madagoni surendar

Mar 05 2023, 14:33

టోల్ ప్లాజా నిబంధనల మార్పు.హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!..

టోల్ ప్లాజా నిబంధనల మార్పు

హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!..

టోల్ ప్లాజా నియమాలు: వాహనం మరియు టోల్ మధ్య సంబంధం ఆహారం మరియు కూరగాయల వంటిది రెండూ కలిసి ఉంటాయి. ఈరోజుల్లో లాంగ్ డ్రైవ్ కు వెళితే ఎక్కడో ఒకచోట టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. హైవేపై డ్రైవింగ్ చేసే వారికి ఈరోజు మనం పెద్ద వార్తను అందిస్తున్నాము.

మీరు కూడా హైవేపై ప్రయాణించి టోల్ టాక్స్ గురించి ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు మీ ఆందోళనలు తగ్గుతాయి. కోట్లాది మంది వాహన యజమానులను ప్రభావితం చేసే టోల్ ట్యాక్స్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. 2024 సంవత్సరానికి ముందు భారతదేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని, అదే సమయంలో టోల్ ట్యాక్స్‌కు కొత్త నిబంధనలు జారీ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు..

టెక్నాలజీలో కూడా మార్పు వస్తుంది, గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన తర్వాత, రోడ్ల పరంగా భారతదేశం అమెరికాతో సమానంగా ఉంటుంది. దీనితో పాటు, టోల్ టాక్స్ వసూలు చేయడానికి నియమాలు మరియు సాంకేతికతలో పెద్ద మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు..

 టోల్ టాక్స్ రికవరీ కోసం ప్రభుత్వం 2 పద్ధతులను చేయవచ్చు..

రాబోయే రోజుల్లో టోల్ రికవరీ కోసం ప్రభుత్వం 2 ఎంపికలను ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో కార్లలో ‘GPS’ వ్యవస్థలను అమర్చడం మొదటి ఎంపిక. కాగా, రెండో పద్ధతి తాజా నంబర్ ప్లేట్‌కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది..

 ప్రస్తుతం శిక్ష విధించే నిబంధన లేదు..

టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదు. రాబోయే రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై కూడా దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు..

 డబ్బు నేరుగా ఖాతా నుంచి తీసివేయబడుతుంది..

ఇప్పటి వరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, అయితే టోల్‌కు సంబంధించి బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి తీసివేయబడుతుందని నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీంతోపాటు కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘2019లో కంపెనీ అమర్చిన నంబర్‌ ప్లేట్లతో కార్లు వస్తాయని నిబంధన పెట్టాం. అందుకే గత నాలుగేళ్లలో వచ్చిన వాహనాలకు వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నాయి..

madagoni surendar

Mar 05 2023, 10:39

ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.

ఆయుష్మాన్ భారత్ కార్డుతో మాత్రమే ఉచిత వైద్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆర్హు లే. మార్చి 31వరకు కొనసాగానున్న నమోదు ప్రక్రియ.బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు.పసుల సైదులు

Streetbuzz news :నల్గొండ జిల్లా

ఆరోగ్య శ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దారిద్రపు రేఖకు దిగువున్న కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది ఇందుకోసo లబ్దిదారుల జాబితాన్ని రూపొందించి కేవైసి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈయొక్క నమోదు పక్రియ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల. సైదులు ఒక ప్రకటన లో కట్టంగూర్ ప్రజలను ప్రతి 5 లక్షల బీమా వర్తిస్తుంది అని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పేద ప్రజలకోసం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెచ్చినందుకు ధన్యవాదములు తెలిపారు.

madagoni surendar

Mar 02 2023, 21:02

కట్టంగూర్ మెయిన్ సెంటర్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం.

కట్టంగూర్ మెయిన్ సెంటర్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం.

కట్టంగూర్ మండల కేంద్రంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి భారీగా పెంచి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపిన కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని నిలదిస్తూ కట్టంగూరు మెయిన్ సెంటర్లో బిఆర్ఎస్ కట్టంగూర్ మండల పార్టీ తరఫున సిలిండర్లతో వంటవారుకు నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దానం చేసి ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.జడ్పీటీసీ తరాల బలరాం, మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోగుల నరసింహ,వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి,పిఏసీఎస్. చైర్మన్ సైదులు యాదవ్,ఎంపిటిసిల పోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ బాబు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుర్రం సైదులు,ఎంపిటిసిలు,వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు,వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు,పిఎసిఎస్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు,మండల మహిళా నాయకులు,వార్డ్ మెంబర్స్,మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 02 2023, 18:08

కార్యకర్తలకు అండగా ఉంటాం.టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య.

కార్యకర్తలకు అండగా ఉంటాం. 

టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్,

పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యం.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ

కేతేపల్లి: పేదలకు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య హామీ ఇచ్చారు. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చిత్తలూరి బక్కా లక్ష్మమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తో కలిసి గుడివాడ గ్రామంలో లక్ష్మమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.లక్ష్మమ్మ మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.‌ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.వారి వెంట.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,గుడివాడ ఎంపీటీసీ గాజుల ప్రభాకర్,మాజీ సర్పంచులు చిత్తలూరు వెంకటయ్య, ఎస్కే లతీఫ్,‌గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, చిత్తలూరు రవి,టేకుల సుధాకర్,వెంకన్న, ఖమ్మం పాటీ సతీష్,ఆలకుంట్ల సత్యనారాయణ,ఎస్కే దస్తగిరి, కదిరే శ్రవణ్,గుండగాని వెంకన్న,కాంగ్రెస్ పార్టీ గుడివాడ గ్రామ నాయకులు, తదితరులు ఉన్నారు.

madagoni surendar

Mar 02 2023, 12:43

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా చిట్యాల మండలం గుండ్రాపల్లి గ్రామంలో  రూ. 50 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తున్నదన్నారు గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డ్, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు పలు సంక్షేమ పధకాల అమలుతో పేదలకు లబ్ది చేకూరిందన్నారు.

madagoni surendar

Mar 02 2023, 10:49

ఏపీలో కొత్త మండలాలు: నోటిఫికేషన్ జారీ- లిస్ట్ ఇదే

ఏపీలో కొత్త మండలాలు: నోటిఫికేషన్ జారీ- లిస్ట్ ఇదే

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణ 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈలోగా స్థానికులు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అవి మనుగడలోకి వస్తాయి. ఇదివరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రక్రియకు కొనసాగింపుగా ప్రభుత్వం దీన్ని చేపట్టింది.

రాష్ట్రంలో ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజించింది ప్రభుత్వం. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

మచిలీపట్నాన్ని సౌత్ మండలం, నార్త్ మండలంగా విభజించింది. రెవెన్యూ, ఇతర పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో మార్పులు చేయలేదు. వాటి పరిధిని పెంచలేదు. రెవెన్యూపరంగా మరింత సుపరిపాలనను అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది.

మచిలీపట్నం విషయంలో మాత్రం కొత్త గ్రామాలను కలుపుకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొంది. వాటిని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది. 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తించింది. ఈ తాజా ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని 30 రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.

madagoni surendar

Mar 01 2023, 18:25

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

Streetbuzz news :

ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తన కూతలతో స్టేషన్ లో హోరెత్తిస్తోంది ఆ కోడి.

.

madagoni surendar

Mar 01 2023, 17:47

ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్.

ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్

కేతేపల్లి: కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి చేశారని టీపీసీసీ‌ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. కేతేపల్లి మండలం కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిలదీస్తున్న రేవంత్ రెడ్డిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. హాత్ హే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి వెంట సింగరేణి ప్రజలు, యువకులు ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ఆయనకు ప్రజల్లో అత్యంత ఆధరణ‌ లభిస్తోందని, దీన్ని చూసి ఓర్వలేకనే భూపాలపల్లి ఎమ్మెల్యే దాడి చేయించారని ఆరోపించాని, ఇది మంచి పద్ధతి కాదని, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్ రెడ్డి, జడ్పిటిసి మాజీ సభ్యుడు జటంగి వెంకట నర్సయ్య, నకిరేకల్ మండలం మాజీ అధ్యక్షులు కోట పుల్లయ్య, కోట శ్రీను, రాచకొండ లింగయ్య, రాష్ట్ర నాయకుడు కోట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 01 2023, 10:01

సామాన్యులకు షాక్‌ ఇచ్చిన కేంద్రం. వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు

సామాన్యులకు షాక్‌ ఇచ్చిన కేంద్రం.

వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు

Streetbuzz news :నల్గొండ జిల్లా

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గృహ వినియోగ గ్యాస్‌తో పాటు కమర్షియల్‌ గ్యాస్‌ ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయి. గృహ వినియోగ వంట గ్యాస్‌పై రూ.50 పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర దేశ రాజధానిలో రూ.1,103కు చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,119కి పెరిగింది. హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.1175కి చేరింది. డొమెస్టిక్‌ గ్యాస్‌ లిండర్‌ ధర దాదాపు ఎనిమిది నెలల తర్వాత రూ.50 పెరిగింది. గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు విలవిలలాడుతుండగా.. తాజాగా పెరిగిన ధరలతో మరింత భారంపడనున్నది._*

madagoni surendar

Feb 28 2023, 17:51

వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ఘన నివాళి.

వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ఘన నివాళి

Streetbuzz news :నల్గొండ జిల్లా :

వైద్య విద్యార్థి ప్రీతి మృతికి కారణమైన సైఫ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని బిఎస్పి జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ పీజీ వైద్యవిద్యార్థిని ధారవత్ ప్రీతి (26) మృతి చెందడం పట్ల చిట్యాల మండల కేంద్రంలో బిఎస్పి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విద్యార్థులు, యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలిలో ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్, వేధింపులకు బలైన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ లేకుండా పోతున్నదని, పీజీ విద్యార్థిని ప్రీతి ఎన్నో కలలుకని మంచి భవిష్యత్తు ఊహించుకుంటున్న తరుణంలో దుర్మార్గుల వల్ల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతిన్నదని, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారిని క్షమించకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతో ర్యాగింగ్, ఆత్మహత్యాయత్నం అనే మాటలతో ఈవిషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు.ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, అలాగే ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, మండల మేడి రాజు,బి వి ఎఫ్ మండల కన్వీనర్ ఏర్పుల నితిన్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.