రైతులను మోసం చేస్తున్న కేసీఆర్: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం విమర్శించారు.గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కలిగిన పేద రైతులకు, రుణమాఫీ అయిన రైతులకు.. తిరిగి పంట రుణాలు ఇవ్వాలని వారు అన్నారు. అసైన్డ్, ఇనాం భూములు కలిగిన పేద రైతులకు తిరిగి పంట రుణం ఇవ్వకుండా, బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నాయకులు కొత్తపల్లి నరసింహ, గౌస్యబేగం, బల్లెం స్వామి, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:
ఖరీఫ్ ధాన్యం మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, మధ్య దళారులు, మిల్లర్లు, కమిషన్ దారుల చేతిలో రైతులకు మద్దతు ధర లభించక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతాంగన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి
SB NEWS

SB NEWS TELANGANA
RR: ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని "A" బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ లో పలువురుకి నియామకపు పత్రాలు అందజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు.
గోపగళ్ల సత్యా రాణి - ఉపాధ్యక్షురాలు గా లక్కుమళ్ళ కల్పన - ప్రధాన కార్యదర్శి గా లుగా నియమితులు అయ్యారు. వీరికి మల్ రెడ్డి రంగారెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో రాష్ట, జిల్లా బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి: ఒకే చెర్వులో వారం రోజుల్లోనే ఇద్దరు శవమై తేలిన ఘటన యాదాద్రి జిల్లా లో చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరి చెరువులో గత వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది.
నల్గొండ: సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు మరియు మరియు చోల్లేటి ప్రభాకర్ రచించిన "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ
స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పరీక్షలపై విద్యార్థులు పెంపొందించుకోవాల్సినటువంటి నైపుణ్యాలు అనే అంశంపై ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ బుధవారం "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" పుస్తకావిష్కరణ చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. కృషి, పట్టుదల, స్వయంకృషితో కష్టపడి చదివి విజయం సాధించవచ్చు అని, కోచింగ్ తప్పనిసరి కాదని, ఎవరైనా సాధించవచ్చని తెలిపారు.
చోల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకై ప్రణాళిక తో సంసిద్ధం కావాలని, తను రచించిన పుస్తకం.. "యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ఫైర్ మేక్స్ హిం ఐఏఎస్" ఎంతగానో ఉపయోగపడుతుందని, యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికతో సన్నద్ధం కావాలని, లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే ఆ రంగంలో రాణించగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ యాదగిరి , యాదగిరి రెడ్డి, దీపిక, శ్రీధర్, దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి, మల్లేశం, తదితర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనానుభవం సర్టిఫికెట్లతో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు.
TS: ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 15 నుంచి 41 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
ఈసారి సభకు భారీ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.ఈనెల 18న జడ్చర్ల, మేడ్చల్ బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఎవరైనా ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
Oct 12 2023, 18:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.3k