/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత Mane Praveen
TS: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
భద్రాచలం జిల్లా: ఎన్నికల వేళ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్రనాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో, హాస్పిటల్‌ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో భద్రాచలం ఎంపీపీ గా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
NLG: ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా 2వసారి దళిత రత్న బుర్రి వెంకన్న
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర 10వ మహాసభలు  హైదరాబాదులోని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ (శాంతి చక్ర ఇంటర్నేషనల్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ హాల్ లో ఆదివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి దాసరి లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జాతీయ చైర్మన్ డాక్టర్ హెచ్.ఆర్. గోయల్, జాతీయ సెక్రెటరీ జనరల్ అశోక్ శెండే, మాజీ జాతీయ చైర్మన్ ఎస్.చంద్రయ్య, మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి. యాదయ్య, దక్షిణ భారతదేశం సెక్రెటరీ వైద్యనాథ్, వక్తలుగా ప్రొఫెసర్ కాశీమ్, డాక్టర్ బైరీ నరేష్, డాక్టర్ డి.యాదయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న బుర్రి వెంకన్న ను మరోసారి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బుర్రి వెంకన్న మాట్లాడుతూ... నామీద నమ్మకం ఉంచి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు నా ప్రత్యేకమైన జై భీమ్ లు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగ హక్కులు ప్రజలకు తెలిసే విధంగా కృషి చేస్తానని, గ్రామాలలో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయని, వారిని సైన్స్ మీద నమ్మకం కలిగేటట్లు చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి తెలిసే విధంగా చైతన్యపరుస్తానని, బాబా సాహెబ్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంస్థలో పనిచేయడం సంతోషకరమని అన్నారు.

నల్గొండ జిల్లాలోని గ్రామ మండలాలలో మరియు జిల్లాలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ పూర్తి బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నా మీద నమ్మకము తో నన్ను  రెండవ సారి రాష్ట్ర శాఖలో అవకాశం కల్పించినందుకు జాతీయ కమిటీ మరియు మాజీ జాతీయ అధ్యక్షులు చంద్రయ్య,  రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య కు, కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ అని తెలియజేశారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్నకు మెమెంటో
డా. బిఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర 10వ మహాసభలు, ఆదివారం హైద్రాబాద్ లోని లకిడికపూల్ శాంతి చక్ర బిల్డింగ్ హాల్లో నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  బుర్రి వెంకన్న కు.. ఆ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ గోయల్  మెమెంటో అందజేశారు. నిరంతరం ప్రజా సమస్యల పైన అంబేద్కర్ ఆశయాలను మరియు స్వేచ్ఛ సమానత్వం కోసం నల్గొండ జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సందర్బంగా  అభినందించారు. దళిత రత్న బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఈ సంఘంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తానని, సంఘంలో సేవ చేసే అదృష్టం నాకు కలగడం చాలా సంతోషకరమని నల్లగొండ జిల్లాలో 4 సంవత్సరాల నుండి ప్రజా సమస్యల పైన, నిరంతరం సంఘం బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో మండలాలలో అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ హక్కులు  ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: ఘనంగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 10వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, 10వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం లకిడికపూల్ లోని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ నందు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎస్డి జాతీయ చైర్మన్ హెచ్ఆర్ గోయల్, విశిష్ట అతిధి జాతీయ సెక్రెటరీ జనరల్ అశోక్ షిండే, మాజీ జాతీయ చైర్మన్ ఎస్. చంద్రయ్య, దక్షిణ భారత సెక్రటరీ వైజ్ నాథ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్రను విపులంగా వివరించారు. ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. లక్ష్మయ్య నైతిక విలువల పైన ప్రసంగించారు. అదేవిధంగా మరో వక్త మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ మాట్లాడుతూ.. సంగం అభివృద్ధి, నాయకత్వ లక్షణాల పైన విపులంగా వివరించారు. మరో వక్త మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి.యాదయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ అనంతరం దళిత ఉద్యమం గురించి వివరించారు. అనంతరం  పలువురు సంఘ సభ్యులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటస్వామి, ఉపాధ్యక్షులు వై. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బి. వెంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు బిందుశ్రీ, మహిళా ప్రధాన కార్యదర్శి ఎం.విజయ మరియు జాతీయ, రాష్ట్ర హోదా కలిగిన నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, అంబేద్కర్ వాదులు, పలువురు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS TELANGANA

SB NEWS NATIONAL MEDIA
NLG: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై నవీన్ రెడ్డి
నల్లగొండ జిల్లా: ఆర్థిక సమస్యలతో ఇటీవల మృతి చెందిన మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన, దామెర అబ్బయ్య కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొన్న NRI కే. నవీన్ రెడ్డి, ఆదివారం సరంపేట సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్, వేనమళ్ళ నర్సింహ, దామెర రాములు పాల్గొన్నారు.
TS: తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ లో నేడు అటుకుల బతుకమ్మ
ప్రకృతి సిద్ధమైన పూలను గుండ్రంగా అందంగా ఒక దానిపైన ఒకటి పేర్చి, ఆ పూలనే పార్వతి దేవి (గౌరీ దేవి)గా భక్తిశ్రద్ధలతో కొలిచే పూల పండుగనే బతుకమ్మ పండుగ. ఆడపడుచులు అంతా సాయంత్రం ఒక చోటికి చేరి మధ్యలో బతుకమ్మలను ఉంచి చుట్టూ రౌండ్ గా నిలబడి.. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో.. అంటూ పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆట ఆడుతారు. బతుకమ్మ ఆటలకు పలు పాటలు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగలో ఒకటి. ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. రోజుకు ఒక పేరుతో జరుపుకుంటారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
మొదటి రోజు - ఎంగిలిపూల              బతుకమ్మ
రెండవ రోజు - అటుకుల బతుకమ్మ
మూడవరోజు - ముద్దపప్పు బతుకమ్మ
నాలుగవ రోజు - నానే బియ్యం బతుకమ్మ
ఐదవ రోజు - అట్ల బతుకమ్మ
ఆరవ రోజు - అలిగిన బతుకమ్మ
ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ.
ఎనిమిదవ రోజు - వెన్నముద్దల   బతుకమ్మ
తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ

నేడు రెండవ రోజు అటుకుల బతుకమ్మ: ఈరోజు అమ్మవారికి వాయినం గా అటుకులను సమర్పిస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. బతుకమ్మ పేర్చడానికి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తు లలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. SB NEWS TELANGANA


ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అవగాహన కల్పించిన మర్రిగూడ ఎస్సై

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మర్రిగూడ మండల ఎస్సై రంగారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు పైన శనివారం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రంగారెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, పౌరులందరూ ఎలక్షన్స్ ప్రవర్తన నియమాలని పాటించాలని, ప్రచారాలకు, మీటింగ్ లకు, ర్యాలీ లకు బ్యానర్లు కట్టుటకు, హోల్డింగ్ లు పెట్టుటకు రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని, 50వేల కంటే ఎక్కువ నగదును దగ్గర పెట్టుకోవద్దని, 50 వేల పైన నగదు ఉంటే తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

దేవరకొండలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దమ్మదీక్ష దివస్
నల్లగొండ జిల్లా, దేవరకొండలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేడు 67వ దమ్మదీక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రజా సంఘాల నాయకులు బుద్ధిష్ట్ డాక్టర్ ఏకుల రాజారావు, కంబాలపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో బుద్ధ వందనం చేసి, దమ్మదీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బోది సత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్,  14 అక్టోబర్ 1956 నాగపూర్ లోని దీక్షభూమి వద్ద ఐదు లక్షల మందితో బౌద్ధ దమ్మ దీక్షను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు ధర్మపురం శ్రీను, సైదులు, అంజయ్య భాస్కరాచారి పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
గ్రహణం సందర్భంగా.. ఆ రెండు ప్రధాన దేవాలయాలు మూసివేత ఎప్పుడంటే..
ఈనెల 28న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈనెల 28 రాత్రి 7.05 గంటల నుండి ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున 3.15 వరకు మూసి వేయనున్నారని అధికారులు తెలిపారు.

SB NEWS
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగుల వేణు కు డాక్టరేట్

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నాగుల వేణు కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రేట్ ను ప్రధానం చేసింది.

"యాదాద్రి భువనగిరి జిల్లా లో పంచాయతీరాజ్ వ్యవస్థలు మహిళ సాధికారత" అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు నాగుల వేణు కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించి, సన్మానించి ఘనంగా సత్కరించారు.