/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ Yadagiri Goud
రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ

రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు అధికారు లను ఆదేశించారు.

శనివారం మంత్రి అధికారు లతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.

ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం ,వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.

గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రైతాంగం , ప్రజలు రైతుబంధు నిధుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకో వాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు....

ఆదిత్య ఎల్ 1,భారత్ కు మరో సంపూర్ణ విజయం

ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఆదిత్య ఎల్‌-1ను శనివారం సాయంత్రం విజయ వంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది

ఇస్రో. లాగ్రాంజ్ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో ఆర్బి ట్‌లోకి చేరిన ఆదిత్య ఎల్‌-1 సూర్యుడిపై పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఆదిత్య ఎల్‌ వన్‌ ద్వారా ఇస్రో సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై అధ్యయనం చేయనుంది.

గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. అప్పటినుంచి వివిధ దశల ద్వారా లాగ్రాంజ్ పాయిం ట్‌కు ఆదిత్యను పంపారు.

శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఇస్రో నిర్వహించిన 4 దశలు విజయవంతంగా పూర్త య్యాయి. మొత్తం 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఆదిత్య ఎల్-1. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్‌-1 సేవలు అందించనుంది.

ఇక ఆదిత్య ఎల్-1 ప్రయో గం సక్సెస్ అవడంతో.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ముంబై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 30-37 తేడాతో గుజరాత్ జెయింట్స్ ఓడించింది.

మొదట ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌దే పైచేయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఆ జట్టు 19-14తో ఆధిక్యంలో ఉంది.అయితే, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయింది.

ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఆలౌటైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ వరుస పాయింట్ల తో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

రాకేశ్ 10 పాయింట్లు, దీపక్ సింగ్ 9 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్ 8 పాయింట్లు, సంజీవి 7 పాయింట్లతో పోరాడినప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం కరువైంది.

మరోవైపు, టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా యు ముంబాను 31-41 తేడాతో ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.

లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలు కమిటీనీ ప్రకటించింది.

25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరి స్తారు.డిప్యూటీ సీఎం భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సిం హారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు.

మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుక చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీత రావులకు ఈ కమి టీలో చోటు కల్పించారు

వీరితో పాటు కమిటీలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా కమిటీలో చోటు కల్పించింది.

13 నుంచి జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ నెల 13వ తదీ నుంచి 16వ తేదీ వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇచ్చా రు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్య లు తీసుకుంటామని ఈమే రకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యా లకు ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది.

తిరిగి 17వ తేదీన కళాశా లలు ప్రారంభమవు తాయ ని తెలిపింది.ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జూనియర్‌ కళాశాలలన్నీ పాటించాలని పేర్కొంది..

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వా నించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సహాయ సహకా రాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం తెలిపారు.

వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

టైర్-2, 3లలో ఐటీలను అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యో గాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదన్నారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణురెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్ కార్పొరేట్ వ్యవహారాలు చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ పాల్గొన్నారు.

హైదరాబాద్ జిహెచ్ఎంసి లో అధికారుల బదిలీలు

రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని తొలగించి రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలక అధికా రులను బదిలీ చేసింది. ఈ మేరకు ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

కూకట్‌పల్లి జోనల్ కమిష నర్‌గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు.

ఆమె స్థానంలో ఐఏఎస్‌ అధికారిణి అభిలాషా అభినవ్‌ నియమితు లయ్యారు. కాగా, 2010 నుంచి 2018 వరకు శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన వి.మమత.. 2018 నుంచి కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా కొనసాగు తున్నారు.

అలాగే శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిణి స్నేహా శబరీష్‌కు బాధ్యతలు అప్పగించారు.

వీరితో పాటు మరికొందరు డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది.. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈగా బదిలీ అయ్యారు.

ప్రస్తుతం ఎస్ ఈగా ఉన్న మల్లికార్జున్ ఈఎన్ సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించిం ది.జీహెచ్‌ఎంసీ ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాసరెడ్డి, ఫలక్‌నుమా అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.లావణ్య, కుత్బుల్లాపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.న ర్సింహలను నియ మించారు.

సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా ఎ.నాగమణి, చార్మినార్ డిప్యూటీ కమి షనర్ గా ఎ.సరితను నియమిస్తూ జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.

TDP: ఈసీ బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్‌.. వెంకటగిరి సభ వాయిదా

అమరావతి: ఈనెల 9న వెంకటగిరిలో నిర్వహించాల్సిన 'రా.. కదలిరా..' కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు ఉదయం విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని..

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి..

సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది..

‘ఆదిత్య-ఎల్‌1’ విజయవంతం

బెంగళూరు: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది.

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం చేపట్టిన కీలక ఘట్టం ఫలించింది.

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది.

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్‌1’ లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే కావడం గమనార్హం.

ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించలేరు: ఎమ్మెల్యే హరీష్ రావు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్ల మెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు.ప్రజలగుండెల్లో ఉన్న కేసీఆర్‌ను తొలగించలేరని అన్నారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్‌ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల పై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీ స్తామని హెచ్చరించారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం లో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేద’ని అన్నారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు.

ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపో యామని అన్నారు.

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిది.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

మొన్నటి ఎన్నికలు కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకు నేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని అన్నారు ..