నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 10:03

పండుగలా 'పాలమూరు' ప్రారంభోత్సవం

పండుగలా 'పాలమూరు' ప్రారంభోత్సవం

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.

లక్షన్నర మంది రైతులను భాగస్వాములు చేయాలి

ప్రాజెక్టు విశిష్ఠత తెలిసేలా కార్యాచరణ ఉండాలి

స్వరాష్ట్ర ఉద్యమ స్వప్నం..నెరవేరిన ఉజ్వలపథం

ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. ఈ నెల 16న జరిగే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రజల కలగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో ఆ కల నెరవేరుతున్నందుకు తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. 

ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు ఆకుపచ్చని సిరులతో తులతూగబోతున్నాయని తెలిపారు. గతంలో ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని, నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు సంబురంగా ఉన్నదని అన్నారు. గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డిలాంటి గొప్ప ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయని తెలిపారు.

తీరిన ప్రజల కష్టాలు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 'పాలమూరు, రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది. అనేక అడ్డంకులను దాటుకొని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో పూర్తయి న ప్రాజెక్టు ఇది' అని చెప్పారు. రైతుల పొలాలకు సాగునీరు, రాజధాని ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి అవసరాలు పాలమూరుతో తీరనున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు విశిష్ఠతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా కార్యాచరణ ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న కనీ సం లక్షన్నర రైతులతో ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభ నిర్వహించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించిన కేటీఆర్‌.. సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలని కోరారు.

సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఇతర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, రఘునందన్‌రావు, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 09:54

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే: కేటీఆర్

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే

హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

రియల్‌ ఎస్టేట్‌ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు.

విజన్‌తో కూడిన సినిమా ముందుంది

ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు

నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం

రియల్‌ పెట్టుబడులు నలువైపుల విస్తరించాలి

2050 దాకా తాగునీటికి ఢోకా లేదు

ప్రశాంతంగా శాంతి భద్రతల పరిస్థితి

అందుకే వెల్లువలా వస్తున్న పెట్టుబడులు

రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పోలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై మీరు చూసింది ట్రైలర్‌ మాత్రమే.. ఇంకా అనేక ప్రాజెక్టులతో, గొప్ప విజన్‌తో నగర అభివృద్ధి సినిమా ముందున్నదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నగరంలో శనివారం నిర్వహించిన టైమ్స్‌ మెగా ప్రాపర్టీ షోను కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతి తక్కువగా ఇండ్ల ధరలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నదని, ఈ ఒరవడిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టేందకు ప్రాధాన్యమివ్వాలని సూ చించారు. నగరంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీపడుతూ, వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మించాలని కోరారు. ఆ భారీ భవనాలు హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయన్న విషయాన్ని తమ డిజైన్ల రూపకల్పన సమయంలోనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత అతి ఎత్తయిన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఒక్క రోజులో నగరాలు నిర్మాణం కావు

ఏ నగరమైనా ఒక రోజులో నిర్మాణం కా దని, ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికతో ముందుకు వెళితేనే నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కోటిమంది ఉన్న హైదరాబాద్‌ జనాభా మూడు కోట్లకు చేరుకున్నా, 2050 వరకు తాగునీటికి ధోకా లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వచ్చిన అద్భుతమైన మార్పులపై సినీ హీరో రజనీకాంత్‌ మొదలు అనేకమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సైతం హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రత్యేకంగా తమ నివేదికల్లో పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే నగరంలో మౌలిక వసతుల కల్పన వేగంగా కొనసాగుతున్నదని, నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు బాగుంటేనే భారీగా పెట్టుబడులు వస్తాయని అన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 22:58

నల్లగొండ అప్పాజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కంచర్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక

అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో

 అప్పాజీపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు,

ఓర్సు సైదులు,ఓర్సు భీమేష్,ఓ ర్సు సత్యనారాయణ,ఓర్సు రాజు,ఓర్సు వెంకన్న,ఓర్సు క్రిష్ణయ్య,ఓర్సు అంజయ్య,ఓర్సు సతీష్,ఓర్సు శ్రీను,ఓర్సు నరేష్, శేషాద్రి,ఒరుగంటి స్వామి,

పోలె లింగయ్య,బొప్పని మధు,బొప్పని గోపాలు,కట్ట వెంకన్న,బొప్పని అజయ్,కాసర్ల సరిత, పోలె పార్వతమ్మ,రూపని ముత్యాలు,వాడపల్లి రమేష్,దాదాపుగా 100 కుటుంబాలు* BRS పార్టీలో చేరినారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు,సర్పంచ్ పబ్బతి రవిందర్ రెడ్డి గారు,PACS వైస్ చైర్మన్ తవిటి క్రిష్ణ గారు,వార్డ్ మెంబర్ P, క్రిష్ణయ్య,A శ్రీను,కట్ట వెంకటేశ్వర్లు,

P శివాజీ,G చిరంజీవి,P రాములు,

BRS ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 22:01

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి :ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

 

తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 6 వ రోజు రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం ఆరో రోజు రోజు రిలే నిరాహార దీక్షలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ

విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని,మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు నందు జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్ , పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, మేస్పెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్లు, కేజీబీవి యుఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్టీలు, పీఈటి, ఎఎన్ఎం, అకౌంటెంట్, కంప్యూటర్ టీచర్లు, ఒకేషనల్ ఇన్స్ ట్రక్టర్స్, వంటమనుషులు, వాచ్మెన్లు, అటెండర్లు మరియు కేజీబీవీ టైప్ -4 (మోడల్ స్కూల్ హస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టెకర్, ఎఎన్ఎం,కుక్స్,వాచ్ వమేన్స్ , జిల్లా స్థాయిలో ఎపిఓ, సిస్టమ్ ఎనలిస్ట్, డిఎల్ఎంటి , డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్, ఆఫీస్ సబార్డినేటర్స్ గా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం( మినిమమ్)

టైమ్ స్కేల్ను ) అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్షా, కెజిబివి యుఆర్ఎస్ ను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని,

సుప్రీకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి మినిమమ్ టైమ్ స్కేలును (కనీస వేతనం) అమలు చేయాలన్నారు.

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించి,నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి (హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని కొరారు.

విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించి,

మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.

కరోనా సమయంలో పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్ల లకు 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 21:04

అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్:మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ

అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్ 

 మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ 

ఈనెల 11వ తేదీ నుండి అంగన్వాడీల సమ్మెకు సంబంధించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అంగనవాడి టీచర్లు హెల్పర్లు సమ్మెలో భాగస్వామ్యం కావద్దని శాంతియుత పద్ధతులో సమస్యను పరిష్కరించుకోవాలి తప్పితే చిన్నారులను , గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు చేపట్ట వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడిలో చేసిన మేలు పై ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్ నుండి టీచర్ అనే పదోన్నతిని దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వాల ముఖ్యమంత్రి ల దీటుగా కేసీఆర్ ఇంటికి పిలిచి మరి సహపంక్తి భోజనం చేసి జీతాలు పెంచిన విషయం అంగన్వాడీలు మర్చిపోలేదని అని తెలియజేశారు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వారికి పిఆర్సి పెరిగినప్పుడల్లా అంగన్వాడీలకు ముపై శాతం జీతం పెంచిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. కరోనా సమయంలో అంగనవాడి సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 20వేల రూపాయల మట్టి ఖర్చులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కీ దక్కుతుందిఅని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మినీ టీచర్లను మెయిన్ టీచర్ గా గుర్తించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ ఘనత రాష్ట్ర ప్రభుత్వం కే దక్కుతుందని తెలిపారు. అంగనవాడి టీచర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాల కి అనే ఒక నిమిత్త కాలం పెట్టడంతోపాటు, అంగనవాడి టీచర్ల ఉద్యోగ నియమాకాలలో పారదర్శకత పాటించింది రాష్ట్ర ప్రభుత్వమేనని, గ్రేడ్ టు సూపర్వైజర్ల పోస్టుల నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా 149 మందినీ జేఎన్టీయూ సహకారంతో పారదర్శకంగా నియమించడం జరిగింది అని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో మొదటి సంతకం మహిళా శిశు సంక్షేమ శాఖ ఫైల్ మీద పెట్టిన విషయం ఎవరు మర్చిపోలేదని తెలిపారు. అంగన్వాడి టీచర్లు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్వ ప్రాథమిక విద్యలో ఒకే సిలబస్ ఉండే విధంగా పొందుపరిచిన ఘనత కూడా ఈ ఈ ప్రభుత్వం దేనని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారుల పిల్లలు ఆడుకోవడానికి ప్రతి సంవత్సరం ఐదువేల రూపాయలు విలువగల ప్రీస్కూల్ కిట్ అందజేస్తుందని, నిజంగా సమ్మెకు పోయే అంగనవాడిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఒక్కసారి అక్కడే అమలవుతున్న పథకం తీరును పరిశీలించాలని కోరారు.

గతంలో ధర్నాలు సమ్మెలతో గత ప్రభుత్వంలో సాధించింది ఏమీలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలి తప్ప చిన్నారులను, గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఏదైనా సామరసపూర్వకంగా శాంతియుత పద్ధతిలో పోరాటం కొనసాగిస్తే మేలు జరుగుతుంది తప్ప ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే మన శాఖకే నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 20:54

నలగొండ మదీనా మసీదులో జరిగిన ఖిరాత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, హోంమంత్రి మహమూద్ అలీ

నేడు తెలంగాణ రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్ అలీ గారు.. స్థానిక మదీనా మస్జీదులో.. జరుగుతున్న ఖిరాత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన సందర్భంగా.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ క్యాంప్ కార్యాలయంలో.. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ మైనార్టీ నాయకులతో కలిసి.. ఘనంగా స్వాగతం పలికారు.

 

మదీనా మస్జిద్ లో 13 సంవత్సరాల తర్వాత జరిగిన ఆల్ ఇండియా కాంపిటీషన్.. ఖిరాత్ కార్యక్రమంలో... కంచర్ల తో కలిసి పాల్గొన్నారు..

 

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో., సెక్యులర్ బావాలు కలిగిన ప్రభుత్వం నడుస్తుందని.. వారి నాయకత్వంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... అమలు చేస్తున్నారని.. వారి నాయకత్వం మరింతగా పటిష్ట పరచవలసిన అవసరం ముస్లిం మైనార్టీ లకు ఉందని అన్నారు...

 

నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తాను గెలిచినప్పటి నుంచి కూడా నల్లగొండ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని... ముఖ్యంగా ముస్లింల కొరకు... ఏ అవసరమున్న... దగ్గరుండి చూసుకుంటున్నారని స్థానిక నాయకులు తెలిపారని.. ఇలాంటి వ్యక్తులను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వారి గెలుపుకు అందరూ.. కృషి చేయాలని కోరారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 14:05

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శిగా మార్గం సతీష్ కుమార్ నియామకం

నల్లగొండ గాంధీనగర్ యాదవ్ భవన్ లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా మార్గం సతీష్ కుమార్ ని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి సమక్షంలో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ వారికి నియాక పత్రం అందజేశారు.

నేటి నుంచి వారి సేవలు బీసీ సంక్షేమ సంఘానికి అందించాలని ,వారు పార్టీలకతీతంగా బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం వచ్చేంతవరకు కట్టుకట్టుగా అన్ని ఉద్యోగ యువజన మహిళ విద్యార్థి సంఘాలు ఐక్యతగా ఉండి పోరాటం చేయాలని, ఈ సందర్భంగా వారి రాకతో బీసీ సంక్షేమ సంఘం మరింత బలోపేతం అవుతుందని జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు అలివేణి యాదవ్ జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కదట్ల ఎంకన్న యాదవ్ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి సతీష్ యాదవ్ తదితరులు ఉజ్వల్ సాయిరాం వెలుపల సాయిప్రసాద్ ఆకాష్ పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 13:02

నల్లగొండలో గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల

ప్రెస్ నోట్..

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు...

 గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని... పానగల్ లో ప్రారంభించారు...

ఈ సందర్భంగా కంచర్ల... గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందించాలని  అదేవిధంగా కెసిఆర్ రద్దు చేసిన లక్ష రూపాయల రుణాన్ని కోపరేటివ్ బ్యాంకులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, డైరెక్టర్లు రుద్రాక్షి వెంకన్న, సయ్యద్ హశం, దోటి అంజయ్య, తక్కెళ్ళ రేణుక, సెక్రటరీ కె అనంత రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, సూర మహేష్, యాటా శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్, కట్టా వెంకట్ రెడ్డి, ఆది రెడ్డి, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 08:52

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.

కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. 

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

సామాజిక సమస్యలను, అన్యాయాలను తట్టుకోలేక ప్రజల కోసం 'తన గొడవ'ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిషరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున ప్రతియేటా పురసారాలను అందిస్తూ ప్రభు త్వం గౌరవించుకుంటున్నదని చెప్పారు. ఏటా ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురసారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి జయరాజుకు సీఎం మరోసారి అభినందనలు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 21:02

హైదరాబాదులో రెండో విడత డబల్ బెడ్ రూమ్ పంపిణీ కోసం మంత్రి తలసాని విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపైన రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నాం

హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైననే హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మాది అన్న కేటీఆర్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారు, వారికి అభినందనలు

మొదటి దశ 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించాం

ఈనెల 21వ తేదీన రెండవ దశ దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నం అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు

అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదు

ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించింది

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నాము, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం 

ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నాం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే

తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి కేటీఆర్

ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్

ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే

ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన

నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుంది

హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రి గారిని కోరారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా అంగీకరించారు

హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయి.

 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించింది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగింది

మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తాం.