ఫిబ్రవరి 16వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు

ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు

సిద్దిపేట జిల్లా:

కుకునూర్ పల్లి:

 [ Crime journalist] :- ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుకునూర్ పల్లి తహసీల్దారు మల్లికార్జున్ రెడ్డి కి సమ్మె నోటీస్ ఇచ్చారు.ఈ. సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక నాలుగు లేబర్ కార్డులను ఉపసంహరించుకోవాలని 2022 విద్యుత్తు సవరణను మానుకోవాలని రైతు వ్యతిరేక విధానాలను దింపి కొట్టాలని కార్పొరేట్ కొమ్ముకాస్తున్న బిజెపిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నరసయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బర్మ కొమురయ్య, ఉమ్మడి మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నర్సింలు, జాలిగామ ప్రభాకర్ ,కుకునూర్ పల్లి మండల నాయకులు సాయిలయ్య, సాయి కుమార్ ,రవికుమార్, నరహరి,పోచయ్య,లక్ష్మణ్, లక్ష్మి, నరసవ్వ, వెంకటవ్వ,బిక్షపతి, కనకయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

420హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి - బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆరు గ్యారెంటీల అమలుపై చేతులెత్తేసిన సీఎం.రేవంత్ సర్కార్  -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఘట్ కేసర్:

[Crime journalist] :-

ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మరియు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మల్లారెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు.కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్‌ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ అన్నారు.

ఆశాజనకంగా తెలంగాణ రాబడి మూడో ఆర్థిక త్రైమాసిక కాగ్ నివేదిక

కేసీఆర్‌ హయాంలో ప్రబల ఆర్థిక శక్తిగా రాష్ట్రం.. 

నిరుడి కంటే రూ. 24,221 కోట్లు అధికం

ఆశాజనకంగా తెలంగాణ రాబడి

మూడో ఆర్థిక త్రైమాసికంపై కాగ్‌ నివేదిక

తెలంగాణ రాష్ట్రం:

[Crime journalist] :-

అనతికాలంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేసీఆర్‌ పాలనలో ఆర్థిక వనరులను భారీగా పెంచడంతో పదేండ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సర (2014-15)లో మూడో త్రైమాసికం (క్యూ-3) చివరి నాటికి రూ.74,419 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ చివరి నాటికి 1,88,863 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలో దాదాపు 73 శాతానికి సమానం. 2014-15 క్యూ-3 చివరి నాటికి వచ్చిన రాబడి కంటే రూ.1,14,444 కోట్లు అధికం.

నిరుడు ఇదే సమయానికి వచ్చిన రాబడి కంటే రూ.24,221 కోట్లు ఎక్కువ. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి మొత్తంగా రూ.2,39,986 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. డిసెంబర్‌ చివరి నాటికి రూ.1,64,641 కోట్ల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్‌ అంచనాలో 69 శాతానికి సమానం. ఇలా ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకుంటూ తెలంగాణ తక్కువ సమయంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని తాజా నివేదికలో కంప్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కొనియాడింది.

రూ.91,136 కోట్ల పన్ను రాబడి

పన్నుల రాబడిలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించింది. ఈ ఆర్థి క సంవత్సరంలో పన్నుల రూపేణా రూ.1,43,989 కోట్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. క్యూ-3 చివరి నాటికి రూ.91,136 కోట్ల రాబడి వచ్చింది. ఇది అంచనాలో 63 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి వచ్చిన 79,506 కోట్ల పన్ను రాబడి కంటే రూ.11,630 కోట్లు అధికం. ఈసారీ పన్ను రాబడుల్లో ప్రధాన వాటా వస్తు, సేవల పన్నుదే. జీఎస్టీ రూపేణా రూ.33,581 కోట్లు ఖజానాకు చేరగా.. అమ్మకం పన్ను ద్వారా రూ.13,806 కోట్లు, ఎక్సైజ్‌ సుంకాల రూపంలో రూ.11,308 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,025 కోట్లు సమకూరాయి.

ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే

ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే 

చదువులు సంకనాకిపోయినా పర్లేదు

మామయ్య సభ కోసం త్యాగాలు చేయాల్సిందే

స్కూల్ బస్సులు కోసం పరీక్షలు వాయిదా

స్కూళ్ల నిర్వాహకులు నుండి బలవంతంగా బస్సులు డిమాండ్

ఎవరికేమైనా మాకనవసరం ... సిద్దం సభను విజయవంతం చేయాల్సిందే.

