నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:33

చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి : తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్:జూన్ 06

నగరంలో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మృగశిర 9వ తేదీన వస్తుందని.. ఆరోజు ఉదయం నుంచే చేప ప్రసాదం ప్రారంభం అవుతుందని తెలిపారు.

బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తోందని... చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాధిగా వస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హరినాథ్ గౌడ్ కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని వేస్తున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వారి సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 స్టాల్ లు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు, ఫైర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారు. 3 సంవత్సరాలుగా కరోనాతో ఈ కార్యక్రమం జరగలేదన్నారు.

చేప ప్రసాదంతో పాటు ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు చెప్పారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు............

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:30

ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు... బాణాసంచాతో ఘనస్వాగతం

హైదరాబాద్:జూన్ 06

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సంధర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీ అధినేత రాకతో తెలంగాణ టీడీపీ నేతల్లో నూతనోత్సహం వచ్చి చేరింది. సన్మాన వేడుక అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జతకట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరపడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు సహా.. తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో టీడీపీ అధినేత చర్చించే అవకాశం ఉంది......

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:05

కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

ఖమ్మం జిల్లా :జూన్ 06

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్‌ లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో హైకమాండ్‌ చర్చలు జరిపింది. కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే అభిమానులకు ఆ ఇద్దరు నేతలు సంకేతాలిచ్చారు.

కాగా ఈనెల 12న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రియాంక రాహుల్ గాంధీ లతో సమావేశం కానున్నారు.

ఈనెల 20వ తేదీ లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాహుల్‌ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:03

శ్రీవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

తిరుపతి:జూన్ 06

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది.

ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఈ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో పాల్గొనేందుకు, నిన్ననే తిరుపతి చేరుకున్న ప్రభాస్, ఈరోజు పొద్దున్నే స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు. రామాయణంలో కొంత భాగాన్ని ఆదిపురుష్ సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. అందుకే యూనిట్ లో సభ్యులంతా భక్తిభావంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్, శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ కు చాలా కీలకం. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. లేదంటే అతడి మార్కెట్ పై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఆదిపురుష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో.

ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్ విషయానికొస్తే.. ఈ వేడుకలో 50 అడుగుల ఆదిపురుష్ హోలోగ్రామ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఆధ్యాత్మిక ప్రవచనకర్త చినజీయర్ స్వామి, ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఇదే వేదిక పైనుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించబోతోంది ఆదిపురుష్ యూనిట్.....,

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 13:06

1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న నారా లోకేష్‌ యువగళం

జనగళమే యువగళమై 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు కడపలో 1500 కి.మీ. మజిలీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పోస్ట్‌ పెట్టారు నారా లోకేష్‌.

ఈ సందర్భంగా కడపనగరంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు అలంఖాన్ పల్లె వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించానని తెలిపారు.

అధికారంలోకి వచ్చాక కడప నగర ప్రజలకు మురుగునీటి బెడద నుంచి విముక్తి కలిగించే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 07:46

Adipurush: నేడే తిరుపతిలో "ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి..!!

తిరుపతిలో వేడుక జరగబోతుందని స్పష్టం చేశారు. “ఆదిపురుష్” వాస్తవానికి జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా.

కానీ ప్రారంభంలో సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో… చాలా నెగెటివిటీ రావటం జరిగింది. “ఆదిపురుష్” ట్రైలర్ విడుదలైన సమయంలో భయంకరంగా ట్రోలింగ్ జరిగింది.

దీంతో సినిమాని జూన్ నెలకి వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మార్చి.. సరికొత్త మార్పులతో ఎఫెక్ట్స్ తో విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆదిపురుష్” రెండో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ లో రాముడు… రావణుడు మధ్య యుద్ధ సన్నివేశాలను చూపించనున్నట్లు సమాచారం.

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 07:45

నైరుతి దాగుడుమూతలు.. అండమాన్‌ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు

వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. గతేడాది ఈ సమయానికల్లా భారత్​లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యం చేస్తున్నాయి..

ప్రస్తుతం అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ కారణంగా మరో మూడు రోజుల తర్వాతే అవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15 దాకా వర్షాలు పడకపోవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం అండమాన్‌ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇటు అరేబియా సముద్రంలో లక్షదీవులను తాకినవీ ముందుకు కదలలేదని చెప్పారు. గతేడాది జూన్‌ ఒకటిన కేరళను తాకగా ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాటి ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:47

హైదరాబాద్ లో భోపాల్ పోలీసుల తనిఖీలు..

దొరికితే దోసుకుందాం అనే చందంగా తయారయ్యింది దేశం,ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలు దేశంలో రోజురోజుకీ ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భోపాల్ నుండి పోలీసులు సోమవారం హైదరాబాద్ కు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బెట్టింగ్ యాప్ తో సూడో పోలీసుల అవతారం ఎత్తి ఓ ముఠా లక్షలు కాజేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు గ్యాంగ్ సభ్యులను కొందరిని అరెస్టు చేసిన భోపాల్ పోలీసులు, మిగతా వారి కోసం హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. అల్కాపురి కాలనీ లో నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ లో డబ్బు చెల్లిస్తామని, భారీగానే డిపాజిట్ చేస్తామని చెప్పి హవాలా ఏజెంట్లను నమ్మించి సదరు సూడోపోలీసుల గ్యాంగ్ బెట్టింగ్ యాప్ హెల్ప్ డెస్క్ ద్వారా లోకల్ ఏజెంట్ల ఫోన్ నెంబర్లను తీసుకుంటుంది. ఆ తర్వాత అసలు పని మొదలు పెడుతుంది. ఇక బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడతామని చెప్పినా ఆ గ్యాంగ్ హవాలా ఏజెంట్లు తమ వద్దకు రాగానే పోలీసులమని చెప్పి వారిని ట్రాప్ చేస్తుంది.

ఆపై నిందితుల బెట్టింగ్ యాప్ లో ఉన్న డబ్బులను తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతుంది. ఈ తరహా మోసాలు పలు రాష్ట్రాలలో ఈ గ్యాంగ్ అమలుచేసింది. హవాలా ఏజెంట్లు ఈ మోసాన్ని బయటకు చెప్పలేకపోతున్నారు. గతవారం ఇదే తరహాలో ఈ గ్యాంగ్ భోపాల్ లో 20 లక్షల రూపాయలు కాజేసింది.

భోపాల్ లో కృష్ణ, మహేష్ అనే ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు మిగతా వారి కోసం ఆచూకీ తీయగా హైదరాబాద్ నగరంలోని అల్కాపురి కాలనీలో ఉంటున్నట్టు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు , హైదరాబాద్లో ఉన్న నిందితులైన సతీష్, ప్రదీప్, అనిల్, శేఖర్ ల కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:46

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు కలకలం రేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్‌ లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.

ఈ ఘటనలో గార్డు వెంకటేశ్వర్లు తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇది ఆత్మహత్య లేక గన్ మిస్ ఫైర్ అయిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది.

ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చారు. వచ్చిన 30 నిముషాలలోనే అతని గన్ ఫైర్ అయినట్లుగా సమాచారం. అయితే గన్ మిస్ ఫైర్ అయిందా? లేక ఇతర కారణాలతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంఘటన ప్రదేశంలో లోపలకు ఎవరినీ రానివ్వడంలేదు. క్లూస్ టీమ్ సాయంతో అక్కడున్న వేలిముద్రలు సేకరించారు. ఆ వేలి ముద్రలు వెంకటేశ్వర్లువేనా? లేక ఇతరులవా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:45

గొప్ప మానవత్వం చాటుకున్న సెహ్వాగ్

ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదకర ఘటనలో అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన కోల్పయిన వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ పరిస్థితులలో క‌న్న‌వాళ్ల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను చ‌ద‌వించేందుకు టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్ల‌లంద‌రిని ఉచితంగా చ‌దివిస్తాన‌ని సెహ్వాగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

'ఒడిశా రైలు ప్రమాద ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ విషాద స‌మ‌యంలో నేను చేయ‌గ‌లిగిన అతి చిన్న సాయం ఏంటంటే..

ఈ ప్ర‌మాదంలో క‌న్న‌వాళ్ల‌ను కోల్పోయిన అనాథ పిల్ల‌ల‌ను ఉచితంగా చదివించడమే. వాళ్ల‌కు సెహ్వాగ్ ఇంట‌ర్నేష‌న్ స్కూళ్ల‌లో చదువుతో పాటు ఉచిత వ‌స‌తి సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తాను..' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు..........