madagoni surendar

Apr 03 2023, 13:54

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

నాక్సల్స్ ఎన్కౌంటర్ : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)లోని నక్సల్స్‌ (Naxals) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఛత్రా (Chatra) అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు..

వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు (Maoist) అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.(Naxals Encounter)

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ (CRPF కోబ్రా యూనిట్ ) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..

నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది..

madagoni surendar

Apr 03 2023, 13:06

నల్గొండ జిల్లా :కేతపల్లి :ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్*

ప్రజలకు దాహార్తి తీర్చడానికే చలివేంద్రాలు, ప్రాణదాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగుమల్ల. రాజ్

.

Streetbuzz news. నల్గొండ జిల్లా ::

ప్రజలకు వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రాణదాతలు పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేశామన్నారు . వ్యవస్థాపకులు రాజు.. అనంతరం రాజు మాట్లాడుతూ.కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మి వెంకన్న గౌడ్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నవారికి నీళ్లు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్రాణదాతలు ఫౌండేషన్ చైర్మన్ గ్రూపు సభ్యులని అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజసేవకు పాటుపడాలని ఆకాంక్షించారు. మన గ్రామ వాస్తవాడైన మెరుగు మల్ల రాజ్ మానవసేవే మాధవసేవే అంటూ ప్రతి నిమిషం ప్రజల శ్రేయస్ కోసమే పాటుపడుతూ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భం గా రక్తదానం చేసే విధంగా తోడ్పడుతూ బాధితుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ముందుకు సాగుతూ మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు సేవలు చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో.కీర్తి వెంకన్న మేరుగుమల్ల బిక్షం పాండు నాగయ్య రాములు ఉపేందర్ సతిరెడ్డి కృష్ణ రెడ్డి ప్రభాకర్ అనిల్ నాగయ్య సైదులు అశోక్ రమేష్ గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 03 2023, 12:56

నెల్లూరు జిల్లా.... నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప కిడ్నాప్.

*నెల్లూరు జిల్లా....

నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప కిడ్నాప్.

 తెల్లవారు జామున ఊయలలో ఉన్న పాపను ఎత్తుకెళ్లిన దుండగులు...

ఊయలలో బొమ్మను ఉంచి పాపను ఎత్తుకెళ్లిన వైనం...

-పోలీసులకు ఫిర్యాదు చేసిన పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ...

తెల్లవారుజామున పాపను ఎత్తుకెళ్లినట్లుగా భావిస్తున్న తల్లిదండ్రులు...

madagoni surendar

Apr 03 2023, 12:50

ఏపీ :మడికి గ్రామపంచాయతీ @75 వసంతాలు. పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949.ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు

మడికి గ్రామపంచాయతీ వసంతాలు

పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949

ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు

నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతన అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్‌తో కళకళలాడుతూ ఉండే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామపంచాయతీ 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ పంచాయతీ 1949 ఏప్రిల్‌ 3 న ఆవిర్భవించింది. అప్పటినుంచి అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ గ్రామానికి చిలకలపాడు, మల్లావానితోట శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఈ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటు కోనసీమకు అటు తూర్పుగోదావరి జిల్లాకి సరిహద్దు గ్రామం ఇది. ఇక్కడి కూరగాయల మార్కెట్ కు రాష్ట్ర నలుమూలన నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు అక్కడకు దిగుమతి చేసుకుంటారు.ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. అనతి కాలంలోనే ఈ మార్కెట్ విశేష గుర్తింపు పొందింది.

గ్రామ చరిత్ర ఇది ...

పావన గౌతమీ గోదావరికి కూత వేటు దూరంలో ఉన్న మడికి గ్రామానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. దేవతాకాలంలో మణికర్ణిక అనే మహిళ ఇక్కడ ఘోర తపస్సు ఒనరించినట్లు చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. నారద మహాముని ప్రేరణతో ఆమె ఏకాదశ రుద్రుల్లో ఒకరైన సోమేశ్వర స్వామిని ప్రతిష్టించగా, నారదుడు నవ జనార్ధనుని ప్రతిష్టలో భాగంగా రెండవ ఆలయం ఎక్కడ నిర్మించినట్లు నేటికీ సజీవ సాక్షాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో శివ-విష్ణువాలయాలు ఉండడం ఈ గ్రామ విశేషం. మణికర్ణికచే ఆలయ నిర్మాణం జరగడంతో ఆ గ్రామానికి మణిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మడికి గా రూపాంతరం చెందింది.

75 ఏళ్లలో 11 మంది సర్పంచులు

75 ఏళ్ల చరిత్ర గల ఈ గ్రామపంచాయతీకి ఇప్పుడు వరకు మంది సర్పంచులు గా పనిచేశారు. తొలి సర్పంచ్‌గా జయవరపు సత్తయ్య(మడికి) పనిచేశారు. ఆ తర్వాత రావిపాటి పట్టాభిరామయ్య(చిలకలపాడు),గండి నాగేశ్వరరావు(చిలకపాడు), రాయపాటి రామారావు(చిలకలపాడు) లు సర్పంచ్ పదవులు చేపట్టారు.వీరి హయాంలో పాఠశాలలు, విద్యుత్ సౌకర్యాలు వచ్చాయి. అయితే 8 జూన్ 1966 నుంచి 7జూన్ 1970 వరకు ఉప సర్పంచ్‌గా ఉన్న కురమళ్ల వీర్రాజు(చిలకలపాడు) సర్పంచిగా ఇంచార్జ్ బాధితులు చేపట్టారు. ఆ తర్వాత 8జూన్1970 నుంచి 31 మార్చి 79 వరకు మామిడిశెట్టి వీరంశెట్టి(మడికి) సర్పంచ్ గా కొనసాగారు.ఈయన కాలంలో సబ్‌ హెల్త్ సెంటర్, పశువుల ఆసుపత్రి వంటి సౌకర్యాలు వచ్చాయి. అలాగే 2 జూలై 1979 నుంచి 26 మే 1981 వరకు ఉప సర్పంచ్ గా ఉన్న కొప్పిశెట్టి వెంకటరాజు(మల్లావానితోట) ఇంచార్జ్ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 27 మే 1981 నుంచి 20 అక్టోబర్ 1995 వరకు సుమారు 14 ఏళ్ల పాటు కురమళ్ల వీర్రాజు సర్పంచ్ గా ఏకచత్రాధిపత్యం వహించారు.ఆ సమయంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సంగిత వెంకట రెడ్డి మార్కెట్ శాఖ నుంచి(1993లో) రూ.5 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించారు. అప్పటి వరకూ దోనె పైనే రైతులు, గ్రామస్థులు కాలవుపై రాకపోకలు సాగించేవారు.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం కూడా ఆయన హయాంలో నిర్మించారు.

అయితే 1995 నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.విచిత్రం ఏంటంటే అప్పటినుంచి ఇప్పటివరకు ఆ గ్రామ సర్పంచ్ పదవి జనరల్‌కు ఒక్కసారి కూడా కేటాయించబడలేదు. ఎస్సీ, బీసీల కేటగిరిలకే రిజర్వు అవుతూ వచ్చింది. 21 అక్టోబర్ 1995 నుంచి 23 ఆగస్టు 2001 వరకు బిసి జనరల్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి యనమదల నాగేశ్వరావు(మడికి) సర్పంచ్ పదవి చేపట్టారు. ఆయన హయాంలోనే తొలిసారిగా సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టారు. అలాగే కాలుపై రేవులను నిర్మించారు.ఆ తర్వాత బిసి జనరల్ స్థానంకు టిడిపి పార్టీ నుంచి పంపన సూర్యారావు (మల్లావానితోట) సర్పంచ్ గా గెలిచి 23 ఆగష్టు2001 నుంచి 22 ఆగష్టు2006 వరకూ పనిచేశారు. అనంతరం తొలిసారిగా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులను పోటీలో నిలపగా స్వతంత్ర అభ్యర్థిగా రెల్లి సామాజిక వర్గానికి చెందిన బంగారి ఆదినారాయణ విజయం సాధించారు. ఆయన 23 ఆగష్టు 2006 నుంచి 22 ఆగష్టు2011 వరకూ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులు యనమదల నాగేశ్వరరావు తదితరుల కృషి తో నాగులపేట ఇళ్ల స్థలాలు, ఇళ్లు,గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలలో బిసి మహిళకు రిజర్వ్ కావడంతో గుత్తుల సీతామహాలక్ష్మి(మడికి)గెలుపొందారు. 2ఆగస్టు 2013 నుండి 1 ఆగష్టు2018వరకు సర్పంచుగా పనిచేశారు. ఆ సమయంలో సిమెంట్ రోడ్లు,డ్రెయినేజీలు నిర్మించారు. ఆ తరువాత ఎస్సీ మహిళలకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడంతో రెండేళ్ల క్రితం ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్న గెలుపొందారు.

ఇద్దరు ఎంపీపీలు.. ఇద్దరు జడ్పిటిసిలు

ఈ గ్రామానికి రాజకీయంగాను మంచి గుర్తింపు ఉంది. ఏకంగా ఇద్దరు మండల పరిషత్ అధ్యక్షులుగాను,మరో ఇద్దరు జడ్పిటిసిలుగాను పనిచేశారు. అంతేకాదు మరో ఇద్దరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. గత ప్రభుత్వంలో కొత్తపల్లి ధనలక్ష్మి, కొత్తపల్లి వెంకటలక్ష్మి లు టిడిపి పార్టీ నుంచి చెరో రెండున్నర సంవత్సరాలు ఎంపిపిగా పనిచేశారు. అలాగే మండలంలో తొలి జడ్పిటిసిగా ఈ గ్రామానికి చెందిన మామిడిశెట్టి జానికరత్నం(బిసి మహిళ) కాంగ్రెస్ పార్టీ నుంచి 1995లో గెలుపొందారు. ఇదే గ్రామానికి చెందిన మల్లిపూడి ఉదయ భాస్కరరావు(జనరల్) 2001లో టిడిపి పార్టీ నుంచి విజయ సాధించారు. మండల పరిషత్తులు ఆవిర్భవించిన 1985లో మడికి సర్పంచ్ గా గెలుపొందిన కురమళ్ల వీర్రాజు మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా పనిచేశారు.అలాగే మలియాల బాబి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా చేపట్టారు.అంతేకాక కరుమళ్ల వీర్రాజు, కొత్తపల్లి కృష్ణ లు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు గాను,యనమదల నాగేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను పనిచేసి మడికి గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు.

రెండేళ్లలో ఎంతో అభివృద్ధి

రెండేళ్ళ తన పదవి కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మీ మౌనికి తెలిపారు.కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గ్రామస్థులు,పాలకవర్గం సహకారంతో అభివృద్ధి సాదిస్తున్నామన్నారు. నాలుగు సచివాలయాల పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టామ్మారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ భవనాలు కొన్ని పూర్తవుగా మరికొన్ని వివిధ దశలో ఉన్నట్లు వివరించారు. అలాగే రూ. కోటి 20 లక్షలతో త్రాగునీరు అందించేందుకు జల జీవన మిషన్ పధకం ద్వారా మంజూరయ్యాయని ఇప్పటికే రూ.50 లక్షల విలువైన పనులు జరిగాయన్నారు. మరో రూ.70 లక్షలతో పనులు చేపట్టనున్నామన్నారు. నాగుల పేటలో రూ.40 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజి పనులు జరుగుతున్నాయన్నారు.రూ. 15 లక్షలతో చిలకలపాడు డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ వివరించారు. గ్రామంలో 54 వాలంటీర్లు ద్వారా సంక్షేమ పధకాలు అందరికీ సక్రమంగా అందిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మోక్షాంజలి తెలిపారు.

కొండ్రెడ్డి శ్రీనివాస్

madagoni surendar

Apr 03 2023, 09:08

ఏపీ :ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...*

ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...

గడప గడపకు ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ..

గత రివ్యూ సమావేశంలో ఏప్రిల్ లో జరిగే సమావేశంలో టికెట్లపై స్పష్టత ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి..

20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించే అవకాశం...

నాతో ఉండాలో వెళ్ళిపోతారో తేల్చుకోవాలని చెప్పే అవకాశం..

తన మీద నమ్మకం గెలుపుపై సందేహాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చని హెచ్చరించే అవకాశం...

ఏంజరుగుతుందో అని ఎమ్మెల్యేలలో ఉత్కంఠత...

రాబోయే ఎన్నికలకు సంబంధించి పల్లెనిద్ర కార్యక్రమాలపై స్పష్టత...

madagoni surendar

Apr 03 2023, 09:03

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

madagoni surendar

Apr 03 2023, 09:00

ఆంధ్ర ప్రదేశ్::ఎస్ .ఎస్ .సి ఇన్విజిలేటర్లు లకు సూచనలు.. ఇన్విజిలేటర్లు ఎవరు కూడా పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు తీసుకు రాకూడదు...

ఆంధ్ర ప్రదేశ్

S.S.C ఇన్విజిలేటర్లు లకు సూచనలు...

ఇన్విజిలేటర్లు ఎవరు కూడా పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు తీసుకు రాకూడదు...

1). ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు ఉదయం 8:30 కు సెంటర్ లో ఉండాలి...

2). అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి...

3). ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది...

4). ఇన్విజిలేటర్ అందరు కూడా ఉదయం 9:00 గంటల లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి...

5). ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి...

6). విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి...

7). O.M.R షీట్ లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి, తమదే అని సరిచేసుకోవాలి...

8). ప్రధాన జవాబు పత్రం పై S.No ఉందా లేదా చెక్ చేసుకోవాలి...

9). అలాగే ఎడిషనల్ షీట్ పైన నంబర్స్ ఉన్నాయా అది సీరియల్ లోనే ఉన్నాయా చూసుకోవాలి...

10). విద్యార్థులు O.M.R పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి, మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి...

11). 9.25 a.m లోగా స్టిక్కర్స్ వేయడం సైన్ చేయడం అయిపోవాలి...

12). సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి...

13). O.M.R షీట్ పైన, అడిషనల్ షీట్ పైన ప్రధాన జవాబు పత్రం పై నంబర్ వేయించాలి...

14). ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు. ప్రశ్న పత్రం పైన మాత్రమే ప్రతి పేజీలో హాల్ టికెట్ నెంబర్ వేయమని చెప్పాలి...

15). స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి...

16). ఎడిషనల్ షీట్, పార్ట్-బి పైన, మ్యాప్, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

17). విద్యార్థులకు ఎడిషనల్ ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వబడిన ప్రొఫార్మా లో ఆ విద్యార్థికి ఇచ్చిన ఎడిషనల్ సీట్ నెంబర్ని ఆ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా ఎంటర్ చేయాలి...

18). ఒక్కో విద్యార్థికి ఎడిషనల్ షీట్, గ్రాఫ్ లు ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి...

19). ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

20). విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు, ఒకవేళ టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి...

21). ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు...

22). ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి...

23). విద్యార్థులు ఎడిషనల్ షీట్ తీసుకునేటప్పుడు వారు తీసుకున్న క్రమంలో కుడి వైపు పై భాగంలో సీరియల్ నంబర్ వేయమని చెప్పాలి...

24). విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని ట్యాగ్ చేసేటప్పుడు ఎడిషనల్ షీట్ సీరియల్ గా ఉండేలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అలాగే బిట్ పేపర్ ని చివరగా ట్యాగ్ చేయమని చెప్పాలి...

కొంతమంది విద్యార్థులు పొరపాటున Part-B బదులు క్వశ్చన్ పేపర్ ని టాగ్ చేసి బిట్ పేపర్ ని ఇంటికి తీసుకెల్లే ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి...

25). స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి...

26). ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి...

27). ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంత వరకు సహకరించాలి...

28). ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు...

29). ఇన్విజిలేటర్ ఎగ్జామ్ కు కేటాయించిన గదిని వదిలి వెళ్ళకూడదు. పరీక్ష జరిగే ఇతర గదులకు తిరగకూడదు...

30). ఏదైనా అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే ఉపశమనకారిణి (రిలీవర్) పెట్టి వెళ్లాలి...

31). ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు...

32). గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది...

33). మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్ గా ఉండేలా చూసుకోవాలి...

34). ప్రశ్నా పత్రములు అదే రోజునకు సంబంధించినవా ? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి...

35). ప్రశ్నాపత్రం వేరుగా వస్తే C.S లేదా D.O లకు రిటర్న్ చేయాలి...

36). ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు...

37). ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే C.S /D.O లకు తెలియజేయాలి...

38). ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

39). విద్యార్థులు ఎగ్జామ్ ముగిసిన పిదప వారు ఎన్ని ఎడిషనల్ షీట్ ఉపయోగించారో ఓఎంఆర్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ పై వేయించాలి...

40). ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూఉన్నట్లు గమనిస్తే C.S, D.O లకు తెలియజేయాలి...

41). దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి...

42). ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి...

43). మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది...

44). పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే ట్యాగ్ చేయించాలి...

45). O.M.R పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి...

46). ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు...

47). ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ షీట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి...

48). సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా ? లేదా ? అని పరిశీలించాలి...

49). ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది...

50). ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్, గ్రాఫ్, మ్యాప్, పార్ట్ -B లపై పూర్తి సంతకం చేయాలి.

madagoni surendar

Apr 02 2023, 19:02

నల్గొండ జిల్లా ::బాదితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్ ఫౌండేషన్ చైర్మన్, బచ్చుపల్లి గంగాధర్ రావు.

బాదితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్ఫౌం డేషన్ చైర్మన్, బచ్చుపల్లి గంగాధర్ రావు బిజీర్ .

నకిరేకల్ మండలంలోని మంగలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గాధరి సైదులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుడగ తక్షణ ఖర్చులు నిమిత్తం తమ బిజిఆర్ ఫౌండేషన్ నుండి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్,అనంతరం వారు మాట్లాడుతు.. బాధితునికి మెరుగైన వైద్యంకోసం తనవంతు సహాకారం చేస్తానని బరోసానిచ్చిన బిజీర్,

(ఈకార్యక్రమంలో)

ఉపసర్పంచ్ చింతల శ్రీను,SCమండల నాయకులు బొల్లేద్దు లక్ష్మయ్య, పెద్దమాల రామాచంద్రు,మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 20:25

నల్గొండ జిల్లా :నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో పర్యటించిన నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు*

చందంపల్లి గ్రామంలో పర్యటించిన నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నల్గొండ జిల్లా.నకిరేకల్ మండలంలోని చందంపల్లిలో గ్రామంలో ట్యాంక్ మీదనుంచి కిందపడి చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాత్క నాగరాజును పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన. ఎంపీపీ 

అనంతరం గ్రామ కార్యదర్శితో సరస్వతితో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో మాటమంతి నిర్వహించి, పారిశుద్ధ్య సమస్యలు గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుని,గ్రామంలో గల అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించి బోజన సదుపాయాలను,మరియు రికార్డులను తనిఖీ చేసిన ఎంపీపీ శ్రీదేవిగంగాధర్ రావు. (ఈకార్యక్రమంలో)

సుధాకర్ రెడ్డి,చిర్రబోయిన శీను, యార క్రాంతి,గాధగోని మహేష్,ముక్కముల లింగస్వామి, ముక్కముల సురేష్ ,వరికుప్పల నాగరాజు, యార అశోకు,వేణు, వెంకన్న, రాంబాబు, బిక్షం, సురేష్, శివ, దార శ్రీను,శ్రీహరి,సతీష్,కే మహేష్, వై మహేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 19:26

గుంటూరుజిల్లా::మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా

గుంటూరుజిల్లా::

మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కరీం అన్నారు.

శనివారం గుంటూరు సిటీలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం లో లారీ డ్రైవర్లు స్కూల్ బస్సులు డ్రైవర్లు,ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా పట్ల న్యాయం విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమoలో డిటిసి కరీం, జిల్లా వ్యాప్తం గా జరిగిన రహదారి ప్రమాదాలను వివరించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.