నిజంనిప్పులాంటిది

Sep 24 2023, 10:18

నిఘా పర్యవేక్షణ లో హైదరాబాద్ అగ్రస్థానం

దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ రికార్డు సాధించింది.

విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా..

ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22వ స్థానంతోపాటు హైదరాబాద్‌ 41వ స్థానంలో ఉన్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించిన ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ…

తాజా జాబితాను ఎక్స్‌ ట్విట్టర్‌,లో విడుదల చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరి గణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది...

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 24 2023, 10:14

ఆసియా క్రీడల్లో భారత్‌ శుభారంభం

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట ప్రారంభించింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇండియాకు తొలి పతకం లభించింది.

రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించింది.

చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది...

SB NEWS

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

*STREETBUZZ NEWS "

నిజంనిప్పులాంటిది

Sep 24 2023, 10:05

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీ ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమా ❓️

కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు.

లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు.

మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా తప్పించుకొన్నారు. వీళ్లు వెళ్లింది మరెక్కడికో కాదు.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పంచాయితీకి.

ఓవైపు లోక్ చరిత్రాత్మకమైన బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈ ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా బయటకు వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎంపీలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

చరిత్రాత్మక మహిళా బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ ఉత్తమ్ కుమార్ మహిళా లోకానికి తీరని అన్యాయం, నమ్మకద్రోహం చేశారని బీఆర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

వీరంతా తమ విధులను నిర్వర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

టికెట్ల పంచాయితీలో కొట్లాడుకుంటూ ఓటు వేయకుండా మహిళల పట్ల బాధ్యతలేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు.

మహిళలకు క్షమాపణ చెప్పేవరకు వారిని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వొద్దని అన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 24 2023, 08:42

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, శనివారం 74,884 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 32,213 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 24 2023, 08:37

తెలంగాణ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఉధృతిత

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ.. ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీ కి వస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు.

భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు.

హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు.

పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బోర్డర్ వద్ద ఐడి కార్డులు.. వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెడుతున్నారు. ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ మార్గాల ద్వారా రాజమండ్రికి చేరుకున్నట్టు సమాచారం.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద హైఅలర్ట్‌ ప్రకటించారు.

ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు.

సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:12

Simultaneous Polls: 'జమిలి ఎన్నికల కమిటీ' తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం

దిల్లీ: 'ఒకే దేశం - ఒకే ఎన్నికల (One Nation, One Election)' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..

ఈ కమిటీ శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ ఛైర్మన్‌ కోవింద్‌.. సమావేశ అజెండాను వివరించారు.

ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

'జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో

తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

దీంతోపాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది' అని ఒక ప్రకటన వెలువడింది.

అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు సమావేశ అజెండాలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి..

SB NEWS

STREETBUZZ NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:09

ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనర్ కీలక సూచనలు

రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశించారు.

దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు.

పండుగ సీజన్ సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉద్యోగులందరితో శనివారం ఆయన వర్చ్‌వల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, గతం కంటే రెట్టింపు స్థాయిలో పని చేయాలన్నారు.

గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని, వినూత్న కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేశామని తెలిపారు.

సంస్థ మనుగడ కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు స్వాగతించారని పేర్కొన్నారు.

వంద రోజుల ఛాలెంజ్‌, శ్రావణ మాసం ఛాలెంజ్‌, రాఖీ పండుగ ఛాలెంజ్‌, దసరా ఛాలెంజ్‌, సంక్రాతి ఛాలెంజ్‌, ఏడీపీసీ ఛాలెంజ్‌... ఇలా ఎన్నింటినో సిబ్బంది స‌వాలుగా స్వీక‌రించి

లక్ష్యానికి మించి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయడం వల్లే సంస్థకు సత్పలితాలు వచ్చాయని తెలిపారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:06

హైదరాబాదులో భారీ భవనాలు కూల్చివేత

మదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు.

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని నెంబర్‌ 7, 8 భవనాలను క్షణాల్లోనే అధికారులు నేలమట్టం చేశారు.

ఏడు అంతస్తుల్లో ఉన్న భవనాలు క్షణాల్లోనే కూల్చివేశారు. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేతను చేపట్టింది.

అయితే, రెండు భవనాల స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించనున్నారు. కొద్దికాలం కిందట భవనాలను నిర్మించారు.

పలు సాంకేతిక కారణాలతో భవనాలకు సమస్యలు రావడంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించి..

పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భవనాలను కూల్చివేశారు.....

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:03

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్ సర్కార్

తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాత లకు ప్రభుత్వం లాంఛనాలతోనే

అంత్య క్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.

అవయవ దానం విష యంలో తమిళనాడు దేశం లోనే అగ్రగామిగా ఉంది. విషా దకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల

అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.

మరణానంతర అవయవ దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులకు తెలియజేయాలి.

మిగిలిన వాళ్లు కూడా అవ యవ దానం చేసేలా ప్రోత్సహించాలి.

అవయవ దాతలు , వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్టాలిన్ పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 22:00

సీ వీ ఆనంద్ ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్..పోలీస్ దంపతులు

హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, పోలీస్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

పోలీస్ వెహికల్‌ నుంచి కిందకు దిగుతున్నట్లు ఫొటోలు తీయించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

పోలీస్ వెహికల్, డ్రెస్, పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఉపయోగించుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు.

ఈ పోలీస్ దంపతులు బాధ్యతలు మరిచి ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్‌ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు.

దీంతో జీవితంలో సంతోషంగా ఉండాలని కొత్త జంటకు సీవీ ఆనంద్ శుభాకాంక్షలు చెప్పారు...