నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:22

బీజాపూర్లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర పేల్చారు..

ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్లో రాయ్పూర్ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు. గత ఏప్రిల్ నెలలో దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు.

దీంతో పది మంది జవాన్లు, వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. అర్ణాపూర్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు మావోయిస్టుల కోసం గాలింపు నిర్వహించి తిరిగి క్యాంపునకు వస్తుండగా మందుపారత పేల్చినట్లు అధికారులు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:20

Peddireddy: ముందస్తు ఎన్నికలు.. మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..

అమరావతి: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు..

అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు.

తెదేపా అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:18

AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్‌ సమీక్ష..

రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు..

మార్చి నెలలో ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది.

ఆ సమ్మిట్‌లో పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. చేసుకున్న ఒప్పందాలు ఎంత మేరకు కార్యరూపం దాల్చాయనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేపట్టారు..

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 13:29

కోకాపేటలో భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

రంగారెడ్డి జిల్లా:

కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు,శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బీఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కేవలంలో ఐదు రోజుల్లో నే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోకాపేటలో గజం లక్ష రూపాయలకు పైగా పలుకుతుండగా కేవలం రూ. 7500 లకు గజం చొప్పున 11 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. వందల కోట్ల స్థలాన్ని కేవలం 40 కోట్లకే కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి............

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:51

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత

హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది..

ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ పలు సూచనలు చేసింది.

''ఓఎంఆర్‌ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోం. ఓఎంఆర్‌ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్‌ చేయాలి. సరైన వివరాలు బబ్లింగ్‌ చేయని, పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ ఉపయోగించిన, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌, పాన్‌ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తాం'' అని వివరించింది..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:50

Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే మరో గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైంది..

సోమవారం ఉదయం ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:49

TDP-YSRCP: కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

టంగుటూరు: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు..

గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ సుమారు 350 మంది పోలీసులు మోహరించారు..

మరోవైపు వైకాపా తీరును నిరసిస్తూ తెదేపా నేతలు ప్రతిస్పందిస్తూ టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు బయల్దేరగా.. మార్గంమధ్యలో 16వ నంబర్‌ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెదేపా నేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 10:19

నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్ - అగువానిఘాట్ వంతెన గంగా నదిలో మునిగిపోయింది

•సిఎం నితీష్ కుమార్ విచారణకు ఆదేశించారు

ఖగారియా జిల్లా నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఖగారియాలోని అగువానీ మరియు సుల్తంగంజ్ మధ్య గంగా నదిపై నిర్మించిన ఫోర్‌లేన్ మహాసేతు యొక్క మూడు స్తంభాలు మరియు 9 మరియు 13 మధ్య నాలుగు సూపర్ నిర్మాణాలు గత ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గంగానదిలో నిమజ్జనం చేయబడ్డాయి.

ఈ సంఘటన తర్వాత నిర్మాణ ఏజెన్సీకి చెందిన ఒక కార్మికుడు కనిపించడం లేదని ఖగారియా గోగ్రీ ఎస్‌డిఓ అమర్ కుమార్ సుమన్ తెలిపారు. మూడు స్తంభాల మధ్య ఉన్న 192 మీటర్ల స్లాబ్‌లో కొంత భాగం గంగానది ప్రధాన ప్రవాహంలో కలిసిపోయింది.

ఖగారియా-అగువానీ-సుల్తాన్‌గంజ్ మధ్య నిర్మాణంలో ఉన్న మహాసేతు సూపర్ స్ట్రక్చర్ పైభాగం కూలిపోవడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే రోడ్డు నిర్మాణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రత్యయ్‌ అమృత్‌ నుంచి ముఖ్యమంత్రి ఈ విషయంపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమాచారం తీసుకున్న ముఖ్యమంత్రి, అదనపు ప్రధాన కార్యదర్శికి పై ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన నిర్మాణం కూలిపోవడంపై మా ఆందోళనలు సరైనవని నిరూపించబడ్డాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రభుత్వ నివాసం వద్ద, ఏప్రిల్ 30, 2022 న, తుఫాను కారణంగా, ఈ వంతెన యొక్క ఐదవ భాగం పడిపోయిందని చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:32

నేడే ‘భారత్‌ భవన్‌’కు శంకుస్థాపన!

•11 ఎకరాలు.. 15 అంతస్తుల్లో నిర్మాణం

హైదరాబాద్‌, జూన్‌05

భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ‘భారత్‌ భవన్‌’ పేరిట కోకాపేటలో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. భారత్‌ భవన్‌ను 15 అంతస్తులతో నిర్మించనున్నారు. త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

భారత్‌ భవన్‌ నిర్మాణంతో పాటు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’, ‘హ్యుమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట మరికొన్ని నిర్మాణాలను బీఆర్‌ఎస్‌ చేపట్టనుంది. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని సర్కారు బీఆర్‌ఎస్ కు కేటాయించింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రం ఏర్పాటు చేసేందుకంటూ ఈ భూమిని కేటాయించింది.

ఈ కేంద్రం ఏర్పాటుకు భూమి కావాలంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గత నెల 12న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కేవలం ఐదు రోజుల్లోనే భూమిని కట్టబెడుతూప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎ్‌సకు ఇప్పటికే బంజారాహిల్స్‌లో భారీ విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం, 33జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఉన్నా.. మళ్లీ 11 ఎకరాల భూమిని కేటాయించుకోవడం గమనార్హం. కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా..ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎ్‌సకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది రూ.500 కోట్ల స్థలం. కానీ, కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

నైపుణ్య శిక్షణ, అవగాహన కోసం..!

ఇంత విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయనున్న కేంద్రం ద్వారా ప్రజా నాయకులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కల్పిస్తామని, సామాజికవేత్తలకు శిక్షణ ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీతోపాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీకి బోయిన్‌పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్న విషయాన్ని ఉదాహరణగా సర్కారు చూపిస్తోంది............

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:29

బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు.

ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు.

ఈ నెల 7వ తేదీ నుండి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు...