TS: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలకు బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లను ఎన్నికల కమిషన్ బదిలీలు చేసింది.
*రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ.
*13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం.
*రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.
*వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశాలు.
*ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు *హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశం *రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు
SB NEWS
SB NEWS TELANGANA


SB NEWS TELANGANA
RR: ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని "A" బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ లో పలువురుకి నియామకపు పత్రాలు అందజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు.
గోపగళ్ల సత్యా రాణి - ఉపాధ్యక్షురాలు గా లక్కుమళ్ళ కల్పన - ప్రధాన కార్యదర్శి గా లుగా నియమితులు అయ్యారు. వీరికి మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో రాష్ట, జిల్లా బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి: ఒకే చెర్వులో వారం రోజుల్లోనే ఇద్దరు శవమై తేలిన ఘటన యాదాద్రి జిల్లా లో చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరి చెరువులో గత వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది.
నల్గొండ: సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు మరియు మరియు చోల్లేటి ప్రభాకర్ రచించిన "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ
స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పరీక్షలపై విద్యార్థులు పెంపొందించుకోవాల్సినటువంటి నైపుణ్యాలు అనే అంశంపై ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ బుధవారం "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. కృషి, పట్టుదల, స్వయంకృషితో కష్టపడి చదివి విజయం సాధించవచ్చు అని, కోచింగ్ తప్పనిసరి కాదని, ఎవరైనా సాధించవచ్చని తెలిపారు.
చోల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకై ప్రణాళిక తో సంసిద్ధం కావాలని, తను రచించిన పుస్తకం.. "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" ఎంతగానో ఉపయోగపడుతుందని, యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికతో సన్నద్ధం కావాలని, లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే ఆ రంగంలో రాణించగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ యాదగిరి , యాదగిరి రెడ్డి, దీపిక, శ్రీధర్, దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి, మల్లేశం, తదితర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనానుభవం సర్టిఫికెట్లతో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు.
TS: ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 15 నుంచి 41 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
ఈసారి సభకు భారీ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.ఈనెల 18న జడ్చర్ల, మేడ్చల్ బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఎవరైనా ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో జరిగిన గర్జన సభలో ప్రసంగించిన అమిత్షా.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్ 3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్షా మాట్లాడుతూ.. ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం అయితే.. అక్టోబర్ లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు. కేవలం కేటీఆర్ ను సీఎంను చేయాలని.. కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు.
గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మోదీ నిర్ణయించినా కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. చివరకు మోదీ 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నెంబర్వన్ రాష్ట్రం అని కెసిఆర్ చెబుతున్నారు. నిజమే నెంబర్ వన్ చేశారు. ఉపాధి కల్పించడంలోనా, తాగునీరు ఇవ్వడంలోనా, ఉద్యోగాలు ఇవ్వడంలోనా కాదు, రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్వన్, మహిళలు, చిన్నారులపై దాడుల్లో నెంబర్వన్, అవినీతిలోనూ నెంబర్వన్ అయింది. పదేళ్లుగా కేటీఆర్ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలా అని ఆలోచించారని అమిత్ షా విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి కి కేవలం తన కొడుకును సీఎం చేయడమే లక్ష్యం. కానీ మా లక్ష్యం ఆదిలాబాద్ గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు, విద్య, రైతులకు నీరు అందించడం మా లక్ష్యం. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ..? దళితులకు మూడెకరాలు ఎక్కడ? దళిత బంధు అందరికీ ఇచ్చారా..? మీ కార్యకర్తలను ఇచ్చుకున్నారు.. మిగిలినవారి సంగతేంటి? అని ప్రశ్నించారు. గిరిజన వర్శిటీ మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ప్రకటించారు. కృష్టా బోర్డు ట్రిబ్యునల్ విధివిధానాలు క్యాబినేట్ లో ఇచ్చారని అమిత్ షా తెలిపారు.
మిర్యాలగూడ: సాగర్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ 4 రోజుల క్రితం ఉదయం వాకింగ్ చేస్తుండగా బిపి పెరిగి పెరాలసిస్ రావడం తో మిర్యాలగూడ అపోలో రీచ్ హాస్పిటల్ లో చేర్పించటం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం, అతడిని పరామర్శించి అతని కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా ఆదిమల వెంకటేష్ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఆర్ఎస్పి తెలిపారు.
Oct 11 2023, 21:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.8k