నిజందాగదుక్షణంఆగదు

Nov 09 2023, 14:52

కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!

కర్ణాటక: కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!


బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది.


ఇందుగలడు అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెదికినా దేవుడు కనిపిస్తాడని హిందువుల నమ్మకం. అందుకు మరోసారి నిదర్శనంగా నిలిచింది దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఓ ఘటన. బెల్తంగడి తాలూకా తెక్కరు గ్రామంలోని బత్రాబైల్‌లోని ఓ ముస్లిం వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు మరొక వ్యక్తికి కల వచ్చింది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి అనుమతితో జేసీబీతో భూమిని తవ్వగా వందేళ్ల క్రితం నాటి గోపాలకృష్ణుడి విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి తన ఆధీనంలో ఉన్న భూమిని ఆలయానికి ఇచ్చేశాడు.


బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది. దీంతో జేసీబీతో భూమిని తవ్వారు. పదుల అడుగుల తవ్విన తర్వాత విరిగిన గోపాలకృష్ణుడి విగ్రహం కనిపించింది.

దీని ప్రకారం విగ్రహం దొరికిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించగా.. హమద్ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విడిచిపెట్టారు. హమద్ తన పూర్వీకుల నుండి వ్యవసాయ భూమిని వారసత్వంగా పొందాడు. సర్వే చేయగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలింది.

వందల సంవత్సరాల క్రితం.. గోపాలకృష్ణ దేవాలయంపై టిప్పు సుల్తాన్ దాడి చేసినట్లు చెబుతారు. గ్రామంలో పదేళ్ల క్రితం ఓ దేవాలయం ఉందనే విషయం వెల్లడైంది. అంతేకాదు ఓ ముస్లిం వ్యక్తి స్థలంలో గుడి ఉందన్న సమాచారం అందుకున్న కొంతమంది పెద్దలు కలిసి గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు ఏర్పాటు చేశారు. గుడి గురించి అన్వేషణ ప్రారంభించారు. అయితే ఎక్కడనే విషయంపై సరైన సమాచారం లేకపోవడంతో గ్రామస్థులు మౌనంగా ఉండిపోయారు.

అయితే 10 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన లక్ష్మణ అనే వ్యక్తి టెక్కరు సమీపంలోని కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు భూమి విషయం ఆలోచిస్తుండగా లక్ష్మణ్ సమీప స్థలంలో ఒక ఆలయం ఉందని కల వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే లక్ష్మణుడి స్థలానికి సమీపంలో హమద్ స్థలం ఉంది.

దీని ప్రకారం భూమికి సంబంధించిన రికార్డును పరిశీలించగా అది ప్రభుత్వ భూమి అని తేలింది. ఆ విధంగా బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా సహకారంతో ముస్లిం వ్యక్తి స్థలంపై సర్వే చేయించారు. సర్వేలో 25 సెంట్ల భూమి ప్రభుత్వానికి చెందినదని తేలడంతో హమద్ కొబ్బరి తోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

అనంతరం ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు డీసీని కోరారు. దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆలయాన్ని నిర్మించడానికి హిందూ మతపరమైన దేవాదాయ శాఖకు భూమిని రిజర్వు చేశారు. తాజాగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా కలలో వచ్చినట్లుగా పది అడుగుల లోతున్న బావిలో గోపాల కృష్ణుడు విగ్రహం కనిపించింది. ప్రస్తుతం హమద్ తన 75 సెంట్ల భూమిని ఆలయ ట్రస్టుకు విక్రయించాడు.


నిజందాగదుక్షణంఆగదు

Nov 08 2023, 16:16

బ్రేకింగ్ న్యూస్* నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్

బ్రేకింగ్ న్యూస్

నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్ 

#మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నాయకులు

#సీనియర్ కాంగ్రెస్ నేత తండు సైదులు గౌడ్ బి ఆర్ యస్ లో చేరిక

#అదే బాటలో మాజీ జడ్ పి టి సి తుమ్మల లింగస్వామి యాదవ్, నల్లగొండ యం పి పి వైస్ ప్రెసిడెంట్ జిల్లా పరమేష్ తదితరులు.

నల్లగొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకీ భారీ షాక్ తగిలింది.నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకీ రాజీనామాలు చేసి గులాబీ గూటికి చేరారు.పార్టీలో చేరిన వారిలో ఆ పార్టీ సీనియర్ నేత తిప్పర్తి మాజీ జడ్ పి టి సి తండు సైదులు గౌడ్,నల్లగొండ మండల వైస్ యం పి పి పరమేష్ మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు తదితరులు గులాబీ గూటికి చేరారు.హైదరాబాద్ లో బి ఆర్ యస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక మరియు ఐటీ మంత్రి కలువకుంట్ల తారకరామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరుల సమక్షంలో బి ఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన నేతలకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్హనించారు.పార్టీలో చేరిన తండు సైదులు గౌడ్ తిప్పర్తి సర్పంచ్ గా జడ్ పి టి సి గా విధులు నిర్వహించారు.అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు తండు నరసింహా గౌడ్ సర్వారం మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు,పైడిమర్రి మాజీ యం పి టి సి వెంకట్ రెడ్డి,దర్వేశ్ పురం మాజీ చైర్మన్ పాలకూరి గణేష్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ యస్ సి సెల్ అధ్యక్షుడు పాల్వాయి సాగర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరం చల్లా రెడ్డి,తిప్పర్తి గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు నకరబోయిన శ్రీను,బుద్దారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

ముప్ప మురళీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లికంటి గంగయ్య,యాపల గూడెం ఉప సర్పంచ్ నక్కా సైదులు,దున్న లతీఫ్,ఎమ్ ఆర్ పి యస్ తిప్పర్తి అధ్యక్షుడు బొజ్జ ఎల్లయ్య,కారింగుల నరేష్ గౌడ్,పల్లె శేఖర్ ,బొంత యాదయ్య, బొంత అంజయ్య, తుమ్మల సైదులు ,దేవురపల్లి మహేష్ రెడ్డి,చింతకుంట్ల చంద్రం,గుర్రం శ్రీనివాస్ రెడ్డి,జక్కలి మల్లేష్ యాదవ్,కొండేటి అంజి,పాలడుగు లింగస్వామి,మందడి మధుసూదన్ రెడ్డి,ఇళ్లేందుల శివ శంకర్, చెదురుపల్లి ప్రకాష్,అలకుంట్ల రమేష్ తదితరులు ఈ రోజు బి ఆర్ యస్ లో చేరిన వారిలో ఉన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 06 2023, 19:44

అభివృద్ధి కొనసాగాలంటే నల్లగొండలో మళ్లీ బిఆర్ఎస్ రావాలి

 బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి కంచర్ల రమాదేవి నేడు నల్గొండ పట్టణంలోని.. మన ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. నలగొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాలన్నా ప్రారంభించిన పనులు పూర్తి కావాలన్నా మళ్ళీ కంచర్ల భూపాల్ రెడ్డి గెలవాలని.. అందుకే కారు గుర్తుపై ఓటు వేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కంచర్ల భూపాల్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇంటింటి చేశారు... ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఎదురేగి నుదుట కుంకుమతో ఇంట్లోకి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.. మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి మందడి లిఖిత సైదిరెడ్డి, , మాజీ కౌన్సిలర్ రావుల రేణుక శ్రీనివాస్ రెడ్డి,కత్తుల సంధ్య, గాలి రాధిక,కంచర్ల విజయ రెడ్డి, కౌన్సిలర్ ఊటుకూరు వెంకటరెడ్డి దోనాల నాగార్జున్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 06 2023, 12:33

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు 

నల్గొండ 17,35కార్యకర్తలు కలిసి పచ్చ తోరణాలు కట్టి ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుని, 17వ వార్డు లోని పోచమ్మ గుడిలో కార్యకర్తలు అందరూ కొబ్బరికాయ కొట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్,పోశం గిరి, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 06 2023, 10:56

బిగ్ బ్రేకింగ్... నల్లగొండ 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక...

నల్లగొండ బి.ఆర్.ఎస్ పార్టీలోకి వలసల జోరు... ఆగకుండా పరిగెత్తుతున్న కారు...

నలగొండ 35వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పున్న సత్యం కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పున్న సత్యంతో పాటు మూడ శేఖర్, గంజి వెంకన్న, జెల్లా వంశీ 17 వార్డు కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకునీ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్, పోశం గిరీష్, సురేపెల్లి అంజి, రాపోలు ప్రభాకర్, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 05 2023, 11:06

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.


