madagoni surendar

Feb 13 2023, 09:42

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌పై నీరు ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రహస్యాన్ని బట్టబయలు చేసేందుకు ఆ గ్రహంపైకి వెళ్లిన క్యూరియోసిటీ రోవర్.. ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. అదేంటో తెలుసుకుందాం. (All Images Credit - NASA)

అంగారక గ్రహం (Mars)పై నీరు ఉండి ఉంటే... ఈపాటికి ఈ భూమిపై ఉన్న ధనవంతుల్లో చాలా మంది మార్స్ ట్రిప్స్ వేసి వచ్చేవారే. కానీ ఆ నీరే ఊరిస్తోంది. ఉన్నట్లు కనిపిస్తూ.. ఎక్కడుందో తెలియట్లేదు. మార్స్ గ్రహ ఉపరితలంపై తిరుగుతూ ఉన్న క్యూరియోసిటీ రోవర్ (Curiosity Rover).. ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నీటి జాడల ఆనవాళ్లను గుర్తించింది

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. తాజాగా ఓ ట్వీట్ చేసింది. దాని ప్రకారం క్యూరియోసిటీ రోవర్.. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో.. ఒకప్పుడు ఓ సరస్సు ఉండేది. అది ఎండిపోయింది. ఆ సరస్సు ఉండేది అని గుర్తించేందుకు వీలుగా అక్కడి నేల ఉంది. అందుకు సంబంధించి క్యూరియోసిటీ తీసిన ఫొటోను నాసా రిలీజ్ చేసింది.

ప్రస్తుతం క్యూరియోసిటీ తిరుగుతున్న ప్రదేశాన్ని సల్ఫేట్-బేరింగ్ యూనిట్ అని పిలుస్తున్నారు. ఇదివరకు శాస్త్రవేత్తలు ఆ ప్రదేశాన్ని పొడి ప్రదేశంగా భావించారు. అక్కడ ఏ సరస్సూ లేదు అనుకున్నారు. కానీ కొత్త ఫొటోని బట్టీ... అక్కడ సరస్సు ఉండేది అని అత్యంత స్పష్టంగా తేలింది. మరైతే.. ఆ ద్రవం ఏమైంది? ఎటుపోయింది?

ఈ సల్ఫేట్ బేరింగ్ యూనిట్ ప్రదేశం.. షార్ప్ (Mt.Sharp) అనే ఎత్తైన పర్వతానికి దగ్గర్లో ఉంది. ఇదివరకు ఈ పర్వతాన్ని ఎక్కిన క్యూరియోసిటీ రోవర్... అక్కడి నుంచి దిగువ ప్రదేశాన్ని చూసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి పంపినదే తాజా ఫొటో. ఇప్పుడు మీరు చూస్తున్నవి.. ఆ ఫొటోలో భాగమే.

మేము ఈ మొత్తం పరిశోధనలో చూసిన నీటి, అలలకు సంబంధించిన ఉత్తమ సాక్ష్యం ఇది" అని క్యూరియోసిటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అశ్విన్ వాసవాడ తెలిపారు. అశ్విన్.. కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్నా, నాసాకి చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. "ఇప్పటివరకూ మేము క్యూరియోసిటీని వేల అడుగులు ఎక్కించాము. ఎక్కడా ఇలాంటి సాక్ష్యాన్ని చూడలేదు" అని అశ్విన్ తెలిపారు.

వందల కోట్ల సంవత్సరాల కిందట.. ఆ ప్రదేశంలో తక్కువ నీటితో ఓ సరస్సు ఉండేది. సరస్సు అడుగు భాగంలో సున్నపురాయి.. మెత్తగా మారింది. ఆ రాతికి.. నీటి అలలు కంటిన్యూగా తగిలేవి. తద్వారా అలలు వచ్చినట్లుగా ఆకారం ఏర్పడింది" అని నాసా (NASA) తెలిపింది.

అలల లాగా కనిపిస్తున్న ప్రదేశానికి ఇప్పుడు మార్కర్ బ్యాండ్ అని నిక్‌నేమ్ పెట్టారు. అక్కడ ఓ రకమైన నల్లటి రాయి ఉంది. అది మిగతా షార్ప్ పర్వత రాయికి భిన్నంగా ఉంది. తన పరిశోధనలో క్యూరియోసిటీ రోవర్.. కొన్ని రాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించింది. ఇందుకోసం డ్రిల్లింగ్ చేసింది. ఆ డ్రిల్లింగ్‌ని బట్టీ ఆ రాళ్లన్నీ గట్టిగానే ఉన్నట్లు నాసా గుర్తించింది.

2014 నుంచి క్యూరియోసిటీ రోవర్.. 5 కిలోమీటర్ల ఎత్తున్న షార్ప్ పర్వతానికి దగ్గర్లో తిరుగుతోంది. ఒకప్పుడు ఈ పర్వతం దగ్గర సరస్సులు, నీటి ప్రవాహాలు ఉండేవి అని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ జీవులు జీవించాయా అనే అంశాన్ని పరిశోధిస్తున్నారు. ఐతే.. అప్పట్లో ఉండే నీరు.. ఆ తర్వాత ఏమైపోయింది? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.

madagoni surendar

Feb 12 2023, 14:49

తప్పిపోయిన ముస్లిం మహిళకు మానవత్వంతో ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్మన్,రోష్ని ట్రస్ట్....*

తప్పిపోయిన ముస్లిం మహిళకు మానవత్వంతో ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్మన్,రోష్ని ట్రస్ట్....

