నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 08:52

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.

కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. 

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

సామాజిక సమస్యలను, అన్యాయాలను తట్టుకోలేక ప్రజల కోసం 'తన గొడవ'ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిషరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున ప్రతియేటా పురసారాలను అందిస్తూ ప్రభు త్వం గౌరవించుకుంటున్నదని చెప్పారు. ఏటా ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురసారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి జయరాజుకు సీఎం మరోసారి అభినందనలు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 21:02

హైదరాబాదులో రెండో విడత డబల్ బెడ్ రూమ్ పంపిణీ కోసం మంత్రి తలసాని విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపైన రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నాం

హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైననే హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మాది అన్న కేటీఆర్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారు, వారికి అభినందనలు

మొదటి దశ 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించాం

ఈనెల 21వ తేదీన రెండవ దశ దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నం అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు

అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదు

ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించింది

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నాము, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం 

ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నాం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే

తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి కేటీఆర్

ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్

ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే

ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన

నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుంది

హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రి గారిని కోరారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా అంగీకరించారు

హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయి.

 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించింది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగింది

మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తాం.

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 10:15

మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి SC వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వినతి

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారికి వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

-బకరం శ్రీనివాస్ మాదిగ

ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్.

                                

 షెడ్యూల్డ్ కులాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అదేవిధంగా ఈనెల 18 నుంచి జరగబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి ఎంపీలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో నిరాహార దీక్ష చేసే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ముందు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. కాబట్టి వర్గీకరణ విషయంలో కూడా కేసీఆర్ గారు సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 

---------------------------------------

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సౌటా కాసీం మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కో-కన్వీనర్ కరిగల్ల దశరథం మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బుక్కాపురం మహేష్ మాదిగ, బొడ్డు శ్రీకాంత్, ఎడెల్లి అంజి, బరపటి రాజు, చింతకుంట్ల కుమార్, గుద్దేటి ప్రవీణ్, నాగన్న, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 08:29

తెలంగాణ మాడల్‌ దేశమంతా కావాలి

తెలంగాణ మాడల్‌ దేశమంతా కావాలి

తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తేనే రైతుల స్థితిలో మార్పు

అఖిల భారత రైతు సంఘాల నాయకుల డిమాండ్‌

బెంగళూరు రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధానంగా చర్చ

కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: బీకేయూ నేత టికాయిత్‌

తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం బెంగళూరులో కర్ణాటక సంయుక్త రాజ్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ పథకాలపై ప్రధానంగా చర్చించారు. పథకాల అమలు తీరును, రైతులకు కలుగుతున్న లాభాలను తెలంగాణకు చెందిన రైతు నేత కోటపాటి నరసింహనాయుడు వారికి వివరించారు. అనంతరం పలువురు రైతు సంఘాల నేతలు స్పందిస్తూ.. తెలంగాణ మాడల్‌ రైతు పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని నొక్కిచెప్పారు. ఇందుకోసం అన్ని రాష్ర్టాల్లో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదర్శం

స్వయంగా తెలంగాణలో పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ పథకాలపై చర్చించానని జాతీయ రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ తెలిపారు. ఇప్పటికే ఐదేండ్లలో రూ.73 వేల కోట్లు రైతుబంధు , రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులు, లక్ష కోట్లు ఉచిత విద్యుత్తు కోసం కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

త్వరలో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంయుక్త కిసాన్‌ మోర్చాలో కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు, దానివల్ల భారత రైతాంగం ఎదురోబోయే ముప్పు గుర్తించి వక్తలు వివరించారు. సమావేశంలో ప్రొఫెసర్లు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 22:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సీఎంలు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

సీఎం సంగ్మాను శాలువాతో సీఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎంకు కేసీఆర్ వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 19:00

15న మరో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

15న మరో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు.

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మంత్రి ఆదేశించారు. అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 18:05

ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

  ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ.

