తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 29 2023, 12:39

నర్సాపూర్ నుంచి బరిలోకి దిగుతా

- పార్టీ కోసం కష్టపడిన నన్నే పక్కకు పెట్టేస్తారా?

- టికెట్ విషయంపై అధిష్ఠానం పునరాలోచించాలి

- బీఆర్ఎస్ కు, సునీతాలక్ష్మారెడ్డికి రాజిరెడ్డి కోవర్ట్

- మూడురోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే మా కార్యచరణ ప్రకటిస్తాం

కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధకరమని ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో తనకే టికెట్ వస్తుందని భావించిన గాలి అనిల్ కుమార్ టికెట్ తనకు రాకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

దీంతో ఆయన శనివారం తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలోని నాయకులు తనకు ఏ పని చెప్పిన కష్టపడి చేశానని, అలాంటి తనకు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సునీతాలక్ష్మారెడ్డికి కోవర్ట్ అయినా ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో కూడా తాను పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించానని అక్కడ కాకుండా నర్సాపూర్ టికెట్ కేటాయిస్తామన్నారని, ఇక్కడ పార్టీని అభివృద్ధి చేశానని, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీని బలపర్చానన్నారు. ఇప్పుడు తనకు టికెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికేనా పార్టీ నిర్ణయం మార్చుకుని మూడురోజుల్లో టికెట్ తనకు కేటాయించకుంటే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నరు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 29 2023, 12:32

అచ్చంపేట నియోజకవర్గానికి ఈనెల 31న మంద కృష్ణమాదిగ రాక...

ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఉప్పునుంతల మండల కన్వనర్ ఎడెల్లి ఆంజనేయులు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, MSF జిల్లా కో-కన్వనర్ కోయ్యల భారత్ కుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ...

ఈనెల 31న అచ్చంపేట పట్టణ కేంద్రానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టలని డిమాండ్ చేస్తూ... నవంబర్ 18న విశ్వరూప మహాసభ విజయవంతం చేయాలని మరియు అచ్చంపేట పట్టణంలో నిర్వహించే జిల్లా స్థాయి సమావేశానికి మందకృష్ణ మాదిగ గారు* ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. మండలంలోని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు హజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో

ఎంఎస్ఎఫ్ అమ్రాబాద్ మండల కన్వనర్ బర్పటి రాజు,శ్రీకాంత్,సీనియర్ నాయకులు సుధాకర్,రాజు,మల్లయ్య, వెంకటయ్య,బాలస్వామి

 తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 27 2023, 12:59

భద్రకాళి అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి

మరియు ఆలయ ఈఓ శేశు భారతి గారు, ఆలయ అర్చకులు మరియు తదితరులు పాల్గొన్నారు

ఎస్బ్ న్యూస్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 27 2023, 10:20

సూర్యాపటలో వాడవాడలా జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం..

సూర్యాపటలో వాడవాడలా జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం.. 

సూర్యాపేట నియోజకవర్గ BRS ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ పలు వార్డుల్లో ఇంటింటికి తిరిగి మ్యానిఫెస్టో వివరిస్తూ ప్రచారం చేస్తున్న మంత్రి సతీమణి గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి

ఎస్బీ న్యూస్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 25 2023, 17:00

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి గారిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి గారిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు.ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.

అదే సందర్భంగా ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మదన్ రెడ్డి గారు నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు, సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటీని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. 

మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు, సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు, అభినందనలు ’’ అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తదితరులున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 21 2023, 13:42

సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్

బీఆర్ఎస్ లో చేరిన సూర్యాపేట రూరల్ మండలం రామారం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు 

వేణు తో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 215 మంది కార్యకర్తలు

గులాబీ కండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది.. అభివృద్ధి కి ఆకర్షితులైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది , సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పాలవరపు వేణు కాంగ్రెస్ ను వీడి 215 మంది కార్యకర్తల తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరందరికీ గులాబీ కండువా కప్పి న మంత్రి సాదరంగా స్వాగతం పలికారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 20 2023, 19:01

మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకమవుతున్న వృత్తి సంఘాలు

సూర్యాపేటలో మంత్రిని కలిసి మద్దతు తెలిపిన సూర్యాపేట కార్పెంటర్స్ అసోసియేషన్

నూతన సంఘాన్ని అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి మద్దతుగా వృత్తి కుల సంఘాలు ఏకమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వైపే మా పయనం అంటూ వృత్తి , కల , సంఘాలు ఒకొక్కరిగా మంత్రి కి మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా సూర్యాపేటలో నూతనంగా ఏర్పడిన కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి తో తమకు చేదినిండా పని దొరుకుతుందని, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.

సూర్యాపేట ప్రజలంతా మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా ఏకతాటిపై నిలిచి జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాగా నూతన అధ్యక్షుడు గా బైరోజు లింగాచారి,

కార్యదర్శి గా,కట్టోజు గోపి

ఉపాధ్యక్షులు గా పర్వతం భుషణాచారి,సహాయ కార్యదర్శి.. బహురోజు ..ఉపేందర్ ఎన్నిక అవగా వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు పుట్టా కిషోర్ ఆద్వర్యం లో జరుగగా కార్యక్రమం లో కాసోజు మాధనాచారి,

కురెళ్లి మనోహర్,కేషవరపు కిరణ్

పోతుగంటి వీరాచారి,జనగాం వీరాచారి మోత్కురి వినోద్ పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 20:50

ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన TPCC మాజీ కార్యదర్శి విజయ్, రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీమ్ బాబా. 

టికెట్లు అమ్ముకున్న సాక్షాలు మేము హై కమాండ్ కి పంపించామన్న కక్షతో మమ్మల్ని సస్పెండ్ చేశాడు. 

రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడివైతే టికెట్లు అమ్ముకోలేదు అని భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకి వచ్చి ప్రమాణం చేయ్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 19:01

జిపి కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి పండగపూట పస్తులతో ఉంచొద్దు


 కలెక్టర్ డిపిఓ లకు వినతి పత్రం ఇచ్చిన యూనియన్ నాయకులు.

రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగ పూట గ్రామపంచాయతీ కార్మికుల్ని పస్తులు ఉంచకుండా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  

   గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని జిల్లా కలెక్టర్ మరియు డిపిఓలకు వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామపంచాయతీలలో సుమారు 3200 మంది కార్మికులు వివిధ రకాల పనులు చేస్తున్నారని వీరిలో 90% పైగా పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు.

      గ్రామ పంచాయతీలలో అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తున్న వీరికి ఇచ్చే వేతనాలు తక్కువే అని అవి కూడా ఆరేడు నెలలుగా పెండింగ్ లో ఉండడంతో అప్పులు సప్పులు చేసి బ్రతకాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో దసరా ఆ తర్వాత దీపావళి పండుగలు రానున్నాయని ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో కొత్తగా అప్పులు దొరకక గ్రామపంచాయతీ కార్మికులు దసరాపండుగ రోజున పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని అందుకే జిల్లా కలెక్టర్ డిపిఓ జోక్యం చేసుకొని కార్మికులకు వేతనాలు ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పెళ్లి సత్తయ్య, యూనియన్ జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, సురేష్ శ్రీకాంత్ నరేష్తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 18 2023, 18:55

మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవలంలో ప్రత్యక పూజలు

మహారష్ట్రలోని షిరిడీ సాయిబాబా దేవాలయానికి వెళ్లి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి - సునీత గార్ల దంపతులు, తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ - కమల గార్ల దంపతులు సాయిబాబా ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

షిరిడీ సాయిబాబా గారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ గారి పైన కలకాలం ఉండాలి, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గార్ల దంపతులను సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు సన్మానించారు