/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్ Yadagiri Goud
మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేసిన కేసులో తీర్పు వెలువడింది.

ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఈ పరువు నష్టం కేసులో దంపతులకు జైలుశిక్ష ఖరారైంది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

SB NEWS

సీమా హైదర్‌కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు

భారత యువకుడు సచిన్‌ను ప్రేమించి సరిహద్దులు దాటి పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్.. మూడు దేశాల సరిహద్దులు దాటి మే 13న అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్.. గ్రేటర్‌కు రాకముందే.. నోయిడా, పాకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వచ్చింది. ఆ తర్వాత నేపాల్ నుంచి భారత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఆ తర్వాత ఆమె గ్రేటర్ నోయిడాలోని రబుపురా పట్టణంలో నివసించడం ప్రారంభించింది. సరిహద్దులో పాక్ ఏజెంట్ అంటూ నిత్యం ఆరోపణలు వస్తున్నాయి.

పాకిస్తాన్ ఆర్మీలో సీమా హైదర్ సోదరుడు మరియు మామ

పాకిస్థానీ మహిళ సీమా హైదర్ UP పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు UP ATS లకు ఒక చిక్కుముడిలా కొనసాగుతోంది. సీమా హైదర్‌కి సంబంధించి రోజుకో షాకింగ్ సీక్రెట్‌లు బయటపడుతున్నాయి.. సీమా హైదర్ సోదరుడు, మామ పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అతని పేరు ఆసిఫ్ మరియు ప్రస్తుతం ఆసిఫ్ ఉద్యోగం మానేశాడు, మరోవైపు, గులాం హైదర్ కూడా సీమ మామ గులాం అక్బర్ ఇస్లామాబాద్‌లో ఉన్నాడని మరియు సైన్యంలో ఉన్నత పదవిలో ఉన్నాడని చెప్పాడు. అయితే, ATS యొక్క విచారణలో, సీమా హైదర్ కూడా తన ప్రకటన నుండి తప్పించుకుంటోందని చెప్పబడింది. పాకిస్థాన్ ఆర్మీలో సోదరుడు ఉన్నాడనే ప్రశ్నపై మౌనం దాల్చింది.

ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపబడింది

ఇక్కడ, UP ATS సీమా హైదర్ యొక్క అన్ని సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తోంది. మూలాల ప్రకారం, సీమా హైదర్ సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తులు. వీరిలో కొందరికి భారత సైన్యంతో సంబంధం ఉన్న విషయం తెరపైకి వచ్చింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నారు.వీరు సైన్యంతో సంబంధం కలిగి ఉన్నారా లేక ఇప్పుడే ఆర్మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టారా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్నారు.

భారతదేశంలోకి ప్రవేశించిన దావాను ధృవీకరించడం సాధ్యం కాదు

సీమా హైదర్ కేసును విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీల ప్రకారం, మే 13న, ఇండో-నేపాల్ సరిహద్దు సునౌలీ సెక్టార్ మరియు సీతామర్హి సెక్టార్‌లో మూడవ దేశ పౌరుల ఉనికి గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. భారతదేశం-నేపాల్ సరిహద్దులోని ఈ రెండు ప్రదేశాల నుండి సీమా హైదర్ మరియు సచిన్ భారతదేశంలోకి ప్రవేశం పొందుతున్నారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రికార్డులు మరియు CCTV ఫుటేజీని పరిశీలించారు మరియు ప్రస్తుతం వారు ఇచ్చిన సమాచారం ధృవీకరించబడలేదు. . విచారణ సందర్భంగా సచిన్, సీమా ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు మే 13న 1850 కిలోమీటర్ల మేర ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దులోని అన్ని బస్సు మార్గాల్లో ప్రయాణిస్తున్న బస్సుల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాయి.

సచిన్ కంటే ముందే చాలా మంది భారతీయులతో పరిచయం ఉంది

సీమా హైదర్‌ని విచారిస్తున్నప్పుడు, షాకింగ్ విషయాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఆమె పబ్-జి ద్వారా పరిచయమైన మొదటి భారతీయ యువకుడు సచిన్ కాదు. అంతకు ముందు కూడా సీమా హైదర్ భారతదేశంలోని చాలా మంది యువకులను సంప్రదించారు. ఆలోచింపజేసే విషయమేమిటంటే ఆ యువకులంతా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందినవారే.

పబ్‌జి ఆడుతూ ప్రేమలో పడింది

పాకిస్థాన్‌లోని కరాచీ నివాసి సీమా హైదర్, రబూపురా నివాసి సచిన్‌తో పబ్‌జి ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తన ప్రేమను పొందడానికి, సీమా హైదర్ అక్రమంగా భారతదేశ సరిహద్దులోకి ప్రవేశించి మే 13న రబుపురాలో నివసించడం ప్రారంభించింది. జులై 6న సమాచారం అందుకున్న పోలీసులు సీమా, సచిన్‌లను అరెస్టు చేశారు. సీమ నెలన్నర రోజులుగా అక్రమంగా రబూపురలో మకాం వేసి స్థానిక ఏజెన్సీకి కూడా ఆచూకీ లభించలేదు.

26 మంది డిప్యూటీ కమిషనర్లు బదిలీ

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు చేపట్టారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ, పోస్టింగ్ ఇస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే జిహెచ్ఎంసికి కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ వచ్చారు. ఆయన పలు అంశాలపై రివ్యూ నిర్వహించి జిహెచ్ఎంసిలో డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పలువురికి స్థానచలనం కలగగా, మరికొంతమందికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ల నుంచి రిలీవైన వారికి పోస్టింగ్లను ఇచ్చారు.

బదిలీలు జరిగిన అధికారుల వివరాలు

కాప్రా డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ బేగంపేట్ సర్కిల్ డీసీగా బదిలీ

బేగంపేట్ డీసీ ముకుంద్ రెడ్డి చందానగర్ డీసీగా బదిలీ

ఉప్పల్ డీసీ అరుణ కుమారి చరణ్ సరూర్ నగర్ డీసీగా బదిలీ

సరూర్ నగర్ డీసీ కృష్ణయ్య కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ గా బదిలీ

హయత్ నగర్ డీసీ మారుతి దివాకర్ అంబర్ పేట్ డీసీగా బదిలీ

అంబర్ పేట్ డీసీ వేణుగోపాల్ ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

చార్మినార్ డీసీ సూర్యకుమార్ అల్వాల్ డీసీగా బదిలీ

అల్వాల్ డీసీ నాగమణిని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

రాజేంద్రనగర్ డీసీ జగన్ మెహిదిపట్నం డీసీగా బదిలీ

మెహిది పట్నం డీసీ Md అలీని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

కార్వాన్ డీసీ శ్రీనివాస్ కు ఉప్పల్ సర్కిల్ -2 డీసీ తో పాటు కాప్రా డీసీగా అదనపు బాధ్యతలు

జూబ్లీహిల్స్ డీసీ రజినికాంత్ రెడ్డి శేరిలింగంపల్లి డీసీ గా బదిలీ

యూసఫ్ గూడ డీసీ రమేష్ మూసాపేట్ డీసీగా బదిలీ

మూసాపేట్ డీసీ రవికుమార్ రాజేంద్రనగర్ డీసీగా బదిల

చందానగర్ డీసీ సుధాంశ్ సికింద్రాబాద్ డీసీగా బదిలీ

సికింద్రాబాద్ డీసీ దశరథ్ ఎల్ బీ నగర్ డీసీగా బదిలీఆర్ సీ పురంఅండ్‌పటాన్ చెరు డీసీ బాలయ్య గోషామహల్ డీసీగా బదిలీ