 

సిపిఎం ఆధ్వర్యంలోనల్లగొండలో నిరసన ప్రదర్శన

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు 

       

  సిపిఎం కేంద్ర పార్టీ పిలుపుమేరకు నల్లగొండలో స్థానిక సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ పెట్రోలు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగాయని అన్నారు. దీని ప్రభావం వలన ప్రజలు కొనలేని తినలేని స్థితిలోకి నెట్టబడ్డారని అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని వాటినుండి ప్రజల ను పక్కదారి పట్టించేందుకు కులం పేరా, మతం పేరా, ప్రాంతం పేరా అనేక అలజడలు సృష్టిస్తూ ప్రజల దృష్టి మరల్చే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనం వెలికితీత ధరల నియంత్రణ అనే అంశాలు ఎక్కడ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా ఇండ్లు ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మూడెకరాల భూమి ఇతర పథకాలు అర్హత ఉన్న ప్రజలందరికీ అందలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని అన్నారు. మరోపక్క కార్మికుల వేతనాల్లో కోత ఉపాధి హామీ పనులను నిధులు కేటాయించకపోవడం పట్టణ కేంద్రాలలో ఉపాధి పనులు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పనులకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను గాలికొదిలి సనాతన ధర్మం అంటూ ఇండియా భారత్ అంటూ మతం కులం వాటిపైనే కేంద్రీకరిస్తూ ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు 

      

*ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎం డి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ ,గంజి మురళీధర్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, నాయకులు కుంభం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ నాయకులు, గాదె నరసింహ, పాక లింగయ్య, సలివొజు సైదాచారి, జిల్లా అంజయ్య, కొండ వెంకన్న , రాము, మంజుల, బొల్లు రవీందర్, మారయ్య, రుద్రాక్ష యాదయ్య, మహాబుబ్ అలీ, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 16:12

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

YRP ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అభినందనలు తెలియజేశారు. 

రవిప్రసాద్ గారు YRP ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం చేయడంతో పాటు క్రీడలకు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవాలయాల అభివృద్ధికి, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మారుమూల గ్రామాలకు సైతం విస్తరించేటట్లు చేయాలని మేమందరం కూడా వారు చూపిన బాటలోనే నడుస్తామని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 10:52

ఆఖరికి ధర్మమే గెలిచింది.. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి సీఎం కేసీఆర్‌

ఆఖరికి ధర్మమే గెలిచింది.. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి సీఎం కేసీఆర్‌

తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 'కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలుపెట్టినట్టే పెట్టాలె వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టాలె ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. ఒకనాడు సుసంపన్నంగా వర్ధిల్లుతూ ఎంతో చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న పాలమూరులో గంజికేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి ఉమ్మడి పాలకులది. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటుచూసినా వలసలే తాండవించేవి. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్‌కు పేరుగాంచిన దుస్థితినాడు. పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూలు కట్టే దుస్థితి ఉండేది' అని సీఎం వివరించారు.

ఉమ్మడి రంగారెడ్డిలోనూ కరువు తాండవం..

'నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా నీరు లేక కరువు తాండవమాడేది. సాగునీరు సంగతి దేవుడెరుగు తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులది' సీఎం అన్నారు. పాలమూరు జిల్లా ప్రజల బాధలను నాటి ఉద్యమకాలంలో గోరెటి వెంకన్న వంటి పాలమూరు కవులు 'పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా' అంటూ.. 'చేతానమేడుందిరా తెలంగాణ చేలన్ని బీల్లాయెరా' అంటూ పాటలు రాసిన సందర్భాన్ని సమీక్ష సందర్భంగా సీఎం గుర్తు చేశారు. 'వలస పోయిన జనం.. అనివార్యమైన పెండ్లికో చావుకో వచ్చుడు తప్ప తమ తమ స్వస్థలాలకు రాకపోదురు అంటూ నాడు ఉద్యమ కాలంలో పాటలు రాసి పాడిన సంధర్భాలు మరుద్దామన్నా మరుపురావు. అరవై ఎకరాలున్న ఆసామి కూడా అడవులు పట్టుకోని కూలికి పోయిన దుస్థితిని నేను స్వయంగా చూసి దుఃఖపడ్డ. నీరులేక కరువుతో హృదయ విదారకమైన పరిస్థితి తాండవించేవి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవు. ఇక్కడి నేలలు కుంకుమ లాగా వుంటవి. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. పసిడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలైంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వయం పాలనలో పాలమూరు-రంగారెడ్డిపై దృష్టి..

