madagoni surendar

Feb 14 2023, 18:06

పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*

పరిశ్రమల స్థాపనకు పర్ఫెక్ట్ ప్లేస్ ఏపీ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

మౌలిక సదుపాయాలతోనే పరిశ్రమలు తరలివస్తాయి

తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడమే మా ధ్యేయం.

పని ఎక్కువ..ప్రచారం తక్కువ ఉండాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం.

పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ లకు ఏపీలో లోటు లేదు.

నైపుణ్య వనరులు పుష్కలం..అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలం

బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

జిల్లాకో ప్రత్యేకత ఉంది..ప్రాంతానికో ప్రాధాన్యత మాది

ఉద్యానవన పంటలకు రాయలసీమ చిరునామా

పారిశ్రామికవేత్తలకు కావలసిన పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల వంటి వసతులున్నాయి

madagoni surendar

Feb 14 2023, 17:40

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.*

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత!.  

 

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్న పేట  

పట్టణానికి చెందిన బోడ హర్ష వర్ధన్ ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి ద్వారా మంజూరైన 3,00,000/- రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అందజేసారు.

madagoni surendar

Feb 14 2023, 16:20

బాల సధనాలను పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు.

బాల సధనాలను పరిశీలించిన బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు.

  

Streetbuzz news : నల్గొండ జిల్లా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు విజయవాడ లోని బాల సాధనాలను పరిశీలన చేశారు.ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలలుతో పనిచేసే వసతి గృహాల సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని,తరుచుగా బాలలు వైద్య పరీక్షలు నిర్వహించాలని,ఇతరులును అనుమతి లేకుండా కేంద్రంలోకి రాకుండా చూడాలని సూచించారు.జిల్లా బాలల సంక్షేమ సమితి అనుమతి ,ఆదేశాలుతో మాత్రమే బాలలను కేంద్రంలో చేర్పించాలని తెలిపారు. వార్డ్ స్థాయి సచివాలయం మహిళా పోలీస్ సిబ్బంది తరుచుగా కేంద్రాన్ని పర్యవేక్షణ చేయాలని, పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సీసీ కెమెరాలు తప్పని సరిగా ఎల్లవేళలా పనిచేయాలని,ఫిర్యాదులు పెట్టేను అందుబాటులో ఉంచాలని తెలిపారు.వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సమక్షంలో తెరిచి రికార్డ్ చేయాలని సూచించారు.సిబ్బంది కొరతను సంభందిత ఉన్నత అధికారుల దృష్టకి తీసుకొని వెళ్ళారు,తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బాలికలు వసతి గృహాల్లో మహిళలును మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది గా నియమించాలని తెలిపారు.కొంతమంది బాలికలు కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని,మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదక సంచాలకులు శ్రీమతి జీ.ఉమాదేవి బాల సదన్ పర్యవేక్షకరాలు జ్యోత్స్న, సూర్య కుమారి పాల్గొన్నారు

madagoni surendar

Feb 14 2023, 13:43

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి*. _ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన_

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని  ప్రజలకు రైల్వే శాఖ విజ్ఞప్తి.

    ఇటీవల రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనల దృష్ట్యా ప్రజలకు సూచన  

తిరుపతి:

 

Streetbuzz news: నల్గొండ జిల్లా :

భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏమనగా జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని ప్రజలకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఇటీవల కాలంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు  రాళ్ల పై దాడి చేస్తున్న ఘటనలు మరియు అటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన దృష్ట్యా రైల్వే శాఖ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. 

  దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటి. భారత దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రదేశాలను రైలు  మార్గాలతో కలుపుతూ మిలియన్ల మంది ప్రయాణీకులకు సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందిస్తుంది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే  సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపింది. వివిధ సరుకుల సరఫరా సమతుల్యం చేయడానికి గాను అవసరమైన వస్తువుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని  దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను రవాణా చేయడం జరిగింది. 

  అయితే, ఇటీవల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు విచ్చలవిడిగా వందే భారత్ రైళ్ల పై  రాళ్లదాడి వంటి ఘటనలకు పాల్పడడంతో రైళ్ల కు  తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రకమైన సంఘ వ్యతిరేక చర్యల మూలాన సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రైళ్లు మరియు రైల్వే స్టేషన్‌లు, ప్రజల ఆస్తుల నష్టం జరిగినట్టే . ఎందుకంటే ఇవన్నీ  ప్రజల డబ్బుతో  నిర్మించి ప్రజల కొరకు  సేవలు అందిస్తున్నాయి . ఈ దాడుల మూలాన కల్గిన నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుంది . కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు  నష్టం కలిగించవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది .

  ఈ అంశంలో రైళ్ల పై రాళ్లు విసరటం లేదా రువ్వడం వంటి దుశ్చర్య కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది . రైలు ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఇబ్బందులు లేని రైలు ప్రయాణాన్ని అందించేందుకు సాధారణ ప్రజలతో పాటు రైలు వినియోగదారుల సహకారం వుండాలని దక్షిణ మధ్య రైల్వే ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేయడంతో పాటు అభ్యర్థిస్తోంది .

madagoni surendar

Feb 14 2023, 10:48

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. అర్థరాత్రి మండలంలోని గుంటుపల్లి 44వ నెంబర్ రేషన్ షాపు పై పీడీఎస్ డీటీ,రెవిన్యూ సిబ్బంది ఆద్వర్యంలో తనిఖీలు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం.

అర్థరాత్రి మండలంలోని గుంటుపల్లి 44వ నెంబర్ రేషన్ షాపు పై పీడీఎస్ డీటీ,రెవిన్యూ సిబ్బంది ఆద్వర్యంలో తనిఖీలు

400కేజీలు రేషన్ బియ్యం స్టాక్ కి మించి ఉండడంతో షాపుకి సీలు వేసిన అధికారులు

నిన్న మధ్యాహ్నం గుంటుపల్లి లో మొబైల్‌ రేషన్ వాహనం నుండి ఆటో లోకి బియ్యం తరలిస్తుండగా ఆటోను,మొబైల్ రేషన్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు

మొబైల్ వాహన లోడింగ్ రేషన్ షాపు 44వ నెంబర్ కావడంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచి అర్థరాత్రి తనిఖీలు చేసిన అధికారులు

madagoni surendar

Feb 13 2023, 22:27

మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

పవన్ కళ్యాణ్ : మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

అమరావతి: తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?..

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది'' అని పవన్‌ పేర్కొన్నారు.

madagoni surendar

Feb 13 2023, 20:45

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మరమ్మత్తు పనులకుగాను 9 లక్షలతో పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమoలో. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, ఎంపీటీసీలు,సర్పంచ్ లు,టీచర్లు, వార్డు నెంబర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 13 2023, 21:33

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్*

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్            

Streetbuzz news: నల్గొండ జిల్లా :

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్ ను నియమించిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా బసవోజు వినోద్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నన్ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియమించినందుకు బీజేపీ జిల్లా కార్యదర్శి మండల. వెంకన్న కి,యువమోర్చ జిల్లా అధ్యక్షులు ఐతరాజు. సిద్దు కి, బీజేపీ జిల్లాకార్యవర్గ సభ్యులు పసుల సైదులు కి,మండల ప్రధాన కార్యదర్శి తండు. సైదులు కి పేరు పేరు అందరికి ధన్యవాదములుతెలిపారు.

madagoni surendar

Feb 13 2023, 09:50

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuzz news.. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో రూ. 32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు సోమవారం పరిశీలించారు పనుల్లో నాణ్యత లోపించకుండా పనులు చేయాలనీ నిర్ధేశిత గడువు లోపు హాస్పిటల్ పనులు పూర్తవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు .

కట్టంగూర్ మండల కేంద్రంలో ఈ నెల 18 వ తేదీన జరుగు శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఉమానాగ లింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం కరపత్రికను ఆవిష్కరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 13 2023, 09:42

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌పై నీరు ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రహస్యాన్ని బట్టబయలు చేసేందుకు ఆ గ్రహంపైకి వెళ్లిన క్యూరియోసిటీ రోవర్.. ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. అదేంటో తెలుసుకుందాం. (All Images Credit - NASA)

అంగారక గ్రహం (Mars)పై నీరు ఉండి ఉంటే... ఈపాటికి ఈ భూమిపై ఉన్న ధనవంతుల్లో చాలా మంది మార్స్ ట్రిప్స్ వేసి వచ్చేవారే. కానీ ఆ నీరే ఊరిస్తోంది. ఉన్నట్లు కనిపిస్తూ.. ఎక్కడుందో తెలియట్లేదు. మార్స్ గ్రహ ఉపరితలంపై తిరుగుతూ ఉన్న క్యూరియోసిటీ రోవర్ (Curiosity Rover).. ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నీటి జాడల ఆనవాళ్లను గుర్తించింది

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. తాజాగా ఓ ట్వీట్ చేసింది. దాని ప్రకారం క్యూరియోసిటీ రోవర్.. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో.. ఒకప్పుడు ఓ సరస్సు ఉండేది. అది ఎండిపోయింది. ఆ సరస్సు ఉండేది అని గుర్తించేందుకు వీలుగా అక్కడి నేల ఉంది. అందుకు సంబంధించి క్యూరియోసిటీ తీసిన ఫొటోను నాసా రిలీజ్ చేసింది.

ప్రస్తుతం క్యూరియోసిటీ తిరుగుతున్న ప్రదేశాన్ని సల్ఫేట్-బేరింగ్ యూనిట్ అని పిలుస్తున్నారు. ఇదివరకు శాస్త్రవేత్తలు ఆ ప్రదేశాన్ని పొడి ప్రదేశంగా భావించారు. అక్కడ ఏ సరస్సూ లేదు అనుకున్నారు. కానీ కొత్త ఫొటోని బట్టీ... అక్కడ సరస్సు ఉండేది అని అత్యంత స్పష్టంగా తేలింది. మరైతే.. ఆ ద్రవం ఏమైంది? ఎటుపోయింది?

ఈ సల్ఫేట్ బేరింగ్ యూనిట్ ప్రదేశం.. షార్ప్ (Mt.Sharp) అనే ఎత్తైన పర్వతానికి దగ్గర్లో ఉంది. ఇదివరకు ఈ పర్వతాన్ని ఎక్కిన క్యూరియోసిటీ రోవర్... అక్కడి నుంచి దిగువ ప్రదేశాన్ని చూసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి పంపినదే తాజా ఫొటో. ఇప్పుడు మీరు చూస్తున్నవి.. ఆ ఫొటోలో భాగమే.

మేము ఈ మొత్తం పరిశోధనలో చూసిన నీటి, అలలకు సంబంధించిన ఉత్తమ సాక్ష్యం ఇది" అని క్యూరియోసిటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అశ్విన్ వాసవాడ తెలిపారు. అశ్విన్.. కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్నా, నాసాకి చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. "ఇప్పటివరకూ మేము క్యూరియోసిటీని వేల అడుగులు ఎక్కించాము. ఎక్కడా ఇలాంటి సాక్ష్యాన్ని చూడలేదు" అని అశ్విన్ తెలిపారు.

వందల కోట్ల సంవత్సరాల కిందట.. ఆ ప్రదేశంలో తక్కువ నీటితో ఓ సరస్సు ఉండేది. సరస్సు అడుగు భాగంలో సున్నపురాయి.. మెత్తగా మారింది. ఆ రాతికి.. నీటి అలలు కంటిన్యూగా తగిలేవి. తద్వారా అలలు వచ్చినట్లుగా ఆకారం ఏర్పడింది" అని నాసా (NASA) తెలిపింది.

అలల లాగా కనిపిస్తున్న ప్రదేశానికి ఇప్పుడు మార్కర్ బ్యాండ్ అని నిక్‌నేమ్ పెట్టారు. అక్కడ ఓ రకమైన నల్లటి రాయి ఉంది. అది మిగతా షార్ప్ పర్వత రాయికి భిన్నంగా ఉంది. తన పరిశోధనలో క్యూరియోసిటీ రోవర్.. కొన్ని రాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించింది. ఇందుకోసం డ్రిల్లింగ్ చేసింది. ఆ డ్రిల్లింగ్‌ని బట్టీ ఆ రాళ్లన్నీ గట్టిగానే ఉన్నట్లు నాసా గుర్తించింది.

2014 నుంచి క్యూరియోసిటీ రోవర్.. 5 కిలోమీటర్ల ఎత్తున్న షార్ప్ పర్వతానికి దగ్గర్లో తిరుగుతోంది. ఒకప్పుడు ఈ పర్వతం దగ్గర సరస్సులు, నీటి ప్రవాహాలు ఉండేవి అని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ జీవులు జీవించాయా అనే అంశాన్ని పరిశోధిస్తున్నారు. ఐతే.. అప్పట్లో ఉండే నీరు.. ఆ తర్వాత ఏమైపోయింది? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.