TS: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు హైదారాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజు తో భేటీ తర్వాత మీడియా కు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తో అనుకూలంగా వ్యవహరించిన తీరును, ఎన్నికల నియమ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎన్నికల ప్రధాన అధికారికి వివరించామని తెలిపారు.అన్ని అంశాలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారన్నారు.
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన ఓ ప్రైవేట్ ట్రస్టుకి జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి అక్కడ ఫోటోలు దిగిన తీరును పిర్యాదు కు జత చేశారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం మట్కా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.
జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై, రాజకీయ ప్రత్యర్థులపై జిల్లా ఎస్పీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల వెనుక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందని ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అమాయక విద్యార్థి వాలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టినా.. కాగజ్నగర్ రూరల్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు భయపడ్డారని అన్నారు.
స్వయంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. తెలంగాణాలో జరగనున్న రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరిగేలా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టినందుకు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం మట్కా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.

ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే పరేడ్ కొరకు, నవంబర్ 1 నుండి విజయవాడలో జరిగే ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రి- రిపబ్లిక్ డే పరేడ్ కోసం.. ఈ నెల 4 ఎం.జి యూనివర్సిటీ లో జరిగిన వాలంటీర్ల ఎంపికలో ఎన్జీ కళాశాల విద్యార్దిని డి. కామేశ్వరి ఎంపిక అయిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన కామేశ్వరి ని అభినందిస్తూ ఒక మొక్కను బహుమతిగా అందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లు యాదగిరి రెడ్డి, వెంకట రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, శీలం యాదగిరి, లైబ్రరీ విభాగం దుర్గా ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, తదితరులు పాల్గొని విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.
నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ మాధవ్ నగర్ లో గల ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో, నేడు విద్యార్థినులు బతుకమ్మలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
విద్యార్థినులు ప్రత్యేకంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాహలంగా బతకమ్మ సంబరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
SB NEWS

SB NEWS TELANGANA
Oct 13 2023, 15:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.8k