madagoni surendar

Feb 04 2024, 18:00

నల్గొండ జిల్లా :-బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

నల్గొండ జిల్లా :

-భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నాడు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత పాల్గొని ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బిజెపి బలోపేతాని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ప్రతి కార్యకర్త ఒకరోజు మొత్తం ఆ బస్తీలో ఉండి జరగబోయే భువనగిరి ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మ్రోగించేలా చెయ్యాలని అన్నారు.ఈ దిశగా మోడీ పథకాలు ప్రతి గడపగడపకు తెలిసేలా చేయాలని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది.

.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మండూరి ప్రభాకర్ రావు, గ్రామ చలో బస్తీ చలో అభియాన్ పట్టణ కన్వీనర్ మైల శ్రీనివాస్,కో కన్వీనర్ అప్ప అంజయ్య,ఉపాధ్యక్షులు వనం వేణు,గుర్రం నాగచంద్రు, కొల్లూరి జానయ్య,పట్టణ నాయకులు బ్రహ్మదేవర రవిశంకర్,కోట శ్రీను,సిద్ధోజు ఉపేంద్ర చారి,యెన్నం వెంకటేష్,కడింగు నాగరాజు, నర్సింగు అశోక్,రాపోలు శరత్,రవీందర్ నాగేష్, రమేష్,తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Feb 04 2024, 17:12

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి

సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.

కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆనాడు స్వతంత్ర జడ్పిటిసి గా గెలుపొంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి ని అన్నారు..

2009లో లీటర్ పెట్రోల్ తీసుకుని ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టె తీసుకొలేని ఉద్యమ నాయకుడు హరీష్ రావు ని ఎద్దేవ చేశారు..తెలంగాణ కోసం అసలైన ఆత్మ బలిదానం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతా చారి అని మరొకసారి గుర్తు చేశారు..

డ్రామాలు అంటేనే కెసిఆర్ కుటుంబమని, సినీ నటుల కంటే గొప్ప నటులు కెసిఆర్,హరీష్ రావు అని అన్నారు...

అలాగే మా నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు..

బిఆర్ఎస్ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు..

గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో దొంగ పాలన చేసినందుకు ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి ని ప్రజలు మెచ్చుకుంటున్నారని, దీనిని జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు..అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేశామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు..అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు..

...

ఈ కార్యక్రమంలో

బట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరరావు, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ, మండల కార్యదర్శి షేక్ రఫీ, మండల నాయకులు దంచనాల రాజేంద్రప్రసాద్, నరసింహారావు, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Feb 04 2024, 12:07

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా:-

భువనగిరి గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి వేళ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే గదిలో ఉరి వేసుకుని నూసైడ్ చేసుకున్నారు. గమనించిన తోటి స్టూడెంట్స్, హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పరీక్షల భయంతో చనిపోయారా లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను టెన్త్ చదువుతోన్న వైష్ణవి, భవ్యగా గుర్తించారు. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం హాస్టల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న వారు ఉరి వేసుకుని చనిపోవడంతో తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు అవుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

madagoni surendar

Feb 03 2024, 21:25

గంజాయి నిషేధంకై పోలీస్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి.
నల్లగొండ జిల్లా:- గంజాయి నిషేధంకై పోలీస్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలి.

ఆకతాయిలా ఆగడాలపై ప్రత్యేక ధృష్ఠి పెట్టాలి
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి.

.
నల్లగొండ జిల్లాలోని గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవిస్తున్న "ఆకతాయిల ఆగడాల" పై సమగ్రమైన విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా (అఖిల భారత ప్రజతంత్రమహిళా సంఘం) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ చంధనా దీప్తిని కలిసి జిల్లాలో రోజురోజుకు మితిమీరిపోతున్న గంజాయి ఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ ప్రభావంకు యువత రోజు రోజుకు విపరీతంగా బానిసలు అవుతున్నారన్నారు..ఆకతాయిలు మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై పార్కులను,రైల్వే స్టేషన్,పానగల్ చెరువు, బైపాస్ రోడ్డు,పట్టణ సరిహద్దు ప్రాంతాలలోని ప్రేమ జంటలను,యువ స్త్రీలను టార్గెట్ గా చేసుకొని మాటువేసి దాడులు చేస్తూ బెదిరిస్తూ డబ్బులు, స్త్రీల పై ఉన్న బంగారమే టార్గెట్ గా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు.తలొగ్గని అబ్బాయిల,అమ్మాయిల మొబైల్ పోన్ లు లాక్కొని,వీడియోలు తీస్తూ బలత్కారంతో సెక్సువల్ గా అనుభవిస్తున్నారని ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల నరసింహారెడ్డి కాలనీలో నల్లగొండ టూ టౌన్ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్న యువకులను పరిశీలిస్తే గంజాయి డ్రగ్స్ కు బానిసలై ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు అనేది స్పష్టం అవుతుందన్నారు. గతంలోనూ నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం,గోపాలాయపల్లి వేణుగోపాలస్వామి గుట్ట పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.జన సందర్శన తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ప్రేమ జంటలనే లక్ష్యంగా పెట్టుకొని ఈజీ మనీ కి అలవాటు పడి సైకో ల్లాగా తయారై ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారన్నారు ్ ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం గంజాయి లాంటి మత్తు పదార్థాలేనని ఐద్వా భావిస్తుంది. మహిళలనే టార్గెట్ గా పెట్టుకొని వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠినమైన చట్టాలను నమోదు చేసి త్వరతగతిన శిక్ష పడేలా చొరవ చూపాలని జిల్లా ఎస్పీ ని కోరారు.నల్లగొండ జిల్లాలో గంజాయి నిషేధంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి లాంటి మత్తు పదార్థాల మూలాలను చేధించి మహిళల హక్కులను పరిరక్షించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ,ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ,మేకల వరుణ,బొల్లెపల్లి మంజుల,తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నమస్కారాలతో.. అఖిల భారత ప్రజతంత్రమహిళా సంఘం(ఐద్వా) నల్లగొండ జిల్లా కమిటీ 9490209264

