madagoni surendar

Apr 01 2023, 09:07

ఏపీ ::జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల మంత్రి*

జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల మంత్రి*

సమాజ చైతన్యమే లక్ష్యంగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ప్రారంభించడం ముదావహం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ అన్నారు. ఇందుకు ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు ను మంత్రి అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రంలో జర్నలిజంలో డిప్లోమా కోర్సు కు సంబంధించిన నోటిఫికేషన్ ను మంత్రి విడుదల చేశారు. ప్రభుత్వఆధ్వర్యంలో తొలిసారిగా "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ను ప్రెస్ అకాడమి ప్రారంభించడం జర్నలిస్టులకు, ఆ రంగంలో అభిరుచి వున్న అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశంగా మంత్రి అభివర్ణించారు. జర్నలిస్టుల కలానికున్న బలాన్ని మరింతగా మెరుగులు దిద్దుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు సంబందించిన హెల్త్ కార్డుల విషయమై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా హెల్ప్ లైన్ లో ప్రత్యేకంగా నెంబరు 4 ను పొందుపరుస్తున్నట్లు మంత్రి తెలిపి, ఆ మేరకు వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సి.ఈ.ఓ. ప్రెస్ అకాడమి చైర్మన్ కు పంపిన లేఖను కార్యక్రమం లో చదివి వినిపించారు. 8 వేల 699 మంది వర్కింగ్ జర్నలిస్టులకు, వారికి చెందిన 26 వేల 800 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉచిత వైద్య సేవలు అందుతున్నట్లు మంత్రి ఆ లేఖ లో పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టుల దృష్టికి తెచ్చారు. ఉచిత వైద్యసేవల అందుబాటులో సమస్యల పరిష్కార మార్గాలతో బాటు, జర్నలిస్టులు రచించిన పుస్తకాలు గ్రంథాలయాల ద్వారా కొనుగోలు చేసేందుకు అంగీకరింపచేసిన ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తరువులు శుక్రవారం విడుదల కానున్నట్లు మంత్రి ప్రకటించారు.

ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ అన్ని సంస్థలు, ప్రభుత్వాలు ప్రజా సంబంధాల పై దృష్టి పెట్టిన నేపాధ్యంలో జర్నలిజం లో డిప్లొమో అవసరాన్ని తాము గుర్తించి, వర్కింగ్ జర్నలిస్టులకు, అభిరుచి వున్న ఇతర అభ్యర్థులకు ప్రయోజనకరం గా ఉండేలా రూపొందించామని చెప్పారు. ఈ డిప్లొమో కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ఆయన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికారంగానికి ఆద్యులైన కందుకూరి వీరేశలింగం వంటి ప్రాంతమైన రాజమహేంద్రవరం నుండి "జర్నలిజంలో డిప్లోమా కోర్సు" ను ప్రెస్ అకాడెమీ ప్రారంభించడం సంతోష దాయకమన్నారు. శుక్రవారం (31. 03. 23) నుంచి ప్రెస్ అకాడమి వెబ్ సైట్ pressacademy.ap.gov.in నుండి ఈ కోర్సుకు సంబంధించిన దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. అడ్మిషన్ ల కోసం చివరి తేది 15. 04. 2023 గా నిర్ణయించారు. కోర్సుకు సంబంధించిన సందేహాలకు 9154104393 మొబైల్ నంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కోర్సు మెటీరియల్ రూపొందించేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఇన్ చార్జ్ (ఎల్ యస్ యస్ బి) ఎల్. వి. కె రెడ్డి, నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగపు అధిపతి డా. జి అనిత, ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ పి. బాబీ వర్ధన్ ల సారధ్యంలో కోర్సు మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిబంధనలకనుగుణంగా కోర్సు మెటీరియల్ రూపొందించామని ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సపోర్ట్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ ఎల్. వి. కె రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ ప్రదానం వంటి అంశాలు నాగార్జున యూనివర్సిటీ ద్వారా జరుగుతాయని ఆయన వివరించారు. జర్నలిస్టులకు కోర్సు ఫీజు రూ. 1500/- గాను, ఇతరులకు రూ. 2000/- గాను నిర్ణయించడం జరిగిందన్నారు. ఓపెన్ యూనివర్సిటీ ఫీజులుకంటే ఇవి తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. సమావేశం లో శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ శ్రీ ఎం. బాలగంగాధర తిలక్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ మండేల శ్రీ రామ మూర్తి, అధ్యక్షులు శ్రీ కుడుపూడి పార్ధ సారధి, ప్రెస్ అకాడమి కంటెంట్ ఎడిటర్ శ్రీ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా ప్రెస్ అకాడమీ తరపున సీనియర్ పాత్రికేయులు శ్రీ ఏ. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి, చిరుకూరి సాయి బాబా లను ప్రెస్ అకాడెమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.

