/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు... Miryala Kiran Kumar
గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు...

ప్రస్తుతం దేశం ఉల్లి ధరల్లో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 40గా మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుతం, ఉల్లిపాయలను చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక కిలో ఉల్లిపాయలను రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.

పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా పెంచుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, బఫర్ స్టాక్ నుండి లక్ష టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసి రిటైల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచ్చనున్నట్లు తెలిపారు.


ఇంకా, ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టడానికి ఇప్పటికే ఎగుమతి ఆంక్షలను కూడా ప్రభుత్వం అమలు చేసింది. మరింత సహాయం అందించడానికి, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కిలో ఉల్లిని రూ.25 సబ్సిడీపై విక్రయించడం ప్రారంభించింది. అంతేకాదు బఫర్ స్టాక్ నుంచి ఈ నెలలో అదనంగా లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ ఉల్లి ధరలు రూ.30కి పడిపోయినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మైనార్టీలకు ఎన్నో పథకాలతో చేయూతనిచ్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండలో తమ మద్దతు బిఆర్ఎస్ పార్టీకేనని తెలిపిన నల్లగొండ MIM ప్రెసిడెంట్

BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు .. 

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 0.8% ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు.

కంచర్ల భూపాల్ రెడ్డి హయాంలో కరోనా సమయాన్ని మినహాయిస్తే మిగిలిన రెండుమూడు సంవత్సరాల్లోనే ఇంతలా అభివృద్ధి చెందిందంటే.. మరోదఫా ఎమ్మెల్యేగా పంపిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మైనారిటీల మద్దతు BRSకు ఇస్తున్నామని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు

కోమటిరెడ్డి 20 ఏండ్లు MLA, ఒకసారి మంత్రిగా ఉండి కూడా నల్గొండ అభివృద్ధిని విస్మరించి హైదరాబాద్ లో దాక్కున్నారని, ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి అభివృద్ధి చేస్తా... అవకాశం ఇవ్వాలని కోరడం ఎంత వరకు సబబు అని అన్నారు.

MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. CM KCR ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలల ద్వారా 1,20,000 మంది విద్యార్థులకు విద్య అందించడంతో పాటు షాదీముబారక్, రంజాన్ తోఫా లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

CM KCRగారు మూడోసారి అధికారంలోకి వస్తే

మైనారిటీ సంక్షేమం కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తామని అన్నారు

2014లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు, 2018లో మళ్ళీ ఇప్పుడు నాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ గారలు మాట్లాడుతూ.. BRSకు MIM మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.. 2014 నుంచి BRS, MIM పార్టీల మైత్రీ కొనసాగుతోందని, మరోసారి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే మైనారిటీలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు.

కులమతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లో ముందుకు పోతున్నదని.. అందుకే MIM మద్దత్తు ఇచ్చిందని , వారికి మరోసారి ధన్యవాదాలు అని అన్నారు.

 ఇంకా ఈ కార్యక్రమంలో.... మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి.. రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఫరీదోద్దీన్ బక్క పిచ్చయ్య, జమాల్ ఖాద్రి అన్వర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, ఎంఐఎం పట్టణ పార్టీ అధ్యక్షులు హజీ,బిఆరెస్ పట్టణ కార్యదర్శి, జాఫర్,సంధినేని జనార్దన్ రావు... ఎమ్ఐఎం జిల్లా ట్రెజరర్ గౌస్ మహమ్మద్ జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ మల్లిక్, సిరాదుద్దీన్, టౌన్ కమిటీ కార్యదర్శి నదీమ్ టౌన్ కమిటీ జాయింట్ సెక్రెటరీ ముదసిర్ తదితరులు పాల్గొన్నారు

కృష్ణారెడ్డి గారి సమక్షంలో బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరిక

నేడు... బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారి సమక్షంలో... నల్గొండ పట్టణంలోని ఆరో వార్డు, శాంతి నగర్ కు చెందిన బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి..కృష్ణారెడ్డి గారు వారికి గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు... నల్లగొండ అభివృద్ధి పట్ల ఆసక్తితో.. వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని.. నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు... 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే.. ప్రజల కోసం పనిచేసే..ఫైటర్.... భూపాల్ రెడ్డి అన్నారు...

 బొల్లెద్దు రఘు తో పాటు.. సుంకిరెడ్డి వీరేందర్ రెడ్డి బొమ్మరబోయిన ముత్యాలు బొల్లెద్దు నరేందర్, దుస్స వెంకన్న బరుసు సురేష్ కుమార్ కర్నాటి లింగారెడ్డి, ఇమ్రాన్, గోలి నాగరాజు తో పాటు వందమందికి పైగా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

దళిత బహుజన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు లో చిత్తుగా ఓడిస్తాం: పెండం ధనంజయ నేత

మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.

పెండెం ధనంజయ్య నేత

బిఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు

మునుగోడు నియోజకవర్గం.

2014 లో కూసుకుంట్ల గెలిచినపుడే మునుగోడు కు అభివృద్ధి పరిచయం ఐయ్యింది.

 

రాజగోపాల్ రెడ్డి ప్రలోభాలకు లొంగిన

మునుగోడు బీఎస్పీ అభ్యర్థి

శంకరాచారి తీరును ఖండిస్తున్నాం.

డబ్బులు ఎర చూపి కోనుగోలు చేయడం రాజగోపాల్ రెడ్డి ఓటమి భయాన్ని చూపిస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ బీఎస్పీ పార్టీ కి పడతాయన్న భయంతో కోట్ల రూపాయలతో అభ్యర్థి ని లోబరుచుకున్నారు.

దళిత బహుజన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు లో చిత్తుగా ఓడిస్తాం

[ బహుజన వాదాన్ని బొందపెట్టి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ముడుపులకు అమ్ముడుపోయిన ఆందోజు శంకరాచారి వాని బొంద పెట్టాలని ఏకైక ఉద్దేశంతో బీఎస్పీ పార్టీని ఎన్నికలు పోటీ చేయకుండా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడించలనీ ఏకైక నిర్ణయంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు నుంచి తరిమికొట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది

బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త

Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.

ఇటీవలి పరిణామంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో సవాళ్లతో పోరాడుతున్న వ్యక్తులకు సహాయం చేసింది. అది వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు లేదా వాహన రుణాలు అయినా, రుణం తిరిగి చెల్లించే భారం తరచుగా రుణగ్రహీతలకు అధికం అవుతుంది. చాలా మంది తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చుకోలేక పోతున్నారు, ఇది భారీ జరిమానాలు మరియు చక్రవడ్డీల పెంపునకు దారి తీస్తుంది.

ఏదేమైనా, రుణ గ్రహీతలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఆర్‌బిఐ సంచలనాత్మక నియమాన్ని ప్రవేశపెట్టడంతో ఉపశమనం లభించింది. కొత్త ఆదేశం ప్రకారం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) చెల్లింపులు ఆలస్యం అయిన సందర్భాల్లో వడ్డీపై వడ్డీని వసూలు చేయకుండా బ్యాంకులు నిషేధించబడ్డాయి. రుణాలపై వడ్డీని నిర్ణయించేటప్పుడు స్థిర వడ్డీ రేట్లను మాత్రమే వర్తింపజేయాలని ఆర్‌బిఐ నొక్కి చెప్పింది.

అంతేకాకుండా, బ్యాంకులు ఇప్పుడు నెలవారీ EMIని ఏకపక్షంగా పెంచకుండా లేదా రుణగ్రహీత నుండి స్పష్టమైన సమ్మతిని పొందకుండా రుణ కాల వ్యవధిని మార్చకుండా నిరోధించే నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. రుణ గ్రహీతలతో సమయానుకూలంగా మరియు పారదర్శకంగా కమ్యూనికేట్ చేయడాన్ని RBI తప్పనిసరి చేస్తుంది, రుణ పదవీకాలం యొక్క ఏదైనా పొడిగింపు లేదా EMIలో మార్పులను వెంటనే తెలియజేయాలని నిర్ధారిస్తుంది. ఈ చర్య రుణగ్రహీతల హక్కులను కాపాడుతుంది మరియు వారి రుణ ఒప్పందాలకు ఏకపక్ష మార్పులను నిరోధిస్తుంది.

అదనంగా, RBI రుణగ్రహీతలను ఎప్పుడైనా పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పించడం ద్వారా వారికి అధికారం ఇస్తుంది. ముఖ్యంగా, EMI చెల్లింపులు ఆలస్యమైన సందర్భాల్లో, ఆలస్యమైన చెల్లింపుల సాకుతో బ్యాంకులు వడ్డీని వసూలు చేయకుండా నిషేధించబడ్డాయి.

ఈ విప్లవాత్మక నియమాల సెట్, జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది, వినియోగదారులను రక్షించడానికి మరియు సరసమైన రుణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి రూపొందించబడింది. రుణగ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించడంలో RBI యొక్క నిబద్ధత ఈ నిబంధనలలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇది దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా వర్తిస్తుంది. ఫలితంగా, ఆర్‌బిఐ ఆలోచనాత్మకమైన జోక్యానికి ధన్యవాదాలు, రుణగ్రహీతలు ఇప్పుడు తమ ఆర్థిక బాధ్యతలను మరింత సులభంగా నావిగేట్ చేయవచ్చు.

నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా

నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా

డబ్బు సంచులతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే దొంగలను తరిమి కొట్టాలి.. 

కేవలం ఐదేళ్ళ కాలంలోనే కరోనా మహమ్మారిని ఎదిరించి నల్గొండను అభివృద్ధి గడ్డగా మార్చానని , మరో దఫా గెలిపిస్తే నల్గొండను అభివృద్ధిలో బంగారు గడ్డగా మారుస్తానని BRS MLA అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.

తిప్పర్తి, మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచర్ల గారు మాట్లాడుతూ.. గతంలో మట్టి రోడ్లకు కూడా నోచుకోని ఈ పల్లెలన్నీ నేడు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు 20 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏం లేకనే .. ప్రజల మధ్య డబ్బు సంచుల చిచ్చు పెడుతున్నారని .. వాళ్ళకు అది తప్ప మరోటి తెలియదని ఎద్దేవా చేశారు.

KCR గారి పాలనలో రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందని ఇళ్ళే లేదని.. అందరూ సంక్షేమ పథకాలను పొందుతున్నారని అన్నారు.

కఠిక చీకటిని చీల్చివేసిన అభివృద్ధి వెలుగు మన భూపాలన్న అని... ఈ భూపాలన్న గెలుపు .. మా గెలుపని... అందుకే కారునే గెలిపించుకుంటామని పలు గ్రామాల సర్పంచులు అన్నారు

ఈ కార్యక్రమంలో మాడ్గులపల్లి MPP పోకల విద్య రాజు, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పాలుబట్ల బాపయ్య , Ex.ZPTC తండు సైదులు గౌడ్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ , వైస్ MPPలు సూదిరెడ్డి సుమలత శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, కందుల రేణుక లక్ష్మయ్య (PACS వైస్ ఛైర్మన్), MPTC వెన్న గోవర్దనమ్మ , మాడ్గులపల్లి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, సర్పంచులు బొర్రొజు సైదమ్మ సైదులు, బెల్లి శ్రీను , శివ , యర్రమాద కవితా నరేందర్ రెడ్డి, నాగయ్య, సిరిగిరి పద్మ , సాలమ్మ శ్రీను....., నాయకులు డాక్టర్ చెరుకు సుహాన్, జీడిపల్లి వెంకట్ రెడ్డి, యరమాద నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, వల్లపురెడ్డి యాదగిరి రెడ్డి, మర్రి శ్రీను , మర్రి మధు , ఎస్.కె. కరీం, కమాల్ , రంజాన్, దొంత రాములు, బొస్క మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి

బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.

నల్లగొండ జిల్లా:

నాగార్జునసాగర్ నియోజకవర్గం.....

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా....

గుర్రంపోడు మండలం,మైల పురం,కాచారం,బ్రాహ్మణ గూడెం, కొనాయి గూడెం, పల్లిపాడు,చేపురూ గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో....

స్థానిక ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారితో కలిసి పాల్గొన్న.....

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ.....

జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బి.ఆర్.యస్ పార్టీ తరుపున పోటీ చేసే నాగార్జునసాగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కెసిఆర్ గారిని ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో.....

స్థానిక ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి,పలువురు సర్పంచ్ లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కౌగిలి కోసమే శంకరా చారి బిఎస్పి కి మోసం చేసాడు--బిఎస్పి మునుగోడు నాయకులు పెండెం ధనుంజయ్ నేత

బిఎస్పి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి అందోజు శంకరా చారి నామినేషన్ విత్డ్రా.

బరిలోంచి మొదటి గుర్తు ఏనుగు పరారీ.... ఏనుగు స్థానంలో కారు.

గజరాజు జాడ తెలువక సతమతం అవుతున్న బహుజన అభిమానులు.

మొదటి నుండే దొంగగా పేరున్న శంకరా చారికి టికెట్ ఇవ్వటం పట్ల, మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బిఎస్పి నేత పెండెం ధనుంజయ్ నేత.

బిఎస్పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే ఇంతటి దారుణం...! బహుజన ముసుగులో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాడా అంటూ కామెంట్స్...!

కాంగ్రెస్ కౌగిలి కోసమే శంకరా చారి బిఎస్పి కి మోసం చేసాడు--బిఎస్పి మునుగోడు నాయకులు పెండెం ధనుంజయ్ నేత.

బరిలో నుండి ఏనుగు తొలగింపు... ఇక బిఎస్పి మద్దతు మునుగోడులో ఎవరికి...!

ఓటు బ్యాంకింగ్ ఉన్న పెండెం ధనుంజయ్ నేత మద్దతు ఎటు...!

ప్రశ్నించే బహుజన వాదిగా పెండెం... పలు కార్యక్రమాలలో ప్రజల మనసులు గెలుచుకున్న ధనుంజయ్ నేత...

నియోజకవర్గ వ్యాప్తంగా తన సామాజిక వర్గం మద్దతు ఉన్న పెండెం ధనుంజయ్ నేత...!

పలు పార్టీల వల... పార్టీ మారాలంటూ అభ్యర్థన....!

పెండెం ధనుంజయ్ మద్దతు బిఆర్ఎస్ కి ఉంటుందా...! తన గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపా

నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర* *సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి

నల్లగొండ సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర

 సాగు, తాగునీరు సాధనకై పోరాడిన కమ్యూనిస్టులను గెలిపించండి

   నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ రహిత ప్రాంతంగా గుర్తింపు రావడానికి ఎస్ఎల్ బీసీ నీటి ద్వారానే సాధ్యమని గ్రహించిన కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నేడు నల్లగొండ జిల్లా కొంతమేర అభివృద్ధి జరిగిందని అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని సిపిఎం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు 

      బుధవారం 1,2,3,18,19 వార్డులలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి సిపిఎం పార్టీ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయమని కోరారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న కమ్యూనిస్టులు నేడు అసెంబ్లీలో లేకపోవడంతో అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాము నియంతృత్వనికి దారి తీస్తుందని అన్నారు కాకతీయులనాడు ఏర్పడ్డ పానగల్లు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ ద్వారా పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పానగల్లులో చేపట్టలేదని ఆరోపించారు. పానగల్లును పర్యాటక కేంద్రంగా మారుస్తామని గొప్పలు చెప్పడం మినహా చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు పానగల్లులో పశుపోషణ గొర్రెల మేకల పెంపుకు దారులు అధికంగా ఉన్నందున ప్రస్తుతం ఉన్న పశు వైద్యశాల ఆధునికరించి 24 గంటలు డాక్టర్లు వైద్య సేవలు అందజే విధంగా ప్రభుత్వంపై పోరాడుతామని హామీ ఇచ్చారు పట్టణ పేదలు కార్మికుల హక్కుల రక్షణ కోసం కనీస వేతనాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం మహిళలు మైనార్టీల రక్షణ కోసం సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సమస్యల పట్ల కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు

  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం మాట్లాడుతూ రైతు నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధిలో సాగు త్రాగునీరు సాధన కోసం d39,40,41 పిల్ల కాలువల నిర్మాణం కోసం పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగిన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 

      *ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్, ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మైల యాదయ్య ఆకిటి లింగమ్మ రుద్రాక్ష శేఖర్ రుద్రాక్ష యాదయ్య దండెంపల్లి దశరథ బుజ్జమ్మ కొండ చంద్రకళ జిట్టా సైదులు దండెం పల్లి సరోజ,భూతం అరుణ, అద్దంకి నరసింహ సలివోజు సైదాచారి , మధుసూదన్ రెడ్డి ,కోట్ల అశోక్ రెడ్డి మారగోని నగేష్ చెనగోని వెంకన్న శ్రావణ్ తరుణ్ కర్నాటి శ్రీరంగం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గoడమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కార్తీక మాసములో నియమ నిబంధనలు పాటిస్తూ నలబై రోజుల పాటు దీక్షలో వుండే అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, ఇతర దీక్షా స్వాములకు  డిసెంబరు 31 వరకు ప్రతిరోజూ శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వెనకభాగంలో నిర్వహించే అన్నదానం కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలందరిపై వుండాలని, అయ్యప్ప స్వామి అందరిని చల్లగా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వూర రామ్మూర్తి, మద్ది శ్రీనివాస్ యాదవ్, శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి సభ్యులు అంతటి విజయ్, యర్రంశెట్టి ఉపేందర్, రాచకొండ దేవయ్య, రాచకొండ క్ర్రష్ణ, చీపూరి క్ర్రష్ణ, వెంపటి పురుషోత్తం, కొండ్లె రంగయ్య, గుండా శ్రీధర్, పందిరి ఉపేందర్, దేశోజు నాని, గాలి క్ర్రష్ణ, ఎర్ర వెంకన్న, వెంపటి శభరినాధ్ తది తరులు పాల్గోన్నారు.