నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:51

మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్​

కరీంనగర్ :

తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ్లిక్​ ప్లేసుల్లో విద్యుత్​ లైట్ల వెలుగులతో అలంకరించారు. కానీ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్​లో ఆ ఏర్పాట్లేమీ కనిపించడం లేదు.

కలెక్టరేట్​, సిటీలోని బస్టాండ్​ జంక్షన్​, కోర్టు జంక్షన్​, గీతా భవన్​ జంక్షన్లలో ఏర్పాట్లు చేయకపోవడంతో చీకట్లోనే ఉన్నాయి..  అమరవీరుల స్థూపానికి సైతం లైటింగ్​ ఏర్పాటు చేయలేదు. దీంతో సిటీలో దశాబ్ది ఉత్సవాల సందడి కనిపించలేదు. 

పరేడ్​ గ్రౌండ్‌లో వేడుకులకు గంగుల

దశాబ్ది వేడుకలకు సిటీలోని పరేడ్​ గ్రౌండ్ ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు మంత్రి గంగుల కమలాకర్​ జెండా ఆవిష్కరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీస్, జడ్పీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. 

అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలను నిర్వహించేందుకు అంతా రెడీ చేశారు. ఇక్కడి వేడుకలకు మంత్రి కేటీఆర్​ హాజరుకానున్నారు. అన్ని వర్గాల ప్రజల దశాబ్ధి వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. జూన్​2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:48

ట్యాంకుబండ్‌పై బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి టెకీ ప్రాణాలు కోల్పోయాడు. శామీర్‌పేట ఆలియాబాద్‌లో నివాసముంటున్న లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు మనోజ్‌కుమార్‌ (27) హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

విధులు ముగించుకొని ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బైక్‌పై తన నివాసానికి వెళ్తుండగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్దకు రాగానే అటునుంచి మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో సోని ట్రావెల్స్‌ బస్సు మనోజ్‌ బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్‌ బస్సు ముందు టైర్ల కిందకు దూసుకుపోవడంతో మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుల సమాచారంతో అక్కడికి చేరుకున్న దోమలగూడ పోలీసులు మనోజ్‌ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మనోజ్‌ మృతి చెందాడు.

ఇటు బస్సు డ్రైవర్‌ సయ్యద్‌ వసీం పాషా(35) పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌ కుటుంబీకులకు సమాచారమందించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బస్సును సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:46

16 మంది త‌హసీల్దార్ల‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి*l

హైద‌రాబాద్ :తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల వేళ రాష్ట్రంలోని ప‌లువురు త‌హ‌సీల్దార్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ల‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది.

16 మంది త‌హ‌సీల్దార్లు, ఇద్ద‌రు సెక్ష‌న్ ఆఫీస‌ర్లు, ఒక సీసీఎల్ఏ ఆఫీస‌ర్‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి క‌ల్పించింది. ఈ మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి పొందిన త‌హ‌సీల్దార్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్లు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి పొందింది వీరే..