madagoni surendar

Apr 01 2023, 09:00

సూర్యాపేట జిల్లా:: వర్షంలో రైతులకు సాయమందించిన పోలీసులపై ప్రశంసల వర్షం

సూర్యాపేట జిల్లా వర్షంలో రైతులకు సాయమందించిన పోలీసులపై ప్రశంసల వర్షం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం( Heavy Rain ) కురిసింది. మఠంపల్లి మండలం( Mattampally Mandal )లో కల్లాల్లో ఉంచిన మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దైంది..

అటుగా వెళ్తున్నపోలీసులు( Police ) పెద్ద మనసు చాటుకున్నారు. ఈదురుగాలుతో కూడిన వర్షానికి తడుస్తున్న మిర్చి పంటను పట్టాలతో కప్పేందుకు ఇబ్బంది పడుతున్న రైతులకు( Farmers ) పోలీసులు సహాయం అందించారు.

అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అక్కడ బందోబస్తుకు వెళ్లిన ఎస్ఐ రవికుమార్. తిరిగి వెళ్తుండగా రైతుల కష్టాలను గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా.. ఎస్ఐ రవికుమార్ తన వాహనాన్ని రోడ్డుపై ఆపి సిబ్బందితో కల్లాల్లోకి వెళ్లి పట్టాలు కప్పి, రైతులకు అండగా నిలిచారు.

madagoni surendar

Mar 31 2023, 19:28

ఏపీ ::వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో వివాహితుడు (32),ఇంటి పక్కన నివాసం ఉండే బాలిక(14) పై అగయిత్యానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వివాహితుడు ఫోక్సో కేసు నమోదు

వత్సవాయి :

వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో వివాహితుడు (32),ఇంటి పక్కన నివాసం ఉండే బాలిక(14) పై అగయిత్యానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బలవంతంగా మైనర్ బాలికను అనుభవించి గర్భం దాల్చడానికి కారకుడైన యువకుని పై వత్సవాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన షేక్ సుభాని ఆరు నెలల క్రితం ఆమెను బలవంతంగా అనుభవించాడని,ఈ విషయం ఎవరికైనా చెప్పినట్లయితే చంపుతానని బాలికను బెదిరించనట్లుగా,ఆ బాలిక భయపడి ఎవరికి ఏమి చెప్పకుండా ఉన్నదని,కాలక్రమేనా ఆ బాలికలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అయిందని,మైనర్ బాలిక తల్లి తన కుమార్తెను అడుగగా గ్రామానికి చెందిన షేక్ సుభాని బలవంతంగా తన పై అఘాయిత్యం చేశాడని తల్లికి వెల్లడించడంతో బాధితురాలి తల్లి ఏ వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై కేసు నమోదు చేసి,బాలికను వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్ఐ అభిమన్యు తెలిపారు.

madagoni surendar

Mar 31 2023, 17:31

నెల్లూరు జిల్లా, తేది: *అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.

నెల్లూరు జిల్లా, తేది:

అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- జిల్లా యస్.పి. విజయ రావు,ఐ పి ఎస్.

విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు

అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి.

ద్విద్రవాహనాల సైలెన్సర్ లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.

యస్.పి. ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) అధ్వర్యంలో

ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో 420 వాహనాల సైలెన్సర్ లను ద్వంసం.

డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచనలు.

ఈ రోజు ఉదయం మాగుంట లేవుట్ లోని అవుట్ పోస్టు సమీపంలో జిల్లా యస్.పి.విజయ రావు, IPS., ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) శ్రీ ప్రసాద్ అధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో తీసివేసిన 420 సైలెన్సర్ లను తొక్కించడం జరిగింది. SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., ఆదేశాల మేరకు

నెల్లూరు టౌన్ లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి గత రెండు నెలలలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లు గల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 420 సైలెన్సర్ లను తీసివేయడంజరిగింది.

ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

రణగొణ ధ్వనులు చేసే సైలన్సర్లను ఆయా వాహనదారులచే ఊడదీయించి తిరిగి బండికి వచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే బిగించేలా చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు.

వాహనదారులు ఈ విషయంలో ఒరిజినల్ సైలన్సర్లనే ఉపయోగించాలన్నారు.

సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

పోలీసులు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 420 వాహనాల సైలెన్సర్ లను తీసి వేసి, వాటిని ద్వంసం చేసారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం. SPS నెల్లూరు జిల్లా.

madagoni surendar

Mar 31 2023, 15:47

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ.

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు జిల్లా మీదుగా పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనిని మొదట కాజీపేట మార్గంలో నడపాలని రూట్ మ్యాప్ రూపొందించినా.. ఎక్కువ దూర భారం అవుతుందని భావించి ప్రయాణ సమయం తగ్గించటానికి బీబీనగర్ నుంచి నడికుడ మార్గం సరైందని గుర్తించారు. ఈ మార్గంలో 130 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ వందే భారత్ రైలుని మోడీ చేతుల మీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వెళ్లే నారాయణాద్రి 12:30 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్ రైలు 9 గంటల కన్నా తక్కువ సమయంలో వెళ్లనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వందే భారత్ రైలును ఆరు స్టేషన్లలోనే ఆపనున్నారు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్.. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో నిలపనున్నారు.

madagoni surendar

Mar 31 2023, 12:25

మధ్యప్రదేశ్ ::ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య.. 34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

పండగపూట ఊహించని విషాదం.. శ్రీరామనవమి వేడుకల్లో ఘోరం ప్రమాదం .. ఇండోర్‌లో కుప్పకూలిన మెట్ల బావి.. అవును, ఇది పెనువిషాదం, అంతులేని దుఖం ఇది. పండగ సంబరం అనేక కుటుంబాల్లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను తీసేసింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 34మంది  ప్రాణాలు కోల్పోయారు.  పలువురు  ఆచూకీ గల్లంతైంది.

సీతారాముల హోమం చేస్తుండగా మెట్ల భావి కుప్పకూలింది. ఊహించనివిధంగా జరిగిన ఈ ప్రమాదంలో 50 అడుగుల లోతున్న బావిలో పడిపోయారు భక్తులు. దీంతో రామనవమి వేడుకల్లో బాధాకరమైన అరుపులతో నిండిపోయాయి.

కొందరు తాడుతో, మరికొందరు పొడవాటి వెదురు నిచ్చెనతో రక్షించేందుకు పరుగులు తీశారు. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

34మంది మృతి, పలువురికి గాయాలు:

బావిలో చిక్కుకున్నవారిలో కొందర్నీ సేఫ్‌గా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. మృతుల్లో 11మంది మహిళలు ఉండటం అక్కడున్న అందర్నీ కలిచివేసింది. బేలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. పురాతన మెట్ల బావిపై 10 ఏళ్లక్రితం స్లాబ్‌వేసి ఓ గదిని నిర్మించారు. హోమం జరుగుతుండగా ఎక్కుమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును ఆపలేక కుంగిపోయింది. మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతైనట్లు కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా టి తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. గాయపడినవారికి 50వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. ఇక, ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శ్రీరామనవమిరోజు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో తనను కలిచివేసిందన్నారు పీఎం మోడీ..

madagoni surendar

Mar 31 2023, 12:15

తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఇంద్రభవనంలా తెలంగాణ నూతన సచివాలయం

మరో నెలరోజుల్లో అందుబాటులోకి

హైదరాబాద్ : రాష్ట్ర నూతన పాలనా సౌధం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో కొత్త సచివాలయం అందుబాటులోకి రానుంది. పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా ఫర్నీచర్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫర్నీచర్ ఏ మాత్రం ఉపయోగించకుండా పూర్తిగా కొత్త వాటినే అమరుస్తున్నారు. ప్రారంభోత్సవమైన ఒకటి, రెండు రోజుల్లోనే కొత్త సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభానికి వారం రోజుల ముందు శాఖల వారీగా కేటాయింపులు చేయనున్నారు.

తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వచ్చే నెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలా ఎనిమిది నిమిషాలకు మేష లగ్నాన కొత్త సచివాలయంలో వైదికంగా పూజలు ప్రారంభమవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాల నుంచి ఒంటి గంటా 33 నిమిషాల మధ్య సింహలగ్న శుభ మూహుర్తాన ముఖ్యమంత్రి కేసీఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. ఆ తర్వాత మంత్రులందరూ వారి సీట్లలో కూర్చొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల నుంచి మూడు గంటలా 20 నిమిషాల వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

కొత్త సచివాలయంలో కొత్త ఫర్నిచర్​

ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న వేళ సచివాలయానికి సంబంధించి మిగిలిన పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సంబంధించిన అన్ని పనులు చాలా రోజుల క్రితమే పూర్తయ్యాయి. మిగిలిన అంతస్తుల్లో ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సచివాలయం కోసం ఫర్నీచర్ అంతా కొత్తగానే కొనుగోలు చేశారు. ఎక్కడ కూడా పాత ఫర్నీచర్ ఉపయోగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా ఏకరూపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇష్టారీతిన కాకుండా అందరికీ ఒకే తరహా ఫర్నీచర్ అమరుస్తున్నారు.

సచివాలయంలో ఉద్యోగుల కేటాయింపు ఏప్రల్​ 25కి పూర్తవుతుంది

ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏ పనీ మిగలకుండా అన్ని రకాల పనులు పూర్తవుతాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయా శాఖలకు కేటాయింపులు చేయనున్నారు. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ, కేబినెట్ సమావేశ మందిరం, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉండనున్నాయి. మిగిలిన అన్ని శాఖలకు ఇతర అంతస్తులను కేటాయించనున్నారు. ఒక్కో మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి, మంత్రి పేషీ, సంబంధిత శాఖ కార్యదర్శి, ఉద్యోగులు విభాగాలు ఒకే చోట ఉండేలా కేటాయింపులు జరగనున్నాయి. పాత సచివాలయంలో కొన్ని శాఖలు మినహాయిస్తే మెజార్టీ శాఖలకు సంబంధించి మంత్రి పేషీ ఒక అంతస్తులో కార్యదర్శి, ఉద్యోగులు మరో అంతస్తుల్లో ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తు, ఇతరత్రా కారణాల రీత్యా ఎలాంటి మార్పులకు అస్కారం లేకుండా చూస్తున్నారు. కేటాయింపుల ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాలు అక్కడి నుంచే

ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు కొత్త సచివాలయం నుంచి జరిగేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ నుంచి కేవలం కంప్యూటర్లు, సంబంధిత సామాగ్రి, దస్త్రాలను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని ప్రారంభోత్సవం తర్వాత వీలైనంత త్వరగా వాటిని కొత్త సచివాలయానికి తరలించి పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.

madagoni surendar

Mar 31 2023, 09:44

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news.నల్గొండ జిల్లా ::

కట్టంగూర్ టౌన్ శ్రీరామ్ నగర్ కాలనికి చెందిన అయితగోని సైదులు తల్లి అయితగోని లక్షవమ్మ అనారోగ్యం తో మృతి చెందాగా వారి భౌతికకాయాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించి.10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఆయన వెంట జెడ్పీటీసీ తరాల బలరామ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, ఉప సర్పంచ్ అంతటీ శీనువాస్, వార్డు మెంబర్ రెడ్డి పల్లి మనోహర్,పోటిచెటి సైదులు, అంతటి నాగేష్ నాగమణి,PACS డైరెక్టర్ నిమ్మల సత్యనారాయణ,మండల నాయకులు బోల్లేద్దు యాదయ్య, శ్రీ పాద రామకృష్ణ, నోముల వెంకటేశ్వర్లు, రాచకొండ యాదయ్య,కానుగు లింగయ్య, మేకల నాగరాజు,జిల్లా యాదయ్య,బోల్లేద్దు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.....

madagoni surendar

Mar 31 2023, 09:35

హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు.

రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్రి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి శుక్రవారం ఉదయం కొత్తగూడెం చేరుకుంటారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్ హౌజ్​లో బస చేస్తారు. రాములోరి పట్టాభిషేకంలో పాల్గొన్న తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు.

madagoni surendar

Mar 30 2023, 19:34

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

తెనాలి టూ టౌన్ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఐతానగర్ ప్యాడిసన్ పేట కమ్యునిటీ హాలు వద్ద ఐలా శ్రీనివాస్, మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు..

కమ్యునిటీ హాలు వద్ద కూర్చుని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు. నర్సీపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్ధానికంగా విక్రయిస్తున్న ముఠాను తెనాలి టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డిఎస్పీ కె స్రవంతి రాయ్ తెలియజేశారు..

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…ఐతానగర్‌కు చెందిన ఐలా శ్రీనివాస్‌ గతంలో గంజాయి, దొంగతనం, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నర్సీపట్నం నుండి విష్ణు అనే వ్యక్తి ద్వారా గంజాయి దిగుమతి చేసుకుని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఐతానగర్‌లోని ప్యాడిసన్ పేటలో గల కమ్యూనిటీ హాలు వద్ద మరో ఐదుగురితో కలిసి గంజాయిని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు చేస్తుండగా టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ బి శివరామయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్దలానికి వెళ్లి ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌తో పాటు నందులపేటకు చెందిన దేవరకొండ మను శివ శంకర్‌, ఐతానగర్‌కు చెందిన తాడికొండ చంద్రశేఖర్‌, తాతపూడి సునీల్‌, పల్లె సంజయ్‌, వల్లభాపురపు సునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 15 కేజీల జంగాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు.