madagoni surendar

Feb 19 2023, 10:17

Ap :27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు* *రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు*

27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు

తొలుత రెండ్రోజుల పాటు సమావేశాలు

రెండో విడత మార్చి 6న ప్రారంభం

13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

వెలగపూడి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 6న ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు తెలుస్తోంది.

madagoni surendar

Feb 17 2023, 20:09

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ*

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ

Streetbuzz news :నల్గొండ జిల్లా :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వం లో  ఎంపీపీ జెల్లా ముతిలింగయ్య కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య& మాజి జెడ్పిటిసి మాద యాదగిరి మాట్లాడుతూ.. భారతదేశంలో రైతాంగ ప్రజా వ్యతిరేక విధనాలకు పట్లుపడుతున్న మోడీ ప్రభుత్వానికి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పే దిశగా బి అర్ ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అని అన్నారు దేశంలో బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని అరికట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం పాలన కొనసాగాలంటే బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వాన్ని సాధ్యమైద్దని దేశ ప్రజలు నమ్ముతూ స్వాగతిస్తున్నారు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవుతారని అన్నారు దేశలో అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వములో బి ఆర్ ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరడం ద్వారానే కెసిఆర్ భారతదేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని క్రియాశీలక శక్తులంతా ఏకమై దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని దేశ అభివృద్ధికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో సర్పంచులు చేనగాని సతీష్ రేణుక అయితేగొని నారాయణ,సుంకరబోయిన వెంకన్న,మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ సర్పంచ్ గడుసు శంకర్ రెడ్డి,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య,ఎం ఎస్ ఆర్ చైర్మన్ మంగదుడ్ల శ్రీనివాస్, వనం రాంబాబు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 17 2023, 19:59

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య*

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య 

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం గార్లబాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో తేలువారిగూడెం లో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవస్థానం నిర్మాణం కోసం 50,000 రూపాయల విరాళం.అందజేసిన            

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య,ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీరుద్దీన్,తేలు లింగయ్య,తేలు నాగయ్య తేలు భద్రయ్య,కడారి సైదులు,తేలు వెంకన్న,తేలు లింగయ్య,బొప్పని యాదగిరి,కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ మండల యువజన నాయకులు ఆవుల వేణు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 17 2023, 18:39

తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే

ప్రజారంజక పాలకుడు కేసీఆర్

అలుపెరుగని పోరాట యోధుడు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహోన్నత వ్యక్తి

అనితర సాధ్యమైన విజయాలను తనదైన పద్దతుల్లో ప్రజలకు చేరువ చేసిన గొప్ప పరిపాలన దక్షకుడు

తెచ్చిన రాష్ట్రాన్ని దేశానికే తలమానికం గా తయారు చేసిన ఘనత కేసీఆర్ దే

సంక్షేమం - అభివృద్ధి ని సమపాళ్ళలో ముందుకు తీసుకెలుతూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహా నేత

తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గం:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన సందర్భంగా శుక్రవారం నాడు నకిరేకల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు..మెదటగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి.. పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు బాణసంచా కాల్చిన, అనంతరం కేకు కట్ చేశారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వానికి దేశ వ్యాప్తంగా మద్దతు

-రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించచడం ఖాయం..

-ఉద్యమ వీరుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలుపెరగని యోధుడు కారణజన్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా, ప్రజలకు అండగా మా గుండె నీ గుండెల్లో నిండిన ఇల్లు అని ప్రజల గుండెల్లో జనహృదయ నేతగా, రైతులకు రారాజుగా, రైతు బాంధవుడుగా, ఆసరా పింఛన్లతో అలుపెరగని నేతగా, తెలంగాణ రాష్ట్రమంతా నీటితో నింపి ప్రజల గుండెల్లో పోనిగి పొరులుతున నెలతల్లి గుండెలో అపరభగీరథుడిగా, భావి తెలంగాణ నిర్మాతగా, ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచి కల్యాణ లక్ష్మీ తో కన్నతల్లితండ్రిగా,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

