madagoni surendar

Apr 10 2023, 17:22

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులకు సూచించారు రూ.32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి పరిశీలించారు గడువు లోపు పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 20:21

ఏపీలో విస్తృతంగా కోవిడ్‌ పరీక్షలు.గత రెండు వారాల్లో 15,096 మందికి పరీక్షలు

ఏపీలో విస్తృతంగా కోవిడ్‌ పరీక్షలు

గత రెండు వారాల్లో 15,096 మందికి పరీక్షలు

ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు

కరోనాపై పూర్తి అప్రమత్తంగా ఏపీ

ఆక్సిజన్‌ ప్లాంట్లు, పీహెచ్‌సీలకు కేంద్రం నిధులివ్వాలి

కేంద్ర మంత్రికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి

గుంటూరు, : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా పరీక్షల వి

యంలో నిరంతరం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారని మంత్రి రజిని పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మరో 20 లక్షల బూస్టర్‌ డోసులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్‌ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణ తదితర అవసరాలకు అయ్యే మొత్తాన్ని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ భరించాలని మంత్రి రజిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తమ రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితులు, కేంద్రం పరంగా అందించాల్సిన వైద్య అవసరాల గురించి కేంద్ర మంత్రి డాక్టర్‌ మాండవీయకు పలు విజ్ఞప్తులు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మాండవీయతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పర్వీన్‌ పవార్‌ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున మంత్రి రజినితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ నివాస్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 20:16

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

.

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పవిత్రరంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని మజీద్ లో నిర్వహించిన దావత్- ఏ- ఇఫ్తార్ విందుకు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి ముఖ్య అతిధిగా హాజరై ముస్లిం సోదరులతో కలసి విందును ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

madagoni surendar

Apr 07 2023, 18:31

ఏపీ::మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు... మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు...

మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....

రోజు రోజుకి నిత్యపెళ్ళికొడుకుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి... మొన్న నలుగురు ని ఒకరికి ఒకరు తెలియకుండా పెళ్లి చేసుకొని మొహం చాటేసి వ్యవహారం నడిపిస్తున్న NRI నిత్యపెళ్ళికొడుకు విషయం అందరికి తెలిసిందే. మీడియా లో ఎన్ని కధనాలు వచ్చినా పోలీసులు కు అమ్యామ్యాలు సమర్పించి NRI పారిపోయిన వ్యక్తి సంఘటన పక్కన పెడితే...

జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ను వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ సైట్స్ లో రెండో వివాహం కోసం దరఖాస్తు చేసున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఐడీ కార్టులు సృష్టించి ఓ వ్యక్తి చేసిన మోసం కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన డక్కుమళ్ల సుదర్శన రావు అలియస్ పవన్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. 2012లోనే అతను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి మొదటి నుండి లైంగిక కోరికలు ఎక్కువ. కోర్కెలు తీర్చుకోవటం కోసం మహిళల కోసం వెదకటం మొదలు పెట్టాడు. అయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకోవడం సులభమని గ్రహించి అప్పటి నుండి షాదీ.కామ్ లో రిజిష్టర్ చేయించుకున్నాడు. ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకొన్న ద్వితీయ వివాహం మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన మహిళతో అదే విధంగా పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అప్పు కావాలంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు. లైగింక కోరికలు తీర్చమని వేధించాడు. అయితే అనుమానం వచ్చిన ఆ మహిళ అతడ్ని నిలదీసింది. ఎక్కువగా మహిళలతో మాట్లాడుతుండటాన్ని కూడా గమనించింది. అయితే ఆమె వాట్సప్ ను వాట్సప్ వెబ్ ద్వారా స్కాన్ చేసుకొని వారిద్దరూ ఏకంతంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను, చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో సదరు మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. దీంతో మొత్తం బండారం బయటపడింది. ఆర్మిలో మేజర్ స్తాయిలో ఉన్నట్లు నకిలి ఐడెంటీటీ కార్డులు స్రష్టించి మహిళలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అనేక మంది మహిళలతోనూ టచ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆర్మి మేజర్ స్థాయిలో ఉన్నాడని నమ్మించడానికి ఆర్మీ డిపెండెంట్ కార్డులను మహిళలకు తానే జారీ చేసేవాడు. అవన్నీ నకిలేవని పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది అమాయక మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం వారిని లైంగికంగా వాడుకోవడం లాంటి పనులు చేస్తున్నాడని దిశ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నకిలీ ఐడెంటిటి కార్డులు, డిపెండెంట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 18:08

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం.

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కోర్టు విధించిన జరిమానాలను కట్టలేని, బెయిల్ ఫీజును కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని... అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది.

madagoni surendar

Apr 07 2023, 18:03

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు..

ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..

madagoni surendar

Apr 07 2023, 17:48

నల్గొండ జిల్లా :ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి చెందిన సంఘటన. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామం లో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ గ్రామనకి చెందిన అనిల్ (19) శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ని బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందరు. దీంతో గ్రామం లో విషాదచాయాలు అలుముకున్నాయి. దీనికి సమాందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Apr 07 2023, 17:14

70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా.తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా.

AP BRS Office

70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా...

తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా...

ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర సూటి ప్రశ్న

విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఉక్కు సంకల్ప పోరు....

8వ తేదీన విశాఖ పర్యటనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ప్లాన్

ఈ నెల పదో తేదీని వైజాగ్ స్టీల్ ఉద్యోగ సంఘాలతో భేటీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు భారత రాష్ట్ర సమితి ఆంధప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ను తన వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. పరిశ్రమలన్న తర్వాత లాభనష్టాలుంటాయని.. ప్రైవేటు రంగంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉన్న టాటా ప్లాంట్ కూడా 70 వేల కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కానీ.. టాటా కంపెనీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనేందుకు ఆసక్తి చూపుతోందని తెలిపారు. అసలు నష్టాల్లో ఉన్న టాటా స్టీల్.. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా టేకప్ చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. జిందాల్ స్టీల్, అదానీ గ్రూప్ ఇలా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 2014 నుంచీ ఉద్దేశపూర్వంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు. అయినా 2021-22 వార్షిక సంవత్సంలో స్వల్ప లాభాలు ఆర్జించిన విశాఖ ఉక్కు కర్మాగారం.. ఇవాళ 30 వేల కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని వివరించారు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న తోట.. ఏపీలో పార్టీలన్నీ ప్రేక్షక వహించడం ద్వారా బీజేపీ సహకరిస్తున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా దొడ్డిదారిన ప్రైవేటు భాగస్వామ్యాల్ని ఆహ్వానించేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసుని కేంద్రం విడుదల చేసిందని బీఆర్ఎస్ మాత్రమే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రి కేటి రామారావు రాసిన బహిరంగ లేఖకు సమాధానం చెప్పే దమ్ముందా అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని పార్టీలు ఏమీ చేయలేవనే ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు తెలిపారు. ఏపీలో పార్టీలన్నీ బీజేపీ చేతిలో తోలు బొమ్మలుగా మారాయని.. కేంద్రం చెప్పినదానికి జీహుజూర్ అంటూ తలాడించేలా తయారయ్యాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని ఆ దిశగా బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాంతాలకు అతీతంగా 32 మంది తెలుగు వాళ్లు బలిదానాలు చేశారని, వాటిని పట్టించుకోకుండా వ్యవహరించడం చారిత్రక తప్పిదం అవుతుందని తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఏకమైతే ఈ దుశ్చర్యని కచ్చితంగా అడ్డుకొని తీరతామని వెల్లడించారు. విశాఖ ప్లాంట్కు 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని వాటిని కారుచౌకగా కొట్టేసేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీ ఇందులో ముందు వరుసలో ఉన్నారని ఈ విషయం గూగుల్ కూడా చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గూగుల్లో 'హూ వాంట్స్ టు బై వైజాగ్ స్టీల్ ప్లాంట్' అని కొడితే అదానీ పేరే చూపిస్తోందని తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం గంగవరం పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకున్నట్లే.. విశాఖ స్టీల్ ప్లాంట్ను చౌకగా కొట్టేసే కుట్రలు జరగుతున్నాయ చంద్రశేఖర్ విమర్శించారు. అదానీ కాకపోతే మోదీ వ్యాపార మిత్రులు మరొకరైనా దీన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాలతో భేటీ కానున్నట్టు డాక్టర్ తోట చంద్రశేఖర్ వెల్లడించారు. ఈనెల పదో తేదీన విశాఖలో ఆయా బృందాలతో చర్చలు జరుపుతామని, పార్టీ అధిష్టానంతో చర్చించి స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన వివరించారు.

madagoni surendar

Apr 07 2023, 17:16

వైఎస్సార్ జిల్లా....కడపలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం..

వైఎస్సార్ జిల్లా....కడపలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం..

"మా నమ్మకం నువ్వే జగనన్న" పోస్టర్ ఆవిష్కరించిన డిప్యూటి సీఎం అంజద్ బాష...

పాల్గొన్న రాష్ట్ర చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, డిప్యూటీ మేయర్లు,

కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు , కార్యకర్తలు...

డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ...

జగనన్న నీవే మా భవిషత్ ఆన్న నినాదంతో కొత్త కార్యక్రమం చేపట్టాం..

అధికారంలో ఉండగా తమ ప్రభుత్వ పనితీరును ధైర్యంగా చెప్పి, వారికి అవగాహన కల్పించే సాహసోపేత నిర్ణయం..

కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసేందుకే ఈ జగనన్నే మా భవిషత్ కార్యక్రమం..

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ఏవేమీ అందుతున్నాయి.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గుర్తించేలా వైసిపి సైనికులు పనిచేస్తారు..

వైసిపి పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తారు..

పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తారు..

సంతృప్తి చెందితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్..

అన్ని వర్గాలు, కులాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం...

madagoni surendar

Apr 07 2023, 17:00

ఏపీ :సిఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్.

CBN సెల్ఫీ ఛాలెంజ్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్!

నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు

చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్

రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ వ్యాఖ్య

ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..నువ్వు కట్టిన ఇళ్లెక్కడ...జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటో తో ట్వీట్ చేసిన చంద్రబాబు

తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్ కు, లీడర్స్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత