Mane Praveen

Oct 13 2023, 10:54

TS: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు హైదారాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజు తో భేటీ తర్వాత మీడియా కు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తో అనుకూలంగా వ్యవహరించిన తీరును, ఎన్నికల నియమ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎన్నికల ప్రధాన అధికారికి వివరించామని తెలిపారు.అన్ని అంశాలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన ఓ ప్రైవేట్ ట్రస్టుకి జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి అక్కడ ఫోటోలు దిగిన తీరును పిర్యాదు కు జత చేశారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం మట్కా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.

జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై, రాజకీయ ప్రత్యర్థులపై జిల్లా ఎస్పీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల వెనుక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందని ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అమాయక విద్యార్థి వాలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టినా.. కాగజ్‌నగర్ రూరల్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు భయపడ్డారని అన్నారు.

స్వయంగా ముగ్గురు సీనియర్  ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. తెలంగాణాలో జరగనున్న రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరిగేలా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేపట్టినందుకు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

Mane Praveen

Oct 13 2023, 08:28

NLG: జీవో 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ.. కలెక్టర్ కు ఫిర్యాదు

ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
నల్గొండ: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయములో పెద్దన్న పాత్ర పోషించేందుకు వెళ్లి తమ సొంత ప్రయోజనం చూసుకొని సమస్త జర్నలిస్టులకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ సమస్త జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ జిఓ 59 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరు ప్రధాన జర్నలిస్టులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేసుకొన్న విషయమై.. విచారణ జరిపి రద్దు చేయాలని సమస్త జర్నలిస్టులు అందరూ గురువారం స్థానిక పీఆర్టీయూ భవన్ లో యూనియన్ లకు అతీతంగా నల్గొండ జర్నలిస్టుల హౌజింగ్ సోసైటీ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

అనంతరం జర్నలిస్టుల ముసుగులో 59 జీఓ నియమాలను తుంగలో తొక్కి భూమిని కాజేసిన 10 మంది జర్నలిస్టులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారి వివరాలను ఫిర్యాదు వెంట జతపరిచామని వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.

జాబితాలో తహశీల్దార్ బంధువులు, ఎంఎల్ఎ అనుచరులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారని వెంటనే తప్పుడు క్రమబద్దీకరణపై విచారణ జరిపి, రద్దు చేయడంతో పాటు దానికి బాధ్యులైన రెవిన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించి కోరారు.

ప్రింట్, ఎలాక్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల పేరిట ఎమ్మేల్యే, అధికారులతో చర్చించి చివరకు ఓ పది మంది జర్నలిస్టులు తమ సొంత ప్రయోజనం చేకూర్చుకొని జిల్లా కేంద్రంలోని 200 మంది జర్నలిస్టుల పొట్ట కొట్టారని అవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్ లో సమస్త జర్నలిస్ట్ లకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అవసరమైతే రాష్ట్ర సంఘ నాయకత్వంతో చర్చించి జర్నలిస్టుల ముసుగులో భూమిని అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే వీరి యజమాన్యాలకు సమగ్రమైన నివేదికతో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ కర్ణన్.. జీవో నెంబర్ 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నల్గొండ జిల్లా జర్నలిస్టుల హౌసింగ్ సోసైటి సాదన సమితి నాయకులు తెలిపారు..

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 13 2023, 07:52

TS: హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్
హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్‌ అధికారులను కేంద్ర ఎన్నికల కమీషన్‌ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు  ఎస్పీలు ఉన్నారు.

ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతో పాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, వీరి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్‌ఛార్జ్ లను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌, వరంగల్‌ సీపీగా డీ.మురళీధర్‌, నిజామాబాద్‌ సీపీగా ఎస్‌.జయరాం ను నియమించారు.

సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్‌, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్‌.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా అందె రాములు నియమితులయ్యారు. నాగర్‌ కర్నూల్‌ ఎస్పీగా సీహెచ్‌.రామేశ్వర్‌, గద్వాల ఎస్పీగా ఎన్‌ వి, మహబూబాబాద్‌ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు.

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 12 2023, 22:54

శిర్దేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుక
NLG: చండూరు మండలం, శిర్దేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈసం రాంబాబు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తీరోక్కపూలతో ప్రకృతిని ఆరాధించే పండుగ అని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: చండూరు మండలం, శిర్దేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ప

Mane Praveen

Oct 12 2023, 22:32

NLG: ప్రీ రిపబ్లిక్ డే పేరెడ్ కు ఎన్.జి కళాశాల విద్యార్థిని ఎంపిక
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే పరేడ్ కొరకు, నవంబర్ 1 నుండి విజయవాడలో జరిగే ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రి- రిపబ్లిక్ డే పరేడ్ కోసం.. ఈ నెల 4 ఎం.జి యూనివర్సిటీ లో జరిగిన వాలంటీర్ల ఎంపికలో ఎన్జీ కళాశాల విద్యార్దిని డి. కామేశ్వరి ఎంపిక అయిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన కామేశ్వరి ని అభినందిస్తూ  ఒక మొక్కను బహుమతిగా అందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు.

డి. కామేశ్వరి ఎన్ఎస్ఎస్ యూనిట్ 6వ యూనిట్ విభాగం నుండి ఎంపికైనదని, ఈ విభాగం ను ప్రోగ్రాం ఆఫీసర్ కే.శివరాణి పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లు యాదగిరి రెడ్డి, వెంకట రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, శీలం యాదగిరి, లైబ్రరీ విభాగం దుర్గా ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, తదితరులు పాల్గొని విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.

SB NEWS NALGONDA DIST

Mane Praveen

Oct 12 2023, 18:03

NLG: ప్రభుత్వ జేబీఎస్ హైస్కూల్ లో ఘనంగా బతుకమ్మ
నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ మాధవ్ నగర్ లో గల ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో, నేడు విద్యార్థినులు బతుకమ్మలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు ప్రత్యేకంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో కోలాహలంగా బతకమ్మ సంబరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

Mane Praveen

Oct 12 2023, 17:50

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం విమర్శించారు.గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కలిగిన పేద రైతులకు, రుణమాఫీ అయిన రైతులకు.. తిరిగి పంట రుణాలు ఇవ్వాలని వారు అన్నారు. అసైన్డ్, ఇనాం భూములు కలిగిన పేద రైతులకు తిరిగి పంట రుణం ఇవ్వకుండా, బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నాయకులు కొత్తపల్లి నరసింహ, గౌస్యబేగం, బల్లెం స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 11 2023, 21:51

TS: పదిమంది ఎస్పీలు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
1.సంగారెడ్డి - రమణ కుమార్
2.కామారెడ్డి - శ్రీనివాసరెడ్డి
3. మహబూబాబాద్ - చంద్రమోహన్
4. జోగులాంబ గద్వాల - సృజన
5. జగిత్యాల - భాస్కర్
6. సూర్యాపేట - రాజేంద్రప్రసాద్
7. మహబూబ్‌నగర్‌ - నర్సింహ
8.నాగర్ కర్నూల్ - మనోహర్ 9.నారాయణపేట - వెంకటేశ్వర్లు 10.భూపాలపల్లి - కరుణాకర్ SB NEWS

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 11 2023, 20:55

TS: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలకు బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లను ఎన్నికల కమిషన్ బదిలీలు చేసింది.

*రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ.

*13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం.

*రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.

*వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.

*ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు *హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం *రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు

SB NEWS SB NEWS TELANGANA

Mane Praveen

Oct 11 2023, 17:00

IBP: మహిళా సాధికారత కాంగ్రెస్ తో సాధ్యం: మల్ రెడ్డి రంగారెడ్డి
RR: ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని "A" బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ లో పలువురుకి నియామకపు పత్రాలు అందజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. గోపగళ్ల సత్యా రాణి - ఉపాధ్యక్షురాలు గా లక్కుమళ్ళ కల్పన - ప్రధాన కార్యదర్శి గా లుగా నియమితులు అయ్యారు. వీరికి మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట, జిల్లా బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA