Andrapradesh

Oct 28 2023, 13:58

వచ్చే ఎన్నికల్లో మా వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెనాలి సాధికార సభ నిరూపించింది: రఘురామకృష్ణరాజు

సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న యాత్రలపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఏ ముఖం పెట్టుకుని సామాజిక యాత్ర చేస్తారని మండిపడ్డారు.

తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారని... మొత్తం పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని... ఇంత చేసి ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారని దుయ్యబట్టారు.

త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అజయ్ రెడ్డిని, మరో కార్పొరేషన్ కు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని నియమించబోతున్నట్టు సమాచారం ఉందని అన్నారు. 

జగన్ తన సొంత సామాజికవర్గానికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సామాజిక సాధికార యాత్రలకు ప్రజల మద్దతు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెనాలిలో జరిగిన సామాజిక సాధికార సభ నిరూపించిందని తెలిపారు.

అక్కడి సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని రఘురాజు అన్నారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరితే వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్పారు.

Andrapradesh

Oct 28 2023, 13:56

భార్యతో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ, సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు. తన భార్యతో కలిసి పయనమయ్యారు. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్... ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది.

అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు.

Andrapradesh

Oct 28 2023, 13:54

హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి విఆర్ కు పంపిన ఎస్పీ

ప్రకాశం జిల్లా దర్శి డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్ 2023 అక్టోబర్ 21 న మార్కాపురం పి.ఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటరమణ పై దాడి చేయగా బాధితుడు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ అశోక్ ను విఆర్ కు పంపినట్లు సమాచారం

Andrapradesh

Oct 28 2023, 13:53

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు షెల్టర్ లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

జంగారెడ్డిగూడెం నుండి దొరమామిడి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్..

బస్సును ప్రమాదం జరగకుండా మరోవైపుకు మళ్ళించడంతో బస్సు షెల్టర్ తగలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

అదే బస్సు వేరే వైపుకి వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని డ్రైవర్ అప్రమత్తమయ్యి బస్సును ఇటు పైపుకు మళ్లించడంతో ప్రమాదం తప్పిందని తెలిపిన స్థానికులు..

ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా ప్రయాణికులు..

అయితే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుండి వెళ్లే ప్రతి బస్సు ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదాలు, జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు..

Andrapradesh

Aug 20 2023, 17:19

పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం..

అల్లూరి జిల్లా...

పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద 

100 అడుగుల లోయలో నుండి పడిపోయిన ఆర్టీసీ బస్సు..

పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు

బస్సు లో

60 మంది ప్రయాణికులు..

పలువురు కి తీవ్రగాయాలు

నలుగురు మృతి..

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!

Andrapradesh

Aug 17 2023, 15:33

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఖరారు?

ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు.

కర్ణాటక నుండి రాజ్యసభకు షర్మిల.

అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను ఖరారు చేసినట్లు తెలిసింది.

కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లే షర్మిల తన పార్టీని విలీనం చేయడంతో పాటు ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు చెప్తున్నారు.            

ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తి కాగా ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ తో ఈ విలీనం కథ సుఖాంతం కాబోతున్నట్లు సమాచారం. 

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి.            

షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని,దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది.              

అయితే,ఇప్పుడు వైఎస్ఆర్టీపీ,కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం.   

నిజానికి ముందుగా ఆగ‌స్టు 12న దీనికి ముహూర్తం పెట్టుకున్నా షర్మిల నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ ముహూర్తానికి ఇది అమలు కాలేదు.అయితే,ఇప్పుడు ఈ స్థానంలో మరో ముహూర్తం కోసం చూస్తున్నారట. 

ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చ‌ర్చ‌లు పూర్తి కాగా విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయని తెలిసింది.             

షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.              

షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి షర్మిల మైలేజీ పెంచే ప్రణాళిక కూడా ఒకటి కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం రావాల‌నే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు.            

తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. 

ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది.           

నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌,ధ‌ర్నాలు, నిర‌స‌న‌లుప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు,ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది.కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది.మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు.            

ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల సుతారం వెనకబడి పోయారు.            

ఒకవైపు ఎంత చేసినా మైలేజీ రాకపోవడం, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె కాస్త నిరాశలో ఉంటూ వచ్చారు.                    

ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. 

మొత్తానికి ఇప్పుడు ఈ ప్రక్రియను ఆయనే దగ్గరుండి పూర్తి చేయనున్నారు.

కాగా షర్మిల పార్టీ విలీనం, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటిస్తే ఆమెకి మొదటి శత్రువు అన్న జగనే. 

ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది జగన్ వైఎస్ఆర్సీపీనే.టీడీపీ క్యాడర్ టీడీపీకి ఉండగా జనసేనకి ఉన్న కొద్దిపాటి సైన్యం అంతా యువతే కనిపిస్తున్నారు.             

ఇక ఎటొచ్చీ వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు రాజకీయం అంటూ ఏపీలో మొదలు పెడితే మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే.               

యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంపై తర్జన భర్జన పడిన షర్మిల ఇప్పుడు భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ ప్రోత్సాహంతో అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.             

షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీలో అడుగుపెట్టనున్న సంగతి కూడా వైసీపీ ముఖ్య నేతలందరికీ తెలుసనీ, ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చలలో షర్మిల రాగానే ప్రధానమైన అంశంగా ఉందని చెబుతున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలి.

కత్తిని కత్తితోనే తీయాలి.

వజ్రాన్ని వజ్రం తోనే తీయాలి.

అనే సామెత ను బాగా పాటిస్తున్నారు.

Andrapradesh

Aug 17 2023, 13:22

గంగవరం పోర్ట్ కార్మికుల పోరాటం పరిస్థితి ఉదృతం...

విశాఖ.. గాజువాక...

అదాని గంగవరం పోర్ట్ బంద్ కారణంగా భారీగా మోహరించిన పోలీసులు...

 

 గంగవరం పోర్ట్ గేట్ కాకుండా 100 మీటర్ లోనే అదనంగా భారీ గేటును ఏర్పాటు చేశారు..

 గేటు ఇరువైపులా భారీ కంచి ఏర్పాటు చేసి కార్మికుల ఏవైనా కార్యకలాపాలు చేసిన పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది..

పలువురు సీఐలకి, పోలీసులుకి, కార్మికులకి తీవ్రంగా గాయాలు...

గంగవరం పోర్ట్ గేట్ ముట్టడి చేసిన కార్మికులు...

తీవ్రంగా ప్రతిగటించిన వైస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

పోర్ట్ గేట్ ను ముట్టడించిన కార్మికులు...

ముళ్ల పొదలను దాటుకుంటూ కుటుంబాలతో కలిసి గేట్ ముట్టడించిన కార్మికులు

Andrapradesh

Aug 07 2023, 15:54

తన కార్యాలయంలో ఫోర్జరీలు.. డేటా దుర్వినియోగానికి సీఎం బాధ్యత వహించాలి... సమాధానం చెప్పాలి

సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?

225 ఫైల్స్ ముఖ్యమంత్రి డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి బయటకు పంపించినట్లు తెలిసింది

బయటికి వెళ్లిన ఫైల్స్ లో అత్యంత కీలకమైన అంశాలు

ఇంత పెద్ద విషయం జరిగినా సీఎంఓ స్పందించకపోవడానికి కారణం ఏంటి?

అసలు ఏం జరిగిందో ముఖ్యమంత్రి బయటకు ఎందుకు చెప్పడం లేదు?

ఆయన కార్యాలయంలో ఆయన సంతకానికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?

వాలంటీర్లు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన సమాచారం కూడా పక్కదారి పడుతోందనేదే 

 జనసేన లేవనెత్తిన అంశం 

ముఖ్యమంత్రి సంతకానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?

* గుంటూరు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

Andrapradesh

Jun 07 2023, 17:31

వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా వివాదస్పద వ్యాఖ్యలు
. గుంటూరు జిల్లా టైమ్స్ పవర్ తమ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని అడిగిన మహిళలు... ఇరుకు వీది లో సైడ్ కాలువల నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే .... ఎమ్మెల్యే ముస్తఫా ను అడ్డుకున్న 9 వ డివిజన్ మహిళలు... డివిజన్ ప్రజలు నాశనం కావాలని ఎమ్మెల్యే శాపనార్దాలు... ఎమ్మెల్యే శాపనార్దాలపై డివిజన్ ప్రజలు మండిపాటు... ఎమ్మెల్యే ముస్తఫా తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజకీయ పక్షాల డిమాండ్...

. గుంటూరు జిల్లా టైమ్స్ పవర్ తమ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని అడిగిన మహిళలు... ఇరుకు వీది లో సైడ్ కాలువల నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే .... ఎమ్మెల్యే ముస్తఫా ను అడ్డుకున్న 9 వ

Andrapradesh

May 25 2023, 12:48

విధి నిర్వహణలో అమరుడైన పోలీస్ వీరునికి దిక్కేది?

రోడ్డుపై ఉద్యోగం...రోడ్డుపై నిద్ర...రోడ్డు పైనే మృతి...పాము కాటు తో ఏపీ పోలీస్ మృతి

ఇంత వరకు స్పందించని వైసీపీ ప్రభుత్వం మరియు పోలీస్ ఉన్నతాధికారులు.

ఏపి పోలీస్ లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం

అమరావతిలో పేదలకు ఇళ్ల పంపిణీ కోసం ఈ నెల 26 న సీఎం వైఎస్ జగన్ అమరావతి వస్తున్నారు.

సీఎం గా గెలిచి నాలుగు సంవత్సరాల తరువాత అమరావతి లోకి అడుగుపెడుతున్న సీఎం జగన్.

సీఎం బందోబస్తు కోసం భారీగా మోహరించిన పోలీసులు..వేల కొద్దీ పోలీసులు వారం రోజుల నుండి అమరావతిలో ఉంటున్నారు.

అక్కడ పోలీసులు నడి రోడ్డుపై చాలా ప్రమాదకరంగా రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాస్తున్నారు...ఇదే సమయంలో అక్కడే డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుకు గురి కావడం జరిగింది.

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు..పోలీస్ వీరుడు.

ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యేనంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు నెటిజన్లు.

ఇది ఇలా ఉంటే పవన్ కుమార్ మృతి పట్ల ఇంత వరకు స్పందించని వైసీపీ ప్రభుత్వం మరియు పోలీస్ ఉన్నత అధికారులు.