నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:25

తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్!!

రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీసరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ 12.08.2022 నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది.

ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి.

ఆక్యూపెన్సీ రేషియా ఓఆర్ విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి.

నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:23

తిరుపతిలో అయిదో చిరుత ఎట్రీ?

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం. శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ...

తాజాగా ఆయిదో చిరుత‌ను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. కాలిన‌డ‌క భ‌క్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:22

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఆర్థిక చేయూత: మంత్రి గంగుల కమలాకర్

బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు.

శుక్రవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

కనుమరుగైనా కులవృత్తులు కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకుంటున్నారని, తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకని తెలిపారు.

దేశం వెనుకబాటుకు కారణం కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. ఇన్నేండ్ల పాలనలో కాంగ్రెస్‌ ఒరగబెట్టిందేమీ లేదనన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలో.. నిరంతర విద్యుత్ అందిస్తున్న బీఆర్‌ఎస్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

ఎన్నికల సయయంలో వచ్చి మాయ మాటలు చెప్పే పార్టీల మాటలు నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:20

Madhapur Drugs Case Update : మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

హైదరాబాద్‌: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

నిందితుడు వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ పోలీసుల ఆరా..

నిందితుడు వెంకట్‌పై తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు

ఐఆర్ఎస్ అధికారి పేరుతో పలుచోట్ల వెంకట్ మోసాలు

నిర్మాతలు సి.కల్యాణ్‌, రమేశ్‌ నుంచి రూ.30 లక్షలకుపైగా వసూలు

పెళ్లి పేరుతో అధికారిని సైతం మోసం చేసినట్లు గుర్తింపు

సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేసినట్లు గుర్తింపు

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం

ఎన్‌ఆర్‌ఐను అంటూ పెళ్లి పేరుతో విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్

సినీ, రాజకీయ నేతలను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించినట్లు గుర్తింపు

వెంకట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారిని ప్రశ్నించే యోచనలో పోలీసులు

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 13:20

పోలీస్ వ్యవస్థ పై కన్నెర్ర చేసిన ప్రజలు.,.
.,సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనిగిరి గ్రామ శివారులో పోలీస్ వాళ్ళు ఫైన్ లు రాస్తుండగా వాళ్లను తప్పించుకునే క్రమంలో బైక్ కారు యాక్షి డెంట్ అయ్యి ఒకరు మృతి,మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్ తరలింపు.,ప్రజలు పోలీసుల పై తిరుగుబాటు చేయడం జరిగింది

.,సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనిగిరి గ్రామ శివారులో పోలీస్ వాళ్ళు ఫైన్ లు రాస్తుండగా వాళ్లను తప్పించుకునే క్రమంలో బైక్ కారు యాక్షి డెంట్ అయ్యి ఒకరు మృతి,మరొకరు చావుబతుకుల మధ్య హాస్పిటల్ తరలింపు.,ప

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 12:03

టీడీపీ 9మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

  ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడుని అడుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు 

ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని విమర్శించిన అయ్యన్నపాత్రుడు

గన్నవరం సభలో ప్రసంగాలకు సంబందించి టీడీపీ నేతలపై కేసులు

 మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదుp

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:35

ఒక్క ఛాన్స్ ఇవ్వండి: జానకిపురం సర్పంచ్ నవ్య

టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు. రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో నవ్య కూడా పోటీపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు అవకాశం ఇవ్వండని నవ్య వేడుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఇప్పుడు టిక్కెట్టు కోసం పోటీ పడడంపై ప్రజలలో చర్చ జరుగుతోంది. పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి....

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:25

కేంద్రమంత్రి నివాసంలో మృతదేహం కలకలం.. తనయుడిపైనే అనుమానం

లఖ్‌నవూ: కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్(Union Minister Kaushal Kishore) నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కేంద్రమంత్రి తనయుడే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని ఆ కథనాలు పేర్కొన్నాయి..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:18

Adilabad: అనుమానంతో భార్యను చంపి.. లొంగిపోయేందుకు వెళ్తూ..

ఆదిలాబాద్‌ : భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.

అనుమానంతో శుక్రవారం వేకువజామున దీపను అరుణ్‌ హత్య చేశాడు. అనంతరం లొంగిపోతానంటూ ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఖుర్షిద్‌నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని అరుణ్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:16

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా..

పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

జీవో నెంబర్‌ 46 నుంచి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్‌ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్‌.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు..