Mar 02 2023, 18:08
కార్యకర్తలకు అండగా ఉంటాం.టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య.
కార్యకర్తలకు అండగా ఉంటాం.
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,
పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ
కేతేపల్లి: పేదలకు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ ఇచ్చారు. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చిత్తలూరి బక్కా లక్ష్మమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తో కలిసి గుడివాడ గ్రామంలో లక్ష్మమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.లక్ష్మమ్మ మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.వారి వెంట.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,గుడివాడ ఎంపీటీసీ గాజుల ప్రభాకర్,మాజీ సర్పంచులు చిత్తలూరు వెంకటయ్య, ఎస్కే లతీఫ్,గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, చిత్తలూరు రవి,టేకుల సుధాకర్,వెంకన్న, ఖమ్మం పాటీ సతీష్,ఆలకుంట్ల సత్యనారాయణ,ఎస్కే దస్తగిరి, కదిరే శ్రవణ్,గుండగాని వెంకన్న,కాంగ్రెస్ పార్టీ గుడివాడ గ్రామ నాయకులు, తదితరులు ఉన్నారు.
Mar 15 2023, 19:29