దోపిడి లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ: చాపల శ్రీను
నల్లగొండ జిల్లా:
మునుగోడు: ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం బెల్లం శివయ్య అధ్యక్షత బుధవారం మండల కేంద్రంలో సిపిఐ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను హాజరై మాట్లాడుతూ.. దోపిడీ లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ అని అన్నారు.
పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు అసలైన కార్మికులకు అందకుండా తన అనుకున్న వారికి ఇవ్వడం సరైనది కాదని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహలక్ష్మీ గాని దళిత బంధువు గాని బీసీ బందు గాని ఇవ్వాలని మరియు ప్రతి కార్మికునికి టూ వీలర్ వాహనం ఇవ్వాలని కోరారు.కార్మికునికి ఎలాంటి ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని, వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు ఒక్కటై తమ ఓటు ద్వారా అవినీతిపరులకు బుద్ధి చెప్పాలని, నిజమైన నికారసుగా కార్మికుల పక్షాన నిలబడే నాయకున్ని పరిశీలించి గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాలాద్రి, భీమనపల్లి స్వామి, ఏర్పు నరసింహ, నగేష్, హుస్సేన్, దొమ్మాటి గిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.





నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు గా విధులు నిర్వహిస్తున్న రేఖ వెంకటేశ్వర్లు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 83 వ స్నాతకోత్సవం లో ఫిజిక్స్ సబ్జెక్టు నందు పీహెచ్డీ స్నాతక అవార్డును మంగళవారం హైదరాబాదులో ఓయూ వీసీ రవీందర్, Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతులమీదుగా అందుకున్నారు. వారు ప్రో. ఏ.సదానందచారి పర్యవేక్షణ లో 'నానో విక్షేపిత సూపర్ అయానిక పదార్థాల విద్యుత్ వాహకత్వం' పై అధ్యయనం చేశారు. 






Nov 02 2023, 17:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.6k