ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం.

కుమ్రంభీం ఆసిఫాబాద్: ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం,యూనియన్ గుర్తింపుకై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు.రిటైర్డ్ వార్డెన్, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లి రాజయ్య అధ్యక్షతన ఆదివారం రోజున సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 10న శనివారం ఉదయం 11 గంటలకు బాలభారతి హై స్కూల్లో కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ యొక్క సమావేశంలో మిల్లులో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించుటకు చేపట్టవలసిన కార్యక్రమం గురించి చర్చించటం జరుగుతుందని,కాబట్టి కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.2014 సెప్టెంబర్ లో అక్రమంగా మూసివేసిన ఎస్ పి ఎం,కార్మికుల అనేక ఆందోళన ఫలితంగా 2018 ఆగస్టు రెండున తెరుసుకున్నప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్న మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్నట్టు వారి బాధలు కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,జెకె పేపర్ మిల్లు చెప్పిందే చట్టం చేసిందే శాసనం గా కార్మికులు శ్రమదోపిడికి గురియగుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మిల్లు ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్న కనీస సౌకర్యమైన క్యాంటీన్ లేకపోవడం దురదృష్టకరమని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసే సౌకర్యం కూడా లేకపోవడం అత్యంత దారుణమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయదేవ్ ,ఉపాధ్యక్షులు ఎస్పీయం మాజీ జనరల్ సెక్రటరీ, గుల్ల పెళ్లి నాగేశ్వరరావు, ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ బి. నర్సయ్య, కార్మిక నాయకులు కలికోట రమణయ్య,  ఐక్యవేదిక జనరల్ సెక్రెటరీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, నాయకులు అడ్వకేట్ కిషోర్, బి.వేణు రాజ నరసయ్య పాల్గొన్నారు.

చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఆర్థికంగా చేయూతనిద్దాం - జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్: చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు పిల్లల ఉద్యానవనంలో ప్రతి ఆదివారం పార్కును సందర్శించే వారికి అల్పాహారం, తినుబండారాల విక్రయ కేంద్రాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్త, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం పిల్లల ఉద్యానవనమునకు కుటుంబ సభ్యులతో సందర్శనకు వచ్చేవారు బయట నుండి తినుబండారాలు కొనుగోలు చేయకుండా పార్కులోని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారులు విక్రయించే కేంద్రాల వద్ద కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని అన్నారు. తద్వారా చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఉపాధి కల్పించినట్టు అవుతుందని తెలిపారు. విక్రయ కేంద్రాలలో చూడ, దయివడ, బెల్లం గులాబి పూలు, తోటకూర గారెలు, ఎగ్ లెస్ కేకులు, చకోడీలు, ఖారా, బిస్కెట్లు, చిరుధాన్యాలతో తయారుచేసిన తినుబండారాలు, చిప్స్, గప్చుప్ ఇతర తిను పదార్థాలు లభిస్తాయని, సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ తహసిల్దార్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో వ్యవహరించాలి : జిల్లా అదనపు కలెక్టర్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహభావంతో వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని సిర్పూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని, విధుల పట్ల సమయపాలన పాటించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయులు, అధికారులతో 10వ తరగతి వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయులు కార్యచరణ ప్రకారంగా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని, విద్యార్థులు అందరూ 10 జి పి ఎ సాధించేలా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ప్రగతి ఆధారంగా తక్కువ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. వార్షిక ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందుంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వి ఎం ఓటరు అవగాహన కేంద్రం : జిల్లా కలెక్టర్.


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జి.13 లో ఏర్పాటు చేసిన ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు వేసే విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఓటరు అవగాహన కేంద్రంలో ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది జితేందర్, మధు, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
తునికాకు టెండర్లు వెంటనే పిలవాలి.


టిఎజి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్.






కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా,జనవరి20, : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఎజి ఎస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాగజ్ నగర్ పట్టణం లోనీ బాల భారతి హై స్కూల్ లో తునికాకు కల్లేదార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ తునికాకు సేకరణ వ్యవసాయం తర్వాత రెండో పంటగా అటవీ ప్రాంతంలో ఉందని,ఆకు సేకరణ ద్వారా ఆదివాసీలు ఇతర పేదలు ఉపాధి పొందుతారని కుమురం భీం జిల్లాలో సైతం 30 వేల మంది కూలీలు ఉపాధి పొందుతారని, కూలీలతోపాటు కళ్ళేదారులు గోడౌన్ కార్మికులు కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా ఆదాయం పొందుతారని, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం వస్తుందని కానీ జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు పెద్ద పులులు సంచరిస్తున్నాయని పేరుతో ఈ సీజన్లో తునికాకు యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికీ సిఫారసులు చేసిందనీ ఈ నిర్ణయం వల్ల పేదలు నష్టపోతారని, జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 25 యూనిట్లు ఉండగా మైనింగ్, కవాల్ టైగర్ కారిడార్, కడంబ టైగర్ కారిడార్ పేరుతో ఇప్పటికే చాలా యూనిట్లను తగ్గించినటువంటి పరిస్థితి ఉందని, తగ్గిన యూనిట్ల పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పులుల ఆవాసం 25 యూనిట్ల పరిధిలో లేదని దాని సాకు చూపి పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని, దీనిపై ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు. వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తునికాకు కళ్ళేదారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా చన్కపురి కాశినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె నాయిమ్, కోశాధికారి గా సోయం తిరుపతి ఉపాధ్యక్షులుగా టేకం హనుమంతు, సహాయ కార్యదర్శిగా ఒండ్రే గణేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, అజిజ్, బోరెం తిరుపతి, యాదగిరి నాందేవ్, పెందం రవి, ఎల్ములే దశరథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాలశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజo శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ముంజo ఆనంద్ కుమార్ , వివిధ మండలాల కల్లేదార్లు పాల్గొన్నారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత.

ఆసిఫాబాద్ జిల్లా: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎఫ్తర్వా అప్పలకొండ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని భవానీనగర్ సమీపంలో ఎఫ్ఎస్ఓ సాయిచరణ్ బృందంతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఒక వాహనంలో పరిశీలించగా 12 కలప దుంగలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. కలపను, వాహనాన్ని స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించారు.
రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డా. శ్రీనివాస్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బీజేపీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షులను నియమించింది, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కసరత్తు ప్రారంభించింది. పనితీరు బాలేని కొన్ని జిల్లాలోని అధ్యక్షులను మార్పులు చేయగా, కొమురంభీం జిల్లా అధ్యక్షుడి డా. శ్రీనివాస్ మాత్రం మార్పు చేయకుండా రెండో సారి ఆయ
నే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంది. గురువారం సాయంత్రం ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠకులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచాలి : జిల్లా కలెక్టర్.

స్ట్రీట్ బజ్ న్యూస్,జనవరి 12, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలో నూతనంగా చేపట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శాఖా గ్రంధాలయాలలో పాఠకులకు అవసరమైన పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు సర్నార్థమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.