madagoni surendar

Apr 06 2023, 19:27

అమరావతి::ఏపీ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం.

అమరావతి

ఏపీ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం?

ఇవ్వాలో, రేపు అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం

ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీ ప్రక్రియ

కొందరు కలెక్టర్ల, ఎస్పీలు భారీగా ఫిర్యాదులు చేసిన ప్రజా ప్రతినిధులు...

గత నెలలోనే బదిలీ జరగాల్సిన సీఎం ఆమోదం కాకపోవడంతో నిలిచిన బదిలీలు.

madagoni surendar

Apr 06 2023, 19:23

నల్గొండ జిల్లా :భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు

భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీను గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పోతేపాక సాంబయ్య పాల్గొని. పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి.అనంతరం వారు మీడియాతో. మాట్లాడుతూ. బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మ బలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలుకొని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసింది బిజెపి కార్యకర్త సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు అదే విధంగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన అవినీతి పాలన దొర పాలన ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీని కూకటి వేళ్ళతో పీకి పడేస్తారని దిశగా తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా డాకయ్య,తాడికొండ రామ్మూర్తి,మైల శ్రీనివాస్, అప్పం అంజయ్య,నారగోని వెంకటేశ్వర్లు,పెండం చంద్రమోహన్,చినేని జానీ,జాల వెంకన్న, నడికుడి నవీన్,బ్రహ్మయ్య, సోమయ్య, రాపోలు శరత్,తదితర మిత్రులు పాల్గొన్నారు

madagoni surendar

Apr 06 2023, 17:29

గద్వాల పట్టణంలోని డీకే అరుణ బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోబిజెపి జిల్లా ప్రదాన కార్యదర్శి డాక్టర్ డికె స్నిగ్ద రెడ్డి

ఈరోజు గద్వాల పట్టణంలోని డీకే బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోబిజెపి జిల్లా ప్రదాన కార్యదర్శి డాక్టర్ డికె స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ..

పరంపర అనే పేరుతో ఆహుతి సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేశ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఈ నెల 9వ తేదీనా 6:30 గంటలకు గద్వాల తేరు మైదానంలో

ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన దేశ కళలు, సాంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది.

ఇందులో భాగంగా మన గద్వాల్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతోపాటు, యువతకు వాటి పట్ల ఆసక్తి కనబరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు

ఈ కార్యక్రమం నృత్యగ్రామ్ డాన్స్ ఎన్సెంబుల్ చిత్ర సేన డాన్స్ కంపెనీ వారు శ్రీలంక కళాకారుల చేత నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం తమ ప్రాంతంలో నిర్వహిస్తే ఎంతో బాగుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి వెంటనే స్పందించి ఈ కార్యక్రమ నిర్వహణపై అనుమతి ఇవ్వడం జరిగింది..

ఇటువంటి కార్యక్రమంలో గద్వాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడంతోపాటు రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాల విలువలను అందించాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు,జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణ వేణి , కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాల్వాయి రాముడు తదితరులు ఉన్నారు.

madagoni surendar

Apr 06 2023, 16:36

ఏపీ:కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం.షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన. ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు.

కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం

షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు*

కొండపల్లి మున్సిపాలిటీ,

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గా మసీదు పరిసర ప్రాంతమంతా ఎన్టీపీఎస్ కాలుష్యం వలన దర్గాకు మసీదుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్, బాబురావు ఇతర అధికారులు షా బుఖారి బాబా దర్గా మరియు మసీదు ప్రాంగణం ఈరోజు పరిశీలించారు.

పొల్యూషన్ కారణంగా త్వరగా కు భక్తులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యంతో దర్గా ప్రాంగణమంతా నల్లగా అయిపోతుందని, మసీదులో కనీసం నమాజ్ చేసుకునేందుకు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఈ ఈ కు విన్నవించుకున్నారు.

అదేవిధంగా వెంటనే ‌చెట్లు నాటించాలని, దర్గా మసీదు లో పనిచేసే సిబ్బందికి, ముతవల్లీలకు, ఇమామ్ లకు హెల్త్ కార్డ్ ఇవ్వాలని,షెడ్డు ఏర్పాటు చేయాలని చెట్లకు నీళ్లు వేయటానికి, పరిశుభ్రత చేయుటకు వర్కర్స్ ని కేటాయించాలని భక్తులు కోరారు.