'పోరాడి తెలంగాణ తెచ్చుకున్నంక స్వయంపాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. నూతన ప్రభుత్వం తక్షణమే పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలు పెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. దాంతో పాలమూరు జిల్లా పచ్చబడడం ప్రారంభమైంది. వలసలు ఆగిపోయినయి. బయటి రాష్ట్రాలనుంచే పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది' అంటూ సీఎం కేసీఆర్‌ జరిగిన ప్రగతిని వివరించారు. 'మరి చిన్న చిన్న పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటెనే ఇంతగొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే దక్షిణ తెలంగాణ దశ దిశను మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా తెలంగాణలో అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు' అన్నారు. అదే దార్శనికతతో ఎత్తిపోతలను ప్రారంభించాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ప్రారంభమయ్యాయన్నారు. స్వయానా పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు. 'ఇటువంటి నేతలు ఉండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించింది. రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా వుండాలి తప్ప.. ఇట్లా వారిని జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా ఉండకూడదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో సరిగ్గా అదే జరిగింది' అంటూ తలెత్తిన అడ్డంకుల గురించి వాటి కారణాల గురించి సీఎం వివరించారు.

ఆఖరికి ధర్మమే గెలిచింది..

'మొక్కవోని పట్టుదలతో ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాల్‌గా స్వీకరించారు. ఎన్ని అడ్డంకులనెదుర్కునేందుకయినా సిద్ధ పడి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిపూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఒక వైపు నిర్మాణం పనులను మరోవైపు న్యాయం సాధించేందుకు ప్రజలకు సాగునీరు తాగునీరును అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగిస్తూ అడ్డంకులను దాటే ఎత్తుగడలు వ్యూహాలను అమలు పరుస్తూ కొనసాగించిన వారి కృషి ఫలించింది. ఆఖరికి ధర్మమే గెలిచింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగి పోయాయి. ఇది ఎంతో శుభ సందర్భం. ఇది తెలంగాణకు పండుగరోజు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భంకన్నా మనకు మరో గొప్ప వేడుక ఉంటదని నీననుకోను' అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డిని, సీఈలు రమణారెడ్డిని, హమీద్ ఖాన్‌ను సీఎం అభినందించారు.

అందరి కృషికి దైవ కృప తోడై..

'మనందరి కృషికి దైవ కృప కూడా తోడు కావడం వల్లనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. నాటి ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణేలు వేసి నీటికోసం మొక్కుదు. ఇట్లా మనం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయం. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కలు చెల్లించుకోవాల్సి వున్నది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుతామని నాతో సహా మనందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి వున్నది. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు సభకు వస్తున్నప్పుడు కలషాలు తెచ్చుకోవాలె. తెచ్చుకున్న కలషాల ద్వారా కృష్ణా జలాలను తీసుకపోయి స్వామి పాదాలకు అభిషేకం చేయాలి.

దేవునిగుడిలో కొబ్బరికాయ కొట్టి పూలుచల్లి అర్చన చేయాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి' అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డిని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లకు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం పనులకోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అందుకోసం అవసరమైన భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్ధతులనే అనుసరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఉమామహేశ్వరం పనులు..

అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులకు సంబంధించి మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. తద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, సమ్మిళిత సమగ్ర వ్యవసాయరంగాభివృద్ధిని సాధించి, తెలంగాణ రైతన్నల లోగిల్లు బంగారు పంటలతో తులతూగి తద్వారా మనం ఆశించిన లక్ష్యంగా పెట్టుకున్న బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం స్పష్టం చేశారు.

మంచి హృదయంతో పని చేస్తే ప్రకృతి కూడా కరుణిస్తదని, దేవుడు కూడా దయచూపిస్తాడనేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాధించిన విజయమే సాక్ష్యం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎత్తిపోతలకు వినయోగించే బాహుబలి పంపుల వివరాలను సీఎంకు ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువు 12 కిలోలుంటుందనీ, దాని రూటర్ 80 టన్నులుంటుందనీ, తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు ఇంజనీర్లు వివరించడంతో సమావేశం ఆశ్చర్యపోయింది.

ఎన్నో వింతలు.. ఆశ్చర్యపోయే అంశాలు..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యంగొలిపే అంశాలు నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని తెలిపారు. బాహుబలి వంటి భారీ పంపులను బిగిస్తున్నప్పుడు చూడడానికే భయం గొలిపే పరిస్థితులుంటాయని సీఎం వివరించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా చూశానని సీఎం వివరించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ అటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు పడుతున్న శ్రమను మరోసారి సీఎం అభినందించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రాడార్ లో వచ్చే చెరువులను నింపే దిశగా అనుసంధానిస్తూ కాల్వల పనులను చేపట్టాలని సీఎం అన్నారు. ఉత్తర తెలంగాణ నిర్మించిన చెక్ డ్యాంలో అద్భుత ఫలితాలనిస్తున్నాయని సీఎం తెలిపారు. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో వొక్క తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. అదే విధానాన్ని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని సీఎం అన్నారు.

హరితహారంతో పరిస్థితులు మారాయ్‌..

ఇన్నాల్లూ మహారాష్ట్ర ఎగువనించి వస్తేనే కృష్ణా గోదావరి నదుల్లో ఎగువనుంచి వరదవచ్చేదనీ ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం పరిధిలోని నదీపరీవాహక ప్రాంతాల్లోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్న సందర్భాన్ని సీఎం వివరించారు.

అదే సందర్భంగా నీటిని ఎత్తిపోసేందుకు పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్ వ్యవస్థల నిర్మాణంపై జెన్కో ట్రాన్స్ కో సీఎండీ శ్రీ ప్రభాకర్ రావు తదితర విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాగునీరు తరలింపుకోసం చేపట్టాల్సిన చర్యల కోసం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులతో సీఎం సీమీక్షించారు. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 08:14

పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల కై కధం తొక్కిన విద్యార్థి లోకం

పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల కై కధం తొక్కిన విద్యార్థి లోకం. 

 

ప్రభుత్వ విద్యను బలోపితం చేయాలని PDSU ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్డీవో కార్యాలయం ముట్టడి

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి PDSU డిమాండ్ 

మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 4000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, జిల్లా అధ్యక్షురాలు  కె.సంద్య కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో బుధవారం పి డి యస్ యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించగా వారు ముఖ్యవక్తులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు నెంబర్స్ మెంట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని మూడేళ్లుగా వారికి రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదన గురవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఫీజుల వేధింపులపై కనీసం ప్రభుత్వ అధికారులు నోరు మెదపడం లేదని అన్నారు. ఇప్పటికే ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, మొత్తంగా విద్యారంగం అస్తవ్యస్తమైపోయిందని తెలిపారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ సియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒకపక్క ప్రభుత్వ బడలను మూసివేస్తూ ప్రైవేటు పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో పేద విద్యార్థుల వద్ద ఫీజుల పేరుతో డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యకు నమూనాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను గాలికి వదిలేసారని నేటికీ కొత్త గురుకులాలకు సొంత భవనాలు స్థలాల కేటాయింపు లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాలలో చదివే విద్యార్థులకు కాస్మెటిక్స్, హాస్టల్ నిర్వాహకులకు సంవత్సరాల తరబడి డైట్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చలగాటం ఆడుతుందని అన్నారు. భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్,చర్ల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు, పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం PDSU పట్టణ నాయకులు. పాయం నవీన్, ప్రవీణ్ ,రాంపండు, సుధాకర్ రామకృష్ణ ,చరణ్,ప్రదీప్, దీపిక, తేజశ్రీ, మౌనిక, రమాదేవి ,ప్రమీల, నాగమణి, దేవి ,ప్రసన్న తదితర విద్యార్థులు పాల్గొన్నారు.