/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై స్పందించిన జగదీష్ రెడ్డి Miryala Kiran Kumar
రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై స్పందించిన జగదీష్ రెడ్డి

రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై స్పందించిన  జగదీష్ రెడ్డి 

రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలు దురదృష్టకరం

ఆనాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ ను ఖతం చేయాలి

ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే 

రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదు , తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు

ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది

మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి

కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు 24 గంటల కరెంటు రైతు బీమా ఆగదు

 ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేదు

ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు

నల్లగొండ జిల్లా లో 12 కు 12 స్థానాలలో బిఆర్ఎస్ విజయం ఖాయం 

 సూర్యాపేట

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణి నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి,రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలుదురదృష్టకరంఅన్నారు.ఆ నాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం కలిగింది అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే ఆన్న మంత్రి,

రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు.తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు అన్నారు.

ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది అన్నారు.

మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగాకేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు ,24 గంటల కరెంటు, రైతు బీమా తో పాటు 

 ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేరాన్నారు.

ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవొద్దన్నారు..సూర్యాపేటలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న మంత్రి, ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. గ్రామాలకు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంగా అభ్యర్థులుగా గుర్తించకుండా, ప్రజలు వినతులు , విజ్ఞాపనలతో తమను అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.

అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం

అభివృద్ధి వెంటే మేము -విద్యా సంస్థల ఐక్య వేదిక

భూపాలన్న గెలుపే మా లక్ష్యమంటూ ఏకగ్రీవ తీర్మానం

 ప్రెవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్నా అర్హులైన సిబ్బందికి రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, గృహలక్ష్మి మరియు డబల్ బెడ్రూమ్ మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

 స్థానిక ఎన్.ఆర్.ఎస్ గార్డెన్ మర్రిగూడ బైపాస్ యందు ఏర్పాటు చేసిన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి విద్యా సంస్థల ఐక్య వేదిక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..తన గెలుపు కొరకు సంఘీభావం ప్రకటించిన ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది మరియు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ సందర్బంగా ట్రాస్మాగౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి మరియు విద్యా సంస్థల ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ .. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలంటే మరోమారు బి.ఆర్.ఎస్. కె పట్టం కట్టాలని దానిలో భాగంగా మన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి‌, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కార్యదర్శి తలకోల పురుషోత్తం,,డిగ్రీ మరియు పీజీ కళాశాలల సామాల వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షులు చందం శ్రీను, ట్రాస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.రావ్, పట్టణ అధ్యక్షులు ఎం.డి అజీజ్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, లీగల్ సెల్ సలహాధారు కె.జవహర్, కేజీ టు పీజీ పరిశీలకులు ఇ.రాధాకృష్ణ, గొర్రె వెంకట్ రెడ్డి, వై శివశంకర్, ఎ. ప్రణీత్, పాముల అశోక్, గిరిధర్ గౌడ్, శ్రీమతి అమరావతి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ అలీ, జిల్లా టి.పి.టి ఫేడరేషన్ ప్రతినిధులు బక్క నర్సింహా, ఏ.వెంకన్న, బి.రాంబాబు, బొజ్జ రాజు మరియు టి.పి.టి. ఫోరం ప్రతినిధులు మధుమూర్తి, సంజీవ రెడ్డి, సోమయ్య సహా వందలాది మంది నియోజకవర్గం పరిధి లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, లెక్చరర్స్,యాజమాన్య ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు

BRS అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి Rmp వైద్యుల సంఘం మద్దతు

BRS అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారికి Rmp వైద్యుల సంఘం మద్దతు

ఎవరికైనా ప్రమాదం ఏర్పడితే మొదలు వైద్యం చేసే వాళ్ళు గ్రామీణ వైద్యులేనని.. అందుకే వారంటే మాకు ఎనలేని అభిమానం ఉందని కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

పట్టణంలోని RMP వైద్యుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన RMP వైద్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నల్గొండ అభివృద్ధి ఆగొద్దంటే RMP వైద్యులు నడుం బిగించాలని కోరారు.

ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తితో పరిచయం ఉన్న RMPలు చైతన్యవంతులని, నిరక్షరాస్యులను కూడా చైతన్య పరచగలరని ఆయన అన్నారు.

BRS చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు.

కాగా.... మా గ్రామీణ వైద్యుల అభివృద్ధి కోసం కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎంతో చేశారని, భూపాలన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మాదేనని గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి‌, డా.చెరుకు సుహాస్, RMP వైద్య సంఘం జిల్లా బి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి , నాయకులు DSN చారి , పి. వెంకటేశ్వర్లు గౌడ్ , CH బ్రహ్మచారి, రాజశేఖర్ రావు, వనం యాదగిరి, నరేష్, అక్బర్, లతీఫ్, అబ్బాస్ తదితర RMP వైద్యులు పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో దోపిడి పాలక వర్గాలైన పార్టీలను ఓడించండి:నాయకులు ముసలి సతీష్ సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ

ఈ ఎన్నికల్లో దోపిడి పాలక వర్గాలైన బిజెపి,బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించండి.భద్రాచలం డివిజన్

నాయకులు ముసలి సతీష్  సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ...

భద్రాచలంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ బిర్ ఎస్ రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒడిచండి, మందు డబ్బు కులము మతము ప్రజలను విభజించే ధోరణలు 

 బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే విధానాలు మోసపూరితమైన వాగ్దానాలతో మాటలు చెపుతున్నారని నిరుద్యోగం పెరిగిందని ధరలు పెరిగాయని జీవనఆధారమైన పొడుభూములను గుంజుకోవడానికి 

 ప్రజలకు జీవనాదరం లేకుండా చేసేవిధంగా మన భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని 

రాష్ట్రంలో కేసీఆర్ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకొస్తుందని అభివృద్ధి నమూనా సంక్షేమ పథకాలు దళితబందు బీసీ బందు గృహలక్ష్మి పధకాలు ప్రశ్నార్దకంగా మారాయని విద్యారంగం సంక్షోభంలో ఉందని వైద్యరంగం భద్రాచలంలో గౌట్ హాస్పిటల్ మూతపడే దశలో ఉందని ప్రైవేటు విద్యా, ప్రైవేట్ వైద్యం ఖరీదుగా మారిందని .సాగు నీరు ప్రశ్నార్ధకంగా మారిందని మిషన్ భగీరథ,నీరు ప్రజలకు అందడం లేదనీ ప్రాజెక్టులలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని బిజెపి, బిఆర్ఎస్ లు 10 సంవత్సరాలు కుమ్మక్కై ప్రజా వ్యతిరేకవిధానాలు ముందుకు తీసుకోని వచ్చారని 

ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ను ఓడించాలని సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ కోరుతున్నారు . 

బిజెపిని, బీ ఆర్ఎస్ ను ఓడించాలని ఇతర బూర్జువా పార్టీలను నిలదీయాలని, ప్రజా స్వామ్యవాదులను గెలిపించాలని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ప్రజలకు పిలుపునిస్తోంది.

*ఈ కార్యక్రమంలో నరేష్ ప్రకాష్ రాజి రమేష్ ఇమ్రాన్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చని నాయకులను నిడదీయండి:సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్

చర్ల :భూర్జవ,పాలక పార్టీలను ఓడించండి.

గత హామీలను అమలు చేయని పాలకులను నిలదీయండి.న్యూడెమోక్రసీ.

బూర్ జవా పాలక పార్టీలను ఓడించాలని గతంలో హామీలను ఇచ్చి విస్మరించిన పాలకులను ఇప్పుడు నిడదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్* లు పీలుపు నిచ్చారు.

గతంలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని విచ్చలవిడి హామీలను ఇచ్చి ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా విస్మరించిన పార్టీలను గ్రామాలకు వస్తే నిలదీయాలని భూర్జవ పార్టీలను ఓడించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి కార్పొరేట్ శక్తులకి ప్రజల ఆస్తులను చేస్తున్నారని అందులో భాగమే నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకొస్తున్నారని అడవుల నుండి ఆదివాసీలను గెంటివేయడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని వారన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో గుంజుకొని ప్రజలని మోసం చేసిందని వారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా అడిగిన ప్రశ్నించిన గొంతుకలపై ఊపా పిడి యాక్ట్ లాంటి కేసులను నమోదు చేసి జైలవనిర్బంధిస్తున్నారని వారన్నారు.ఎన్నికలే శాశ్వతంగా బతికే పాలక బూర్జవ పార్టీలను ఎండగట్టాలని,విప్లవ పార్టీలను ప్రజాస్వామిక వాదులను గెలిపించుకుంటే ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి అనేక ఆందోళన చేసిన పట్టించుకోని నాయకులు ఈరోజు ఎన్నికలు రాగానే రంగురంగుల జండాలతో రంగురంగు వేషాలతో వచ్చి ప్రజల దగ్గర కొత్త కొత్త హామీలతో ముందుకు వస్తున్నారని ఇవి ఎవరు కూడా నమ్మొద్దని ఆ పార్టీలో ఆ వేషాలు అన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం కోసమేనని వారన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో పేదలకు చేసింది ఏమీ లేదని పైగా గ్యాస్,విద్య,విద్యుత్తు, వైద్యం అందని ద్రాక్షగా మార్చాలని వారన్నారు.ఇప్పటికీ అనేక గ్రామాలలో రోడ్లు,రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అనేకసార్లు అధికారులకు పాలకులకు విన్నవించిన ఫలితం లేదని వారు అన్నారు.అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.బిజెపి ప్రభుత్వం హిందూ మతం మతోన్మాదం పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టి ఐక్యంగా ఉన్న గ్రామాలలో విచ్ఛిన్న చర్యలు చేపట్టి విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తుందని వారన్నారు.బిజెపి, కాంగ్రెస్,బి ఆర్ ఎస్ అన్ని ఒక్క తాను గుడ్డలేనని అధికారం కోసమే వేరు ఆరాటపడుతున్నారు.తప్పితే ప్రజా సమస్యల కోసం కాదని ఇది ప్రజలందరూ గమనించాలని వారు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ప్రజల కోసం పని చేసే వారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని,ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్,భాను,నరసింహారావు,సీతారాములు,సరోజ,కోటమ్మ,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి మద్దతు తెలిపిన నల్గొండ క్రిస్టియన్స్

క్రైస్తవులంతా బిఆర్ యస్. అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు.

నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్ లో ఉన్న బిలీవర్స్ చర్చ్ లో నల్గొండ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్, మరియు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్ల సదస్సులో నల్గొండ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మరియు తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడినారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ కో- ఆప్షన్ మెంబర్ శ్రీ తీగల జాన్ శాస్త్రి గారు అధ్యక్షత వహించనారు. వారి అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గాలో ఉన్న పాస్టర్లు మరియు పాస్టర్ అమ్మలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేసినారు, ముఖ్య అతిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో అభివృద్ధి పథకంలో నడిపిస్తుందని తెలియజేశారు, చర్చి నిర్మాణాలకు పర్మిషన్, క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తూ, క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు, నిరుపేదలకు బట్టలు పంపిణీ చేస్తుందని, క్రిస్మస్ విందు ఇస్తుందని తెలియజేశారు.గెలిచిన తర్వాత క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ మరియు క్రైస్తవ భవన్ ఇస్తానని వాగ్దానం చేశారు . నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో క్రైస్తవులు ముందంజలో ఉండి మరొకసారి గెలిపించాలని కోరినారు,గనుక నవంబర్ 30 వ తారీఖు జరిగే ఎలక్షన్ లో క్రైస్తవులు భారీ ఎత్తున పాల్గొని కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థని గెలిపించాలని కోరినారు. అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఇతర పాస్టర్లు పాల్గొని విజయవంతం చేసినారు. పాస్టర్ ఐజక్ రామ్, కన్నడ డేవిడ్, విజయ్, ప్రసాద్ కుమార్ , నా లాజరస్ , జాన్ బాబు,రాజ్ కుమార్, కట్ట మోజేష్, జయ చందు, అనిల్ కుమార్, జక్కయ్య పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. తదితరులు పాల్గొన్నారు

నలగొండలో BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

అభివృద్ధి అంటేనే కంచర్ల ... కంచర్ల అంటేనే అభివృద్ధి..

మాలల సమస్యలను పరిష్కరించే సత్తా BRSకే ఉందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల JAC ఛైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు.

VT కాలనీలోని MLA గారి క్యాంప్ అఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ మాట్లాడుతూ.. 

20 ఏళ్ళు MLAగా ఉండి కోమటిరెడ్డి నల్గొండకు ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా.. స్కీములంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 

నల్గొండ అభివృద్ధి అంటేనే కంచర్ల భూపాల్ రెడ్డి గారని.. అంచలా నల్గొండను అభివృద్ధి చేశారని, ఇది ఎవరో చెప్పడం కాదూ.. నల్గొండను చూస్తేనే తెలుస్తుందని అన్నారు. అందుకే రెండో దఫా కంచర్ల భూపాల్ రెడ్డి గారు MLAగా 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ది కోసం CM KCR గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, దళిత బంధు ద్వారా దళితులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు KCR గారు తీసుకున్న చొరవ అద్వితీయమైనదని ఆయన కొనియాడారు.  

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు

ఆడపడుచుల పెళ్ళిళ్ళ కొరకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు..

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఛైర్మన్ తాళ్ళపల్లి రవి , కన్వీనర్ నల్లాల కనకరాజు , వినోద్ కుమార్, నరసింహ, మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి: జగదీశ్వర్ రెడ్డి

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి

ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధి చేసే వారికి మళ్లీ పట్టం కట్టండి

మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద గల తేజ హైస్కూల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు బిక్కు మల్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. గతంలో హైదరాబాద్ మూసి నీరు తాగే పరిస్థితి ఉండేదని నేడు మిషన్ భగీరథ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. గతంలో దీపాల వెలుతురుతో చదువుకునే పరిస్థితులు ఉండేయని, నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 గంటల కరెంటు తో పాటు దేశం లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని కొనియాడారు. నరేంద్ర మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో సైతం 

ఇప్పటికి ప్రతిరోజు ఆరు గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. 2014 ముందు ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని బెరీజు వేసుకొని తమ ఓటును వెయ్యాలన్నారు. వ్యాపారస్తులను గతం లో చందాల పేరుతో దందాలు నిర్వహించి బెదిరించే వారని,నేడు శాంతి భద్రతలతో ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. స్మశానవాటికలను రూపుదిద్ది వైకుంఠధామాలుగా మార్చడంతో పాటు పెళ్ళికాని అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వారింట్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. నేడు ఏ గ్రామం వెళ్లిన కాలేశ్వరం జలాలతో పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని కొనియాడారు. సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందడంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలను స్థాపించుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు.ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ఓటును అభివృద్ధి చేసే వారికే వేసి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, కాచం సత్యనారాయణ, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్, చల్లా లక్ష్మీకాంత్, మీలా వంశీ, బెలిదే శ్రీనివాస్, నల్లపాటి శ్రీనివాస్, బిక్కుమళ్ళ సోమేశ్వర్, దారం వెంకన్న, కక్కిరేణి చంద్రశేఖర్, రాచకొండ శ్రీనివాస్, ముప్పారపు నాగేశ్వరరావు , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీను వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎస్ కె అష్రాఫ్

కాంగ్రెస్ పార్టీను వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎస్ కె అష్రాఫ్.

నల్లగొండ పట్టణం మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి ఎస్కే అష్రాఫ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 22 వార్డు నూరుద్దీన్ నేతృత్వంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎస్కే అష్రాఫ్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా అభివృద్ధి ని నోచుకోని నల్లగొండ కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల లోనే అభివృద్ధి చెందిందని సబండ వర్గాలకు కేసిఆర్ గారి ప్రభుత్వమే అన్ని రకాల హామీలను నెరవేస్తుందని రాబోయే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

200 మంది యువకులతో కలిసి BRS లో చేరిన మునుగోడు BSP రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ నేత

BSP పార్టీ నుండి BRS లో చేరిన 200 మంది యువకులు 

బీఎస్పీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ గారి నేతృత్వంలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మునుగోడు ప్రగతి ప్రదాత శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 

 మునుగోడు నియోజకవర్గంలో BRS లోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి....

 ఎవరు ఊహించని విధంగా సబ్బండ వర్గాల నుండి భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి....

 అదే క్రమంలో ఈరోజు చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పెండం ధనుంజయ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు బిఆర్ఎస్ లో చేరారు...

 అనంతరం వారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి కొమ్ముకాస్తూ అతనితో భేరసారాలు జరిపి మోసం చేశాడని, కాంట్రాక్టు రాజకీయాలు చేస్తూ రాజకీయ విలువలను దిగజార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రభాకర్ రెడ్డి గారి హయం లోని మునుగోడు సస్యశ్యామలమైందని ప్రతి ఇంటికి త్రాగునీరు వ్యవసాయానికి సాగునీరు వచ్చాయని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుతో మునుగోడు ప్రగతికి మర