/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: రేపు నాంపల్లి మండలానికి రానున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి Mane Praveen
NLG: రేపు నాంపల్లి మండలానికి రానున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలానికి విచ్చేయుచున్నారు. నాంపల్లి మండలంలోని దేవత్ పల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే ఉదయం 09: 30 గంటలకు ముష్టిపల్లి గ్రామంలో  11 KV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం  ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను మండలంలోని లబ్దిదారులకు అందజేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలి: కక్కిరేణి శిరీష
యాదాద్రి జిల్లా, రామన్నపేట: ఈ నెల 18 నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బహుజన్ సమాజ్ పార్టీ రామన్నపేట మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష డిమాండ్ చేశారు. శుక్రవారం రామన్నపేట బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతు.. స్దానిక సంస్థలలో మాదిరిగా చట్ట సభలలో కూడా 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని  డిమాండ్ చేశారు. అవసరం అయితే ప్రతి పక్షాల మద్దతుతో ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆమె కోరారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు విశేష కృషి చేయాలని అన్నారు.
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే భగత్
NLG: త్రిపురారం మండలం, రాగడప గ్రామానికి చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ రేవూరి దశరథ ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న విషయాన్ని తెలుసుకొన్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు భగత్ కుమార్ శుక్రవారం దశరథ గృహాన్ని సందర్శించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్ రేవూరి కొండల్, మండల నాయకులు మడుపు వెంకటేశ్వర్లు, కలకొండ వెంకటేశ్వర్లు, బొల్లం సైదులు, రేగులగడ్డ దేవస్థాన చైర్మన్ జాల పాపయ్య, త్రిపురారం పట్టణ అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్, ఎంపీటీసీ రావినాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అవిరెండ్ల సైదులు, మండల నాయకుడు మంద వెంకటేశ్వర్లు, మండల బిసి సెల్ అధ్యక్షుడు పోషబోయిన సైదయ్య, మాజీ సర్పంచ్ లు రేవూరి కోటయ్య, బాలు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో జిపి కార్మికుల వివిధ డిమాండ్లపై ఎంపీడీవో కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండలం లో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్ర వారం, కార్మికుల వివిధ డిమాండ్లపై  ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను, అదేవిధంగా సమ్మె కాలంలో వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వివిధ డిమాండ్లతో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో 34 రోజులు సమ్మె చేస్తే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  జిపీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని సమ్మెను విరమించండి  అని తెలంగాణ రాష్ట్ర జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఎలాంటి డిమాండ్లను పరిష్కరించలేదని వారు అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె బాటలోకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పోలేపల్లి రాములు నాయక్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు
ఒకేరోజు ఇద్దరు భార్యల మృతి..
TS: రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి కి చెందిన మంగళారం అంతయ్య కు ఇద్దరు భార్యలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద భార్య లక్ష్మి (55), చిన్న భార్య చంద్రమ్మ (40) ఇద్దరూ ఒకేరోజు మృతి చెందారు. మొదట తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్న భార్య మృతి చెందింది.

ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద భార్య కూడా మరణించడం జరిగింది. దీంతో భర్త అంతయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని సమీప బంధువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
NLG: మండల స్థాయి SGF U/17 బాల బాలికల క్రీడోత్సవాలు ప్రారంభం
నల్గొండ: పట్టణంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో గురువారం, మండల స్థాయి SGF U/17 బాల బాలికల  క్రీడోత్సవాలలో భాగంగా ముఖ్యఅతిథిగా ఎంఈఓ అరుంధతి, గౌరవ అతిథిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు ట్రస్మా జిల్లా శాఖల ప్రతినిధి అజీజ్ షరీఫ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హాజరై క్రీడలు ప్రారంభించారు.
NLG: చిట్యాలలో అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మించాలని బిఎస్పి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిట్యాల: పట్టణ కేంద్రంలో ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారిపై అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో దుకాణదారుల వద్ద నుండి సంతకాలు సేకరించారు. దుకాణదారులు సంఘీభావంగా సంతకాలు చేశారు. అనంతరం మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. చిట్యాల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కువ కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడి, తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలో అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ హైవే మీదుగా ప్రతి రోజు లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. చిట్యాల గుండా భువనగిరి మీదుగా గజ్వేల్  ప్రజ్ఞాపూర్ వైపు భారీ వాహనాలు పోవడం వల్ల, భారీగా ట్రాఫిక్ జామై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు స్పీడ్ గా రావడం వల్ల రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఇకనైనా పాలకులు స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి అండర్ పాసింగ్ బ్రిడ్జి ను నిర్మించాలని ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మండల సలహాదారులు జిట్టా నర్సింహా రాజు, చుక్క నర్సింహా, మహేష్, యోగి, సంతోష్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: బిఎస్పి మండల మహిళా కమిటీ ఎన్నిక
యాదాద్రి జిల్లా, రామన్నపేట: మండల బిఎస్పి పార్టీ మహిళా కమిటీని గురువారం ఎన్నుకున్నారు. కో కన్వీనర్ గా ఎన్నారం గ్రామానికి చెందిన గూడపురి సంతోష ముదిరాజ్ ని, మండల మహిళా కార్యదర్శి గా మునిపంపుల గ్రామానికి చెందిన బందెల అనిత ను నకిరేకల్ బిఎస్పీ మహిళ కన్వీనర్ మర్రి శోభ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ.. రామన్నపేట మండలంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికోసం కష్టపడి పని చేస్తామని వారు అన్నారు. మహిళలకు గుర్తింపు తెచ్చే విదంగా బిఎస్పీ పార్టీ కీలకమైన పోస్టులు ఇస్తున్నారని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీలో  మండలంలో పనిచేయడం మాకెంతో ఆనందంగా ఉందని, పార్టీ అధినేత మాయావతి ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఎంతో చైతన్యం అవుతున్నారు అని అన్నారు. మహిళలను గుర్తించి కీలకమైన స్థానం కల్పించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే ఆ విలువలు దక్కుతాయని అన్నారు. తమ ఎంపికకు సహకరించిన  నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు మేడి సంతోష్, మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష లకు తమ కృతఙ్ఞతలు అని తెలిపారు.
అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన పలు సంఘాలు

నల్లగొండ జిల్లా, చింతపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల కోసం చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హెచ్చరించారు.

గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, నిరవధిక సమ్మె నాలుగవ రోజులో భాగంగా చింతపల్లి ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆఫీసు ముందు ముట్టడి  జరిగింది. ప్రాజెక్టు ఆఫీస్ నుండి  తాహసిల్దార్ కార్యాలయం వరకు  ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరానికి హాజరై వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ, అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టించడం దిక్కుమాలిన చర్య అని ఆరోపించారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవకుండా భజన సంఘాలను పిలవడం అప్రజా స్వామికమని ఏద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనం తదితర డిమాండ్స్ పరిష్కరించాలని  సీఐటీయూ ఎఐటియుసి సంఘాల జేఏసీ అధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రం లో నిరవధిక సమ్మె చేస్తున్నామన్నారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవక పోవటం అప్రజాస్వామికం. మళ్ళీ పాత పద్ధతి లోనే అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేస్తూ ఐసిడిఎస్ మంత్రి హామీలు ఉన్నాయని చెప్పారు. మంత్రి హామీలు సమస్యలను పరిస్కారం చేయక పోగా మరింత అసంతృప్తిని పెంచిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 12న మంత్రి సత్యవతి రాథోడ్  అత్యంత దుర్మార్గమైన పద్దతిని అనుసరించి పోరాటంలో లేని సంఘాలతో చర్చలు జరిపారని తెలిపారు. అతి ముఖ్యమైన డిమాండ్స్ ఐన.. పర్మినెంట్, కనిసవేతనం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు తదితర ముఖ్యమైన డిమాండ్స్ ను ఏవి కూడా ప్రస్తావించలేదని అన్నారు. బతికి ఉన్నప్పుడు కావాల్సిన సౌకర్యాలను కల్పించకుండా, ఆ డిమాండ్స్ ను పక్కన పెట్టి కేవలం చనిపోయిన తర్వాత దాహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు 20 వేలు, ఆయాలకు 10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం అని అన్నారు. ఇందులో కూడా టీచర్లకు, ఆయాలకు అమౌంట్ లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదు. ఇద్దరికి సమానంగా నిర్ణయం చేయాలని హితవు పలికారు.

ఇన్సూరెన్స్ 2 లక్షలు అన్నారు కానీ జీఓ రాలేదు. మినీ వర్కర్ల సర్కులర్లో మినీలను మెయిన్ టీచర్స్ గా నియామకం, హెల్పర్ల నియామకం పైన స్పష్టత లేదు. షరతులు అనే అంశం మినీ టీచర్స్ కు ప్రమాదకరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్లీ పాతదే ప్రకటించారు.మొత్తానికి మంత్రి చర్చలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆరోపించారు. మళ్లీ అంగన్వాడి ఉద్యోగుల్ని మోసం చేసే విధంగా హామీలు ఇచ్చారన్నారు. ఈ మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి  జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, మద్దతు తెలుపుతూ తన ఆటపాటలతో చైతన్య గీతాలు ఆలపించాడు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా అధ్యక్షురాలు వసంతి, శాంత కుమారి, ఇందిరా, ఉమా, యాదమ్మ, అలివేలు, రేణుక, సరిత, తదితరులు పాల్గొన్నారు.

నార్కట్ పల్లి: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా,

నార్కట్ పల్లి: తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు చేపట్టిన ధర్నా లో గురువారం, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని పాల్గొని మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. 40 ఏండ్ల నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను ఎందుకు పర్మినెంట్‌ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అంగన్వాడీ ఉద్యోగులు గ్రామాల్లో బాలింతలకు, పిల్లలకు పౌష్టికారాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వ సర్వేలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికీ అంగన్వాడీ టీచర్‌ రూ.13,843, ఆయాలకు రూ.7,800 వేతనాలు ఇస్తున్నారని, వాటితో వారి కుటుంబం ఎలా గడుస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి రూ.26,000/- కనీస వేతనమివ్వాలన్నారు.

నిత్య సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి, ఇంటి అద్దెలు, గ్యాస్‌ ధరలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని పర్మినెంట్‌ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, కృష్ణ, మహేష్, సంతోష్, ఉదయ్, యోగి, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడి  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.