madagoni surendar

Feb 28 2023, 10:17

రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి

రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి లేదు. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి

 రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత చిరుమర్తి లింగయ్య కు లేదని నకిరేకల్ నియోజకవర్గంలో దళితులకు ఏమి చేయలేదని దళితులపై దాడి జరిగిన స్పందించలేదని బిఎస్పి జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వారు మీడియతో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగం తెచ్చుకొని ఈ రోజు ఆలా బాబా సాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ల ద్వారా కష్ట పడి చదువుకున్న ఉద్యోగస్తులు అందరిని కష్టాన్ని మీరు విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుందని అన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వినియోగించుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడడం జరిగిందన్నారు.అది మాత్రమే కాకుండా వెనకున్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.నిజంగా స్వలాభం కోసం వేల కోట్లు సంపాదించి ఉంటే నీ లెక్కనే వేరే పార్టీలోకి చేరి పదవి తెచ్చుకొని తన ఆస్తులు కాపాడుకునే పనిలో ఉండేవాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాన్యవర్ కాన్షీరామ్ స్ఫూర్తితో బహుజనులకు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశం కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అని విశ్వసించి బిఎస్పి పార్టీలోకి చేరారు అన్నారు. నువ్వు రిజర్వేషన్లను వినియోగించుకొని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయి అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన నువ్వు ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చావ్, ఇక్కడున్నటువంటి దళితుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ పథకాలు తీసుకొచ్చావో చెప్పాలి.

ప్రవీణ్ కుమార్ సార్ మీద చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలని ఖండిస్తూ గురుకులాల సెక్రటరీగా చేసిన కృషికి, శ్రమకు ప్రపంచంలోనే నం.1 అయిన హర్వర్డ్ యూనివర్సిటీ గురుకులాలని కేస్ స్టడీగా తీసుకోవడం జరిగిందన్నారు.అత్యున్నత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి ఒక సాధారణ తండా నుంచి పుట్టిన బిడ్డ మనవత్ పూర్ణ ను అడిగితే తెలుస్తుంది. సార్ ఇచ్చిన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదని.. యువతని పక్కదోవ పట్టిస్తున్నారని చేస్తున్నటువంటి ఆరోపణలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యువతని చైతన్యవంతులు చేస్తూ బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఓటు చైతన్యాన్ని తీసుకువస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర ఆధిపత్య వర్గాల పార్టీల లెక్క బహుజనులు కేవలం అనుచరులుగా మాత్రమే కాదు మనం లీడర్లుగా తయారు చేసే విధంగా ముందుకు వెళ్తుంది. నిజంగా యువతని పెడదారి పట్టిస్తున్నది యువత శక్తి మొత్తం నిర్వీర్యం చేస్తున్నది నువ్వు, నీ వెనుక ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ. యువతని ముందుకి, బిర్యానిలకి, డబ్బుకి బానిసలు చేస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయపెట్టి బెదిరించి దళిత బందు అనే ప్రలోభాలకు గురిచేసి పార్టీ మారేటట్టు చేస్తున్నది నువ్వు కాదా,

3500 కోట్ల ఇసుక దందా నకిరేకల్ చుట్టూ జరుగుతుందన్నది వాస్తవం కాదా? నిజంగా ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఉన్నది? ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి? అనేదానికి బహిరంగ చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఈ విషయమై గొడవ జరిగిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

పరువు నష్టం దావా వేస్తా అని మమ్మల్ని బెదిరించడం కాదు నీకు దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దళితులను మోసం చేశాడని కేసు పెట్టు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితుల భూములు లాక్కున్నది మీ ప్రభుత్వం కాదా?

కరోడ్ గిరి షాపుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కదా?

నీ అల్లుడు ఉద్యోగాల పేరిట పోస్టింగుల పేరిట లక్షల రూపాయలు బెదిరించి వసూలు చేసింది నిజం కాదా?

రైతుల భూములు లాక్కున్న చరిత్ర నీకు లేదా?

