madagoni surendar

Mar 02 2023, 10:49

ఏపీలో కొత్త మండలాలు: నోటిఫికేషన్ జారీ- లిస్ట్ ఇదే

ఏపీలో కొత్త మండలాలు: నోటిఫికేషన్ జారీ- లిస్ట్ ఇదే

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణ 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఈలోగా స్థానికులు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అవి మనుగడలోకి వస్తాయి. ఇదివరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రక్రియకు కొనసాగింపుగా ప్రభుత్వం దీన్ని చేపట్టింది.

రాష్ట్రంలో ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజించింది ప్రభుత్వం. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

మచిలీపట్నాన్ని సౌత్ మండలం, నార్త్ మండలంగా విభజించింది. రెవెన్యూ, ఇతర పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్, రూరల్ మండలాలుగా విభజించింది. ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో మార్పులు చేయలేదు. వాటి పరిధిని పెంచలేదు. రెవెన్యూపరంగా మరింత సుపరిపాలనను అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది.

మచిలీపట్నం విషయంలో మాత్రం కొత్త గ్రామాలను కలుపుకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొంది. వాటిని సౌత్, నార్త్ మండలాలుగా విభజించింది. 1 నుంచి 19 వరకు వార్డులను కలుపుకొని సౌత్ మండలంగా, శివార్లలోని గ్రామాలను విలీనం చేస్తూ నార్త్ మండలంగా గుర్తించింది. ఈ తాజా ప్రక్రియపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని 30 రోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.

madagoni surendar

Mar 01 2023, 18:25

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

Streetbuzz news :

ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తన కూతలతో స్టేషన్ లో హోరెత్తిస్తోంది ఆ కోడి.

.

madagoni surendar

Mar 01 2023, 17:47

ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్.

ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్

కేతేపల్లి: కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డిపై దాడి చేశారని టీపీసీసీ‌ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. కేతేపల్లి మండలం కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిలదీస్తున్న రేవంత్ రెడ్డిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. హాత్ హే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి వెంట సింగరేణి ప్రజలు, యువకులు ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ఆయనకు ప్రజల్లో అత్యంత ఆధరణ‌ లభిస్తోందని, దీన్ని చూసి ఓర్వలేకనే భూపాలపల్లి ఎమ్మెల్యే దాడి చేయించారని ఆరోపించాని, ఇది మంచి పద్ధతి కాదని, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్ రెడ్డి, జడ్పిటిసి మాజీ సభ్యుడు జటంగి వెంకట నర్సయ్య, నకిరేకల్ మండలం మాజీ అధ్యక్షులు కోట పుల్లయ్య, కోట శ్రీను, రాచకొండ లింగయ్య, రాష్ట్ర నాయకుడు కోట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 01 2023, 10:01

సామాన్యులకు షాక్‌ ఇచ్చిన కేంద్రం. వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు

సామాన్యులకు షాక్‌ ఇచ్చిన కేంద్రం.

వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు

Streetbuzz news :నల్గొండ జిల్లా

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గృహ వినియోగ గ్యాస్‌తో పాటు కమర్షియల్‌ గ్యాస్‌ ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయి. గృహ వినియోగ వంట గ్యాస్‌పై రూ.50 పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర దేశ రాజధానిలో రూ.1,103కు చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,119కి పెరిగింది. హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.1175కి చేరింది. డొమెస్టిక్‌ గ్యాస్‌ లిండర్‌ ధర దాదాపు ఎనిమిది నెలల తర్వాత రూ.50 పెరిగింది. గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు విలవిలలాడుతుండగా.. తాజాగా పెరిగిన ధరలతో మరింత భారంపడనున్నది._*

madagoni surendar

Feb 28 2023, 17:51

వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ఘన నివాళి.

వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి ఘన నివాళి

Streetbuzz news :నల్గొండ జిల్లా :

వైద్య విద్యార్థి ప్రీతి మృతికి కారణమైన సైఫ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని బిఎస్పి జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ పీజీ వైద్యవిద్యార్థిని ధారవత్ ప్రీతి (26) మృతి చెందడం పట్ల చిట్యాల మండల కేంద్రంలో బిఎస్పి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విద్యార్థులు, యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలిలో ప్రీతి చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్, వేధింపులకు బలైన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ లేకుండా పోతున్నదని, పీజీ విద్యార్థిని ప్రీతి ఎన్నో కలలుకని మంచి భవిష్యత్తు ఊహించుకుంటున్న తరుణంలో దుర్మార్గుల వల్ల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతిన్నదని, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారిని క్షమించకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతో ర్యాగింగ్, ఆత్మహత్యాయత్నం అనే మాటలతో ఈవిషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు.ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, అలాగే ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, మండల మేడి రాజు,బి వి ఎఫ్ మండల కన్వీనర్ ఏర్పుల నితిన్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 28 2023, 10:17

రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి

రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి

 రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత చిరుమర్తి లింగయ్య కు లేదని నకిరేకల్ నియోజకవర్గంలో దళితులకు ఏమి చేయలేదని దళితులపై దాడి జరిగిన స్పందించలేదని బిఎస్పి జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వారు మీడియతో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగం తెచ్చుకొని ఈ రోజు ఆలా బాబా సాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ల ద్వారా కష్ట పడి చదువుకున్న ఉద్యోగస్తులు అందరిని కష్టాన్ని మీరు విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుందని అన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వినియోగించుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడడం జరిగిందన్నారు.అది మాత్రమే కాకుండా వెనకున్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.నిజంగా స్వలాభం కోసం వేల కోట్లు సంపాదించి ఉంటే నీ లెక్కనే వేరే పార్టీలోకి చేరి పదవి తెచ్చుకొని తన ఆస్తులు కాపాడుకునే పనిలో ఉండేవాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాన్యవర్ కాన్షీరామ్ స్ఫూర్తితో బహుజనులకు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశం కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అని విశ్వసించి బిఎస్పి పార్టీలోకి చేరారు అన్నారు. నువ్వు రిజర్వేషన్లను వినియోగించుకొని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయి అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన నువ్వు ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చావ్, ఇక్కడున్నటువంటి దళితుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ పథకాలు తీసుకొచ్చావో చెప్పాలి.

ప్రవీణ్ కుమార్ సార్ మీద చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలని ఖండిస్తూ గురుకులాల సెక్రటరీగా చేసిన కృషికి, శ్రమకు ప్రపంచంలోనే నం.1 అయిన హర్వర్డ్ యూనివర్సిటీ గురుకులాలని కేస్ స్టడీగా తీసుకోవడం జరిగిందన్నారు.అత్యున్నత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి ఒక సాధారణ తండా నుంచి పుట్టిన బిడ్డ మనవత్ పూర్ణ ను అడిగితే తెలుస్తుంది. సార్ ఇచ్చిన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదని.. యువతని పక్కదోవ పట్టిస్తున్నారని చేస్తున్నటువంటి ఆరోపణలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యువతని చైతన్యవంతులు చేస్తూ బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఓటు చైతన్యాన్ని తీసుకువస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర ఆధిపత్య వర్గాల పార్టీల లెక్క బహుజనులు కేవలం అనుచరులుగా మాత్రమే కాదు మనం లీడర్లుగా తయారు చేసే విధంగా ముందుకు వెళ్తుంది. నిజంగా యువతని పెడదారి పట్టిస్తున్నది యువత శక్తి మొత్తం నిర్వీర్యం చేస్తున్నది నువ్వు, నీ వెనుక ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ. యువతని ముందుకి, బిర్యానిలకి, డబ్బుకి బానిసలు చేస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయపెట్టి బెదిరించి దళిత బందు అనే ప్రలోభాలకు గురిచేసి పార్టీ మారేటట్టు చేస్తున్నది నువ్వు కాదా,

3500 కోట్ల ఇసుక దందా నకిరేకల్ చుట్టూ జరుగుతుందన్నది వాస్తవం కాదా? నిజంగా ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఉన్నది? ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి? అనేదానికి బహిరంగ చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఈ విషయమై గొడవ జరిగిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

పరువు నష్టం దావా వేస్తా అని మమ్మల్ని బెదిరించడం కాదు నీకు దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దళితులను మోసం చేశాడని కేసు పెట్టు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితుల భూములు లాక్కున్నది మీ ప్రభుత్వం కాదా?

కరోడ్ గిరి షాపుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కదా?

నీ అల్లుడు ఉద్యోగాల పేరిట పోస్టింగుల పేరిట లక్షల రూపాయలు బెదిరించి వసూలు చేసింది నిజం కాదా?

రైతుల భూములు లాక్కున్న చరిత్ర నీకు లేదా?

రియల్ ఎస్టేట్ పేరిట ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకున్నది నిజం కాదా? 

నేషనల్ హైవే నాలుగు లేన్ల దారికి సంబందించిన నీ అవినీతి అక్రమాలెన్ని? నీ చరిత్ర అంతా దోచుకోవడం దాచుకోవడమే. 

నువ్వు కేసు పెడ్తే భయపడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లి కాదు, పులి. తన మీద, తన కుటుంబం మీద చేసినటువంటి ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా మర్రి శోభ,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు విజయ్,మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి,చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కోశాధికారి మునుగోటి సత్తయ్య,రామన్నపేట మండల ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,నాయకులు మేడి కృష్ణ, చరణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2023, 20:29

రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మరియు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .ఈ సందర్భంగా. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా మన తెలంగాణను నీతి ఆయోగే గుర్తించడం మనందరికీ గర్వకారణమన్నారు.

