తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 19:35

నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో... కనగల్ మండలం రేగట్ట గ్రామానికి చెందిన 30 మంది పైగా క

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... కెసిఆర్ నాయకత్వంలో సంబండ వర్గాలు..

 కెసిఆర్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుకొని...

 సంతోషంగా ఉన్నారని అందుకే వారి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని... బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు..

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరీం పాషా సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి.. మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య,ఎంపీటీసీ, పాలకూరి పుష్ప వెంకటేశం... సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ కడారి కృష్ణయ్య,మాజీ జెడ్పిటిసి,ఎర్రోళ్ల సంజీవ, గోలి నవీన్.... పార్టీలో చేరిన వారిలో.. తిరిగి మల్ల వెంకటరమణ భోగరాజు నవీష్ అంతా సతీష్ సిరిగిమల్ల శ్రీధర్ భోగరాజు అంజయ్య సిరిగిమల్ల మల్లేష్ బొమ్మ పల్లి సైదులు తదితరులు ఉన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 19:21

నల్గొండలో గెలుపే లక్ష్యంగా గడప గడపకు బిజెపి

నల్గొండలో బీజేపీ గెలుపే లక్ష్యంగా గడప గడపకు బీజేపీ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

గురువారం కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్వేశిపురం మరియు కనగల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి గడప గడపకు వెళ్లి బిజెపి కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను తామే ప్రవేశ పెట్టామని రాష్ర్ట ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు అయోమయానికి గురి చేస్తుందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, రహాదారులు అద్భుతంగా తయారవుతున్నాయని, రేషన్ పాటు రాష్టంలో అమలయ్యే అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ప్రజలంతా గమనించి మాయ మాటలు చెప్పే పార్టీల మోసాలను పసిగట్టి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, BRS లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మండల నాయకుకు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్ర ఇంచార్జిలు బూత్ అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 17:52

ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదు

      ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఇతర న్యాయమైన సమస్యల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 15 రోజుల నిరవధిక సమ్మె సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

     తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా విస్తృత సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ ఆయన ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ఐక్యంగా వీరోచిత పోరాటం చేసిన ఆశలకు అభినందనలు తెలిపారు. సమ్మెలో భాగంగా 9న చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ధర్నా సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు గారు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కమిటీ వేస్తామని సమస్యలు సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె జీతము పెండింగ్ ఏరియర్స్ కరోనా రిస్క్ అలవెన్స్, పెండింగ్ వేతనాలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.

     

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల కోడ్ వచ్చినందున ఆశ వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని ప్రభుత్వం మోసం చేస్తే మరో పోరాటానికి ఆశ వర్కర్లు సిద్ధమవుతారని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ మాట్లాడుతూ టిబి స్ఫూటం డబ్బాలను ఆశలతో మోపించే పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. పారితోషకాలు లేని పనులను ఆశ వర్కర్లు చేయవద్దని చేయవద్దని అన్నారు. ఆశ వర్కర్ల పనిబారం తగ్గించాలని జాబ్ చార్ట్ రూపొందించాలని డిమాండ్ చేశారు.

        

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,జిల్లా నాయకులు భీమాగాని గణేష్, ఆశ యూనియన్ జిల్లా నాయకులు రమావత్ కవిత, వసంత, శైలు,టీ పార్వతమ్మ, ఎస్ కె సలీమా, కె. సంధ్యారాణి, ఎం పుష్పలత, ఎస్ జయమ్మ, సునీత, పూలమ్మ, బి అనూష, బి.నిర్మల, మమత, పద్మ, శ్వేత, తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 11 2023, 18:23

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె తాత్కకలికవాయిదా

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.

      

బుధవారం నల్లగొండ జిల్లా విద్య అధికారి కార్యాలయంలో సహాయ సంచాలకులు రంగాచారి కి సమ్మె విరమణ పత్రం అందజేయడం జరిగింది వారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అదనంగా పెంచిన రూ.2000 వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని మొత్తం సరిపడా బడ్జెట్ ను కేటాయించాలని లేదా క్రొత్త మెనూను సవరించాలని ముఖ్యమంత్రి అల్పాహారం పనికి అదనం వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 28 నుండి నిరవధక సమ్మె చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని తేదీ 9 10 2023న ఉదయం 9 గంటలకు వారి నివాసంలో సిఐటి యు ప్రతినిధి బృందం కలిసి చర్చించారని అన్నారు.ఈ సందర్భంగా వారు స్పందిస్తూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే పెండింగ్ బిల్లులు, గౌరవితనం బడ్జెట్ విడుదల చేశామని వాటి ఫాలో కోసం అధికారిని కేటా ఇస్తామని ముఖ్యమంత్రి అల్పాహార పథకం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరగా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను మరింత మోసం చేస్తుందని రెండు సంవత్సరాలుగా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం సరైనది కాదని మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారని అధిక అప్పులు చేసి ఉన్న ఆస్తులు గాలి బొట్టులు తాకట్లు పెట్టి మధ్యాహ్న భోజన పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారని ఎప్పుడు బిల్లులు అడిగినా ఎప్పుడు జీతాలు అడిగినా ఫ్రీజింగ్ లో ఉన్నాయని రకరకాల ఆరు నెలలు సంవత్సరాలు 8 నెలలు పెండింగ్లో పెడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులను మరింత అప్పుల పాలు అవుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమ్మె తాత్కాలిక విరమణ తప్ప సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు

       

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ ,జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, పందుల ముత్యాలి తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 10 2023, 11:28

నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కాజీపేట: ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి.