రియల్ ఎస్టేట్ పేరిట ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకున్నది నిజం కాదా? 

నేషనల్ హైవే నాలుగు లేన్ల దారికి సంబందించిన నీ అవినీతి అక్రమాలెన్ని? నీ చరిత్ర అంతా దోచుకోవడం దాచుకోవడమే. 

నువ్వు కేసు పెడ్తే భయపడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లి కాదు, పులి. తన మీద, తన కుటుంబం మీద చేసినటువంటి ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా మర్రి శోభ,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతేపల్లి మండల అధ్యక్షులు విజయ్,మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి,చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కోశాధికారి మునుగోటి సత్తయ్య,రామన్నపేట మండల ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,నాయకులు మేడి కృష్ణ, చరణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2023, 20:29

రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

రూ:1.56 కోట్లతో నిర్మించనున్న (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.రాజ్యసభ సభ్యులు& నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి హెచ్ సి) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మరియు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య .ఈ సందర్భంగా. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా మన తెలంగాణను నీతి ఆయోగే గుర్తించడం మనందరికీ గర్వకారణమన్నారు.

సీఎం కెసిఆర్ కృషి వల్ల 2014 లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43 కి చేరిందని

ఈ రోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదన్పారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేవలం 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను ఇరవై రెట్లు పెంచి 27,966 బెడ్లకు పెంచిన ఘనత కేసీఆర్ దారికే దక్కుతుందన్నారు.

2018లో ప్రారంభమైన కంటి వెలుగు పథకం ద్వారా 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి కేసిఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటే నేడు 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని,డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పించన్లు అందిస్తుండటంతో పాటు వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కుడా తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహకారాలతో నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 32.00 కోట్లు మంజూరు చేసుకొని పనులు కూడా ప్రారంభించామని ,మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో

కట్టంగూర్ పి హెచ్ సి భవన నిర్మాణానికి రూ. 1.56 కోట్లు, నియోజకవర్గ పరిధిలోని 12 హెల్త్ సబ్ సెంటర్లకుగాను రూ.2.40 కోట్లు మంజూరు చేసుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో. జెడ్పిటిసి తరాల బలరాం,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,డి ఎం హెచ్ ఓ,డాక్టర్,నర్సులు,ఆశ వర్కర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2023, 18:23

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

Streetbuzz news : నల్గొండ జిల్లా :

చిట్యాల పట్టణంలో యశోదా హాస్పిటల్ వారు హైదరాబాద్ విజయవాడ హైవేపై గుండ్రాంపల్లి,కట్టంగూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..

యాక్సిడెంట్స్ అయినా,హార్ట్ ఎటాక్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించే విధంగా ఈ ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు, హైవే పై తరచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కొంతమంది సంఘటన స్థలంలో ప్రాణాలు కోల్పోతే, మరి కొంత మంది సకాలంలో ఆసుపత్రికి వెళ్లకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు, సకాలంలో క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్తే వైద్యులు తగిన చికిత్స అందించి బతికించే అవకాశం ఉంటుందన్న సదుద్దేశ్యంతో యశోదా హాస్పిటల్ యాజమాన్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు పూర్తి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందించాల్సిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

madagoni surendar

Feb 24 2023, 15:50

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన పర్వతం శంకర్ (24) రామన్నపేటలో కౌలుకు భూమిని సాగుచేస్తు కుటుంబాన్ని సాకుతున్నాడు,అయితే అప్పులు తెచ్చి పెట్టుబడుల పెట్టగా, పంట సరైన దిగుబడి రాక పెరిగిన అప్పులు,ఎలా తిర్చాలో తెలియక బుధవారం పురుగుల మందుతాగాడు,చికిత్స పొందుతు శుక్రవారం ఉదయం నల్లగొండ గొల్లగూడం ప్రబుత్వ ఆసుపత్రిలో మరణించాడు. మృతునికి భార్య మరియు చిన్నబాబు వున్నారు.నిరుపేద కుటుంబం కావడంతో, కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో భార్యకూమారుడు నిరాశ్రయులయ్యారు.

madagoni surendar

Feb 23 2023, 18:46

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్.

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్స్ 181,182,183లో శక్తి కేంద్రఇంచార్జి పసుల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోన కాలంలో ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా మన దేశంలొనే కరోన కి వ్యాక్సిన్ ని కనుక్కొని దేశ ప్రజలకు ఉచితంగా అధించిన ఘనత మోడి ది అని అన్నారు. కరోన అప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నారు ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా తెరిచిన ఘనత మోదీ అని గ్రామ పంచాయితీ లకు ఇచ్చే నిధులన్ని కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నాయని రైతు వేదికలు, వైకుంఠదామలు,పల్లె ప్రకృతివనలు లాంటివి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో. బీజేపీ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షలు పాదూరి వెంకట్ రెడ్డి,మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మారం శేఖర్ రెడ్డి, మండలఉపాధ్యక్షులు కత్తుల. హనుమంతు,ముప్పిడి. నాగరాజు,దళిత మోర్చా మండల అధ్యక్షులు గద్దపాటి శంకర్,బూత్ అధ్యక్షులు నంద్యాల సందీప్ రెడ్డి, గద్దగూటి సైదులు,వి నాగరాజు,కొండి గణేష్ రెడ్డి, బూతం సతీష్,చెవుగోని వెంకటేష్,గజ్జి శ్రీకాంత్,శ్రీపాద వేణు,పొట్టబత్తుల సైదులు, గోపి,బీజేపీ నాయకులు 

 కార్యకర్తలు మహిళలు యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

madagoni surendar

Feb 23 2023, 18:29

ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే& ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు

ఉద్దీపన వాలంటీర్లలకు సుమారుగా 2 లక్షల 60 వేల రూపాయల వేతనం అందజేసిన

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం.

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గం-:

 చిట్యాల మండలం:

వట్టిమర్తి గ్రామం 

 -గ్రామాల్లో పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉద్దీపన ద్వారా ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తుంది అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం అన్నారు.. గురువారం వట్టిమర్తి గ్రామంలో ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా విద్యను అందిస్తున్న సుమారు 4 వాల్లంటీర్లకు 1 ఆయమ్మ కు ఉపకార వేతనంగా 2 లక్షల 60 వేల రూపాయలు వారు అందజేశారు...ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకే ఉద్దీపన ఫౌండేషన్ తో ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం తన సహయ సహకారాలు ఉంటాయని అన్నారు. గ్రామంలో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పూజర్ల శంభయ్య , స్థానిక సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...

madagoni surendar

Feb 23 2023, 16:11

వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై నాగబాబు ఆగ్రహం.

వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై నాగబాబు ఆగ్రహం..

ఏపీలో రాజకీయాలు రోజుకు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అధికారపార్టీ సింగిల్ గా బరిలోకి దిగుతుంటే..మిగతా పార్టీల పొత్తు అనేది తేలాల్సి ఉంది.ఇప్పటికైతే జనసేన , బిజెపి పొత్తు ఉండగా..టీడీపీ జత కలిసేది లేనిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో టిడిపి , జనసేన కార్య కర్తలు , అభిమానులు రాబోయే ఎన్నికల్లో టిడిపి , జనసేన కలిసి పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ సపోర్ట్ మీడియా కేసీఆర్ పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేశారంటూ ప్రచారం చేయడం ఏపీలో పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా లేదంటే ఒంటరిగా బరిలోకి దిగినా.. కేసీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ప్రచారం చేసింది.

పవన్ కళ్యాణ్ కు బిఆర్ఎస్ వెయ్యి కోట్ల ఆఫర్ ప్రకటించారనే ప్రచారం ఫై జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే.. పవన్ కళ్యాణ్‌కు వచ్చే నష్టమేం లేదన్న నాగబాబు.. కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త అని హెచ్చరించారు. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలని నాగబాబు ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే.. అవినీతి రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిర అవుతారేమో గానీ.. నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలని సూచించారు.

పవన్‌ కళ్యాణ్‌ మరో పాతికేళ్లపాటు ప్రజల కోసం యుద్ధం చేయగలడన్న నాగబాబు.. మీకు అంత ఓపిక లేదంటూ.. పరోక్షంగా చంద్రబాబు వయసును ప్రస్తావించారు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తమకు లేదన్నారు. ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ ఇంకెన్నాళ్లు వాగి చస్తారని నిలదీశారు. మిగతా రెండు పార్టీల నాయకులను అదే మాట అనే దమ్ము మీకు లేదంటూ చురకలు అంటించారు.

madagoni surendar

Feb 23 2023, 13:05

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా. టీడీపీ పోలిట్‌బ్యూరో లోకి కన్నా లక్ష్మీ నారాయణ కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక.

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా.

టీడీపీ పోలిట్‌బ్యూరో లోకి కన్నా లక్ష్మీ నారాయణ

కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక.

గుంటూరు : సుదీర్ఘకాలం తెలుగుదేశం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహించి ఇప్పుడు అదే పార్టీ ‘సైకిల్’ ఎక్కబోతున్న మాజీ మంత్రి, మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల, చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ తురుపుముక్కగా పనిచేసిన కన్నా, ఇప్పుడు టీడీపీకి తురుపుముక్క కాగలరా? దశాబ్దాల పాటు సభలో-బయటా చంద్రబాబు నాయుడును కడిగేసిన కన్నా, ఇప్పుడు అదే బాబుతో కలసి అడుగులేయగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లోప్రొఫైల్ స్కూలు, ముక్కుసూటిగా వ్యవహరించే కన్నా విభిన్న సిలబస్ ఉన్న టీడీపీ యూనివర్శిటీలో రాణిస్తారా? కాపు నేతగా ఇమేజ్ ఉన్న కన్నా రాకతో, కాపులు టీడీపీ వైపు అడుగులేస్తారా? కన్నా రాకతో టీడీపీకి లాభమా? టీడీపీతో కన్నాకు లాభమా? అసలు కన్నాకు టీడీపీలో లభించే గౌరవమేమిటి? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.

కన్నా లక్ష్మీనారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రుల చేతిలో బ్రహ్మాస్త్రం ఆయన. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సంధించే అస్త్రశస్త్రాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాచుకుని, ఎదురుదాడి చేసే యోధుడాయన.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కాంగ్రెస్ తరపున అస్త్రశస్త్రాలు సంధించే నాయకుడాయన. అలాంటి కన్నా ఇప్పుడు తాను ఎదురుదాడి చేసిన అదే టీడీపీ తీర్థం తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ?!. రాజకీయమంటే అదే మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులూ ఉండరన్న, దేవరాజ్ ఆర్స్ సిద్ధాంతం మరోసారి రుజువైన సందర్భం. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? ఆయన స్థాయికి తగ్గ గౌరవం టీడీపీ నాయకత్వం ఇస్తుందా? ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మాస్ ఇమేజ్ ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా? గుంటూరు జిల్లాలో పాతుకుపోయి, మంత్రి పదవుల కోసం కాచుకుని ఉన్న సీనియర్లు, కన్నా రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఆయనతో కలసి పనిచేస్తారా? బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో పనిచేసిన కన్నా ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా? ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురిచేస్తున్న అంశం ఇదే. కాపు నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్ధంతో రాజధాని గుంటూరు జిల్లాతోపాటు, కులరాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో చేరతారని బహుశా ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. జాతీయ పార్టీ బీజేపీ నిరాదరణ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఒంటెత్తు వైఖరి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం కలసి వెరసి ఆయనను, టీడీపీ వైపు అడుగులు వేసేందుకు కారణం అయి ఉండవచ్చు. పైగా కన్నా సమర్థత, రాజకీయ వ్యూహాలపై చంద్రబాబుకు ఉన్న అవగాహన కన్నా రాజకీయ ప్రత్యామ్నాయ ఎంపిక అందుకు దోహదపడి ఉండవచ్చు. కాపు నేత అయిన కన్నా, జనసేనను ఎంచుకోకుండా, టీడీపీని ఎంపిక చేసుకన్నారంటే ఆయనకున్న రాజకీయ అనుభవం-ముందుచూపు ఎంత విస్తృతమయిందో ఊహించుకోవచ్చు. ఆయన ఒకవేళ జనసేనలో చేరితే, మరో పవర్ సెంటర్ అవుతారు. యోధానుయోధులైన సీఎంల వద్ద పనిచేసిన కన్నా సొంత వ్యక్తిత్వం, దూకుడును, జనసేనలో చేరితే పవన్ తట్టుకోలేరు. అదీ కాకపోతే మహా అయితే కన్నా, జనసేనలో నెంబర్‌టూ స్థాయికి చేరవచ్చు. అయినప్పటికీ, క్యాడర్ , పార్టీ నిర్మాణం లేని జనసేనలో చేరి, కన్నా సాధించేది శూన్యం. బహుశా అలాంటి అంచనాతోనే ఆయన జనసేన వైపు మొగ్గుచూపి ఉండకపోవచ్చు.

దశాబ్దాల పాటు మంత్రి, ఎమ్మెల్యేగా జనం మధ్యలో ఉండి, మాస్ పొలిటీషియన్‌గా పనిచేసిన కన్నాను వాడుకోవడంలో బీజేపీ విఫలమయింది. బీజేపీలో చేరకముందు, కన్నా చుట్టూ వందలు-వేల మంది జనం కనిపించేవారు. రాజకీయ ఎత్తుగడలు, పార్టీ కార్యక్రమాలు, సమీక్షలతో నిరంతరం బిజీగా ఉండే కన్నాను బీజేపీ ఖాళీగా కూర్చోపెట్టింది. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ, మాస్ లీడర్‌గా ఉన్న కన్నా లాంటి నేతలు అలాంటి పరిణామాలు ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరుతుండటంతో, మళ్లీ కన్నా నివాసం జనంతో కళకళలాడుతోంది. మాస్ లీడర్లకు ఉన్న విలువ అది. ఈ సూత్రం కన్నాకే కాదు. ఏ మాస్ లీడరకయినా వర్తించేదే. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను తయారు చేసిన కన్నాకు, నియోజకవర్గ స్థాయి నేత కూడా కాని సోము వీర్రాజుతో కలసి పనిచేయడం, అవమానం అనిపించడంలో తప్పలేదు. అయితే, బీజేపీ స్కూల్ సిలబస్‌ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో కన్నా లాంటి నేతలు విఫలమవుతున్నారు. సోము లాంటి నేతలకు సొంత ఊళ్లలో పలుకుబడి లేకపోయినా, బీజేపీ దృష్టిలో అలాంటి వారే మహానేతలు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు.. ఇంటి పక్కన వాళ్లు కూడా పట్టించుకోని వారంతా, బీజేపీలో రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు. జనంలో ఠికాణా లేని వీరంతా పేపర్ టైగర్లు. జాతీయ నాయకత్వానికి కూడా, వీరు తప్ప మరొకరు గతిలేని పరిస్థితి. ఆంధ్రాలో ఈ బాపతు నాయకుల సంఖ్య డజన్లలోనే ఉంటుంది.

madagoni surendar

Feb 23 2023, 10:36

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు..

సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు..

madagoni surendar

Feb 22 2023, 19:37

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల మంత్రి కేటిఆర్ నకిరేకల్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర యువ నేత యంగలి గోపి గౌడ్ తో ఆప్యాయతో తమ్మీ బాగున్నావా అంటూ పలకరించారు..