స్పందించిన ‌ఈ ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలోనే కాలుష్య నివారణ చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, దర్గా ముతవల్లి షాజహాన్ బాబు, కాజా తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 06 2023, 15:50

నందిగామ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు - వాలంటీర్లు -గృహసారథులకు విజ్ఞప్తి ..*

నందిగామ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు - వాలంటీర్లు -గృహసారథులకు విజ్ఞప్తి ..

"మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ..డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .శాసనమండలి సభ్యులు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదేశానుసారం "మా నమ్మకం నువ్వే జగన్ - మా భవిష్యత్తు నువ్వే జగనన్న" కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు మండలాల సచివాలయ కన్వీనర్లు- వాలంటీర్లు - గృహసారథులు కలిసికట్టుగా ఈనెల 7 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పార్టీ కార్యాలయం అందజేసిన జగనన్న కిట్లు( ప్రచార సామాగ్రి) తో తమ క్లస్టర్లలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబంతో 10 నిమిషాల సమయం కేటాయించి మన ప్రభుత్వ పథకాలను- పనితీరును వివరిస్తూ, వారి ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అంటిస్తూ- వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటూ - జగనన్న పాలన పై వారి అభిప్రాయాలను సేకరిస్తూ - గత పాలనకు.. మన పాలనకు .. వ్యత్యాసాన్ని వారికి వివరిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ .. ఎప్పటికప్పుడు డేటాను పార్టీ కార్యాలయానికి అందజేయాలని మనవి చేస్తున్నాను .. పార్టీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తూ ..

డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

శాసనమండలి సభ్యులు

madagoni surendar

Apr 06 2023, 09:21

ఏపీ :ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు. *ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట..

ఈ నెల 7వ తేదీన ప్రారంభమవనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వివరాలు

ప్రతీ ఇంటా.. ప్రతీ నోట జగన్ మాట...!!

7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'

ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయతను ప్రజా మద్దతుగా భావించి నమోదు చేసేలా ‘పీపుల్స్‌ సర్వే’

రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు జగనన్న సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే 'జగనన్నే మా భవిష్యత్తు'. 'మా నమ్మకం నువ్వే జగన్'

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణల అనంతరం అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు ఏ రాజకీయ పార్టీ ఇదివరకు చేయని భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభించి ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల ­పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు.

రాష్ర్టానికి మంచి చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల స్థానంలో వాస్తవాలను, సీఎం జగన్‌ సంక్షేమ రథానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ‘పీపుల్స్‌ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.

సీఎం జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వైఎస్సార్‌ సీపీ బలంగా నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్‌ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు.

ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత కలిగిన కార్యకర్తలున్న పార్టీ వైఎస్సార్ సీపీ..

వైఎస్సార్ సీపీ తన సైనికులను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యత గల సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్ సీపీ ఉన్నత శిఖరాలకు చేరువ అవుతోంది ఈ విషయాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమం ద్వారా నిరూపించాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది.

ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు సీఎం జగన్‌ ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంది. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కూడా ఇచ్చింది. 

 

ప్రజల నినాదంగా ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ ప్లకార్డు కార్యక్రమం

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

madagoni surendar

Apr 05 2023, 22:24

నల్గొండ జిల్లా:కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్.

కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముక్కాముల శేఖర్ యాదవ్               

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కాంగ్రెస్ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షునిగా కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన ముక్కాముల శేఖర్ యాదవ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముక్కాముల శేఖర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ బలో ప్రాంతానికి ఎంతో కృషి చేస్తానని తెలిపారు. మండలంలో నియోజకవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతుగా కఠినంగా పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి,పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య,నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్,కి&సీనియర్ నాయకులకు ధన్యవాదాలు. తెలిపారు.ఈ కార్యక్రమంలో. పి. ఏ. సి.ఎస్ కట్టంగుర్ మాజీ చైర్మెన్ చేవుగొని సాయిలు , ఒ. బి. సి..మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు. కొంపెల్లీ లక్ష్మయ్య, పిట్టం పల్లి మాజీ సర్పంచ్ గౌర నర్సింహా, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్, నంద్యాల అనంత రెడ్డి.మండల యువ జన కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేని సైదులు,అన్నారం గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల సైదులు,మునికుంట్ల గ్రామ అధ్యక్షులు కడారి మల్లేష్, వార్డు మెంబర్లు ఉట్కురి శ్రీను ,ఏనుగు సైదులు,బొజ్జ శ్రీను,యువజన నాయకులు నర్సింగ్ సంతోష్ గౌడ్,ఉట్కురి సాయి ,దాసరి సతీష్,బీసం మహేష్ పులకరం శ్రీను,మల్లె బోయిన ప్రకాష్,కైతపురం.సైదులు,మారం ప్రభాకర్ రెడ్డి,తేలు సైదులు, సాయి ప్రతప్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 05 2023, 21:13

ఏపీ :కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

నెల్లూరు జిల్లా:

జిల్లాలో కన్న కూతురినే హత్య చేసిందో కసాయి తల్లి.

గుర్రాల మడుగు సంగంలో కిడ్నాపు గురై కాల్వలో శవమై తేలిన చిన్నారిని.. తానే హత్య చేసినట్లు చిన్నారి తల్లి అంగీకరించింది.

నిందితురాలిని బాలాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఫిర్యాదుదారుపై అనుమానంతో విచారించగా.. తనకు ఇద్దరు ఆడపిల్లలే కావడం, భర్తతో విడిగా ఉండటం తదితర కారణాలతో నేరానికి పాల్పడ్డట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.

madagoni surendar

Apr 05 2023, 20:48

నెల్లూరు జిల్లా: ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .*

నెల్లూరు జిల్లా

ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .

ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ పోలీసులకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 150 వాటర్ కూలర్స్ , 150 హ్యాట్స్ మరియు 150 సన్ గ్లాసెస్ పంపిణీ.నిత్యం ఎండలో నిలబడి దుమ్ము, ధూళి లెక్కచేయకుండా జిల్లాలోని ట్రాఫిక్ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు కనుక వారి సంక్షేమం నా భాధ్యత –యస్.పి.

ఎండ తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. మండుటెండలో తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

స్వీయ రక్షణ చాలా అవసరం. ఎండకు నీరు బాగా తాగాలి, డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసర కార్యకలాపాలు సాఫీగా సాగుటకు ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనది.*

 నిరంతరం ప్రజల కంటికి కనబడే పోలీస్ విభాగమే ట్రాఫిక్.

 ప్రముఖుల రాకపోకలు, పరిక్షల సమయంలో, ఇటీవల జరిగిన శోభాయాత్రలో ట్రాఫిక్ సమన్వయం చాలా బాగుంది.

 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలన వేయడంలో, ఫైన్ కట్టించుటలో బాగా విధులు నిర్వహిస్తున్నారని అభినందనలు.

 విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని తెలిపారు.

 మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తా, చక్కగా పని చేయండి.

 మా సంక్షేమంకొరకు ఎంతో శ్రద్ద తీసుకుంటు అన్ని రకాల సదుపాయలు అందిస్తున్న యస్.పి. గారికి సంతోషంతో ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తపరిచి విదులు సక్రమంగా

నిర్వహిస్తామని తెలిపిన ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది.

జిల్లా పోలీసు కార్యాలయం,

madagoni surendar

Apr 05 2023, 18:58

సుప్రీం కోర్ట్ : దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం'పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

సుప్రీం కోర్ట్ : దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం'పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (సీబీఐ), ఈడీ (ఈ డి ) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ఆరోపిస్తున్న విపక్షాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. ఈ కేసులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను (Probe Agencies) దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈడీ (ed), సీబీఐ (CBI) వంటి సంస్థలతో కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌.. దీని విచారణ అర్హతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ''కేసుల దర్యాప్తులు, విచారణల నుంచి విపక్ష నేతలకు రక్షణ కల్పించేందుకు ఈ పిటిషన్‌ వేశారా? వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా?'' అని ప్రతిపక్షాల (Opposition Parties) తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సీజేఐ ప్రశ్నించారు.