ఈనెల 15 వరకు ప్యాసింజర్లు..: కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 10 2023, 11:26

సీఐడీ కార్యాలయానికి నారా లోకేష్‌

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి బయల్దేరారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌..

ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను సీఐడీ విచారించనుంది. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై లోకేష్‌ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేడు ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్‌ హాజరు కావాల్సి ఉంది. కాగా, చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత..

న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్‌కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్‌

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 19:31

ఎన్నికలలో పోటీ చేయడానికి సిపిఎం సన్నద్ధం

    జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి వర్గ సభ్యులు వెల్లడి 

రాబోయే ఎన్నికలలో సిపిఎం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమని కార్యకర్తలను సమయత్తం చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై రంగారెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల బిజెపి పాలనలో దేశం అధోగతి పాలయిందని అన్నారు దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని దేశంలో మత ఉన్మాదపు చర్యలకు పాల్పడ్డారని దేశాన్ని ఆదాని అంబానీ లాంటివి పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలని ధారాధత్వం చేశారని అన్నారు. కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజల హక్కులను కాల రాశారని అన్నారు ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను బిజెపి ప్రభుత్వం తుడిచి పెట్టేసిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దేశంలో రెండు పూటలా తిండి తినలేని పరిస్థితులకి పేదలని నెట్టివేసిందని ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట చెప్పి నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని అన్నారు దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ సెక్యులర్ ప్రజాస్వామ్యం పదాలను తొలగించి ప్రశ్నించే వారిపైన దాడులకు ఉసిగొలుపుతుందని అన్నారు.

మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని తుంగలో తొక్కిందని డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించిందని జ్యోతిష్యము మూఢనమ్మకాలు లాంటి పాఠాలలో ప్రవేశపెట్టడం దౌర్భాగ్యస్థితికి నిదర్శనం అని అన్నారు. భారతదేశంలో పత్రిక మీడియా స్వేచ్ఛలను హరించి వేసిందని అక్రమ దాడులు కొనసాగిస్తూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జర్నలిస్టులను జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నించారు వామపక్ష భావజాలం ఉన్న నాయకుల ఇండ్లపై దాడులు చేస్తూ భయపతాన్ని సృష్టిస్తుందని అన్నారు. సనాతన ధర్మం పేరా ప్రజలను అణిచి వేయడానికి ఉపయోగపడే చర్యలకు పూనుకుంటుందని అన్నారు ప్రజలు రాబోయే ఎన్నికలలో బిజెపి మతోన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వేల శిలాఫలకాలు ఏమిటని ప్రశ్నించారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందారని అన్నారు నిరుద్యోగులకు నిరాశ చూపారని ఉద్యోగ నియామకాలలో అసంబద్ధమైన నిర్ణయాల వలన యువత అయోమయానికి గురయ్యారని టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు ప్రాణప్రదమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి నిధులు కేటాయించకపోవడం దానిని పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి మూలమని తెలిపారు ప్రజల చేతుల్లో ఉన్న భూములను పట్టాలివ్వకుండా ధరణి పేరా తొక్కి పెడుతున్నారని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాసన్ పట్టణ కార్యదర్శి ఎం డి సలీం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణ రెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మండల కార్యదర్శిలు నలుపరాజు సైదులు మన్నెం బిక్షం కందుల సైదులు శ్రీకర్ జిల్లా అంజయ్య కొండ వెంకన్న దొండ కృష్ణారెడ్డి దండంపల్లి సరోజ బొల్లోజు భారత కానుగు లింగస్వామి యాదయ్య గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

పాలడుగు నాగార్జున నల్లగొండ

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 19:26

రేపటి నుండే అందుబాటులోకి మహాప్రస్థానం సేవలు

 అత్యాధునిక వసతులు..ఆధునిక సౌకర్యాలతో పార్క్ ని తలపిస్తున్న మహాప్రస్థానం

మహాప్రస్థానంలో కాటికాపర్లతో సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి

అంతిమ సంస్కారాల రుసుము 6 వేలు గా నిర్ణయం

రేపటి నుంచి ప్రారంభం కానున్న కార్యకలాపాలు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం

భూతల స్వర్గాన్ని తలపిస్తున్న  సూర్యాపేట లోని మహా ప్రస్థానం సేవలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. సకల వసతులు, అత్యాధునిక సౌకర్యాలతో రూ.. 4.20 కోట్ల తో ఆదునికరించిన మహాప్రస్థానం సేవలకు సిద్ధంగా ఉంది..

