/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సిటీలో ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు Yadagiri Goud
సిటీలో ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ :జూలై 08

సికింద్రాబాద్‌లో మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా నేటి నుంచి ఈ నెల 10 తారీకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.

దీంతో కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైస్, ఎస్‌బీఐ క్రాస్ రోడ్, సీటీఓ, ప్లాజా, వైఎంసీఎ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ రోడ్లు, జంక్షన్ల వైపు వాహన దారులు రావొద్దని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు ముందుగా బయలుదేరాలని సూచించారు.

కాగా టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుంచి మహంకాళి దేవాలయం వైపు వెళ్లే రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది. బాట క్రాస్ రోడ్ నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్, సుభాష్ రోడ్ వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. అలాగే.. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్ - రసూల్‌పురా క్రాస్ రోడ్డు-పీఎన్టీ-సీటీఓ-ఎస్‌బీఐ క్రాస్ రోడ్ -వైఎంసీఎ క్రాస్ రోడ్ సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లైన్‌లో రాణిగంజ్ క్రాస్ వద్దకు మళ్లించనున్నారని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీంతో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సూచించారు....

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే : మంత్రి హరీష్ రావు

మెదక్ జిల్లా :జూలై 08

రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘటన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మహిళల కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ హర్ష, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో మొత్తం 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకి పోడు పట్టాల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.4 లక్షల ఎకరాల పోడు భూములను పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం వారికి త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు పది శాతానికి పెంచారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంట్ గిరిజన తండాలను అందించారని గుర్తు చేశారు.

ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం 3,146 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. గిరిజనుల కష్టాలు చూసిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 3146 తండాలను ఆదివాసీ గూడేలను పంచాయతీలు గా మార్చారని అన్నారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడు వచ్చినా మోదీతో సహా కేవలం సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి తిట్టుడే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రమేష్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మేఘమాల, కవిత, ఎంపీపీలు మంజుల, హరికృష్ణ, వినోద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మనసూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్ పట్టణాధ్యక్షుడు భిక్షపతితో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు......

కెసిఆర్ అవినీతి ఢిల్లీ వ‌ర‌కు పాకింది.. : బిఆర్ఎస్ పై మోడీ విమ‌ర్శ‌ల దాడి

హన్మకొండ జిల్లా:జూలై 08

కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్ర‌ధాని మోడీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ పని , వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు. కుటుంబాన్ని పెంచిపోషించడమే కేసీఆర్ సర్కార్ పని పని అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని , కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వాటిని వెలికితీసే ప‌నిలో ప‌డ్డాయ‌ని అన్నారు.. వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని అన్నారు. ఇక త‌న ప్ర‌సంగంలో కెసిఆర్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు..కుటుంబ పాల‌న‌, అవినీతి ప్ర‌భుత్వం అంటూ ప‌దే ప‌దే వ‌క్కాణించారు. దేశంలోని కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని.. ఉదయం, సాయంత్రం మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అంటూ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని అన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ అవినీతి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని అన్నారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి ఇవ్వలేదని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. 9 ఏళ్లలో కేంద్రం గ్రామపంచాయితీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి.. చేసి చూపించామని అన్నారు.

తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. తాము ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నామని చెప్పారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్‌లో కొందరికి నిద్రపట్టదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. గ‌తాన్ని ప్ర‌స్తావిస్తూ, బీజేపీ తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. “అబ్ కీ బార్ బిజెపి సర్కార్” అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు...

పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం ..పేలిన తుపాకి, కత్తిపోట్లు … 10 మంది మ‌ర‌ణం

కోల్ క‌తా :జూలై 08

పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు.. వందలాది మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌ల‌ను చోటు చేసుకున్నాయి…కాగా, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 5.67 కోట్ల మంది ప్రజలు సుమారు 2.06 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

ఈ నేప‌థ్యంలోలోనే బిజెపి, తృణ‌మూల్, కాంగ్రెస్ పార్టీల కార్య‌కర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి .. . కూచ్ బెహార్ లోని ఫాలిమారీలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ను కాల్చిచంపారు. బిశ్వాస్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా టీఎంసీ మద్దతుదారులు అడ్డుకున్నారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారు ఆయనను చంపారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.

నార్త్ 24 పరగణాల జిల్లాలోని కదంబగచ్చి ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారుడు రాత్రంతా కొట్టడంతో మృతి చెందాడు. మృతుడిని అబ్దుల్లా (41)గా గుర్తించారు. అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు ఎస్పీ భాస్కర్ ముఖర్జీ తెలిపారు. ఈ హత్యను నిరసిస్తూ స్థానికులు తెల్లవారుజామున టాకి రోడ్డును దిగ్బంధించగా పోలీసులు వాటిని తొలగించారు.

ముర్షిదాబాద్ జిల్లా కపస్దంగా ప్రాంతంలో జరిగిన హింసాకాండలో టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. మృతుడిని బాబర్ అలీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్, ఖర్గ్రామ్లో ఇద్దరు, కూచ్బెహార్ జిల్లాలోని తుఫాన్గంజ్లో మరో వ్యక్తిని హతమార్చినట్లు అధికార టీఎంసీ ఆరోపించింది.

‘‘పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు నిన్న రాత్రి నుంచి టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. రెజీనగర్, తుఫాన్గంజ్, ఖర్గ్రామ్లో ముగ్గురు కార్మికులు చనిపోయారు. డోమ్కల్ లో మా ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. కేంద్ర బలగాలు ఎక్కడున్నాయి?’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ప్రశ్నించారు...

సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా ❓️

గద్వాల జిల్లా:జూలై 08

గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖారారైంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్య నాయకులతో సమావేశమైన జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు అభ్యర్థిత్వంపై చర్చించినట్లు తెలిసింది. హైద రాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో శుక్రవారం సాయంత్రం సమావేశమై, దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 20న కొల్లాపూర్‌లో జూపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో వీరు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది.

ఆ సభకు ప్రియాంకా గాంధీ రానుండటంతో.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు హస్తం గూటి కి చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భా గంగానే అదే రోజు పార్టీలో చేరేందుకు గద్వా ల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దంపతులు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా, మొన్నటి వరకు ఆ పార్టీ నుంచే గద్వాల స్థానం నుంచి టికెట్‌ వస్తుందని ఆశించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నాటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామనే ప్రచారంలో ఉండగా, అటు అలంపూర్‌, ఇటు గద్వాల శాసనసభ్యులతో వారి వర్గా నికి అంతర్గత కలహాలు ఉన్నాయి. ప్రొటో కాల్‌ విషయంతో పాటు జడ్పీ సమావేశాల నిర్వహణ.. పలు అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌రెడ్డికి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దంప తులకు మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌ పర్యటన ముందు వరకు కూడా వారు బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉండి, టికెట్‌ కోసం ప్రయత్నిస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు పలువురు మంత్రుల వద్ద కూడా తమ అభ్యర్థనను పెట్టారు. కానీ అందరూ ఊహించని విధంగా, ఇటీవల పొంగులేటి, జూపల్లితో రేవంత్‌రెడ్డి సమావేశమైన సందర్భంలోనే జడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తిరుపతయ్య కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. దీంతో వారు పార్టీ మారే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ నివాసంలో సమావేశమైన చైర్‌పర్సన్‌ దంపతులు.. స్థానిక డీసీసీ అధ్యక్షుల తోపాటు మరో బీఆర్‌ఎస్‌ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ దంపతులిద్దరూ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో స మావేశం కావడంతో ఈ నెల 20న జరిగే సమావే శంలోనే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లుగా భావించవచ్చు.

దేశంలో తెలంగాణ పాత్ర గొప్పది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

హన్మకొండ :జూలై 08

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు.

ముందుగా ‘తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ చిన్న, కొత్త రాష్ట్రం కావచ్చు కానీ, దేశంలో మీ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. తెలుగువారి ప్రతిభ దేశ సామార్ధ్యాన్ని పెంచిందని అన్నారు. పెట్టుబడుటు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ముందు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గడిచిన 9 ఏళ్ల నుంచి ఎంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కనెక్టివిటీ పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని అన్నారు. లాజిస్టిక్స్ సదుపాయం లేకపోతే వ్యాపారాలు నష్టపోతాయని తెలిపారు. రాష్ట్రంలో 2500 జాతీయ రహదారులు ఇప్పుడు 5 వేల కిలో మీటర్లకు పెరిగాయని అన్నారు.,..........

గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాలి.. ప్ర‌ధాని మోదీకి కేటీఆర్ డిమాండ్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ కొన్ని డిమాండ్లు చేశారు. తెలంగాణ‌లో గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో కేంద్ర స‌ర్కార్ జాప్యం చేస్తున్న‌ట్లు మంత్రి ఆరోపించారు. ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ విభ‌జ‌న చ‌ట్టం కింద ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. కానీ రాష్ట్రంలోని వేలాది మంది గిరిజ‌న యువ‌త ఉన్న‌త విద్యా అవ‌కాశాలును కోల్పోతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు.

ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు కోసం ఆరేళ్ల క్రిత‌మే ములుగులో 350 ఎక‌రాల స్థ‌లాన్ని కేంద్రానికి అప్ప‌గించిన‌ట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ అక్క‌డ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంద‌న్నారు. కీల‌క‌మైన ఆ ఇన్స్‌టిట్యూష‌న్ కోసం కేంద్రం నిధుల‌ను విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు. ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ కేంద్రాన్ని విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని, కానీ కేంద్ర పాల‌కులు ఆ విన్న‌పాల‌ను విస్మ‌రించిన‌ట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు విష‌యంలో నిర్ల‌క్ష్యాన్ని, తెలంగాణ ప్ర‌జ‌ల ప‌ట్ల స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను వీడాల‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆయ‌న ప్ర‌ధాని మోదీని డిమాండ్ చేశారు......

ప్ర‌ధాని స‌భ‌ కు వీఐపీ పాస్‌ల‌కు పైర‌వీలు

వ‌రంగ‌ల్ జిల్లా :జూలై 08

బీజేపీ విజ‌య సంక‌ల్ప స‌భ వీఐపీ పాస్‌ల కోసం ముఖ్య నేత‌లు, శ్రేణులు అగ‌చాట్లు ప‌డుతున్నారు. వీఐపీ గ్యాల‌రీలో 2వేల పైచిలుకుగా వీఐపీ పాస్‌ల‌ను ముఖ్య నేత‌ల‌కు అంద‌జేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య‌నేత‌ల‌కు త‌లా కొన్ని పంపిణీ చేశారు.

అయితే ప్ర‌ధాని స‌భ కావ‌డంతో స‌హ‌జంగానే వీఐపీ గ్యాల‌రీ నుంచి న‌రేంద్ర మోదీని ద‌గ్గ‌ర నుంచి చూడాల‌నే కుతుహ‌లంతో పాస్‌ల కోసం పైర‌వీలు జోరుగా సాగుతున్నాయి. వాస్త‌వానికి జిల్లాలో చాలా కీల‌కంగా ప‌నిచేస్తున్న నేత‌ల‌కు సైతం పాస్‌లు అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

హ‌న్మ‌కొండ జిల్లాలో పార్టీ హోదాను అడ్డుపెట్టుకుని ఓ నాయ‌కురాలు పాస్‌లు వారి వ‌ర్గానికే ఎక్కువ‌గా ఇచ్చుకున్నారంటూ ఓ వ‌ర్గం నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. పాస్‌లు త‌మ‌కు రాక‌పోవ‌డంతో కొంత‌మంది నేత‌లు చిన్న‌బుచ్చుకుంటున్నారు. మ‌రికొంత‌మందైతే జిల్లా పార్టీ నాయ‌క‌త్వాన్ని త‌ప్పుబ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం లేద‌న‌డానికి పాస్‌లు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే నిద‌ర్శ‌న‌మంటూ అసంతృప్తి స్వ‌రం వినిపిస్తున్నారు. శ్రేణులు పాస్‌ల కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ కీల‌క నేత‌లంద‌రికీ ఫోన్ చేసి మ‌రీ అన్నా పాస్ ఉందా అంటూ వాక‌బు చేస్తుండ‌టం విశేషం....

హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ :జూలై 08

హకీం పేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ ప్రధాని వెళ్లనున్నారు. వరంగల్ లోని మామునూరు ఎయిర్ స్ట్రిప్‌లో దిగనున్నారు.

వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వ్యాగన్ తయారీ, పీవోహెచ్ సహా పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు....

సిఐ స్వర్ణలత -దొంగ , పోలీసా ❓️

విశాఖపట్నం:జూలై 08

మూడేళ్ల కిందట విశాఖ జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడిపై ఇష్టారీతిన మాట్లాడిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ని చాలా మంది గుర్తు పెట్టుకునే ఉంటారు. ఆమె పోలీస్ ఆఫీసర్స్ సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా. ఆమె పేరు స్వర్ణలత. ఇప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా బయటపడింది.

ఈ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి అధికారులను కాపాడేందుకు ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు ఎప్పుడూ రెడీగా ఉంటారు కాబట్టి.. తెర వెనుక ప్రయత్నాలు జరుగతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో శుక్రవారం సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సిఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.