నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:27

Nitish- Kejriwal: కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ.. కేంద్రంపై 'రాజ్యసభ ప్లాన్‌'!

దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) నాటికి భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై (Opposition Unity) ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే..

ఈ క్రమంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) ఆదివారం దిల్లీ (Delhi) సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు.

బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్‌.. కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా ఓ 'రాజ్యసభ ప్లాన్‌ (Rajyasabha Plan)'ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:25

Crime News: గన్నవరంలో దారుణం.. సగం కాలిన స్థితిలో రెండు మృతదేహాలు..

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం జరిగింది. సగం కాలిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గన్నవరం మండలం సావరగూడెం సమీపంలోని బుడమేరు కాలువ వద్ద ఉన్న మామిడితోటలో సగం కాలిన స్థితిలో ఉన్న ఇద్దరి మృతదేహాలను ఆదివారం స్థానిక రైతులు గుర్తించారు..

వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.

రెండు మృతదేహాల్లో ఒకరిది స్థానికంగా తిరుగాడే యాచకుడిదిగా గుర్తించినట్టు సీఐ కనకారావు తెలిపారు. మామిడితోట యజమాని ఇతర ప్రాంతంలో ఉండటంతో అక్కడికి వచ్చిన యాచకుడు.. సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటారని వెల్లడించారు.

ఎండ తీవ్రత కారణంగా మృతదేహం కాలినట్లు మారిందన్నారు. మరో మృతదేహం సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తిదిగా గుర్తించామన్నారు.

చేతికి ఉన్న కడియం ఆధారంగా క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు..

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:24

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన..

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు..

అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు..

అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:54

గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

అమరావతి; ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు..

అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాల్లో వేగం పెంచారు.

ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు మూడు అంతస్తులలో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:42

Pawan Kalyan: ఎంతమేరకు నెరవేరుస్తారో.. మరో నెల వెయిట్‌ చేస్తాం: పవన్‌ ట్వీట్‌

అమరావతి: అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు..

ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటితుడుపులా ఉండబోవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు జనసేన నిరీక్షిస్తుందని పవన్‌ పేర్కొన్నారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:41

తెలంగాణ గవర్నర్ 2000 నోటు పై ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై:

నేను వేసుకునే కోటు... నా వద్దనున్న నోటు తెలుపే.. కనుక రెండు వేల రూపాయల నోట్ల చెలామణీ రద్దయినా నాకు బాధలేదు’ అంటూ తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చమత్కరించారు.

రిజర్వుబ్యాంక్‌ 2 వేల రూపాయల చెలామణీని రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వుపై ఆమె ఆదివారం వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో ఓ ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న తమిళిసై మీడియాతో మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పకూడదని, పరీక్షలనేవి జీవితంలో భాగం మాత్రమేనని చెప్పారు.

పరీక్షలు రాయలేకపోయినవారిలో పలువురు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారని, విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు ఆత్మరక్షణ సంబంధిత క్రీడలు నేర్పాలని, ఈ విషయమై పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి విద్యాశాఖ మంత్రికి సూచనలు కూడా ఇచ్చానని తెలిపారు.

కేంద్ర పాలిత రాష్ట్రాల గవర్నర్ల అధికారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఉత్తర్వు ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. పుదుచ్చేరి కి సంబంధించి తనకు ముఖ్యమంత్రికి ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. ముఖ్యమంత్రి కి తనకు మధ్య విబేధాలు చోటుచేసుకోవాలని మాజీ సీఎం నారాయణాస్వామి ఆశ పడుతున్నారని ఆమె విమర్శించారు.

కాగా 2 వేల రూపాలయ నోట్ల రద్దుపై తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్‌ కనుక ఆమె తెల్లకోటు ధరిస్తుండటాన్ని సూచించేలా ఈ వ్యాఖ్యను చేశారు. కోటు మాత్రమే కాదు తన నోటు తెలుపేనంటూ తన వద్ద ఎలాంటి నల్లధనం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు విలేకరులకు నవ్వుపుట్టించాయి

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:39

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లా :

మెదక్‌ జిల్లాలోని నార్సింగ్‌ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.

దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు.

మృతులను తండ్రీ కొడుకులైన శేఖర్‌, యశ్వంత్‌ (9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారిని కవిత, అవినాశ్‌గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందినవారిగా గుర్తించారు.

కామారెడ్డి నుంచి చేగుంటవైపు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 11:45

రేపు మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..?

భువనేశ్వర్‌:

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌ ఆదివారం భువనేశ్వర్‌కు తిరిగి రానున్నారు.

దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్‌కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్‌ విక్రమ కేశరి అరూఖ్‌ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్‌ రంజన్‌ దాస్‌, శ్రీకాంత్‌ సాహు ఉన్నారు.

స్పీకర్‌ పదవికి రాజీనామా చేసిన విక్రమ్‌ కేశరి అరుఖ్‌కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

నిజంనిప్పులాంటిది

May 21 2023, 11:14

ప్రీతి చెల్లి కీ ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు జారీ

వరంగల్‌ జిల్లా :

కాకతీయ మెడికల్‌ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది.

హైదరాబాద్‌ HMDA లో ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో HMDA పేర్కొంది.

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందచేసింది.

అదే సమయంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని HMDA లో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు.

ఈ మేరకు మే 20వ తేదీ శనివారం పూజను HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు...

నిజంనిప్పులాంటిది

May 21 2023, 11:13

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుపతిజిల్లా:

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్‌ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది.

జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ఆదివారం మే 21న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.

శుక్ర, శని వారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా కానుంది. ఇక గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు.

శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీంతో రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల మొత్తం మీద 4 నుంచి 8 గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు...