madagoni surendar

Mar 26 2023, 11:53

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన

ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన

Streetbuzz news.నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో పలు వార్డులలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఆదివారం ఉదయం కాలినడకన పర్యటించారు.ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తనని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని, అభివృద్ధి లో నకిరేకల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు

madagoni surendar

Mar 25 2023, 18:05

భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం

భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం

 గ్రహ శకలాలు, తోక చుక్కలు అత్యంత అరుదుగా భూమి సమీపంలోకి వస్తుంటాయి. దశాబ్ధాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఖగోళ అద్భుతాలు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు గ్రహశకలాలు భూమికి ప్రమాదాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది. డైనోసార్ల వంటి భారీ జంతువులు భూమిపై తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడమే అని అందరికి తెలిసిన విషయం.

ఇదిలా ఉంటే 2023 డీజెడ్2 అనే గ్రహశకలం భూమి, చంద్రుడికి కక్ష్యల మధ్య నుంచి ప్రయాణించబోతోంది. ఈ ఖగోళ అద్భుతం శనివారం చోటు చేసుకోబోతోంది. ఈ గ్రహ శకలాన్ని ఒక నెల క్రితం కనుగొన్నారు. ఒక నగరాన్ని తుడిచిపెట్టగలిగేంత పరిమాణంలో ఉన్న దీని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. శనివారం భూమికి 1,68,000 కిలోమీటర్ల దూరం నుంచి గ్రహశకలం వెళ్తోంది. ఇది భూమి చంద్రుల మధ్య దూరం కన్నా సగం దూరమే. దీంతో ప్రపంచ శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యంత దగ్గరగా రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి గ్రహశకలాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. దీన్ని బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోపుల సాయంతో చూడవచ్చు.

సాధారణంగా ఆస్టారయిడ్ ఫ్లైబైస్ సాధారణంగా జరుగుతుంటాయి. అయితే పెద్ద గ్రహశకలాలు రావడం చాలా అరుదు. ఇలాంటివి దశాబ్ధానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. శాస్త్రవేత్తలు దీని పరిమాణాన్ని 40-90 మీటర్ల మధ్య ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న గుర్తించారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. దీన్ని గుర్తించే సమయానికి ఇది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహశకలం సూర్యడి చుట్టూ ఓ భ్రమణం చేయడానికి 3.16 ఏళ్లు తీసుకుంటుంది. ఇది 2026లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆ తరువాత 2029లో భూమికి మరింత దగ్గర వచ్చే అవకాశం ఉందని, భూమిని ఢీకోట్టే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

madagoni surendar

Mar 25 2023, 16:12

సింహాచలం :ప్రసాద్. పథకం పనులు వేగవంతం చేయించండి.రెండో విడత నిధులకు. ప్రతిపాదనలు పంపాలని వినతి

ప్రసాద్ పథకం పనులు వేగవంతం చేయించండి.

రెండో విడత నిధులకు. ప్రతిపాదనలు పంపాలని వినతి

ఎంవీపీ కాలనీ, మార్చ్ 25

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తుందని,అందులో భాగంగానే తొలి విడతగా సింహాచలం దేవస్థానానికి మంజూరు చేసిన 54 కోట్ల పనులను వేగవంతం చేసే విధంగా తమ వంతు సహకారం అందించాలని విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ను సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు కోరారు. శనివారం ఉదయం ఎంపీ ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శ్రీను బాబు .l ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపిక బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి తొలి విడతగా 54 కోట్లు నిధులు మంజూరు చేశారని, అయితే అభివృద్ధిపనులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు అని ఎంపి కి వివరించారు..పర్యాటక శాఖ ద్వారా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందించే విధముగా కృషి చేయాలని అధికారులను శీను బాబు ఎంపీ ని కోరారు.. అలాగే రెండో విడత నిధులు మంజూరు కు కూడా కృషి చేయాలని శ్రీనుబాబు వివరించారు. ఇందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తానన్నారని శ్రీను బాబు చెప్పారు.

madagoni surendar

Mar 25 2023, 16:04

ఘంటాడి కృష్ణ 'రిస్క్'.. బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం పక్కా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.

ఘంటాడి కృష్ణ 'రిస్క్'.. బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం పక్కా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి  

తెలుగులో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి కొత్త వారితో తీస్తున్న పాన్ ఇండియా సినిమా 'రిస్క్'. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణ కృష్ణమోహన్, ప్రముఖ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు, ప్రముఖ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, హీరో ఆదిత్య హాజరయ్యారు.

madagoni surendar

Mar 25 2023, 14:34

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసు : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసు : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు..

రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్‌.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది..

madagoni surendar

Mar 24 2023, 22:48

విజయవాడ: రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. ఎపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు,

విజయవాడ

రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఎపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు

సుంకర పద్మశ్రీ .. ఎపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 

దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది

మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు

వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు

పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉంది

అందుకే సూరత్ కోర్టీ తీర్పు ఆధారాంగా పార్లమెంట్ లో అనుర్హుడిగా ప్రకటించారు

రెండేళ్లు జైలు శిక్ష పడిందనే సాకుతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయిస్తారా

వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని మాత్రం మోడీ కాపాడతారా 

ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారు

రాజ్యాంగ బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారు

మోడీ, అమిత్ షాలు విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు

కాంగ్రెస్ శ్రేణులంతా మా నాయకుడికి అండగా ఉంటాం

రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు.

..

కార్యాలయ కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

madagoni surendar

Mar 24 2023, 22:40

న్యూఢిల్లీ. కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక భేటీ..

న్యూఢిల్లీ.

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక భేటీ..

రాహుల్‌ గాంధీని (రాహుల్ గాంధీ ) ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని రచించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, జనరల్‌ సెక్రటరీలు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, రాజీవ్‌ శుక్లా, తారీఖ్‌ అన్వర్‌లతోపాటు సీనియర్‌ నేతలు పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌, సల్మాన్‌ ఖుర్షిద్‌, పవన్‌ కుమార్‌ బన్సాల్‌, మరికొందరు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. అయితే, ఈ భేటీకి రాహుల్‌ గాంధీ రాలేదని సమాచారం.

మరోవైపు మోదీ ఇంటిపేరును కించపరిచేలా 2019లో కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్‌ (రాహుల్గాం ధీ ) చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్‌ తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

madagoni surendar

Mar 24 2023, 19:34

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కేతపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన పల్స వెంకన్న ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి ద్వారా మంజూరైన. 2,50,000/- రూపాయల ఎల్ఓసి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేసారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 24 2023, 18:53

దాతల సహకారం తో పౌష్టికాహార వితరణ

దాతల సహకారం తో పౌష్టికాహార వితరణ

దాతల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు మాసాల పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్ నాగరాణి శుక్రవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమంలో ఆమె తెలిపారు .ఈ సందర్భంగా హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలను విశదీకరించారు .రెండు వారాలకు మించి దగ్గు, జ్వరము తగ్గకుంటే , బరువుని కోల్పోతున్నట్లయితే డాక్టర్స్ ని సంప్రదించాలని ఆయన సూచించారు . ప్రతి నెల ఐదుగురు క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కర్లపాటి మాట్లాడుతూ తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలతో పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు కూడా సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. 

కాగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ పవన్ ,డాక్టర్ రాజ్ కుమార్ ,డాక్టర్ శాలిని, పి పి ఈ యూనిట్ డాక్టర్ నాగరాణి ,

టీబి సూపర్వైజర్ నాగరాజు పెద్ద ఎత్తున ఆశలు ఏఎన్ఎం పాల్గొన్నారు

madagoni surendar

Mar 24 2023, 18:48

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (రాహుల్ గాంధీ ) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (ఎంపీ )పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (ఎంపీ /MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(మహమ్మద్ ఫైజల్ )ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (ఎంపీ ) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (లాలు ప్రసాద్ యాదవ్ ) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (అజాం ఖాన్ ).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (జయలలిత ) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..