madagoni surendar

Apr 03 2023, 09:08

ఏపీ :ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...*

ఏప్రిల్ 3 వ తేదీ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ...

గడప గడపకు ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ..

గత రివ్యూ సమావేశంలో ఏప్రిల్ లో జరిగే సమావేశంలో టికెట్లపై స్పష్టత ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి..

20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించే అవకాశం...

నాతో ఉండాలో వెళ్ళిపోతారో తేల్చుకోవాలని చెప్పే అవకాశం..

తన మీద నమ్మకం గెలుపుపై సందేహాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చని హెచ్చరించే అవకాశం...

ఏంజరుగుతుందో అని ఎమ్మెల్యేలలో ఉత్కంఠత...

రాబోయే ఎన్నికలకు సంబంధించి పల్లెనిద్ర కార్యక్రమాలపై స్పష్టత...

madagoni surendar

Apr 03 2023, 09:03

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల లో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

madagoni surendar

Apr 03 2023, 09:00

ఆంధ్ర ప్రదేశ్::ఎస్ .ఎస్ .సి ఇన్విజిలేటర్లు లకు సూచనలు.. ఇన్విజిలేటర్లు ఎవరు కూడా పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు తీసుకు రాకూడదు...

ఆంధ్ర ప్రదేశ్

S.S.C ఇన్విజిలేటర్లు లకు సూచనలు...

ఇన్విజిలేటర్లు ఎవరు కూడా పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు తీసుకు రాకూడదు...

1). ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు ఉదయం 8:30 కు సెంటర్ లో ఉండాలి...

2). అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి...

3). ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది...

4). ఇన్విజిలేటర్ అందరు కూడా ఉదయం 9:00 గంటల లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి...

5). ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి...

6). విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి...

7). O.M.R షీట్ లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి, తమదే అని సరిచేసుకోవాలి...

8). ప్రధాన జవాబు పత్రం పై S.No ఉందా లేదా చెక్ చేసుకోవాలి...

9). అలాగే ఎడిషనల్ షీట్ పైన నంబర్స్ ఉన్నాయా అది సీరియల్ లోనే ఉన్నాయా చూసుకోవాలి...

10). విద్యార్థులు O.M.R పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి, మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి...

11). 9.25 a.m లోగా స్టిక్కర్స్ వేయడం సైన్ చేయడం అయిపోవాలి...

12). సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి...

13). O.M.R షీట్ పైన, అడిషనల్ షీట్ పైన ప్రధాన జవాబు పత్రం పై నంబర్ వేయించాలి...

14). ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు. ప్రశ్న పత్రం పైన మాత్రమే ప్రతి పేజీలో హాల్ టికెట్ నెంబర్ వేయమని చెప్పాలి...

15). స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి...

16). ఎడిషనల్ షీట్, పార్ట్-బి పైన, మ్యాప్, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

17). విద్యార్థులకు ఎడిషనల్ ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వబడిన ప్రొఫార్మా లో ఆ విద్యార్థికి ఇచ్చిన ఎడిషనల్ సీట్ నెంబర్ని ఆ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా ఎంటర్ చేయాలి...

18). ఒక్కో విద్యార్థికి ఎడిషనల్ షీట్, గ్రాఫ్ లు ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి...

19). ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

20). విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు, ఒకవేళ టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి...

21). ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు...

22). ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి...

23). విద్యార్థులు ఎడిషనల్ షీట్ తీసుకునేటప్పుడు వారు తీసుకున్న క్రమంలో కుడి వైపు పై భాగంలో సీరియల్ నంబర్ వేయమని చెప్పాలి...

24). విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని ట్యాగ్ చేసేటప్పుడు ఎడిషనల్ షీట్ సీరియల్ గా ఉండేలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అలాగే బిట్ పేపర్ ని చివరగా ట్యాగ్ చేయమని చెప్పాలి...

కొంతమంది విద్యార్థులు పొరపాటున Part-B బదులు క్వశ్చన్ పేపర్ ని టాగ్ చేసి బిట్ పేపర్ ని ఇంటికి తీసుకెల్లే ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి...

25). స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి...

26). ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి...

27). ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంత వరకు సహకరించాలి...

28). ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు...

29). ఇన్విజిలేటర్ ఎగ్జామ్ కు కేటాయించిన గదిని వదిలి వెళ్ళకూడదు. పరీక్ష జరిగే ఇతర గదులకు తిరగకూడదు...

30). ఏదైనా అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే ఉపశమనకారిణి (రిలీవర్) పెట్టి వెళ్లాలి...

31). ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు...

32). గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది...

33). మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్ గా ఉండేలా చూసుకోవాలి...

34). ప్రశ్నా పత్రములు అదే రోజునకు సంబంధించినవా ? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి...

35). ప్రశ్నాపత్రం వేరుగా వస్తే C.S లేదా D.O లకు రిటర్న్ చేయాలి...

36). ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు...

37). ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే C.S /D.O లకు తెలియజేయాలి...

38). ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి...

39). విద్యార్థులు ఎగ్జామ్ ముగిసిన పిదప వారు ఎన్ని ఎడిషనల్ షీట్ ఉపయోగించారో ఓఎంఆర్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ పై వేయించాలి...

40). ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూఉన్నట్లు గమనిస్తే C.S, D.O లకు తెలియజేయాలి...

41). దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి...

42). ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి...

43). మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది...

44). పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే ట్యాగ్ చేయించాలి...

45). O.M.R పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి...

46). ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు...

47). ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ షీట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి...

48). సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా ? లేదా ? అని పరిశీలించాలి...

49). ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది...

50). ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్, గ్రాఫ్, మ్యాప్, పార్ట్ -B లపై పూర్తి సంతకం చేయాలి.

madagoni surendar

Apr 02 2023, 19:02

నల్గొండ జిల్లా ::బాదితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్ ఫౌండేషన్ చైర్మన్, బచ్చుపల్లి గంగాధర్ రావు.

బాదితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్ఫౌం డేషన్ చైర్మన్, బచ్చుపల్లి గంగాధర్ రావు బిజీర్ .

నకిరేకల్ మండలంలోని మంగలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గాధరి సైదులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుడగ తక్షణ ఖర్చులు నిమిత్తం తమ బిజిఆర్ ఫౌండేషన్ నుండి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజీర్,అనంతరం వారు మాట్లాడుతు.. బాధితునికి మెరుగైన వైద్యంకోసం తనవంతు సహాకారం చేస్తానని బరోసానిచ్చిన బిజీర్,

(ఈకార్యక్రమంలో)

ఉపసర్పంచ్ చింతల శ్రీను,SCమండల నాయకులు బొల్లేద్దు లక్ష్మయ్య, పెద్దమాల రామాచంద్రు,మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 20:25

నల్గొండ జిల్లా :నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో పర్యటించిన నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు*

చందంపల్లి గ్రామంలో పర్యటించిన నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నల్గొండ జిల్లా.నకిరేకల్ మండలంలోని చందంపల్లిలో గ్రామంలో ట్యాంక్ మీదనుంచి కిందపడి చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాత్క నాగరాజును పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన. ఎంపీపీ 

అనంతరం గ్రామ కార్యదర్శితో సరస్వతితో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో మాటమంతి నిర్వహించి, పారిశుద్ధ్య సమస్యలు గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుని,గ్రామంలో గల అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించి బోజన సదుపాయాలను,మరియు రికార్డులను తనిఖీ చేసిన ఎంపీపీ శ్రీదేవిగంగాధర్ రావు. (ఈకార్యక్రమంలో)

సుధాకర్ రెడ్డి,చిర్రబోయిన శీను, యార క్రాంతి,గాధగోని మహేష్,ముక్కముల లింగస్వామి, ముక్కముల సురేష్ ,వరికుప్పల నాగరాజు, యార అశోకు,వేణు, వెంకన్న, రాంబాబు, బిక్షం, సురేష్, శివ, దార శ్రీను,శ్రీహరి,సతీష్,కే మహేష్, వై మహేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 19:26

గుంటూరుజిల్లా::మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా

గుంటూరుజిల్లా::

మద్యంసేవించి వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు పట్టుబడితే జైలుకు వెళ్తారని గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కరీం అన్నారు.

శనివారం గుంటూరు సిటీలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం లో లారీ డ్రైవర్లు స్కూల్ బస్సులు డ్రైవర్లు,ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా పట్ల న్యాయం విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

కార్యక్రమoలో డిటిసి కరీం, జిల్లా వ్యాప్తం గా జరిగిన రహదారి ప్రమాదాలను వివరించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

madagoni surendar

Apr 01 2023, 19:18

ఖమ్మం జిల్లా:ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు చక్రం కింద పడి వృద్ధుడి చేతికి తీవ్రగాయం...

ఖమ్మం జిల్లా:

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు చక్రం కింద పడి వృద్ధుడి చేతికి తీవ్రగాయం....

టికెట్ తెచ్చుకునేందుకు ఆగివున్న గూడ్స్ రైలు కింద దూరిన వృద్ధుడు...

ట్రైన్ కదలటంతో ట్రైన్ కింద ఉండిపోయిన వృద్ధుడు...

జనం కేకలు వేయడంతో ట్రైన్ నిలిపివేసిన లోకో పైలెట్....వృద్ధుడుకి తప్పిన ప్రాణాపాయం....

గాయపడ్డ వృద్ధుడుది ఎన్టీఆర్ జిల్లా పరిటాలకు చెందిన ఆకుల పెద్దబాబుగా గుర్తింపు....

madagoni surendar

Apr 01 2023, 18:59

ఏపీ :చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా ఆప్కో ముందడుగు*

చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా ఆప్కో ముందడుగు

ఆప్కో 38వ సర్వసభ్య సమావేశంలో సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పలు సంస్ధాగత మార్పులు : ఎంఎం నాయక్

నూలు, నేత వస్త్రాలపై జిఎస్ టి రద్దుకు నేతన్న డిమాండ్

నేతన్న నేస్తం, పింఛను కానుక పధకాలపై సిఎంను అభినందిస్తూ తీర్మానం

రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చేనేత కార్మికుల సర్వతోముఖాభివృద్దే ద్యేయంగా ఆప్కో తన పయనం సాగిస్తుందని సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహాకార సంఘం (ఆప్కో) 38వ సర్వసభ్య సమావేశం మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ లో శనివారం జరిగింది. రాష్టం నలుమూలల నుండి అయా చేనేత సహాకార సంఘల ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరుకాగా, విభిన్న అంశాలపై లోతుగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రికగా అందిస్తున్న నేతన్న నేస్తం పధకం వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలలో వెలుగును ప్రసాదించిందన్నారు. కార్మికుల డిమాండ్ మేరకు రాయితీ నూలును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండి సంఘాలకు బకాయిలు లేకుండా చూసేందుకు నూతన విధానానికి అంకురార్పణ చేయనున్నామన్నారు. పవర్ లూమ్స్ పోటీని తట్టుకునేలా ఆధునికతకు అద్దం పడుతూ నూతన డిజైన్లను వినియోగదారులకు అందించవలసి ఉందన్నారు. ఆప్కో ఆస్తులు వేటినీ విక్రయించబోమని, లీజుకు ఇచ్చిన వాటిని సైతం చట్టపరిధికి లోబడి వెనక్కు తీసుకుంటామని స్పఫ్టం చేసారు.

చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఆప్కోలో పారదర్శకత కోసం నూతన సాఫ్ట్ వేర్ లతో కంప్యూటరీకరణను వేగవంతం చేస్తున్నామన్నారు. విపణిలో ఎదురవుతున్న పోటీని తట్టుకుని వినియోగదారులకు ఏలా చేరువ కాగలమన్నదే మనకు సవాల్ గా మారిందన్నారు. స్వల్ప మార్పులతో మరింత వైవిధ్యభరితమైన డిజైన్లను రూపొందించటం ద్వారా మంచి మార్కెట్ ను పొందగలుగుతామన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు అప్పుపై వస్త్రాలు అందించే పధకాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు నెలవారీ పొదుపు పధకం ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసేలా మరో కార్యక్రమాన్ని కూడా తీసుకురావలని సమాలోచిస్తున్నామని నాయక్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించే క్లస్టర్ అభివృద్ది కార్యక్రమం మరో పది యూనిట్లకు మంజూరు అయ్యిందని, దీని ద్వారా ప్రతి చేనేత కార్మికులు గరిష్టంగా రూ.30వేలు లబ్ది పొందగలుగుతాయని వివరించారు.

సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా నూలు, చేనేత వస్త్రాలపై జిఎస్టి రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసారు. వైఎస్ ఆర్ నేతన్న నేస్తం, పింఛను కానుక పధకాలను అమలు చేస్తున్నందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సొసైటీలు ఉత్పత్తి చేసిన అన్ని రకాలను కొనుగోలు చేయాలని, అయితే మార్కెట్ డిమాండ్ల మేరకు రూపొందించిన ఉత్పత్తి ప్రణాళికను గౌరవించి తదనుగుణంగా వ్యవహరించాలని మరో తీర్మానాన్ని అంగీకరించారు. ఆప్కో స్ధిరాస్తుల విలువను మదింపు చేయటం ద్వారా సంస్ధ పరపతి స్దాయిని పెంపొందించుకోవాలని సమావేశం తీర్మానించారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా సకాలంలో అందేలా చర్యులు తీసుకోవాలన్న తీర్మానంపై సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రతిస్పందిస్తూ ప్రస్తుతం ఉన్న రూ.12,500 మొత్తాన్ని రూ.25వేలకు పెంపుచేసేలా ప్రయత్నిస్తామన్నారు. చేనేత పితామహులుగా పేరుగాంచిన దివంగత ప్రగఢ కోటయ్య, మాచాని సోమప్ప, మిడతు అప్పయ్య జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆప్కో సర్వసభ్య సమావేశం తీర్మానాలను ఆమోదించింది.

కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన చేనేత కార్మికులు కుటుంబ సభ్యులకు సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి, ఎండి ఎంఎం నాయక్ లు రూ.12,500 వంతున చెక్కులు పంపిణీ చేసారు. జ్యోతీ ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా, సమావేశంలో ఆప్కో డైరెక్టర్ అవ్వారి ఎల్లా సుబ్బారాయిడు, చేనేత జౌళిశాఖ సంయిక్త సంచాలకులు మైసూరు నాగేశ్వరరావు, కన్నబాబు, ఆప్కో జనరల్ మేనేజర్ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 01 2023, 18:01

తిరుపతి(రైల్వే): సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

తిరుపతి(రైల్వే): సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.

సికింద్రాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి సాయంత్రం 3.15 గంటలకు చేరుకుంది. ఇక్కడ పరిశీలన అనంతరం తిరిగి సికింద్రాబాద్‌కు అదే మార్గంలో బయలుదేరింది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో రైలును ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ తిరుపతికి చేరుకోనుంది. 9వ తేదీన రైలు షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి కేవలం నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 10వ తేదీన ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తుంది. ప్రయాణ సమయం 8.30 గంటలుగా నిర్ధారించారు. రైలు నంబర్లు, టికెట్‌ ధర రెండ్రోజుల్లో ద.మ.రైల్వే ప్రకటించే అవకాశం ఉంది.

madagoni surendar

Apr 01 2023, 17:03

ఏపీ:సెంట్రల్ జోన్ కబడ్డీ టోర్నమెంట్ లో అమ్రిత సాయి విద్యార్థుల ప్రతిభ

ఏపీ:సెంట్రల్ జోన్ కబడ్డీ టోర్నమెంట్ లో అమ్రిత సాయి విద్యార్థుల ప్రతిభ

కంచికచర్ల మండలం పరిటాల సమీపం లోని అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జె.యన్.టి.యు కాకినాడ నిర్వహించిన సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్ తెలియ చేసారు.

గుడ్లవల్లేరు వేదిక గా, జె.యన్.టి.యు కాకినాడ నిర్వహించిన సెంట్రల్ జోన్ కబడ్డీ పోటీలలో మొత్తం 5 జిల్లాల నుండి 60 టీమ్స్ పోటీ పడగా, అమ్రిత సాయి కబడ్డీ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయి లో సత్తా చాటటం గర్వ కారణం అని

కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ కె. రామ్మోహన రావు తెలియ చేసారు. ఈ పోటీలలో మొదటి స్థానం కైవసం చేసుకున్న అమ్రిత సాయి కళాశాల కబడ్డీ టీం మెంబెర్స్ కు, టోర్నమెంట్ నిర్వాహకులు ప్రశంస పత్రాల తో పాటు విన్నింగ్ కప్ అందజేశారు.

ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్ మాట్లాడుతూ తమ కళాశాల లో విద్యార్థులకు అకాడమిక్స్ తో పాటు క్రీడల లో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని , దీని ఫలితంగా అద్భుత విజయాలు సాధించటం తో పాటు యూనివర్సిటీ స్థాయి లో రాణిస్తున్నామని తెలిపారు.

గెలుపొందిన కబడ్డీ టీం విద్యార్థులను సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ కె. రామ్మోహన రావు , ప్రిన్సిపాల్ డా || యమ్.శశిధర్, అకాడమిక్ డైరెక్టర్ డా || పి. చిరంజీవి, ఫీజికల్ డైరెక్టర్స్ పి.శ్రీనివాస రావు, పి. శివ రామ కృష్ణ, అన్ని విభాగాల అధిపతులు అభినందించారు.