 

అంత్యక్రియల రుసుము 6 వేలు గా నిర్ణయం

 సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద వద్ద ఉన్న మహాప్రస్థానం గతం లో సౌకర్యాల లేమీ తో ప్రజలు ఇబ్బందులు పడేవారు.. ఇక అంత్యక్రియలు నిర్వహించాలంటే జేబులు గుల్ల అయ్యేవి. మంత్రి జగదీష్ గారు తీసుకున్న నిర్ణయం, చొరవ తో మహా ప్రస్థానం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకే రుసుము తో అది కూడా అందుబాటు లో ఉండే విధంగా మహాప్రస్థానం లో కాటి కాపరులతో సమావేశం అయిన మంత్రి జగదీష్ రెడ్డి, అంత్యక్రియల ఫీజు 6 వేలు గా నిర్ణయించారు.. ఈ ఫీజు రాష్ట్రం లోనే సూర్యాపేట లోనే అతి తక్కువ కావడం మరో విశేషం..

  కిరాయి దారులకు సౌకర్యం గా అద్దె కాటేజ్ లు

అద్దె ఇళ్ళ లో ఉండే వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఎదుర్కొనే సమస్య వర్ణాతీతం. యజమానులు పార్థివదేహన్ని ఉంచకూడదని పెట్టే షరతులు ఒక వైపు, భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి మరోవైపు అష్ట కష్టాలు పడేవారు.కిరాయి దారుల సమస్యలను గుర్తించిన మంత్రి అటువంటి అభాగ్యుల కోసం మహాప్రస్థానంలో చనిపోయినాటినుండి కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఉండి జరిపించుకునేందుకు వీలుగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అతి తక్కువ ఫీజుతో పదిమంది కుటుంబ సభ్యులు ఉండేలా రెండు కాటేలను సిద్ధం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 18:29

కెసిఆర్ పాలనలోని గ్రామాల అభివృద్ధి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ

పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి

కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను ససశ్యామలం చేసింది బీఆర్ఎస్

➖➖➖➖➖➖➖➖

పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామం లో బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి

గిడ్డంగుల సంస్థ ఆద్వర్యంలో రూ.9.70 కోట్ల తో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ తో నిర్మించనున్న గౌడాన్ కు శంకుస్థాపన.

➖➖➖➖➖➖➖➖

 పెన్ పహాడ్ 

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పెన్ పహాడ్ మండలంలోని చీదెళ్ళ గ్రామం లో పర్యటించిన మంత్రి గ్రామం లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. తమ అభిమాన నేత జగదీష్ రెడ్డి రాక ను తెలుసుకున్న గ్రామ మహిళలు పెద్ద ఎత్తున మంత్రి కి ఎదురెళ్లి స్వాగతం పలికారు. రైతులు తమ ఉత్పత్తుల ను నిలవ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ , రూ..9.70 కోట్ల రూపాయల తో గ్రామంలో నిర్మించనున్న గౌడాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్‌ చొరవతోనేనని తెలిపారు.కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే అన్నారు.2014 కు ముందు 

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను వందలాది కిలో మీటర్ల నుండి గోదావరి జలాలను తెచ్చి ససశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ నే అన్నారు.

పల్లెప్రగతి ద్వారా గ్రామానికి ఒక ట్రాక్టర్‌తో పాటు శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, హరితహారం, నర్సరీ తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు పల్లెలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయన్నారు.

అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారిందన్నారు. తండా లను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గతం లో దుమ్ము దూలి తో ఉన్న రహదారులు నేడు అద్దం లా రూపుదిద్దుకున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 

టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య , మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, సర్పంచ్ పరెడీ సీతారాంరెడ్డి , సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామ్ రెడ్డి , ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు , రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గుర్రం అమృతా రెడ్డి. మిరియాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, వార్డ్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 05 2023, 15:23

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి షాక్.. రూ.11 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు

తెలంగాణలోని ప్రముఖ ఆలయం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. రూ.11 కోట్లు పన్ను చెల్లించాలంటూ మల్లన్న దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు..

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసినప్పటికీ 12ఏ రిజిస్ట్రేషన్‌ను ఆలయ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు.. దాదాపుగా 1995 నుంచి ఐటీ రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 

దీనిపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. 1995 నుంచి ఐటీ రిటర్న్‌లు, ఆడిట్ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.

ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ.8 కోట్ల ట్యాక్స్ దీనికి రూ.3 కోట్ల జరిమానా మొత్తం రూ.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలపై సాధారణ వ్యక్తులు, కంపెనీలతో వ్యవహరించినట్లుగా కఠిన వైఖరిని అవలంబించొద్దని భక్తులు సూచిస్తున్నారు. మరి ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.