madagoni surendar

Feb 03 2024, 21:02

వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య
                                  నల్లగొండ జిల్లా: (కేతేపల్లి):-  ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే   ఇప్పలగూడేంలో  ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Feb 03 2024, 21:17

వ్యక్తి దారుణ హత్య.

వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ జిల్లా:

(కేతేపల్లి):- ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే ఇప్పలగూడేంలో ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Feb 03 2024, 11:46

: రైలు కింద పడి యువకుడి సూసైడ్
చిత్తూరు జిల్లా : రైలు కింద పడి యువకుడి సూసైడ్ వాల్మీకిపురం- కలికిరి మార్గంలోని కలికిరి వద్ద మదనపల్లి పట్టణం ఎస్టేట్ వద్ద వుండే టిఎన్ఆర్ కాలనీకి చెందిన పెద్దారెడ్డి కుమారుడు ఏ. సోమశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న కదిరి రైల్వే హెచ్ సి బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

madagoni surendar

Feb 03 2024, 11:17

సమ్మక్క-సారక్క వనదేవతలను సతీసమేతంగా దర్శించుకున్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ముల్లుగు జిల్లా :- . .. .. తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క - సారక్క వన దేవతలను సతీసమేతంగా  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే  అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. సమ్మక్క సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పై పసుపు, కుంకుమ, బెల్లం, నూతన వస్త్రాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్దతులో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు..

madagoni surendar

Nov 17 2023, 16:00

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బిజెపి కి ఓటు వేయాలి.నకిరేకల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బిజెపికి ఓటు వేయాలి.నకిరేకల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య

Streetbuzz news నల్గొండ జిల్లా:

బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని అందుకోసం ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని.నకిరేకల్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి నకిరేకంటి మొగులయ్య అన్నారు.శుక్రవారం పామునగుండ్ల, యరసాని గూడెం, ముత్యాలమ్మ గూడెం, దుగినవేల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకంటి. మొగులయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని, అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలు చేస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కేవలం వారు మాత్రమే అభివృద్ది చెందారని ఆరోపించారు. బీజేపీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నకిరేకల్ లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు....ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతగోని అనిత,మండల అధ్యక్షులు పబ్బు వెంకటేశ్వర్లు,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు,పాదూరి వెంకట్ రెడ్డి,కోమటి భాస్కర్,పులకరం శంకర్,గున్నల.నాగరాజు,కారంపూడి సాయి, ఉట్కూరి చిరంజీవి,పులకరం రూప,ఉట్కూరి కృష్ణ,నీలం నాగరాజు,పులకరం నాగరాజు,కాడింగ్ నాగరాజు,ఉడుగుండ్ల శేఖర్,గజానాబోయిన శ్రీను,జాడిగాల వీరేష్,బంటు ప్రశాంత్, కడింగు గణేష్, బొమ్మకంటి నాగరాజు, బక్క శివ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 20 2023, 13:29

హైదరాబాద్ .బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

గాంధీ భవన్

బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

మంత్రులు కేసీఆర్ దగ్గర తమ గ్రాఫ్ పెంచుకుని టికెట్లు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ని తిడుతున్నారు.

తలసాని చదువుకోలేదు కాబట్టి ఆయనకి సంస్కారం ఉండదు.

9 ఏళ్ల నుండి కేసీఆర్ బీసీలకు చేసింది ఎంటి?

తలసాని బీసీ ముసుగు వేసుకొని నాటక కంపెనీ మొదలుపెట్టాడు.

తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య కు నివాళి అరిపించావా

ఈ నలుగురు బీసీ మంత్రులు బీసీల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా?

తన కొడుకు గోదావరి నది గురించి అవగాహన లేని మాటలు మాట్లాడినట్టు ఇప్పుడు తలసాని బీసీల గురించి తలసాని కి గొర్లు తెలియడు గొర్ల మంద తెలియడు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.

తలసాని HMDA భూములను పాన్ పరాగ్ నలిమినట్టు నములుతున్నాడు.

కేసీఆర్ కేటీఆర్ లతో కోట్లాడి మీ పార్టీ బీసీ నేతలకు పదవులు ఇప్పించండి.

సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్.