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మహె రున్నిసా బేగం (48) మతిస్థిమితంతో తప్పి పోయి కేరళ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా.. ఆమెను రప్పించడానికి కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్ గారితో పాటు రోష్ని ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది అలీంలు మానవత్వం చూపి 4వేలు ఆర్థిక సాయం చేయగా.. కొత్త కోట మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి 2వేల రూపాయలు,కొత్తకోట వైస్ ఎంపిపి వడ్డే శ్రీనివాసులు ఒక వెయ్యి రూపాయలు,పాలెం గ్రామ సర్పంచ్ రామకృష్ణారెడ్డి వెయ్యి రూపాయలు,పాలెం గ్రామ మాజీ ఎంపిటిసి సాయి దాభ రాజు మరో రెండు వేల రూపాయలు అందించి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్, తహెసీన్ వహీద్ అలీ,క్రషర్ మాధవరెడ్డి,వినోద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా కేరళలో ఉన్న మా అక్క మహేరున్నీసా బేగంకు కొత్తకోటకు రావడానికి ఆర్థిక సహాయం చేసి.. అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేసిన కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ గారికి,రోష్ని ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది అలీo గారికి మెడికల్ ఖాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

madagoni surendar

Feb 11 2023, 20:47

భద్రాద్రిలో అరుణ్ సాగర్ పురస్కారాలు.

భద్రాద్రిలో అరుణ్ సాగర్ పురస్కారాలు 

భద్రాద్రి కొత్తగూడెం : ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పేరిట ప్రతీ సంవత్సరం ఇచ్చే పురస్కారాలను భద్రాచలంలోని శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు అరుణ్ సాగర్ పురస్కారాల సభ ముస్తాబయింది.

ఈ సంవత్సరం అరుణ్ సాగర్ పురస్కార జ్ఞాపికలను ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందించనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవార్డుల ప్రధానం ఉంటుందని తెలిపారు. అరుణ్ సాగర్ పురస్కారాల సభకు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో, విశిష్ట అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, సాక్షి పత్రిక సంపాదకులు వద్దెల్లి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. కవులకు, రచయితలకు, జర్నలిస్టులకు వేదికగా జరుగుతున్న ప్రముఖ కవి, జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పురస్కారాల సభకు అభిమానులు కవులు జర్నలిస్టులు సంఘ సంస్కర్తలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

madagoni surendar

Feb 11 2023, 17:33

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

2 ఫైర్ ఇంజన్లు తో మంటలని అదుపు లోకిస్తున్న అగ్నిమాపక శాఖ ...

ఈరోజు రెండో శనివారం కార్యాలయానికి సెలవుకావడంతో సిబ్బంది ఎవరూ లేరు....

ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందని అనే అంశాలు తెలియాల్సి ఉంది....

కొసుమెరుపు*

ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అవ్వగా నేడు జరిగిన అగ్నిప్రమాదం లో ఏమి ఫైల్ తగలబడ్డాయో,ఏమి నష్టం జరిగిందో విచారణలో తెలియాల్సి ఉంది...

madagoni surendar

Feb 11 2023, 17:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండి.

ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఫలుమార్లు స్పష్టం చేసింది.

నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా అమరావతిని రాజధానిగా అంగీకరించారు.

ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది.

3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 3 రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండి.

- రామకృష్ణ.

madagoni surendar

Feb 11 2023, 11:24

వైద్య సేవలు రోగుల హక్కులు.. యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్.

వైద్య సేవలు రోగుల హక్కులు..

యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,

ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్. 

నల్గొండ జిల్లా :

సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగ దారులే అందరూ తమ అవసరాల కోసం అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ధరలలో తేడాలు, కల్తీ, తూనికలు, కొలతలలో మోసాలు వంటివెన్నో జరుగుతుంటాయి వినియోగదారులకు చట్ట పరిజ్ఞానం లేనందు వల్ల నష్టపోతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందే సేవల్లో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు వర్తించదు కానీ వైద్యంలో నిర్లక్ష్యం చూపితే డాక్టర్‌పై సివిల్‌ కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు.

రోగానికి సంబంధించిన సమాచారం కోరొచ్చు. మందుల పట్టికకు సంబంధించిత సమాచారం చికిత్సకు సంబంధించిన వివరాలను పొందే హక్కు ఉంటుంది 

మార్కెట్‌ నుంచి ఏ వస్తువునైనా కొనేటప్పుడు ఐఎస్‌టీ, అగ్‌మార్క్‌ ముద్ర ఉన్న వస్తువులనే కొనాలి. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఫోరాల పరిధిలోకి వచ్చే వివాదాలు, అంశాలు వస్తు సేవల నాణ్యతా ప్రమాణాలలో లోపాలు, వ్యత్యాసాలు, తేడాలు వస్తు, సేవల ప్యాకేజీల ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు బస్డాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌, సినిమా హాళ్లలోనూ వస్తు, సేవల ప్యాకేజీ మీద ముద్రించిన రేటుకే అమ్మాలని చట్టం శాసిస్తోంది. అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల, కొలతల శాఖవారి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-333కి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందొచ్చు ఆ ఫిర్యాదును వారం రోజలలోపు విచారించి పరిష్కరిస్తుంది.

madagoni surendar

Feb 11 2023, 08:45

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

 Street Buzz news నల్గొండ జిల్లా:

 ;(నకిరేకల్):- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ, NSUI విద్యార్థి సంఘాల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ మైనార్టీ స్కూల్ ను కట్టంగూర్ కు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతోందని వెంటనే సొంత భవనం నిర్మించాలని డిగ్రీ, బీసీ గురుకుల.మైనార్టీ గురుకుల పాలిటెక్ని, ఐటిఐ కళాశాలను నకరేకల్ లో నిర్మించాలని డిమాండ్ చేశారు,లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ లోని విద్యారంగా సమస్యలు ఏం పరిష్కరించిండు నకిరేకల్ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ నాయకుడు గద్దపాటి రమేష్, నియోజకవర్గ కోశాధికారి కొవ్వూరి రంజిత్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, విజయ్, సందుపట్ల శృతి విద్యార్థి యూనియన్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 10 2023, 09:14

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి 

Street Buzz news నల్గొండ జిల్లా:  ;(నకిరేకల్ నియోజకవర్గం):- హాత్ సే హాత్ జోడోయాత్ర పాదయాత్రను గురువారం రెండవ రోజు నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించి స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న  

TPCC ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ చార్జ్ .కొండేటి మల్లయ్య మరియు వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్ .ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలికే సుంకరబోయిన నరసింహ యాదవ్, మాజీ ఎంపీపీ లింగాల మల్లేశ్వరి, ఎంకన్న, మాజి మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ లింగయ్య గౌడ్ ,డిసిసి కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి, బొప్పని యాదగిరి, నకిరేకంటే శ్రీను,వంటేపాక వెంకన్న స్వప్న, వెంకటమ్మ, సుంకర సైదులు, మేడి నాగరాజు,కొండ నారాయణ, సిహెచ్ శ్రీరంగం, కొండల్ గౌడ్, వనం స్వామి, పున్న శ్రీను,కోమటి యాదగిరి, వనం వెంకట సత్తి, చిట్టిపోలు కుమారస్వామి, కొంగరి అంజయ్య, మునుగోడు చంద్రయ్య, సుంకరి సైదులు, ఏర్పుల రవి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కొండ అంజమ్మ, సురుగు జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 09 2023, 18:10

మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి. బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి *


*మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి.ప్రియదర్శిని మేడి

నకిరేకల్ పట్టణ కేంద్రంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ను తరలించడం ప్రభుత్వ అసమర్థ చర్య అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి స్వలాభం కోసం స్కూలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రియదర్శిని మేడి జిల్లా స్థాయి అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా హాస్టల్ ని ఎక్కడికి మార్చడం లేదని చెప్పడం గమనార్హం. పార్టీ మారానని చెప్పుకునే ఎమ్మెల్యే సిసి రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపనలకు, దళిత బంధు ఆశ చూపే పనికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ ను ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆయనకు పేద విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మించలేని అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకుడు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,విద్యార్థి సంఘం నాయకులు అంజన్ కుమార్ యాదవ్,జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 07 2023, 18:03

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి*

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి

నల్గొండ జిల్లా :

 రామన్నపేట బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో మాత రమాబాయి అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా మాట్లాడుతూ.. రమాబాయి అంబేడ్కర్ 1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్ర లోని "ధబోల్" గ్రామంలో జన్మించారన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించటంతో బంధువులతో కలిసి ముంబాయి వచ్చారన్నారు.మాతా రమాబాయికి 1906లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్‌ తో వివాహం జరిగిందన్నారు. అంబేడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీగా ఉండటంతో కుటుంబ బారమంతా మాతా రమాబాయి చూసుకునేవారన్నారు. అంబేడ్కర్ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళేటప్పుడు ఆమె పూర్తి సహకారం అందించారన్నారు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చిన ఆమె ఏనాడు చలించిపోలేదని, సమస్యలకు లొంగిపోలేదన్నారు. అంబేడ్కర్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. మాతా రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చవి చూసింది. నలుగురు పిల్లల మరణం, భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండక పోవటం, సమాజంలో రాజకీయ ఉద్రిక్తతలు ఆమెను ఆందోళనకు గురిచేశాయి. అంబేడ్కర్ దళిత జాతుల కోసం అహర్నిశలు కృషిచేస్తుంటే, శ్రమిస్తుంటే రమాబాయికి తీవ్ర ఆందోళన కలిగించేది. 1935 మే 26న మాతా రమాబాయి అంబేడ్కర్ మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, టిల్లు, ఉపేందర్, అనూష్,పవన్,సురేష్, మజ్జు తదితరులు పాల్గొన్నారు