గోషామహల్ డీసీ డాకు నాయక్ చార్మినార్ డీసీగా బదిలీ

కూకట్ పల్లి డీసీ రవీంద్ర కుమార్ హయత్ నగర్ డీసీగా బదిలీ

గాజులరామారం డీసీ ప్రశాంతి జూబ్లీహిల్స్ డీసీగా బదిలీ

శేరిలింగంపల్లి జాయింట్ కమిషనర్ మల్లయ్య గాజుల రామారం డీసీగా బదిలీ

ఆర్ సీ పురం అండ్‌ పటాన్ చెరు డీసీగా పోచారం మున్సిపాలిటీ కమిషనర్ పని చేసిన సురేష్ కు పోస్టింగ్

సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన చంద్రశేఖర్ కు యూసఫ్ గూడ డీసీగా పోస్టింగ్

నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన సత్యబాబుకు కుత్బుల్లాపూర్ డీసీగా పోస్టింగ్

కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారు ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశం..........

OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు.

పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు.

ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ బంధించింది. దీంతో ఈరోజు (బుధవారం) ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.725 కేజీల బంగారాన్ని మంగళవారం రాత్రి కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం..

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది.

దాంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇద్దరి వద్ద 1.725 కేజీల బంగారు నగలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్‌ చేశారు. కాగా, బహిరంగ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.72,55,069 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు...

SB NEWS

నేడు తిరుమల లో సాధారణ భక్తుల రద్దీ

తిరుపతి :జులై 19

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం స్వామివారిని 64,003 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 24,659 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖలో నువ్వు మంత్రివా? : అటెండర్ వా?

ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామంటున్నారు.

తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా?. జగదీష్ రెడ్డి నువ్వు మంత్రివా? లేక ఆ శాఖలో అటెండర్ వా ?. అసలు నువ్వు ఎప్పుడైనా ఉచిత కరెంటుపై సమీక్ష చేశావా?. ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేశారు.

కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు విద్యుత్ ఉద్యోగుల ఖాతాలో పడేవి. కానీ బీఆరెస్ పాలనలో 20వ తేదీ వచ్చినా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారింది.

ఇందుకు సిగ్గుతో తలవంచుకుని జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది జగదీష్ రెడ్డే". అని రేవంత్ రెడ్డి విమర్శించారు....

పది మంది అదనపు ఎస్పీల బదిలీలు

తెలంగాణలో 10 మంది అదనపు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

బదిలీ అయిన వారిలో బీవీ సత్యనారాయణ, టీవీ హనుమంతరావు, ఇక్బాల్ సిద్ధిఖీ, కె. నర్సింహారెడ్డి, ఎన్వెంకటరమణ, పి. అశోక్, జి. శ్రీనివాస్, జి. మధుసూదన్రావు, సయ్యద్ రఫీక్, పి. సత్యనారాయణ ఉన్నారు.

బదిలీకి సంబంధించిన వివరాలను ఈ దిగువన చూడొచ్చు. కాగా, ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మరి కొంతమంది నాన్ క్యాడర్ ఎస్పీ లు, ఐపీఎస్ ల బదిలీ జరిగే అవకాశాలున్నాయి...

SB NEWS

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు : మంత్రి హరీశ్‌రావు

ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.

ఇందుకు లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బయోమెట్రిక్‌ విధానంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చారు.

సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

బోర్డు మరికొన్ని నిర్ణయాలు..

మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని బోర్డు నిర్ణయించింది. మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ జరిపేలా ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వాటి సంఖ్యను 103కు పెంచింది. ఫలితంగా డయాలసిస్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రంలోనే డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి.

కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగుచేసే ‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇకపై ఈ తరహా సేవలను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో కూడా అందుబాటులోకి తేవాలని కమిటీ నిర్ణయించింది...

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదారి పరవళ్ళు* l

భ‌ద్రాచలం జిల్లా :జులై 18

గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది.

గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వచ్చి తాలిపేరు ప్రాజెక్టులో చేరుతున్నాయి.

ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,000 క్యూసెక్కుల వరద నీటిని దిగునున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరులశాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపటికి గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారుల అంచనా.

నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. సింగరేణి అధికారులు నీటిని మోటర్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా 503.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు....