madagoni surendar

Apr 12 2023, 15:34

బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు కేంద్రం నందు ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో జరిగిన ప్రమాద ఘటనపై వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ..

ఈరోజు చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి,అధికార అహంకారంతో విచ్చలవిడిగా బాణాసంచా కాలుస్తూ, అక్కడ ఎవరున్నారు ఏంటి అని కూడా ఆలోచించకుండా కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, ఒకేసారి గందరగోళాని సృష్టించి బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె మీద పడి అందులోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు వ్యక్తుల కాలు తెగిపడడం, ఒకరి పొట్టలో నుండి పేగులు బయటికి రావడం మరియు మరికొందరికి తీవ్ర గాయాలు అవ్వడం అంటే చాలా చాలా బాధాకరం, ఈ ఘటనలో గాయపడిన బాధితులను తక్షణమే మెరుగైన వైద్యం అందించి అందుకు అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అలాగే ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో చీమలపాడు గ్రామాన్ని మాంసపు ముద్దలగా మార్చిన వారు ఎవరైనా సరే తక్షణమే రాజీనామా చేయాలని,అలాగే ఒక్కొక్క బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని,కుటుంబానికి ఒకరి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని,ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాలని వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ అన్నారు.

madagoni surendar

Apr 12 2023, 15:10

జానారెడ్డికి అస్వస్థత.. యశోదలో చేరిక

జానారెడ్డికి అస్వస్థత.. యశోదలో చేరిక

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి యశోద హాస్పిటల్ లో చేరారు. మోకాలి శాస్త్ర చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పూర్తి చెకప్ చేశారు. జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

జానారెడ్డి వయస్సు 76 సంవత్సరాలు. తెలంగాణలోనే మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా.. రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర జానారెడ్డికి ఉంది. రాజకీయాల్లో అజాత శత్రువుగా.. అన్ని పార్టీల్లోని నేతలకు ఇష్టమైన నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన శైలిలో పోరాటం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని.. కాంగ్రెస్ పార్టీని ఒప్పించటంలో ఎంతో కృషి చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన రికార్డ్ కూడా జానారెడ్డి సొంతం.

జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

madagoni surendar

Apr 12 2023, 15:02

నల్గొండ జిల్లా :కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు...

నల్గొండ జిల్లా :

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు...

తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించిన కుటుంభ సభ్యులు...

జానారెడ్డి కి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..

గుండె కు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుట్లోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేసిన వైద్యులు

ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో జానారెడ్డి..

madagoni surendar

Apr 12 2023, 14:47

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎం ఎస్ ఆర్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 54 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ మరియు 28 మందికి 10 లక్షల 50 వేల రూపాయల. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్, మన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం..అన్నారు.

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం నిలిచింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయకోణం దాగి ఉంది.

అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డల వివాహానికి డబ్బులు సహాయం చేయలేదు.

మహిళా సాధికారత మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది.

మన తెలంగాణ సర్కారుకు ఎల్లప్పుడూ మీ అందరి దీవెనలు ఉండాలి, ఆశీర్వాదం కావాలి అండగా నిలవాలి అన్నారు.

పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం..అందరూ ఆత్మాభిమానంతో బ్రతకాలన్నదే వారి ఆకాంక్ష.

కేసీఆర్ ఈ రాష్ట్రమే తన కుటుంబం అన్న కోణంలో ఆలోచిస్తారు. అందుకే కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్,రైతు బంధు, రైతు భీమా,దళిత బంధు,సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాలు వచ్చాయి.

అన్ని వర్గాల ప్రజలు సగౌరవంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..

పేదింటి ఆడబిడ్డలకు అమ్మవడి, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పథకం అమలు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో.ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య,జడ్పీటీసీ తరాల బలరాం,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,పీ.ఏ.సి.ఎస్. నూక సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచ్లు, ఎంపిటిసిలు,వార్డ్ నెంబర్లు,మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 12 2023, 13:46

రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

.

.

Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :

రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు బుధవారం కట్టంగూర్ మండల కేంద్రంలో మరియు అయిపాముల,మునుకుంట్ల గ్రామంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియెగం చేసుకోవాలన్నారు.అనంతరం ఈదులూరు గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనంతరం. గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి..గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 80 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య ,జడ్పీటీసీ తరాల బలరాం, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్, పీ.ఏ.సి.ఎస్.చైర్మన్ నూక సైదులు,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,ఎంపిడిఓ సునీత,సర్పంచులు,ఎంపిటిసిలు, వార్డ్ నెంబర్లు అధికారులు,నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 21:51

మహాత్మా జ్యోతీరావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన.కట్టంగూర్ ఎంపీపీ ముత్తి లింగయ్య.

మహాత్మా జ్యోతీరావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన. ఎంపీపీ ముత్తి లింగయ్య

కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కర్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడకలో పాల్గొన్న కట్టంగూరు ఎంపీపీ .ఈ సందర్భంగా. జెల్లా ముత్తిలింగయ్య,మరియు తహసిల్దార్ దేశ్యా నాయక్,ఎంపిడిఓ సునీత మాట్లాడుతూ..

భారతీయ సామాజిక సంస్కర్త

భాష వీక్షించు సవరించు

అతను అంటరానితనం కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు 1873 సెప్టెంబరు 24న ఫులే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చు లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అతను మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన. మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే పూలే అని వారు అన్నారు ఈకార్యక్రమంలో. చింతమల్ల చలపతి,ఎంపీఒ పర్వేజ్,ఏఇ జమిల్,ఎపిఒ కడియం రామ్మోహన్,ఎపియం వినోద,మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి,మాజి రెపరండం సర్పంచ్ రాష్టప్రతి అవార్డ్ గ్రహీత గద్దపాటి దానయ్య,వనం రాంబాబు, వుడుగు నర్సిహ్మా, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 21:46

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు

కట్టంగూర్,: రైతులు పండించిన ధాన్యాన్ని కచ్చితంగా మద్దతు ధరకు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు కోరారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి మండలంలో పిఎసిఎస్, ఐకెపిలా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందవచ్చునన్నారు. అందువల్ల రైతులు దళారులను నమ్మి తక్కువ ధరలకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు రవాణా ఖర్చులను తగ్గించాలని లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించుకున్న రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరిపిస్తున్నారని చెప్పారు. మండలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గ్రేడ్ వన్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2060 చొప్పున ధర చెల్లించనున్నట్లు అదే విధంగా కామన్ రకానికి రూ.2040 చెల్లిస్తామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన మూడు నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తామన్నారు. బుధవారం ఐటిపాముల కట్టంగూర్ , కలిమెరా, ఈదులూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విలేకరుల సమావేశంలో సీఈవో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 17:16

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య *

నకిరేకల్ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పులా మాల వేసి అయన ఆశయాలను స్మరించుకొని జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనంతరం మహాత్మా జ్యోతి రావు పూలె విగ్రహానికి శంకుస్థాన చేశారు.ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.....అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని ఆయన అన్నారు.

కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు.

మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని ఆయన కొనియాడారు.

సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.జీవితాంతం అసమానతలపై పోరాడిన ఆదర్శమూర్తి మహాత్మా జ్యోతిబాపులే అని ఆయన అన్నారు.పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారని స్పష్టం చేసారు. బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్ర‌భుత్వం అమలు చేస్తుందనీ ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,నకిరేకల్ జడ్పీటీసీ మాధ ధనలక్ష్మినాగేష్, కౌన్సిలర్లు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 16:50

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జ్యోతరావు పూలే : ప్రియదర్శిని మేడి

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జ్యోతరావు పూలే : ప్రియదర్శిని మేడి

భారతీయ సామాజిక కార్యకర్త, కుల రహిత సమాజానికి కృషి చేసిన సంఘ సంస్కర్తగా, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మ‌హాత్మా జ్యోతరావు పూలే అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకిరేకల్ సెంటర్ లో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడుగా సమాజ అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో విద్య ఎంతో అవసరమని మహిళల విద్య పట్ల ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని కొనియాడారు. స్వార్థం కోసం కాకుండా లాభాపేక్ష లేకుండా భారత దేశంలో సేవ చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన మనందరికీ ఆదర్శ ప్రాయుడన్నారు. చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విజయ్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కేతాఫల్లి మహిళా కన్వీనర్ శృతి, మండల బివిఎఫ్ కన్వీనర్ శివ, సినియర్ నాయకులు గ్యార శేఖర్, నితిన్, వినయ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Apr 10 2023, 17:22

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులకు సూచించారు రూ.32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి పరిశీలించారు గడువు లోపు పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.