NLG: జీవో 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ.. కలెక్టర్ కు ఫిర్యాదు
ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
నల్గొండ: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయములో పెద్దన్న పాత్ర పోషించేందుకు వెళ్లి తమ సొంత ప్రయోజనం చూసుకొని సమస్త జర్నలిస్టులకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ సమస్త జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ జిఓ 59 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరు ప్రధాన జర్నలిస్టులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేసుకొన్న విషయమై.. విచారణ జరిపి రద్దు చేయాలని సమస్త జర్నలిస్టులు అందరూ గురువారం స్థానిక పీఆర్టీయూ భవన్ లో యూనియన్ లకు అతీతంగా నల్గొండ జర్నలిస్టుల హౌజింగ్ సోసైటీ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అనంతరం జర్నలిస్టుల ముసుగులో 59 జీఓ నియమాలను తుంగలో తొక్కి భూమిని కాజేసిన 10 మంది జర్నలిస్టులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారి వివరాలను ఫిర్యాదు వెంట జతపరిచామని వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.
జాబితాలో తహశీల్దార్ బంధువులు, ఎంఎల్ఎ అనుచరులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారని వెంటనే తప్పుడు క్రమబద్దీకరణపై విచారణ జరిపి, రద్దు చేయడంతో పాటు దానికి బాధ్యులైన రెవిన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించి కోరారు.
ప్రింట్, ఎలాక్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల పేరిట ఎమ్మేల్యే, అధికారులతో చర్చించి చివరకు ఓ పది మంది జర్నలిస్టులు తమ సొంత ప్రయోజనం చేకూర్చుకొని జిల్లా కేంద్రంలోని 200 మంది జర్నలిస్టుల పొట్ట కొట్టారని అవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో సమస్త జర్నలిస్ట్ లకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అవసరమైతే రాష్ట్ర సంఘ నాయకత్వంతో చర్చించి జర్నలిస్టుల ముసుగులో భూమిని అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే వీరి యజమాన్యాలకు సమగ్రమైన నివేదికతో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ కర్ణన్.. జీవో నెంబర్ 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నల్గొండ జిల్లా జర్నలిస్టుల హౌసింగ్ సోసైటి సాదన సమితి నాయకులు తెలిపారు..
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA

ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే పరేడ్ కొరకు, నవంబర్ 1 నుండి విజయవాడలో జరిగే ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రి- రిపబ్లిక్ డే పరేడ్ కోసం.. ఈ నెల 4 ఎం.జి యూనివర్సిటీ లో జరిగిన వాలంటీర్ల ఎంపికలో ఎన్జీ కళాశాల విద్యార్దిని డి. కామేశ్వరి ఎంపిక అయిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన కామేశ్వరి ని అభినందిస్తూ ఒక మొక్కను బహుమతిగా అందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లు యాదగిరి రెడ్డి, వెంకట రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, శీలం యాదగిరి, లైబ్రరీ విభాగం దుర్గా ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, తదితరులు పాల్గొని విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.
నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ మాధవ్ నగర్ లో గల ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో, నేడు విద్యార్థినులు బతుకమ్మలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
విద్యార్థినులు ప్రత్యేకంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాహలంగా బతకమ్మ సంబరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
SB NEWS

SB NEWS TELANGANA
RR: ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని "A" బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ లో పలువురుకి నియామకపు పత్రాలు అందజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు.
గోపగళ్ల సత్యా రాణి - ఉపాధ్యక్షురాలు గా లక్కుమళ్ళ కల్పన - ప్రధాన కార్యదర్శి గా లుగా నియమితులు అయ్యారు. వీరికి మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో రాష్ట, జిల్లా బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 13 2023, 10:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.5k