/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం, పెళ్లి ఊరేగింపులతో అదుపుతప్పిన బస్సు Yadagiri Goud
ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం, పెళ్లి ఊరేగింపులతో అదుపుతప్పిన బస్సు

•కాల్వలో పడి ఏడుగురు మృతి; డజను మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరాతీలతో నిండిన బస్సు నగరంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు.

ఏడుగురు మరణించారు, డజను మంది గాయపడ్డారు

మంగళవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో పెళ్లి ఊరేగింపులతో వెళ్తున్న బస్సు కాల్వలో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. ఇది కాకుండా, ఈ ప్రమాదంలో డజను మంది గాయపడ్డారు.

బస్సులో 40 మంది ఉన్నారు

సమాచారం ప్రకారం, ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున దర్శి ప్రాంతానికి సమీపంలో జరిగింది. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తోంది. అప్పుడు బస్సు అదుపు తప్పి సాగర్ కాలువలో పడిపోయింది. బస్సులో దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సును అద్దెకు తీసుకున్నారు.

మృతులను అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీ బేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)గా గుర్తించారు.

బీసీల రాజకీయ ప్లీనరీని విజయవంతం చేయాలి

---బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

బీసి ముఖ్యమంత్రితో పాటు మిషన్ 60 (బీసీలకు 60 ఎమ్యెల్యే టికెట్లు) డిమాండ్ తొ జూలై 15న ఎల్ బి నగర్లోని కెబిఆర్ కన్వెన్షన్లో నిర్వహించ తలపెట్టిన బీసీల రాజకీయ ప్లీనరిని విజయవంతం చేయాలనీ బీసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన గోడపత్రికలను మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ 10 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే బీసిల రాజకీయ ప్లీనరి తెలంగాణలో రాజకీయాలను శాసించబోతుందన్నారు. ఈ సమావేశంలో బీసిల రాజకీయ భవిష్యత్, దశ-దిశను నిర్ణయిస్తామని ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు దళితులని, బీసీలని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసి చేయలేదన్నారు. పైగా తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అగ్రకుల నాయకులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పారని అన్నారు. ఇంత కాలం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ ని సైతం తప్పించి అగ్రకులాలకే బాధ్యతలు అప్పజెప్పారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసిల రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదన్నారు. కేవలం పిడికెడు శాతం ఉన్న అగ్రకులాలకే పెత్తనం ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలను ఓట్లు ఏవిధంగా అడుగుతారని అని ప్రశ్నించారు.

ఏవిధంగా బీసీలు మీకు ఓట్లు వేయాలో చెప్పాలనీ ఎద్దేవా చేశారు. అందుకే ఓటు మాదేసీటు మాదే... మేమెంతో మాకంతా అనే నినాదంతో అగ్రకుల ఆధిపత్య పాలనకు చరమగీతం పాడేందుకు రాజ్యాధికారం వైపు బీసిలందరిని తీసుకెళ్లడమే ఈ రాజకీయ ప్లీనరి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మీరిచ్చే రాయితీలు, సబ్సిడీలు, స్కాలర్ షిప్లు మమ్ముల్ని సంతృప్తి పరచలేవన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠమే అజెండేగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, గౌరవ సలహాదారు నెలపట్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్, రాములు, రవీందర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

నాగర్‌కర్నూలు:జులై 11

జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు. మంగళవారం ఉదయం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ నెల 20 న జరిగే బహిరంగ సభాస్థలి పరిశీలన కోసం వచ్చినట్టు తెలిసింది ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 20 న కొల్లాపూర్‌లో రెండు లక్షల మందితో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు ప్రముఖ నాయకులు, ప్రియాంక గాంధీ రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, రాక్షస, నియంతృత్వ పాలనకు చమర గీతం పాడాలన్నారు. ఆస్తులు.. పుస్తెలు అమ్ముకొని చదువుకున్న వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు బహుమానం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అంటూ జూపల్లి కృష్ణరావు ప్రశ్నించారు...

