Ap :ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఆ రెండు పరీక్షలు నేడు, ఎల్లుండి
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఆ రెండు పరీక్షలు నేడు, ఎల్లుండి
Streetbuzz news :
అమరావతి,*: ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులు తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ < పరీక్షను బుధ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ రెండు పరీక్షల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులు తప్పనిసరిగా క్వాలిఫై కావాలని పేర్కొంది. ఈ పరీక్షలను పబ్లిక్ ఎగ్జామీనేషన్స్ రిజిస్టర్డ్ నెంబర్స్తో జరుపుతామని, ఆ నెంబర్లను ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు పంపించామని తెలిపింది. ఫస్టియర్లో ఈ పరీక్షల్లో తప్పిన వారు, లేక రాయలేకపోయిన సెకండీయర్ విద్యార్ధులు తమ పాత హాల్ టిక్కెట్ నెంబర్లతో ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో పాసయితేనే ఇంటర్ పాసైనట్లు సర్టిఫికెట్ ఇస్తారు. సెకండియర్ విద్యార్ధులకు ఈ పరీక్షలు రాసేందుకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు.
Feb 15 2023, 10:23