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం పై అధికారుల ఒత్తిళ్లు

ఆంధ్రప్రదేశ్:

గోదావరి జిల్లా:

[Crime journalist]:- రాష్ట్రంలోని విద్యార్థులందరికి యూనివర్సల్ మేనమామ గా చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వారి భవిష్యత్ పైనే దెబ్బ కొడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో ఈ నెల 3 న జరగనున్న సిద్దం మహా సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్కూల్ బస్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. దీంతో అధికారులు బస్సులు ఇవ్వాలంటూ ప్రయివేటు స్కూళ్ల నిర్వాహకులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఓ వైపు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు రాబోయే రోజుల్లో 10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి నిముషం ఎంతో విలువైందనీ స్కూళ్ల నిర్వాహకులు అధికారులకు తెలియజేసినప్పటికి, మెజారిటీ స్కూళ్ల నిర్వాహకులు బస్సులు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసినప్పటికి అధికారులు మాత్రం వీరి మాటలు పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఏకంగా సిద్దం సభ రోజున జరగనున్న ఇంటర్ పరీక్షనే ప్రభుత్వం వాయిదా వేసింది. దీని కోసం ఓ ప్రత్యేక జీవో ను విడుదల చేస్తూ అర్ధాంతరంగా వాయిదా ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సత్తా చాటి రాజకీయంగా మార్కులు వేసుకోవాలనేది జగన్ ఆలోచన. అయితే ఈ ఆలోచన తప్పు కాదు గానీ ఇందుకు ప్రధానంగా జన సమీకరణ కు స్కూల్ బస్సులను ఎంచుకోవడమే తప్పిదమని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు తరగతులు బోధించడం ఎంతో ముఖ్యమని ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం స్కూల్ నిర్వాహకులు మాటలు వినడం లేదనిమండిపడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చుకునైనా సరే ఎన్ని బస్సులు వుంటే అన్ని బస్సులు సిద్దం సభకు పంపించల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారనీ, ముఖ్యమంత్రి జగన్ విద్యకు అధిక పీట వేస్తున్నారని, ప్రతి విద్యార్థికి మేనమామ లా వారి భవిష్యత్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులకు ఇదేం పనికిమాలిన పని అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా కావాలంటే ప్రయివేటు బస్సులు కిరాయికి పెట్టుకోవాలమో గానీ విద్యార్థులను స్కూళ్ళు మానేయమని చెప్పడమెంటని మండిపడుతున్నారు. గతం లోనూ జన సమీకరణ కు బస్సులు అడిగిన సందర్భాలు వున్నప్పటికీ ఇంత దారుణంగా ఎవరూ ఇన్నిన్నిసార్లు అడగలేదని, పైగా గతం లో స్కూళ్లకు ఇబ్బంది లేకుండా సెలవు రోజుల్లో సభ నిర్వహించుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఓ ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్ పరీక్షలనే వాయిదా వేయడం ఇదే ప్రదమమని, ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని స్కూల్ బస్సులను వదిలేయాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

నిరుద్యోగ డిఎస్ సి అభ్యర్థుల ప్రతిజ్ఞ

నిరుద్యోగ డిఎస్ సి అభ్యర్థుల ప్రతిజ్ఞ

నిరుద్యోగ DSCఅభ్యర్థుల ఈ ప్రతిజ్ఞ చూస్తే వైసిపి వాళ్ళంతా నీళ్ళు లేని

బావిలో దూకనైనా దూకాలి లేదా

రాజకీయాలు వదిలేసి ఆయినా పోవాలి

•Pawan Kalyan •

•Jansenapaarty•

• JSPBJPAlliance •

•JSPTDPAlliance •

•YSJaganFailedCM •

•WhyAPHatesJagan•

•HelloAP_ByeByeYCP•

•JSPForNewAgePolitics•

•HelloAP_WelcomeJanaSena•

భారిగా నగదు పట్టివేత ₹- 5,12,91,180 నగదు స్వాధీనం - ఆరుగురు అరెస్ట్

భారీగా నగదు పట్టివేత5,12,91,180 నగదు స్వాధీనం

ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్ 

గూడూరు :

[Crime journalist 01-02-2024] :- ఎలక్షన్ కోడ్‌ సమీపిస్తున్న తరుణంలోలో భాగంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ గూడూరు వన్ టౌన్ సి గూడూరు రూరల్ ఎస్సై మరియు చిలుకూరు ఎస్సైలు సిబ్బందితో కలిసి గురువారం వాహనాలను తనిఖీలు చేపట్టారు. నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనఏర్పాట్లు చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా చెక్పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లోపోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 180 రూపాయలను భారీ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. గురువారం గూడూరు పట్టణంలోని గూడూరు సర్కిల్ కార్యాలయంలో గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గూడూరు రూరల్ సీఐ ఎస్సై వారి సిబ్బందితో కలిసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మూడు కోట్ల 67 లక్షల 41 వేల 180 రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గూడూరు రూరల్ పరిధిలోని చిలకలూరి బైపాస్ రోడ్ జంక్షన్ వరద గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ ఇబ్బందితో కలిసి 95 లక్షల 80 వేల రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గూడూరు వన్ టౌన్ పరిధిలో ముబారక్ బిర్యాని షాప్ వద్ద బిఎస్సార్ లాడ్జి ఎదురుగా గూడూరు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి 50,00,000, నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అటుగా వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ఆ సంచుల్లో ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 150రూపాయలను  తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ నగదును సీజ్ చేసేమని తెలిపారు . సందర్భంగా ఆయన గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి , గూడూరు వన్ టౌన్ సిఐ పాపారావు , రూరల్ ఎస్సై మనోజ్ కుమార్, చిలుకూరు ఎస్సై అంజిరెడ్డి సిబ్బందిని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

నేడు నాగోబా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు నాగోబా జాతర కు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

అదిలాబాద్ జిల్లా:

[Crime journalist]

-ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ఈ నెల 2న (నేడు) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ గ్రామములో నాగోబా జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేస్లా పూర్ గ్రామములో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రెండు గ్యారంటీ లను ఇక్కడినుండే ప్రకటించి అమలు చేయనున్నట్లు సీతక్క అన్నారు

మున్సిపల్ నూతన కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇ

మున్సిపల్ నూతన కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా:

[Crime journalist 01-02-2024]

అమలాపురం మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ మనోహర్ ను ఈరోజు మొగళ్లమూరు క్యాంపు కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కేఅందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎంపీ,నూతన మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నెల 2(అనగా రేపు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో జరపబోయే సభను విజయవంతం చేయాలి -మంత్రి సీతక్క

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో జరపబోయే. సభను విజయవంతం చేయాలి -  మంత్రి సీతక్క

అదిలాబాద్:

[Crime journalist 01-02-2024] 

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారి కామెంట్స్.

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలి

-వెనుకబాటుకు గురైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

-వందలాది గ్రామాల్లో త్రాగు నీటి సమస్య ఉంది

-ఇంద్ర వెల్లి లో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రేపు ఇంద్ర వెల్లి లో జరగనున్న సభ విజయవంతం చేయాలి.కెసిఆర్ 10 యేండ్ల పాలనలో అదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైంది.మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన కూడా బిఆర్ ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనం వృదా. అదిలాబాద్ జిల్లా పోరాటాలకు పుట్టిన ఇల్లు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుంది.ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చినం.ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇచ్చినం అని చెప్పిన బిఆర్ ఎస్ నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో మంచి నీటి కలెక్షన్లు లేవు,కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మిగితా ప్రాంతాలకు సమాంతరంగా అదిలాబాద్ ను నిలుపుతాం.రండి కదలి రండి ఈ నేల 2న జరిగే ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అభిమానులకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్,జిల్లా అధ్యక్షురాలు సురేఖ గారితో పాటు కార్మిక సంఘం నాయకులు జనక్ ప్రసాద్,గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు

గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం

గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం

సిద్దిపేట జిల్లా:

[Crimejournalist01-02-2024] :

కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం జరిపారు.ఈ మహోత్సవం లో పాల్గొన్న స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి ఆంజనేయులు దంపతులను, ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్స్, కార్యదర్శి గార్లను స్థానిక ఎంపిటిసి తరుపున శాలువాలతో సన్మానించిన కోహెడ ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం దంపతులు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి , పంచాయితీ కార్యదర్శి ఇల్లందుల నరేష్ గౌడ్ , వార్డు మెంబర్స్ గౌవబోయిన రజిత , కంది శ్రీనివాస్ రెడ్డి , బింరెడ్డి భారతవ్వ , సాధనవేణి రాజు, సయ్యద్ ఇమాంబీ , షేక్ సజన్ బీ, గార్లను శాలువలతో సన్మానించిన Mptc ఖమ్మం స్వరూపవేంకటేశం ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది,ఆశా పిడిశెట్టి తారా , అంగన్వాడీ టీచర్లు బీ. జ్యోష్ణ , మహిళ సంఘాల వి ఏ వో జయ , మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.