madagoni surendar

Feb 24 2023, 18:23

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

Streetbuzz news : నల్గొండ జిల్లా :

చిట్యాల పట్టణంలో యశోదా హాస్పిటల్ వారు హైదరాబాద్ విజయవాడ హైవేపై గుండ్రాంపల్లి,కట్టంగూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..

యాక్సిడెంట్స్ అయినా,హార్ట్ ఎటాక్ వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించే విధంగా ఈ ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు, హైవే పై తరచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కొంతమంది సంఘటన స్థలంలో ప్రాణాలు కోల్పోతే, మరి కొంత మంది సకాలంలో ఆసుపత్రికి వెళ్లకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు, సకాలంలో క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్తే వైద్యులు తగిన చికిత్స అందించి బతికించే అవకాశం ఉంటుందన్న సదుద్దేశ్యంతో యశోదా హాస్పిటల్ యాజమాన్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు పూర్తి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందించాల్సిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

madagoni surendar

Feb 24 2023, 15:50

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

అప్పుల బాధకు యువ కౌలురైతు ఆత్మహత్య

నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన పర్వతం శంకర్ (24) రామన్నపేటలో కౌలుకు భూమిని సాగుచేస్తు కుటుంబాన్ని సాకుతున్నాడు,అయితే అప్పులు తెచ్చి పెట్టుబడుల పెట్టగా, పంట సరైన దిగుబడి రాక పెరిగిన అప్పులు,ఎలా తిర్చాలో తెలియక బుధవారం పురుగుల మందుతాగాడు,చికిత్స పొందుతు శుక్రవారం ఉదయం నల్లగొండ గొల్లగూడం ప్రబుత్వ ఆసుపత్రిలో మరణించాడు. మృతునికి భార్య మరియు చిన్నబాబు వున్నారు.నిరుపేద కుటుంబం కావడంతో, కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో భార్యకూమారుడు నిరాశ్రయులయ్యారు.

madagoni surendar

Feb 23 2023, 18:46

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్.

భారతీయ జనతా పార్టీ ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్స్ 181,182,183లో శక్తి కేంద్రఇంచార్జి పసుల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోన కాలంలో ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా మన దేశంలొనే కరోన కి వ్యాక్సిన్ ని కనుక్కొని దేశ ప్రజలకు ఉచితంగా అధించిన ఘనత మోడి ది అని అన్నారు. కరోన అప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నారు ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా తెరిచిన ఘనత మోదీ అని గ్రామ పంచాయితీ లకు ఇచ్చే నిధులన్ని కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నాయని రైతు వేదికలు, వైకుంఠదామలు,పల్లె ప్రకృతివనలు లాంటివి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో. బీజేపీ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షలు పాదూరి వెంకట్ రెడ్డి,మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మారం శేఖర్ రెడ్డి, మండలఉపాధ్యక్షులు కత్తుల. హనుమంతు,ముప్పిడి. నాగరాజు,దళిత మోర్చా మండల అధ్యక్షులు గద్దపాటి శంకర్,బూత్ అధ్యక్షులు నంద్యాల సందీప్ రెడ్డి, గద్దగూటి సైదులు,వి నాగరాజు,కొండి గణేష్ రెడ్డి, బూతం సతీష్,చెవుగోని వెంకటేష్,గజ్జి శ్రీకాంత్,శ్రీపాద వేణు,పొట్టబత్తుల సైదులు, గోపి,బీజేపీ నాయకులు 

 కార్యకర్తలు మహిళలు యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

madagoni surendar

Feb 23 2023, 18:29

ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే& ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు

ఉద్దీపన వాలంటీర్లలకు సుమారుగా 2 లక్షల 60 వేల రూపాయల వేతనం అందజేసిన

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం.

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గం-:

 చిట్యాల మండలం:

వట్టిమర్తి గ్రామం 

 -గ్రామాల్లో పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉద్దీపన ద్వారా ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తుంది అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం అన్నారు.. గురువారం వట్టిమర్తి గ్రామంలో ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా విద్యను అందిస్తున్న సుమారు 4 వాల్లంటీర్లకు 1 ఆయమ్మ కు ఉపకార వేతనంగా 2 లక్షల 60 వేల రూపాయలు వారు అందజేశారు...ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకే ఉద్దీపన ఫౌండేషన్ తో ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం తన సహయ సహకారాలు ఉంటాయని అన్నారు. గ్రామంలో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పూజర్ల శంభయ్య , స్థానిక సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...

madagoni surendar

Feb 23 2023, 16:11

వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై నాగబాబు ఆగ్రహం.

వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై నాగబాబు ఆగ్రహం..

ఏపీలో రాజకీయాలు రోజుకు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అధికారపార్టీ సింగిల్ గా బరిలోకి దిగుతుంటే..మిగతా పార్టీల పొత్తు అనేది తేలాల్సి ఉంది.ఇప్పటికైతే జనసేన , బిజెపి పొత్తు ఉండగా..టీడీపీ జత కలిసేది లేనిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో టిడిపి , జనసేన కార్య కర్తలు , అభిమానులు రాబోయే ఎన్నికల్లో టిడిపి , జనసేన కలిసి పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ సపోర్ట్ మీడియా కేసీఆర్ పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేశారంటూ ప్రచారం చేయడం ఏపీలో పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా లేదంటే ఒంటరిగా బరిలోకి దిగినా.. కేసీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ప్రచారం చేసింది.

పవన్ కళ్యాణ్ కు బిఆర్ఎస్ వెయ్యి కోట్ల ఆఫర్ ప్రకటించారనే ప్రచారం ఫై జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే.. పవన్ కళ్యాణ్‌కు వచ్చే నష్టమేం లేదన్న నాగబాబు.. కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త అని హెచ్చరించారు. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలని నాగబాబు ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే.. అవినీతి రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిర అవుతారేమో గానీ.. నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలని సూచించారు.

పవన్‌ కళ్యాణ్‌ మరో పాతికేళ్లపాటు ప్రజల కోసం యుద్ధం చేయగలడన్న నాగబాబు.. మీకు అంత ఓపిక లేదంటూ.. పరోక్షంగా చంద్రబాబు వయసును ప్రస్తావించారు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తమకు లేదన్నారు. ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ ఇంకెన్నాళ్లు వాగి చస్తారని నిలదీశారు. మిగతా రెండు పార్టీల నాయకులను అదే మాట అనే దమ్ము మీకు లేదంటూ చురకలు అంటించారు.

madagoni surendar

Feb 23 2023, 13:05

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా. టీడీపీ పోలిట్‌బ్యూరో లోకి కన్నా లక్ష్మీ నారాయణ కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక.

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా.

టీడీపీ పోలిట్‌బ్యూరో లోకి కన్నా లక్ష్మీ నారాయణ

కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక.

గుంటూరు : సుదీర్ఘకాలం తెలుగుదేశం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహించి ఇప్పుడు అదే పార్టీ ‘సైకిల్’ ఎక్కబోతున్న మాజీ మంత్రి, మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల, చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ తురుపుముక్కగా పనిచేసిన కన్నా, ఇప్పుడు టీడీపీకి తురుపుముక్క కాగలరా? దశాబ్దాల పాటు సభలో-బయటా చంద్రబాబు నాయుడును కడిగేసిన కన్నా, ఇప్పుడు అదే బాబుతో కలసి అడుగులేయగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

లోప్రొఫైల్ స్కూలు, ముక్కుసూటిగా వ్యవహరించే కన్నా విభిన్న సిలబస్ ఉన్న టీడీపీ యూనివర్శిటీలో రాణిస్తారా? కాపు నేతగా ఇమేజ్ ఉన్న కన్నా రాకతో, కాపులు టీడీపీ వైపు అడుగులేస్తారా? కన్నా రాకతో టీడీపీకి లాభమా? టీడీపీతో కన్నాకు లాభమా? అసలు కన్నాకు టీడీపీలో లభించే గౌరవమేమిటి? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.

కన్నా లక్ష్మీనారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రుల చేతిలో బ్రహ్మాస్త్రం ఆయన. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సంధించే అస్త్రశస్త్రాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాచుకుని, ఎదురుదాడి చేసే యోధుడాయన.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కాంగ్రెస్ తరపున అస్త్రశస్త్రాలు సంధించే నాయకుడాయన. అలాంటి కన్నా ఇప్పుడు తాను ఎదురుదాడి చేసిన అదే టీడీపీ తీర్థం తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ?!. రాజకీయమంటే అదే మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులూ ఉండరన్న, దేవరాజ్ ఆర్స్ సిద్ధాంతం మరోసారి రుజువైన సందర్భం. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? ఆయన స్థాయికి తగ్గ గౌరవం టీడీపీ నాయకత్వం ఇస్తుందా? ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మాస్ ఇమేజ్ ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా? గుంటూరు జిల్లాలో పాతుకుపోయి, మంత్రి పదవుల కోసం కాచుకుని ఉన్న సీనియర్లు, కన్నా రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఆయనతో కలసి పనిచేస్తారా? బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో పనిచేసిన కన్నా ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా? ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురిచేస్తున్న అంశం ఇదే. కాపు నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్ధంతో రాజధాని గుంటూరు జిల్లాతోపాటు, కులరాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో చేరతారని బహుశా ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. జాతీయ పార్టీ బీజేపీ నిరాదరణ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఒంటెత్తు వైఖరి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం కలసి వెరసి ఆయనను, టీడీపీ వైపు అడుగులు వేసేందుకు కారణం అయి ఉండవచ్చు. పైగా కన్నా సమర్థత, రాజకీయ వ్యూహాలపై చంద్రబాబుకు ఉన్న అవగాహన కన్నా రాజకీయ ప్రత్యామ్నాయ ఎంపిక అందుకు దోహదపడి ఉండవచ్చు. కాపు నేత అయిన కన్నా, జనసేనను ఎంచుకోకుండా, టీడీపీని ఎంపిక చేసుకన్నారంటే ఆయనకున్న రాజకీయ అనుభవం-ముందుచూపు ఎంత విస్తృతమయిందో ఊహించుకోవచ్చు. ఆయన ఒకవేళ జనసేనలో చేరితే, మరో పవర్ సెంటర్ అవుతారు. యోధానుయోధులైన సీఎంల వద్ద పనిచేసిన కన్నా సొంత వ్యక్తిత్వం, దూకుడును, జనసేనలో చేరితే పవన్ తట్టుకోలేరు. అదీ కాకపోతే మహా అయితే కన్నా, జనసేనలో నెంబర్‌టూ స్థాయికి చేరవచ్చు. అయినప్పటికీ, క్యాడర్ , పార్టీ నిర్మాణం లేని జనసేనలో చేరి, కన్నా సాధించేది శూన్యం. బహుశా అలాంటి అంచనాతోనే ఆయన జనసేన వైపు మొగ్గుచూపి ఉండకపోవచ్చు.

దశాబ్దాల పాటు మంత్రి, ఎమ్మెల్యేగా జనం మధ్యలో ఉండి, మాస్ పొలిటీషియన్‌గా పనిచేసిన కన్నాను వాడుకోవడంలో బీజేపీ విఫలమయింది. బీజేపీలో చేరకముందు, కన్నా చుట్టూ వందలు-వేల మంది జనం కనిపించేవారు. రాజకీయ ఎత్తుగడలు, పార్టీ కార్యక్రమాలు, సమీక్షలతో నిరంతరం బిజీగా ఉండే కన్నాను బీజేపీ ఖాళీగా కూర్చోపెట్టింది. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ, మాస్ లీడర్‌గా ఉన్న కన్నా లాంటి నేతలు అలాంటి పరిణామాలు ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరుతుండటంతో, మళ్లీ కన్నా నివాసం జనంతో కళకళలాడుతోంది. మాస్ లీడర్లకు ఉన్న విలువ అది. ఈ సూత్రం కన్నాకే కాదు. ఏ మాస్ లీడరకయినా వర్తించేదే. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను తయారు చేసిన కన్నాకు, నియోజకవర్గ స్థాయి నేత కూడా కాని సోము వీర్రాజుతో కలసి పనిచేయడం, అవమానం అనిపించడంలో తప్పలేదు. అయితే, బీజేపీ స్కూల్ సిలబస్‌ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో కన్నా లాంటి నేతలు విఫలమవుతున్నారు. సోము లాంటి నేతలకు సొంత ఊళ్లలో పలుకుబడి లేకపోయినా, బీజేపీ దృష్టిలో అలాంటి వారే మహానేతలు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు.. ఇంటి పక్కన వాళ్లు కూడా పట్టించుకోని వారంతా, బీజేపీలో రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు. జనంలో ఠికాణా లేని వీరంతా పేపర్ టైగర్లు. జాతీయ నాయకత్వానికి కూడా, వీరు తప్ప మరొకరు గతిలేని పరిస్థితి. ఆంధ్రాలో ఈ బాపతు నాయకుల సంఖ్య డజన్లలోనే ఉంటుంది.

madagoni surendar

Feb 23 2023, 10:36

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ : షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు..

సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు..

madagoni surendar

Feb 22 2023, 19:37

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

తమ్మీ బాగున్నావా అంటూ యువనేత గోపి గౌడ్ ను పలకరించిన మంత్రి కేటిఆర్

Streetbuzz news :నల్గొండ జిల్లా :

రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల మంత్రి కేటిఆర్ నకిరేకల్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర యువ నేత యంగలి గోపి గౌడ్ తో ఆప్యాయతో తమ్మీ బాగున్నావా అంటూ పలకరించారు..

madagoni surendar

Feb 21 2023, 21:08

గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను*_

గృహసారధుల సేవలు ఎంతో కీలకం -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

నూతనంగా నియమితులైన గృహసారధులు సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వానికి,మన జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను తెలియజేసారు.

మంగళవారం నాడు పెనుగంచిప్రోలు పట్టణంలోని GSR ఫంక్షన్ హల్,మరియు తంబరేణి గార్డెన్స్ నందు నందు పెనుగంచిప్రోలు మండల గృహసారధులతో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు,వారి తనయులు నియోజకవర్గ నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు శిక్షణ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని సూచించారు,ముఖ్యంగా కేటాయించిన గృహాలపై అహగాహణ కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు,అభివృద్ధి ప్రజలలోకి పూర్తీ స్థాయిలో తీసుకువెళ్లేలా ఉండాలని అన్నారు.వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని అన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమిచేశాడో,మన జగనన్న ఏమి చేసారో ప్రజలకు వివరించాలని అన్నారు.

మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కుల మత,ప్రాంత,పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు,గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందాలంటే తెలుగుదేశం నాయకులు చెప్పిన వారుకో లేదా పసుపు కండువా వేసుకున్నవారికే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు అని అన్నారు,నేడు అలాంటి దుస్థితి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు అని అన్నారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 21 2023, 17:39

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు*

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు

ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఘటన మరిచిపోకముందే, అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్త, అత్తను చంపి, ముక్కలుగా చేసింది ఓ ఇల్లాలు. తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. అసోంలోని గువాహటి సమీపంలో ఉన్న, నూన్ మటి ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. 

నిందితురాలు వందన కలితకు వివాహేతర సంబంధం కలిగి ఉండడమే ఈ హత్యలకు దారితీసినట్టు అనుమానిస్తున్నారు. భర్త అమర్ జ్యోతి దే, అత్త శంకరిదేలను, ప్రియుడి సాయంతో హత్య చేసిన వందన.. మూడు రోజుల పాటు మృతదేహాల ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి, అనంతరం మేఘాలయలోని చిరపుంజి ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను తీసుకెళ్లి, మృతదేహాల భాగాలను గుర్తించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ తర్వాత వాటిని సమీప అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పడేయడం తెలిసిందే.