మసాజ్ ముసుగులో వ్యభిచారం

బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసీ నిర్వాహకులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేశారు. కేంద్రం నడుపుతున్న వ్యక్తి తో పాటు నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వీరంతా హైదరాబాద్‌లోని ప్రముఖుల కుమారులేనని సమాచారం. సహ ఆర్గనైజర్ సయ్యద్ బిల్లాల్‌తో పాటు ఫహద్, హసీదుద్దీన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఐదుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధికారులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదే క్రమంలో మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉన్న మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్‌పై కుడా ఈ రోజు ఉదయం పోలీసులు దాడి చేశారు. సునీల్ కుమార్ అనే వ్యక్తి వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా అక్కడ క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్రాస్ మసాజ్ పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్గనైజర్ సునీల్ కుమార్ తో పాటు సబ్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఫర్జానా బేగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.....

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏ ఓ బి లోని గంపకొండఅటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును మంగళవారం గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడిగట్ట పంచాయతీ మరిగట్ట వద్ద గాలింపులు నిర్వహించిన BSF పోలీసులు భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంపులో ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 25, సేఫ్టీ ఫ్యూజ్ నాలుగు బండిల్స్, 108 జిలేటెన్ స్టిక్స్, 20 హ్యాండ్ గ్రైనేడ్లు ఉన్నాయి. మావోయిస్టుల సింథటిక్ బెల్ట్లు 20, మావోయిస్టుల ర్యాంక్ ని సూచించే నక్షత్రాలు తొమ్మిది జతలు, విజిల్స్ 9 జతలు, కాస్ట్ ఐరన్ హ్యాండ్ ప్రస్ మిషన్ ఉన్నాయి...

SB NEWS

ఇంటర్మీడియట్ కళాశాలలలోభారీ గా పడిపోయిన అడ్మిషన్లు

•ప్రభుత్వ కాలేజీల్లో చేరికకు విముఖత

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 2023-24కు సంబంధించిన ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. అనుకున్న విధంగా అడ్మిషన్లు జరగడం లేదు. ఏటా నమోదయ్యే అడ్మిషన్లతో పోలిస్తే... ఈ సారి సగం మంది కూడా ప్రభుత్వ కాలేజీల్లో చేరలేదు.

రాష్ట్రంలో 406 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా, సుమారు లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. సాధారణంగానైతే ఏటా 90వేలకు పైగా అడ్మిషన్లు నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటిదాకా 47వేల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఏటా టెన్త్‌ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ కాలేజీల్లో పని చేసే లెక్చరర్లు విద్యార్థులను చేర్పించడానికి కృషి చేసేవారు. ముఖ్యంగా కాంట్రాక్టు లెక్చరర్లు ఈ విషయంలో చొరవ తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పి ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేవారు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో వారు ఆసక్తి చూపేవారు. ఉన్నతాధికారులు కూడా ఆ మేరకు ప్రోత్సహించే వారు. కానీ, ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లును ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో అడ్మిషన్లపై వారు ఆసక్తి చూపలేదన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఇంటర్మీడియట్‌ బోర్డుకు రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నవీన్‌మిత్తల్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ.. ఆయనపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో ఇంటర్‌బోర్డు పనితీరును పర్యవేక్షించే సమయం లభించడం లేదు. కొత్త అడ్మిషన్లు, విద్యా బోధన వంటి అంశాలపై ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సారి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. ఈ కారణాల వల్లే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న చర్చ జరుగుతోంది...

West Bengal: కౌంటింగ్‌ కేంద్రం వద్ద పేలుడు.. బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. అయితే, పోలింగ్ రోజున చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలను దృష్ట్యా..

కౌంటింగ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డైమండ్‌ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. హావ్‌డాలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74వేల పంచాయతీ స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో చెలరేగిన హింసతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌ నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు..

బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కీలక నోట్

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వినూత్న కార్యక్రమాలతో జనాల్లోకి చొచ్చుకెళ్లారు. ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన చేసిన ప్రజా సంగ్రామ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

ఒకనొక దశలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి రావడానికి కారణం బండి సంజయ్ అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. ఇవాళ జులై 11 బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కీలక నోట్ విడుదల చేశారు.

ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా నా జన్మదినం సందర్భంగా ఇవాళ విశ్వనాథుని దర్శన నిమిత్తం నేను వారణాసి వెళ్తున్నాను. అందువల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అసౌకర్యానికి అన్యదా భావించవద్దని కోరుకుంటూ... మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే నాపై కురిపించాలని ఆశిస్తున్నాను.’’ అంటూ పుట్టిన రోజున అభిమాలను బండి సంజయ్ నోట్ విడుదల చేశారు...

ట్రాఫిక్లో చిక్కుకున్న గవర్నర్

హైదరాబాద్లో సోమవారం రాత్రి గవర్నర్ తమిళిసై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. గవర్నర్ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్లో నిలిచిపోయింది. ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కు వచ్చిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో రాజ్భవన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్ భద్రతా సిబ్బంది ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక.. చలాన్లు వేయడంలో, వేహికల్స్ని ఆపి ఫొటోలు తీయడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో చూపించడం లేదని, రోజూ 50 కేసుల టార్గెట్ల పేరుతో కానిస్టేబుళ్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అసలు విషయమ్మీద ఫోకస్ పెట్టకపోతే గుడ్ కాప్స్ అన్న పేరు కాస్త బ్యాడ్ కాప్స్గా మారే ప్రమాదం ఉందని చాలామంది అంటున్నారు.....

అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం : ఉందా ❓️

•ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే తొలి మహిళ

•గిరిజన, మాజీ మావోయిస్టుగా రికార్డు

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీతక్క అలియాస్‌ దాసరి అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా!? తెలంగాణలో ఆ పదవిని చేపట్టబోయే తొలి మహిళగా.. తొలి గిరిజన నాయకురాలిగా ఆమె నిలవనున్నారా!? ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు తుపాకీ పట్టిన మాజీ మావోయిస్టు రాజ్యాధికారాన్ని అంది పుచ్చుకుని చరిత్ర సృష్టిస్తారా!? అంటే.. ‘సందర్భం వస్తే.. సీతక్కను ముఖ్యమంత్రిని చేయవచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి!

ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న తానా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా, సోమవారం ఎన్నారైలతో రేవంత్‌ సమావేశమయ్యారు. పలువురు ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా, ‘తెలంగాణలో 18 శాతంగా ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఫోకస్‌ చేస్తున్నారు. మరి, 12 శాతంగా ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను ఉప ముఖ్యమంత్రిగాఫోకస్‌ చేస్తారా!?’ అని సమావేశంలో ఓ ఎన్నారై ప్రశ్నించారు. దానికి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘‘మీరు కాంగ్రెస్‌ పార్టీ బిగ్‌ పిక్చర్‌ చూడట్లేదు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షునిగా పార్టీ చేసింది. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే.. వాటిలో మూడుచోట్ల ముఖ్యమంత్రులు ఓబీసీలే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల పక్షాన పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించడం కాంగ్రెస్‌ సంప్రదాయం కాదు. అయినా.. ఎన్నారైలు ఇచ్చిన సూచనపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటాం. మీరు సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా!? అని అడిగారు కదా? ఆ సందర్భం వస్తే అక్కను సీఎంగా కూడా చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ఒక పాలసీతో ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు; రాజధానిగా అమరావతి నిర్మాణానికి కాంగ్రెస్‌ చొరవ తీసుకుందని, ఆ రెండిటినీ పూర్తి చేయడం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి తమకు సహకరించాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. తనను, కాంగ్రెస్‌ పార్టీని వేర్వేరుగా చూడడం సరికాదని, తెలంగాణలో కాంగ్రెస్‌ అంటే రేవంత్‌ రెడ్డి.. రేవంత్‌ అంటే కాంగ్రెస్‌ అని చెప్పారు...