msrinivas

Aug 04 2023, 13:31

*సీఎం కే సి ఆర్,కేటీఆర్ చిత్రపటాలకు లకు పాలభిషేకం*

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న టియూడబ్లూజే (టీజేఎఫ్) రాష్ట్ర కార్యాలయానికి (తెలంగాణ జర్నలిస్ట్ భవన్) కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిన నేపథ్యంలో స్థల కేటాయింపు జరపడానికి ప్రధాన కారణమైన సీఎం కేసీఆర్, మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్ అధ్యకతన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ కోత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కల్లోజీ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.హైద్రాబాద్ ఉప్పల్ బగాయత్ లో యూనియన్ భవనం కోసం 2000 గజాలా స్థలంను కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, రాష్ట్ర ఐ జె యూ సభ్యులు చండ్ర నరసింహరావు,యూనియన్ బాధ్యులు, యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

msrinivas

Aug 03 2023, 15:58

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:కొత్తగూడెం* *ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు*

గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం,ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు ఈ రోజు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు.

నిందితులపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో Cr.no 165/22,U/s 302,353,332 r/w 34 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఈ కేసులోని నిందితులు మడకం తులా మరియు పోడియం నంగా లను పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగింది.

హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. వినీత్. జి ఐపీఎస్ అన్నారు.నేరం చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడుతుందని తెలియజేసారు.

నిందితులకు ఇద్దరికీ శిక్ష పడేవిధంగా కృషిచేసిన విచారణాధికారి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణ,కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రవి,లైజన్ ఆఫీసర్ వీరబాబు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.

msrinivas

Aug 02 2023, 17:51

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; పాల్వంచ* *శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు* *పాల్వంచ సిఐ*

బందులు, రాస్తారోకోలు చేయడం చట్టరీత్యా నేరమని అందుకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో మాదిరిగా ఇటువంటి తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని వివిధ రాజకీయ పార్టీల వారికి సూచించారు. గతంలో బందులు, రాస్తారోకోల లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఇకముందు ఇదే తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నందుకు వారిపై రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేయడానికి వెనుకాడ బోమని హెచ్చరించారు. ప్రతి వ్యక్తికి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది, కానీ నిరసన వ్యక్తం చేసే క్రమంలో ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అందుకోసమే ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో, ధర్నా చౌక్లలో నిరసనలు తెలియజేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని , తద్వారా ట్రాఫిక్ అంతరాయాలను సృష్టించవద్దని అన్నారు. ప్రజలను అసౌకర్యానికి గురి చేసే ఎటువంటి కార్యకలాపాలకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్పడవద్దని తెలిపారు.

msrinivas

Aug 01 2023, 17:19

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *ఇసుక వ్యాపారులకు పాల్వంచ సిఐ హెచ్చరిక*

పాల్వంచ సర్కిల్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టర్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాల్వంచ మండలం, పట్టణంలోని 30 మంది ట్రాక్టర్ యజమానులను తాసిల్దార్ కు బైండ్ ఓవర్ చేశారు. ములకలపల్లి బూర్గంపాడు మండలాల్లో సైతం మరో 50 మందిని బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు .అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ బైండోవర్ చేయబడిన ప్రతి ఒక్కరు రెండు లక్షల రూపాయల కూచికత్తు సమర్పించాలన్నారు. భవిష్యత్తులో వారు ఇదే తరహా నేరానికి పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడానికి సర్పంచులు సైతం  పోలీసులకు సహకరించాలన్నారు. ఫుల్ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లను ధ్వంసం చేస్తే సహించేది లేదన్నారు. ట్రాక్టర్లకు నంబర్ ప్లేటు ఉండాలని, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఉండాలని, మద్యం సేవించి ట్రాక్టర్లను నడపవద్దని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించానని, అందులో భాగంగానే ప్రమాదాల నివారణ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ల మధ్యలోఏర్పాటు చేసుకున్న మార్గాలను మూసివేయడానికి సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ మీడియా సమావేశంలో టౌన్ ఎస్సై రాము, అడిషనల్ ఎస్సై రాఘవయ్య పాల్గొన్నారు.

msrinivas

Jul 19 2023, 11:50

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *మత్తు పదార్థాలు-దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ రూరల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఆదేశాలమేరకు కే ఎల్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం పాల్వంచ రూరల్ పోలీసులు మత్తు పదార్థాలు, దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాల్వంచ డిఎస్పి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా సిగరెట్,మందు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవడమే ఒక ఫ్యాషన్ భావిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలుగుతూ విద్యపైనే దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులు సైతం పోలీసులకు సహకరించడం తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం పలువురు వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

msrinivas

Jul 11 2023, 16:44

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *సాలి బాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా కె ఎల్ ఆర్ జయంతి వేడుకలు*

న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అన్నదానం

ముఖ్య అతిథిగా హాజరైన కె ఎల్ ఆర్ తనయుడు సిద్ధార్థ్ రెడ్డి

కె ఎల్ ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి జయంతిని న్యూ లైఫ్ ఆఫ్ ఇండియా చైర్మైన్ సాలిభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సోమవారం దివంగత డా. లక్ష్మారెడ్డి జయంతిని పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధి నెహ్రు నగర్ కార్యాలయంలోని న్యూ లైఫ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో డా కే ఎల్ ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం లక్ష్మారెడ్డి కూమారడు సిద్ధార్థ్ రెడ్డి చేతుల మీదుగా కేకు కట్ చేయించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సాలి భాస్కర్ మాట్లాడుతూ డా లక్ష్మారెడ్డి సేవలు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ఎంతో మందికి విద్యా దానం చేసిన విద్యా దాత డా లక్ష్మారెడ్డి అని స్మరించుకున్నారు.ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనదించిన కె ఎల్ ఆర్ సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు.

ఈ కార్యక్రమంలో శంకర్,ఆర్కే వేణు, మేరమ్మ,జ్యోతి, జె స్టాలిన్,నాగేందర్,గౌస్,రాము తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Jul 11 2023, 15:44

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ

పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు పాల్వంచ

అయ్యప్పనగర్ లోని మాడిశెట్టి రాజమనోహర్ నివాసంలో జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర మేరు సంఘ నాయకులు తాళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన

సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఇటీవలి భద్రాచలం లోని అభయ ఆంజనేయ దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన తాళ్ల రవికుమార్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్సు లోని

పిల్లల యూనిఫామ్స్ కుట్టుపని మేరుకులస్తులకు మాత్రమే ఇవ్వాలని మరియు బి.సీ

లోన్స్ లో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే కుట్టుపని పై జీవించే ప్రతీ ఒక్క మేరు కుటుంబాలకు ఉచితంగా కుట్టు మిషన్ లను పంపిణి

చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమం లో పాల్వంచ మేరు ఉపాధ్యక్షులు సింగు రాంబాబు, కార్యదర్శి

మాడిశెట్టి రాజమనోహర్, కోశాధికారి శనగవరపు రాజేశ్యం, రేఖల ప్రభాకర్,

కొట్టురు మధు సతీష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Jul 07 2023, 09:30

*భద్రాద్రి కొత్తగూడెం* *జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పించాలి..*

డి ఈ వో కు మెమోరాండం ఇచ్చిన టి యూ డబ్ల్యూబి జె (టి జె ఎఫ్ )

జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు గత సంవత్సరం జారిచేసినట్లు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితిని కల్పించాలంటూ జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖర శర్మ ని టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వంకంగా కలిసి వినతిపత్రం ను అందచేయటం జరిగింది. డి ఈ వో సానుకూలంగా స్పందిస్తూ రెండు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు పాఠశాలకు సర్కులర్ జారీ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం శ్రమిస్తున్న టీజేఎఫ్ కల్లోజి శ్రీనివాస్ ను జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.డి ఈ వో ని కలిసిన వారిలో టి జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్, టెంజు అధ్యక్షులు వట్టికొండ రవి,టెంజు ప్రధాన కార్యదర్శి సి హెచ్ వి నరసింహారావు, సహాయ కార్యదర్శి అచ్చి ప్రభాకర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి కృష్ణం రాజు,స్మాల్ పేపర్స్ ప్రధాన కార్యదర్శి ఆఫ్జల్ పఠాన్, క్రాంతి, రాజకుమార్, సురేష్, చిరంజీవి,రహీం తదితరులు ఉన్నారు.

msrinivas

Jul 06 2023, 14:11

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో హెల్త్ క్యాంప్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ 

 జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పాల్వంచ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మొబైల్ హెల్త్ క్లీనిక్ ద్వారా వివిధ రకాల డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, ఫార్మసిస్టులతో వారి గ్రామంలో వారి వద్దకే వెళ్లి హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందులో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలోని నెహ్రునగర్, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, తెలంగాణ నగర్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నెహ్రు నగర్ లోని రాతి చెరువు కట్ట ప్రక్కన హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు సుమారు 300 మంది వరకు వచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Jul 01 2023, 10:09

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ 

త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ

పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పాల్వంచకు విచ్చేసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిసిన టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ నాయకులు. భద్రాద్రి జిల్లా లోని జర్నలిస్టుల ఇళ్ల సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించన హరీష్ రావు త్వరలో జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వినత పత్రం అందించిన వారిలో టియూడబ్ల్యూజె టీజేఎఫ్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు,టిన్యూస్ ఉమ్మడి జిల్లాల బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, తెంజు జిల్లా అధ్యక్షుడు వట్టి కొండ రవి,తెంజు జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ వి నసింహారావు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు చెంగ పోగు సైదులు, తెంజు ప్రచార కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, కనుమ రమేష్,కేరటం శ్యామ్,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.