సీఎం కెసిఆర్ కృషి వల్ల 2014 లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43 కి చేరిందని

ఈ రోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదన్పారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను ఇరవై రెట్లు పెంచి 27,966 బెడ్లకు పెంచిన ఘనత కేసీఆర్ దారికే దక్కుతుందన్నారు.

2018లో ప్రారంభమైన కంటి వెలుగు పథకం ద్వారా 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి కేసిఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటే నేడు 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని,డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పించన్లు అందిస్తుండటంతో పాటు వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కుడా తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహకారాలతో నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 32.00 కోట్లు మంజూరు చేసుకొని పనులు కూడా ప్రారంభించామని ,మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో

కట్టంగూర్ పి హెచ్ సి భవన నిర్మాణానికి రూ. 1.56 కోట్లు, నియోజకవర్గ పరిధిలోని 12 హెల్త్ సబ్ సెంటర్లకుగాను రూ.2.40 కోట్లు మంజూరు చేసుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో. జెడ్పిటిసి తరాల బలరాం,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,డి ఎం హెచ్ ఓ,డాక్టర్,నర్సులు,ఆశ వర్కర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2023, 18:23

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

Streetbuzz news : నల్గొండ జిల్లా :

చిట్యాల పట్టణంలో యశోదా హాస్పిటల్ వారు హైదరాబాద్ విజయవాడ హైవేపై గుండ్రాంపల్లి,కట్టంగూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..

యాక్సిడెంట్స్ అయినా,హార్ట్ ఎటాక్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించే విధంగా ఈ ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు, హైవే పై తరచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కొంతమంది సంఘటన స్థలంలో ప్రాణాలు కోల్పోతే, మరి కొంత మంది సకాలంలో ఆసుపత్రికి వెళ్లకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు, సకాలంలో క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్తే వైద్యులు తగిన చికిత్స అందించి బతికించే అవకాశం ఉంటుందన్న సదుద్దేశ్యంతో యశోదా హాస్పిటల్ యాజమాన్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు పూర్తి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందించాల్సిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

madagoni surendar

Feb 24 2023, 15:50

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన పర్వతం శంకర్ (24) రామన్నపేటలో కౌలుకు భూమిని సాగుచేస్తు కుటుంబాన్ని సాకుతున్నాడు,అయితే అప్పులు తెచ్చి పెట్టుబడుల పెట్టగా, పంట సరైన దిగుబడి రాక పెరిగిన అప్పులు,ఎలా తిర్చాలో తెలియక బుధవారం పురుగుల మందుతాగాడు,చికిత్స పొందుతు శుక్రవారం ఉదయం నల్లగొండ గొల్లగూడం ప్రబుత్వ ఆసుపత్రిలో మరణించాడు. మృతునికి భార్య మరియు చిన్నబాబు వున్నారు.నిరుపేద కుటుంబం కావడంతో, కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో భార్యకూమారుడు నిరాశ్రయులయ్యారు.

madagoni surendar

Feb 23 2023, 18:46

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్.

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్స్ 181,182,183లో శక్తి కేంద్రఇంచార్జి పసుల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోన కాలంలో ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా మన దేశంలొనే కరోన కి వ్యాక్సిన్ ని కనుక్కొని దేశ ప్రజలకు ఉచితంగా అధించిన ఘనత మోడి ది అని అన్నారు. కరోన అప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నారు ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా తెరిచిన ఘనత మోదీ అని గ్రామ పంచాయితీ లకు ఇచ్చే నిధులన్ని కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నాయని రైతు వేదికలు, వైకుంఠదామలు,పల్లె ప్రకృతివనలు లాంటివి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో. బీజేపీ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షలు పాదూరి వెంకట్ రెడ్డి,మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మారం శేఖర్ రెడ్డి, మండలఉపాధ్యక్షులు కత్తుల. హనుమంతు,ముప్పిడి. నాగరాజు,దళిత మోర్చా మండల అధ్యక్షులు గద్దపాటి శంకర్,బూత్ అధ్యక్షులు నంద్యాల సందీప్ రెడ్డి, గద్దగూటి సైదులు,వి నాగరాజు,కొండి గణేష్ రెడ్డి, బూతం సతీష్,చెవుగోని వెంకటేష్,గజ్జి శ్రీకాంత్,శ్రీపాద వేణు,పొట్టబత్తుల సైదులు, గోపి,బీజేపీ నాయకులు 

 కార్యకర్తలు మహిళలు యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.