- ప్రజలతో నీరాజనాలు పొందిన మా తెలంగాణ జాతి పీత మా నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది అని,తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా తమ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి నేత తమకు పరిపాలకుడిగా ఉంటే తమ జన్మ ధన్యమని భావిస్తున్నారు. మాజీ ప్రధాని సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు .ఉద్యమ వీరుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలుపెరగని యోధుడు కారణజన్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా, ప్రజలకు అండగా మా గుండె నీ గుండెల్లో నిండిన ఇల్లు అని ప్రజల గుండెల్లో జనహృదయ నేతగా, రైతులకు రారాజుగా, రైతు బాంధవుడుగా, ఆసరా పింఛన్లతో అలుపెరగని నేతగా, తెలంగాణ రాష్ట్రమంతా నీటితో నింపి ప్రజల గుండెల్లో పోనిగి పొరులుతున నెలతల్లి గుండెలో అపరభగీరథుడిగా, భావి తెలంగాణ నిర్మాతగా, ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచి కల్యాణ లక్ష్మీ తో కన్నతల్లితండ్రిగా,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఆయన అన్నారు.ప్రజలతో నీరాజనాలు పొందిన మా తెలంగాణ జాతి పీత మా నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుజర్ల శంబయ్య గారు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, యంపిటిసిలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు...

madagoni surendar

Feb 17 2023, 18:29

నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతుల ఆద్వర్యంలో గణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు.*

నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతుల ఆద్వర్యంలో గణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు.

Streetbuzz news :నల్గొండ జిల్లా :

వేడుకల్లో బాగంగా బిజీర్ సైన్యం యువత బారీబైక్ ర్యాలీ ఏర్పాటుచేయగ వారితోకలిసి మంగలపల్లి హైస్కూలులో ఉపాధ్యాయ మరియు విద్యార్ధి బృందంతో కలిసి కేకుకటింగ్ చేసి,మొక్కనునాటిన ఎంపీపీ దంపతులు, అనంతరం తాటికల్ వృద్ధాశ్రమంలో అవ్వతాతలతో కలిసి కేకుకటింగ్ చేపించి, వారికి అన్నధానంచేసి, పండ్లుపంపిణి చేశారు.

ఆశ్రమంలో అవ్వతాతలు ముఖ్యమంత్రి గురించి మాట్లాడినతీరు అందర్నీఆకట్టుకుంది, మా కన్నబిడ్డలు మమ్మల్ని పంటించుకోకున్న నేడు మా పెద్దకొడుకు కెసిఆర్ ఇచ్చె పెన్షన్ తో ఆశ్రమానికి నెలనెల ఫీజులు కట్టుకోని ప్రశాంతగా జీవిస్తునామని,మా ఆహిస్సు పోసుకోని మాపెద్దకోడుకు కెసిఆర్ పదికాలలపాటు చల్లగ వుండాలని వారు దీవించారు.

(ఈకార్యక్రమంలో)

వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,బీ ఆర్ ఎస్ నాయకులు మరియు బిజీర్ సైన్యం యువత భారీగ పాల్గొన్నారు.

madagoni surendar

Feb 17 2023, 11:52

*భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే*

భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే 

Streetbuzz news :

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తు దిశగా టీమ్‌ఇండియా మరో సమరానికి సై అంటోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మరోసారి ఆసీస్‌ను చిత్తుచేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆడిన 24 టెస్టుల్లో భారత్‌ 20 టెస్టుల్లో గెలిచింది. నాలుగు డ్రా అయ్యయి. భారత్‌ తుది జట్టు: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లి, శ్రేయస్‌, జడేజా, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, షమి, సిరాజ్‌.

madagoni surendar

Feb 16 2023, 22:01

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు*

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు              

*మాడుగులపల్లి :

మిర్యాలగూడ నుండి నల్గొండ వైపు వెళ్ళుతున్న డిసిఎం వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చలరేగిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని కుక్కడం సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోతమిషన్ తీసుకొని వెళ్తున్న డీసీఎం వాహనము కుక్కడం సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమతమై కోత మిషన్ కిందికి దించాడు. కాగా డీసీఎం కు మాత్రం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలు అర్పించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.

madagoni surendar

Feb 16 2023, 20:54

Pawan kalyan: అంబులెన్స్‌ ఇవ్వని సీఎం.. విశాఖను రాజధాని చేస్తామంటే ఎలా నమ్మాలి?: పవన్‌

Pawan kalyan: అంబులెన్స్‌ ఇవ్వని సీఎం.. విశాఖను రాజధాని చేస్తామంటే ఎలా నమ్మాలి?: పవన్‌

అమరావతి: కేజీహెచ్‌లో చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వని ముఖ్యమంత్రి.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ప్రశ్నించారు..

బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని మృతదేహాన్ని తీసుకెళ్లటం చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుందన్నారు. కానీ, రాతి గుండె ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని దుయ్యబట్టారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీసెల్‌ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు. 

ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకుల అశ్రద్ధకు ఈ ఘటనే నిదర్శనంగా అభివర్ణించారు. కొద్ది నెలల కిందట తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను పవన్‌ గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్‌ మీద తీసుకెళ్లారన్నారు. మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు. బెంజిసర్కిల్‌లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్‌ విజువల్స్‌ తీసి జెండా ఊపితే చాలదన్నారు. వైద్యారోగ్యశాఖకు రూ.14వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చినట్టు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్‌ దుయ్యబట్టారు.

madagoni surendar

Feb 16 2023, 20:47

Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి ఫైర్‌

Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి ఫైర్‌

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌బాబుపై ఏపీ శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సంచలన కామెంట్స్‌ చేశారు. అవినీతిపై నారా లోకేష్‌ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు చేశారు.. 

కాగా, బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు. సీఎం జగన్‌పై లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా. లోకేష్‌ ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుంది..

madagoni surendar

Feb 16 2023, 20:37

బీబీనగర్ :ముప్పు తప్పించిన అత్యాధునిక టెక్నాలజీ..

బీబీనగర్ :ముప్పు తప్పించిన అత్యాధునిక టెక్నాలజీ..

Streetbuzz news :

బీబీనగర్-ఘట్‌కేసగర్ స్టేషన్ల మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express Train) రైలు పట్టాలు తప్పింది. ఎస్1 నుంచి ఎస్4, జనరల్, లగేజీ బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పాక..కిలోమీటర్ వరకు బోగీలను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాయి. కాంక్రీట్ స్లీపర్స్ ముక్కలు ముక్కలయ్యాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. ఇంత జరిగినా.. ఒక్క కోచ్ కూడా బోల్తాపడలేదు. పట్టాలు తప్పినప్పటికీ.. అలాగే నిలబడిపోయాయి. అలా జరగడం వల్లే.. పెను ముప్పు తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో LHB (లింక్ హాఫ్‌మ‌న్ బుష్) కోచ్‌లు ఉండడం వల్లే.. ముప్పు తప్పింది.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కాకుండా.. సాధారణ కోచ్‌లు ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక కోచ్‌లోకి మరో కోచ్‌లు దూసుకెళ్తాయి. ఒకదానిపైకి మరొకటి ఎక్కుతుంటాయి. కానీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి.

 ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు బరువు తక్కువగా ఉంటాయి. గ‌రిష్టంగా 140-160 కిమీ వేగంతో ప్ర‌యాణం చేసేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. లోకో పైలట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు.. ఎక్కుడున్న బోగీ అక్కడే ఆగిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా పట్టాలు తప్పినప్పుడు... రైళ్ల చక్రాలు పట్టాల నుంచి బయటకు రావు. రెండు పట్టాల మధ్యే ఉండిపోతాయి. అలాంటి అధునాతన టెక్నాలజీ ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సొంతం.

ప్రస్తుతం 50 శాతానికి పైగా రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 మార్చి నాటికే 10,000 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు.

ఎల్ హెచ్ బీ కోచ్‌లు యాంటీ టెలిస్కోపిక్. అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు వాటి ముందున్న కోచ్‌లపైకి ఎక్కే ఆస్కారం ఉండదు. అధిక వేగంలోనూ సమర్థమైన బ్రేకింగ్ కోసం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 'అడ్వాన్స్‌డ్ న్యూమాటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్'ను వినియోగిస్తున్నారు ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వేగం తగ్గి నిలిచిపోయేలా ఈ బోగీలను రూపొందించారు. రైళ్లు పరస్పరం ఢీకొన్నా, పట్టాలు తప్పినా.. బోగీలు ఒక దానిపైకి మరొకటి ఎక్కే ముప్పు ఉండదు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ (CBC) వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్‌తో ఢీకొట్టుకోకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది. 

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు 1.7 మీటర్లు అధిక పొడవు ఉంటాయి. 'కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ (సీడీటీఎస్)' ఉంటుంది. వీటిలో బయో-టాయిలెట్లు అమర్చి ఉంటాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.