తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:08

అక్టోబర్ నెలలో స్వామివారి విశేష పర్వదినాలు

నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబర్‌ నెలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్‌ 1 న బృహత్యుమాసవ్రతం ఉండ్రాళ్లతద్దె, 3న మధ్యాష్టమి, 10న మతత్రయ ఏకాదశి, 13న మాసశివరాత్రి, అక్టోబర్‌ 14న మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంతదేశిక ఉత్సవం ప్రారంభం.

ఇక 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, సరస్వతిపూజ, 21న దేవి నవరాత్రి వ్రతం, సేనై ముదలియార్‌ వర్ష తిరునక్షత్రం, 22న స్వర్ణరథోత్సవం,

దుర్గాష్టమి, 23 న చక్రస్నానం, మహర్నవమి మరియు విజయదశమి, వేదాంత దేశిక సాత్తుమొర, పిళ్ళైలోకాచార్య పోయిగై ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 24న పూద ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 25న మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 28న పాక్షిక చంద్రగ్రహణం, అక్టోబర్‌ 31న చంద్రోదయోమ వ్రతం అట్లతద్దె, పర్వదినాలు టిటిడి వైభవంగా నిర్వహించనుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 01 2023, 09:06

నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే

నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్‌కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు..

మహబూబ్‌నగర్‌లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుని.. 2.15-2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.

ఇక, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న సన్నాహాక బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 16:50

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే..

దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

కానీ, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. 

కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున దిల్లీలో న్యాయవాదులతో లోకేశ్‌ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు.

పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్‌.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 14:29

శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ గురువారం ఉదయం తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు.

దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. పలువురు క్రికెట్ అభిమానులు గంభీర్‌ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.

శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు గంభీర్.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచకప్‌ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని అభి ప్రాయపడ్డారు.

గంభీర్. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.

ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌లో ఉంది...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 13:14

ములుగు జిల్లా మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న మంత్రి హ‌రీశ్‌రావు

ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం ఉద‌యం శంకుస్థాప‌న చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ క‌విత‌, నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

రూ.180 కోట్లతో మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేయ‌నున్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో రూ.2.36 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాప‌న చేశారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానానికి చేరుకొని దళిత బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయ‌నున్నారు.

అనంత‌రం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు వెళ్లనున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 13:12

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పసిడి

 ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు.

వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు. 

వియత్నంతో పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 580 పాయింట్లు సాధించిన సరబ్జోత్ ఐదో ర్యాంక్ సాధించగా, అర్జున్ 578 పాయింట్లతో వ్యక్తిగత క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

వీరిద్దరూ నేడు జరగనున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో పోటీ పడనున్నారు.

దీంతో ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 24వ పతకం, షూటింగ్‌లో నాలుగో బంగారు పతకం లభించింది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 10:33

భారత్ పై ఆసీస్ ప్రతీకార విజయం

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో పర్యాటక ఆసీస్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అయితే, తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే ఉంది. నెంబర్ 1 ర్యాంక్‌తోనే వన్డే వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.

అటు ఆస్ట్రేలియా.. వన్డేల్లో 5 ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. వన్డే వరల్డ్ కప్ ముందు కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం.. ఆ జట్టులో ఉత్సాహం నింపింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ శుభారంభం అందించాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి నివ్వడం, ఇషాన్ కిషన్‌కు జ్వరం రావడంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం సుందర్ (18) ఔట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ (56), రోహిత్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 6కు పైగా రన్ రేట్‌తో పరుగులు సాధించడంతో భారత్ లక్ష్యం దిశగా వెళ్లింది.

అయితే 21వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ.. మ్యాక్స్‌వెల్ పట్టిన అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 144. 26.5 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 171 వద్ద విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (26) కాసేపు నిలబడినా స్వల్వ వ్యవధిలోనే ఇద్దరూ వెనుదిరిగారు.

సూర్యకుమార్ యాదవ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 257 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్.. విజయావకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగతా మూడు వికెట్లను తీసిన ఆసీస్.. 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ను ఆలౌట్ చేసింది.....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 10:31

29న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

అమరావతి: సీఎం జగన్‌ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు.

విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు..

ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు.

బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2023, 10:28

గణేష్ నిమజ్జనంలో అపశృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో రాత్రి అపశృతి దొర్లింది.

నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి.

విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 22:25

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్:రేమా రాజేశ్వరి

 జల్సా లకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులకు అంతు చిక్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు.

గతవారం 24 వ తేదీన ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు విషయం బయటపడింది 

ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి సరఫరా చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. చేసేది లేక నిందితులు వాహనం వదిలేసి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న ట్రాక్టర్ ను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా  

 ట్రాక్టర్ పైన ఇటుకల ఉంచి క్రింద భాగాన ఉంచిన 93 బ్రౌన్ కలర్ గంజాయి ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి రమా రాజేశ్వరి తెలిపారు.

బుధవారము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి రేమా రాజేశ్వరి నిందితుల వివరాలు వెల్లడించారు.

1 ఈశ్వర్, 2,జగబంధు 3,క్రిశాని,4,గురు, అనే నిందితులు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో సరిహద్దు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారని ఆమె అన్నారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిధులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రామగుండం సీపీ రేమా రాజేశ్వరి తెలిపారు.. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సుధీర్, రాం నాథ్, కేకన్ ఐపీఎస్, డీసీపీ మంచిర్యాల, మోహన్ ఏసిపి, జైపూర్ నిందితులను పట్టుకోవడానికి సహకరించిన అధికారులందరినీ రేమా రాజేశ్వరి అభినందించారు...