NLG: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగులు
![]()
నల్లగొండ: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు ఏఐటియూసి)ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు ముట్టడి చేయగా ఆఫీస్ స్తంభించిపోయింది. ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నాలుగు గంటలపాటు బైటాయించడంతో కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆఫీసుకు రాకుండా పోయినారు. అంతకుముందు డైట్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యము లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న ఆడపడుచుల కోరికలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నదని వారన్నారు.
శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మిక సంఘాలతో మొదట చర్చలు జరిపి వాగ్దానం చేసినవి అమలు పరచకుండా మాట మార్చడం సరైనది కాదని అన్నారు. పర్మినెంట్ , కనీస వేతనాలు, గ్రాడ్యుటి ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ అధికారికంగా సర్కులర్ , జీవోలు ఇచ్చి అంగన్వాడీల సమ్మె విరమింపజేయాలని వారు డిమాండ్ చేశారు
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైగా అంగన్వాడీ ఉద్యోగులు ఐసిడిఎస్ సంస్థలో పనిచేస్తున్న ఎలాంటి చట్టబద్ధ హక్కులు కల్పించడం లేదని వారన్నారు. అంగన్వాడీల పనితో పాటు గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలు ఇతర ప్రజలకు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పట్టించుకోవడంలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ.. నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు.
రాష్ట్రంలో పోరాడుతున్న సంఘాలతో చర్చలు జరపకుండా భజన సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్చిన్నం చేయాలనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొడుతారని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి టీచర్స్, ఆయాలను భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఇతర ఉద్యోగులతో నడుపాలని చూస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.
అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి పర్మినెంట్ చేసి హెల్త్ కార్డులు ఇచ్చారని వారన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు గ్రాడ్యుటి పెన్షన్
బోనస్, వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వారన్నారు. ఒకవైపు పరివారం అనేక రెట్లు పెంచి ప్రభుత్వ పథకాలు సర్వే నువ్వు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కి మంచి పేరు తీసుకొస్తున్న అంగన్వాడీలకు కదా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.26000/- ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
అంగన్వాడి ఉద్యోగ సంఘాల జేఏసీ సిఐటియు ఏఐటీయూసీ అధ్యక్షులు పొడి శెట్టి నాగమణి, వనం రాధిక లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసురత్నం ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎడమ సుమతమ్మ, సిఐటియు ఏఐటియూసి జిల్లా నాయకులు దోటి వెంకన్న, చాపల శ్రీను, డి వెంకన్న,దండంపల్లి సత్తయ్య, బయన్న,సలీం, సైదయ్య ,అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ,విజయలక్ష్మి,కోట్ల శోభ ,అరుణ,సాయి విజిత, రాణి ,అన్నపూర్ణ , శాంత కుమారి, రమాదేవి,సరిత,మమత, సుజాత , శాంతాబాయి, విజితా,లక్ష్మి, పద్మ, కేదారి , నాగమణి,జగదీశ్వరి, విజయ,సుజాత,అంజలి, స్వప్న ,మహిత, జయమ్మ ,విజయ,సువార్త,మనెమ్మా, జ్యోతి ,లెనిన్, అద్దంకి నరసింహ,తదితరులు పాల్గొన్నారు






బీఎస్పీ సహా చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత గతంలో మాదిరిగా పెండింగ్ కాకుండా ఈ సారి ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను.
మహిళలకు ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్లు కాదు.. 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళల జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనూ బీఎస్పీ పార్టీ తరపున పార్లమెంటులో ఆమె మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుంది అని మాయావతి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, అసెంబ్లీ మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, సీనియర్ నాయకులు బొట్ట శివ, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము గణేష్, మరియు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA
DOWNLOAD SB NEWS APP
అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహదాత పగిళ్ల రాజశేఖర్, లడ్డు దాత వావిళ్ళ అంజి యాదవ్. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మిగిలి ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు.
నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై పర్యవేక్షణ చేపడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. మిగిలి ఉన్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించి, ఆ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS, TELANGANA
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య హాజరై అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారికి మద్దతు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, 26 వేల వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులు ఆపాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం చింతపల్లి మండల నాయకులు ఊడిగుండ్ల రాములు, అంగన్వాడి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే. రజిత ఆర్. శోభ, శారద, అనంతలక్ష్మి, సువర్ణ, కలమ్మ, జయ శ్రీ, విమలాదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు
రమేష్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల హామీ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. లేనట్లయితే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
SB NEWS NALGONDA DIST
Sep 21 2023, 11:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.3k