కే మ‌హేశ్వ‌ర్, త‌హ‌సీల్దార్

ఎం సూర్య ప్ర‌కాశ్, త‌హ‌సీల్దార్

ముర‌ళీ కృష్ణ‌, త‌హ‌సీల్దార్

కే మాధ‌వి, త‌హ‌సీల్దార్

పీ నాగ‌రాజు, సెక్ష‌న్ ఆఫీస‌ర్

ఎల్ అలివేలు, త‌హ‌సీల్దార్

బీ శకుంత‌ల‌, త‌హ‌సీల్దార్

కే స‌త్య‌పాల్ రెడ్డి, త‌హ‌సీల్దార్

పీ మాధ‌వి దేవీ, సీసీఎల్ఏ ఆఫీస్

వీ సుహాషినీ, త‌హ‌సీల్దార్

భూక్యా బ‌న్సీలాల్, త‌హ‌సీల్దార్

బీ జ‌య‌శ్రీ, త‌హ‌సీల్దార్

ఎం శ్రీనివాస్ రావు, త‌హ‌సీల్దార్

డీ దేవుజ‌, త‌హ‌సీల్దార్

డీ ప్రేమ్ రాజ్, త‌హ‌సీల్దార్

ఐవీ భాస్కర్ కుమార్, సెక్ష‌న్ ఆఫీస‌ర్

ఉప్ప‌ల లావ‌ణ్య‌, త‌హ‌సీల్దార్

డీ చంద్ర‌క‌ళ‌, త‌హ‌సీల్దార్

ఆర్‌వీ రాధా బాయి, త‌హ‌సీల్దార్...

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:44

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా:

దాచేపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:42

Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.

టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారికి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 85,366 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 48,183 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.........

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 22:07

Encounter ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌, మావోలకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ డివిజన్‌లోని నక్సల్స్‌ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది..

ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి..

ఎన్‌కౌంటర్‌ను జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. జిల్లాలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాయిగూడ-రేగడగట్ట ప్రాంతంలో కోట ఏరియా కమిటీ కమాండర్ మంగడు, వెట్టి భీమాతో పాటు పలువురు మావోలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు డీఆర్‌జీ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది..

అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగానే.. రేగడగట్ట గ్రామ సమీపంలోకి జవాన్లను చూసిన మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్‌జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో నలుగురైదుగురు గాయపడ్డారని భద్రతా దళం ప్రకటించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వివరించారు..

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:34

పదేళ్లలో సీఎం కేసీఆర్ సాధించింది ఏమీ లేదు : వైయస్ షర్మిల

పదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లేనని శనివారం మీడియా సమావేశంలో వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ప్రసంగమంతా అబద్ధాలమయం, అరచేతిలో వైకుంఠమని విమర్శించారు.

రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని చెప్పారు. రెండు సార్లు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లని షర్మిల ప్రశ్నించారు. 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లని నిలదీశారు.

జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కు సిగ్గుండాన్నారు. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. ..

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:32

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు.. రైతు దినోత్సవ వేడుకల్లో కవిత

కామారెడ్డిజిల్లా:

సదాశివనగర్ మండలం పద్మాజి వాడిలో జరిగిన రైతు దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని.. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నమన్నారు కవిత. ఫేక్ సీడ్స్ సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నామన్నారు.

రైతు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకున్నామన్న ఆమె.. తెలంగాణ వచ్చాకే గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు.

కాళేశ్వరం 22 వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని .. తెలంగాణ రైతులు లాభదాయకమైన పంటలవైపు దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:29

ఆకస్మాకంగా మంటలు చెలరేగి స్కార్పియో వాహనం దగ్ధం

నిజాంబాద్ :

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

కారులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందగి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే, దేశంలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ సమయంలో కార్లలో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన సమయంలో వాహనాన్ని కాసేపు ఆపి మరలా ప్రయాణించండి.

అలాగే ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేసి ఉంచకండి. వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.....,......

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:27

నేటి నుంచి ఏపీలో గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షలు

అమరావతి :

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఈరోజు నిర్వహించారు ఇవి ఈ రోజు నుంచి జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ పరీక్ష సెంటర్లను కేటాయించారు.

11 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూన్ 10 వరకు జరగనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సారి బయోమెట్రిక్ తో పాటు.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని సెక్రటరీ ప్రకటించారు. దీని కోసం మొత్తం 70 బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాసే దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 290 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. వారికి గంట అదనపు సమయం ఇస్తామన్నారు. పరీక్షను పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాలతో పాటు జవాబు పత్రాల బుక్ లెట్ ఇస్తామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం ఉండదన్నారు. పేపర్ లీకేజీకి అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 8 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన కేవలం 19 రోజులకే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 92 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 1,26,449 మంది అప్లై చేసుకోగా.. మెయిన్స్ కు 6,455 మంది అర్హత సాధించారు. జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, ఆగస్టులో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఇటీవల వెల్లడించారు....