 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని 2028 వరకు పేదలకు ఉచిత రేషన్ బియ్యం బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. కాగా కరోనా టైమ్ లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచితంగా అందజేస్తుంది.

నిజందాగదుక్షణంఆగదు

Nov 05 2023, 10:52

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి 

గుర్తుల గుర్తుంచుకో అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా సూర్యాపేట లో విస్తృత ప్రచారంచేస్తున్న సునిత జగదీష్ రెడ్డి 

10,12 వ వార్డ్ లో ఇంటిటి ప్రచారం

గడగడపను తడుతూ, జనం తో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం

పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

  

   సూర్యాపేట 

గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి సూర్యాపేట లో గడపగడపనూ తడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేటలోని 10,12 వ వార్డ్ లలో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ఏదో ఒక పథకం ప్రతి పేదోడి ఇంటికి చేరిందని తెలిపారు.. రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డకా పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తు న్నాయన్నారు.మిషన్‌ భగీరథ నీటితో గ్రామా ల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేయడం ఖాయం ఆన్నారు. అంతకుముందు పిల్లలమర్రి శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి, శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రార్థించారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 04 2023, 19:02

Ts: శబరి వెళ్లే భక్తులకు ఉచిత ప్రయాణం… టీఎస్​ ఆర్టీసీ వారికి ఆఫర్..​

శబరిమలకు వెళ్లే భక్తులకు టీఎస్​ఆర్టీసీ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి, బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది.

- సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందని కరీంనగర్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌.సుచరిత చెప్పారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం ఉందని, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటమనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్‌ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్‌ కూడా ఇస్తామని వెల్లడించారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 04 2023, 18:35

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల భారీ ర్యాలీ: వి. కృష్ణ మోహన్ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా)

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల భారీ ర్యాలీ

పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయకుంటే ఉద్యమం ఉధృతం

ఢిల్లీలో లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ తెలిపారు.

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.జి.ఈ.ఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్.టీ.ఎఫ్.ఐ), నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్సీసీపీఏ), సీ.సీ.జీ.జీ.ఓ.ఓ, ఎఐఎస్‌జీపీఎఫ్‌ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన చేతావనీ ర్యాలీలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలను ఆపాలని, ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలని, 8వ కేంద్ర వేతన కమీషన్ ను నియమించాలని, 18 నెలల డి.ఏ/ డి.ఆర్ బకాయిలను విడుదల చేయాలని, కారుణ్య నియామకాలకు అడ్డంకులను తొలగించాలని, పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాలని నినదించారు. ”ఎన్పీఎస్‌ రద్దు చేయాలి, ఓపీఎస్‌ పునరుద్ధరించాలి, ఎన్‌ఈపీని వెనక్కి తీసుకోవాలి” అంటూ డిమాండ్‌ చేస్తూ ఇంగ్లీష్‌, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేబూని దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎన్.జీ.ఓ అసోసియేషన్లు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టి.ఎఫ్), ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా), పోస్టల్ తదితర సంఘాల నుండి వేలాది మంది ఢిల్లీ భారీ ర్యాలీలో పాల్గొని తమ న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెతో సహా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్.పి.ఎస్ ను రద్దు చేసి, సీ.సీ.ఎస్ పెన్షన్ రూల్స్, 2021ను అందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సిబ్బందికి వర్తింప చేసి పాత పెన్షన్ స్కీమును ( ఓ.పి.ఎస్) పునరుద్ధరించాలని, క్యాజువల్, కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్, డైలీ వేతనాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్‌ చేయాలని, వేతన సవరణ జరపాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ,పెన్షన్‌ ఫండ్ ప్రయివేటీకరణలను మానుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Nov 04 2023, 18:19

సూర్యాపేటలో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు..

కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు

బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు

బారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి

చివ్వేంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో బిజెపి , కాంగ్రెస్ లు ఖాళీ

అభివృద్ధి కి ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరికలు

గులాబీ కండువాలతో స్వాగతం పలికిన మంత్రి 

సూర్యాపేట 

   సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.