/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: డ్రైనేజీలో ప‌డి మ‌హిళా హెడ్ కానిస్టేబుల్ మృతి Mane Praveen
TS: డ్రైనేజీలో ప‌డి మ‌హిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాచలం జిల్లా: మరి కొద్దిసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లవలసిన శ్రీదేవి అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది.  రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడి శనివారం మధ్యాహ్నం ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయింది. కెటిఆర్ ప‌ర్య‌ట‌న‌ కు బందోబ‌స్తుకు వ‌చ్చిన ఆమె.. రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజ్ లో పడిపోయింది. స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ శ్రీదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

SB NEWS TELANGANA
బి.టీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు వినతి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం: అజిలాపురం- నర్శింహ్మపురం గ్రామాల అనుబంధ రహదారిని బి.టీ రోడ్డుగా మార్చాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రాన్ని శనివారం మెగావత్ చందు నాయక్ అందజేశారు. అజిలాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆవాస గ్రామం నర్సింహ్మ పురం రోడ్డు సరైనది లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని,  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని కలిసి  సేవ సమాజ్ నిర్మాణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మెగావత్ చందు నాయక్ మాట్లాడుతూ.. అజిలాపురం గ్రామం  నుండి నర్శింహ్మపురం మీదుగా  నర్శింహ్మ పురం గేటు అనగా మెయిన్ రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా కంకర తేలిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి  నర్శింహ్మపురం రోడ్డు ను బి టి రోడ్డుగా మార్చవలసిందిగా కోరారు. SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం
నల్లగొండ: హిందీ భాషా దినోత్సవం సందర్భంగా, పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ ఆధ్వర్యంలో భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హోమ్ నిధి శర్మ, మేనేజింగ్ డైరెక్టర్  బిడిఎల్, హైదరాబాద్ వారు పాల్గొని  మాట్లాడుతూ.. హిందీ భాషా ప్రాధాన్యతను, భాషల ఆవశ్యకతను, హిందీ చదవడం వల్ల లభించే ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే క్రమశిక్షణ సమయపాలన అవసరమని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. హిందీ భాషను ఎంచుకొని అభ్యసించడం వలన కలిగే లాభాలు తెలిపారు. మల్కాజిగిరి ప్రభుత్వ కళాశాల హిందీ ఉపన్యాసకులు జి ఎన్ జగన్ మాట్లాడుతూ.. హిందీ భాషా జాతీయ ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. మరో అతిధి ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. హిందీ వలన భారతీయ సంస్కృతి తన భిన్నత్వాన్ని ఎలా నిలుపుకుంటుందో వివరించారు.

ఈ కార్యక్రమంలో హిందీ శాఖ అధ్యక్షులు డాక్టర్ సీతారాం రాథోడ్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కృష్ణ కౌడిన్య, డాక్టర్ వి వి సుబ్బారావు, డాక్టర్ ఎన్ దీపిక, డాక్టర్ వెల్దండ సుబ్బారావు, లవీందర్ రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, లింగస్వామి, రమ్య, గోవర్ధనగిరి, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.




NLG: విష్ణుమూర్తి కుటుంబానికి నాగార్జున ప్రభుత్వ కళాశాల సిబ్బంది ఆర్థిక సహాయం
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది , మరియు వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల తరఫున ఇటీవల మరణించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు విష్ణుమూర్తి కుటుంబానికి రూ.7,57,500/- ఆర్థిక సహకారం అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్, మరియు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి డిపాజిట్ చేసిన డాక్యుమెంట్లు మరియు ఎల్ఐసి పాలసీ కాపీని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ప్రమాదవశాత్తు విష్ణుమూర్తి మరియు స్వప్న ఇద్దరు చనిపోవడం కారణంగా వారి పిల్లలకు, వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాగార్జున కళాశాల సిబ్బంది ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మునీర్, శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ చంద్రశేఖర్, ప్రసన్న కుమార్, నాగరాజు, మల్లేశం, వెంకటేష్, కళాశాల సిబ్బంది సూదిని వెంకటరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
మర్రిగూడ: ఆశాల మానవహారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ఆశాల మానవహారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ఆశాల మానవహారం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడ మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
మర్రిగూడ మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణల నేపథ్యంలో, నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కట్టల కొద్ది నోట్ల కట్టలు లభ్యం. ఒక్క ట్రంక్ పెట్టే లోనే రెండు కోట్లు కు పైగా నగదు లభ్యం. మహేందర్ రెడ్డి ఇంటి లో కిలోల కొద్ది బంగారం ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేందర్ రెడ్డి కి సంబంధించిన ఆస్తులపై ఏకధాటిగా 15చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది... SB NEWS SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
నేటితో 2000 ల రూపాయల నోటు కనుమరుగు
నేటితో 2000 ల రూపాయల నోటు చెల్లుబాటు ముగియనుంది. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోటు మార్పిడి చేసుకునేందుకు అనుమతిచ్చింది. ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల నోటును బ్యాంకుల్లో జమ చేయడానికి నేటి వరకూ మాత్రమే సమయం ఇచ్చింది. ఇప్పటికే కోట్ల కొద్దీ డబ్బులు బ్యాంకుల్లో అనేక మంది జమ చేశారు. 2016 లో నవంబరు 8న వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, దాని స్థానంలో రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే ఈ రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ విలువైన రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. దాదాపు రెండువేల రూపాయల నోటు ఏడేళ్లు చలామణిలో ఉన్నట్లయింది అయితే ఈ రెండు వేల రూపాయల నోటు వల్ల చిల్లర సమస్య ఎక్కువగా వేధిస్తుండేది. అంతేకాదు గత రెండేళ్ల నుంచి బ్యాంకుల్లోనూ రెండు వేల రూపాయల నోటు కన్పించడం మానేసింది. ఏటీఎంల లోనూ రెండు వేల రూపాయలు రావడం లేదు. దీంతో ప్రజలలో కూడా రెండు వేల నోటు రద్దవుతుందన్న అనుమానం మొదలయింది. అనుకున్న మేరకే రెండు వేల రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అయితే నేటి వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు నేటితో కాలం చెల్లినట్లవుతుంది.

SB NEWS

STREETBUZZ NEWS APP

SB NEWS
అభివృద్ధి చేసి..మునుగోడు రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రూ. 30కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల శంకుస్థాపన చేశారు. మండలంలోని అల్లాపురం గ్రామానికి ఉదయమే చేరుకున్న ఎమ్మెల్యే.. సరళ మైసమ్మ దేవాలయానికి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పీపల్ పహాడ్, డి.నాగారం, కొయ్యలగూడెం, ఎల్లంబావి, పంతంగి, ఎస్ లింగోటం, నేలపట్ల, కుంట్లగూడెం, మందోళ్ళగూడెం, పెద్ద కొండూరు, చిన్న కొండూరు గ్రామాలలో వరుసగా పర్యటించారు. పంచాయతీరాజ్ నిధులు    సుమారుగా రూ.15కోట్లు, హెచ్ఎండిఏ నిధులు రూ.15 కోట్లతో ఆయా గ్రామాలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎల్లంబావి గ్రామంలో సర్పంచ్ గుర్రం కొండల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. సర్పంచ్ కొండల్, ఎల్లంబావి గ్రామ శివారు నుండి డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యేకు  ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుండి 2018వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోయిందని గుర్తు చేశారు. 2018 లో ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి మోసం చేసి వచ్చిన ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ దీవెనలతో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో 2022 ఉప ఎన్నికల్లో గెలిచానని, గెలిచిన నాటి నుంచి మునుగోడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చు కోవడమే లక్ష్యంగా ముందు కెళ్తున్నానన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచులు కొలను శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కొండల్, రెక్కల ఇందిరా సత్తిరెడ్డి, ఆకుల సునీత శ్రీకాంత్, బక్క స్వప్న శ్రీనాథ్, కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, బాతరాజు సత్యం, చౌట వేణుగోపాల్, కాయితి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, ఉప సర్పంచ్ లు బోరెం ప్రకాష్ రెడ్డి, సాయి రెడ్డి బుచ్చిరెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొత్త పర్వతాలు, జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూర్పింటి యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సుర్కంటి శ్రీధర్ రెడ్డి, చెక్క శ్రీనివాస్, బొడ్డు గాలయ్య, మాచర్ల కృష్ణ, పిట్టల శంకరయ్య, మాజీ సర్పంచ్ లు బక్క శంకర్, యాట యోగానందం, నాయకులు మెట్టు మహేశ్వర్ రెడ్డి, గంగాపురం నగేష్ గౌడ్, రాసాల నాగరాజు యాదవ్, బొడ్డు పరమేష్, రిక్కల బాలకృష్ణారెడ్డి, జువ్వి శివకుమార్, పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.