/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి Yadagiri Goud
సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

తమిళనాడు:జులై 07

కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) ఈరోజు తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయకుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. మొదటగా నెల్లై జిల్లా వల్లియూర్‌లో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు.

దీని తర్వాత కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. సీబీసీఐడీలో ఎస్పీగా కూడా పనిచేసిన విజయకుమార్ సాతంకుళం జంట హత్య కేసును తొలిసారిగా దర్యాప్తు చేశారు. కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, నీలగిరి నాలుగు జిల్లాల పర్యవేక్షణ అధికారిగా పని చేశారు. గత జనవరిలో విజయకుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.

గత రెండు రోజులుగా విజయకుమార్ కుటుంబ కారణాలవలన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆయన కొంత కాలంగా నిద్ర సరిగా ఉండటం లేదని తోటి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి డిప్రెషన్‌తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిషనర్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కాగా.. విజయకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా విచారణ జరుపుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. విజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు...

మంత్రి మల్లారెడ్డా? : మజాకా ❓️

నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో గొర్రెల వెంట వెళుతున్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. మంత్రి మల్లారెడ్డే. మేడ్చల్‌ మండలంలోని గౌడవెల్లి గ్రామం లో గురువారం సాయంత్రం

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 18 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయ గా, లబ్ధిదారులకు అందించిన గొర్రెలు గుంపుగా కనిపించడంతో

సంతోషం పట్టలేని మంత్రి యాదవుల వద్ద ఉన్న గొంగడి వేసుకుని, కట్టె చేత పట్టుకుని కాసేపు గొర్రెల మంద వెంట తిరిగారు. ఆశ్చర్యానికి గురైన నాయకులు, యాదవులు సరదాగా కాసేపు నవ్వుకుని మంత్రిని అనుసరించారు.......

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ శివార్లలోని పెద్దంబర్‌పేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన రాజధాని బస్సులో పెద్దంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే మంటలను గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపి, అందులోనుంచి ప్రయాణికులను దించివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అయితే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏసీలో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు...

నేడు షిరిడీ సాయిని ద‌ర్శించుకోనున్న భార‌త రాష్ట్ర‌ప‌తి

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం షిరిడీ సాయినాథుడిని ద‌ర్శించుకుకోనున్నారు. ప్రత్యేక విమానంలో షిరిడీ రానుండ‌డంతో అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్రపతి ముర్ము సుమారు మూడు గంటల పాటు షిర్డీలో ఉంటార‌ని, మధ్యాహ్నహారతికి హాజరవుతార‌ని సంస్థాన్ సీఈవో పి. శివ‌శంక‌ర్ తెలిపారు.

సాయి సమాధి వద్ద రాష్ట్ర‌ప‌తి పూజ చేస్తార‌ని, ఆ తర్వాత సాయిబాబా రాకను గుర్తుచేసే గురుస్థాన్ ఆలయాన్ని, నిమ్మాక్ చెట్టును సందర్శించే అవ‌కాశం ఉంద‌న్నారు. బాబా నివసించిన సర్వమత సమానత్వానికి ప్రతీక అయిన ద్వారకామాయిలో కూడా ముర్ము సంద‌ర్శించ‌నున్నారు.

కాగా, సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది టూర్‌ ప్లాన్‌లో బిజీగా ఉన్నారు. ఇక‌.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు గవర్నర్ రమేశ్ బైస్, మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీలు సదాశివ లోఖండే, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ కూడా రాష్ట్ర‌ప‌తితో పాటు రానున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. గ‌తంలో భార‌త రాష్ట్ర‌ప‌తులుగా ఉన్న వారిలో నీలం సంజీవ్‌రెడ్డి, శంకర్‌దయాళ్‌ శర్మ, ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయిదర్శనం సందర్భంగా షిర్డీని సందర్శించారు..

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

స్నేహితుడు చెప్పాడని కారు వేగంగా నడిపి.. ఇద్దరి మృతికి..

హైదరాబాద్‌: తెల్లవారుజామున రోడ్డు మీద ట్రాఫిక్‌ లేదు.. కారు వేగంగా వెళ్తేనే మజాగా ఉంటుందని స్నేహితుడు చెప్పాడని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు..

ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నాడు. మరో ఇద్దర్ని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రధాన నిందితుడు మహమ్మద్‌ బదియుద్దీన్‌ ఖాద్రి తన స్నేహితుడు బానోత్‌ గణేశ్‌ చెప్పడం వల్లే వేగంగా నడిపినట్లు పోలీసులకు చెప్పాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని తెలిసినా బదియుద్దీన్‌కు అబ్దుల్‌ రెహమాన్‌ వాహనం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. డ్రైవింగ్‌ పక్క సీట్లో బానోత్‌ గణేశ్‌, వెనక సీట్లో మహ్మద్‌ ఫయాజ్‌, సయ్యద్‌ ఇబ్రహీముద్దీన్‌ కూర్చున్నారు. ప్రమాదం తరువాత ఇద్దరు చనిపోయారని తెలుసుకున్న నలుగురూ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు..

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జులై 07

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. నేడు శుక్రవారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 66,977 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉదృతం చేస్తాము

•జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ

తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నాడు నలగొండ ఎంపీడీవో ఆఫీస్ ముందు పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ను జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సమ్మనుద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుండి పంచాయతీ కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరిని వీడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు పంచాయతీల్లో సేవలు చేస్తూ అర్దాకలతో అలమటిస్తున్నారని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానం వలన కార్మికులకు అనుభవం లేని పనులు ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం, కరెంటు స్తంభాలు ఎక్కడం లాంటి పనులతో ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వం మాత్రం చస్తే 5000/ ఇస్తాం అనే చందంగా వ్యవహరిస్తుంది తప్పితే ఆ కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా కుటుంబాన్ని బజారున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం పదిలక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు పేరుగుతున్న తరుణంలో కార్మికుల జీతాలు మాత్రం పెరుగుదల లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ పిఆర్సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతనాలు పెంచుతున్నట్లుజీవోలు జారీ చేశారు అవి అమలు కూడా అవి అయ్యాయి కానీ ప్రభుత్వంరంగ సంస్థ అయినా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం చిన్న చూపే చూసిందే తప్ప వాళ్లకు వేతనాలు పెంచలేదు కాబట్టే మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళామని అన్నారు.ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారు అదే తరహా వేతనాలను పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్, యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్ష కార్యదర్శులు కాశీ మల్ల రాములు, పోలే సత్యనారాయణ జేఏసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఇరిగి ఎల్లేష్, పగిళ్ల ముత్తయ్య, వంగూరి శ్రీకాంత్, పెరిక రాంబాబు, యాదగిరి, చింతకింది భద్రయ్య, నరేష్, పోలే సుధాకర్, రేణుక, కళావతి, వాణి, చింత నాగయ్య, గోవర్ధనా చారి తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ ని తప్పించడం యావత్ బీసీలను అవమానించడమే...!

కళ్ళకు నల్లగుంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించడం యావత్ బీసీలను అవమానించడమేనని అందుకు నిరసనగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ ఆధ్వర్యంలో కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తంచేశారు.

గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన అనంతరం కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి తీవ్రంగా ఖండించారు. అగ్రకుల నేతలు చేయలేనిపనిని బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసుకున్న అనతి కాలంలోనే చేసి చూపించారన్నారు. తన సర్వశక్తులు ఒడ్డి కేవలం పట్టణానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘనత బండి సంజయ్ దేనన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్ష బాధ్యతల నుంచి అవమానకర రీతిలో తప్పించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడు బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుండి అవమానకరంగా తప్పించడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న యావత్ బీసీలను అవమానపరచడమేనని అన్నారు. ఇప్పటివరకు తన సర్వశక్తి యుక్తులు ఒడ్డీ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ తీసుకువచ్చిన బండి సంజయ్ ని ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఒక సామాజిక వర్గం మెప్పుకోసం తొలగించి అగ్రకులానికి చెందిన నాయకుడిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం అంటే బిజెపికి బీసీలపైన ఉన్న చిత్తశుద్ధి కపట ప్రేమ ఏందో అర్థమై కనువిప్పు కలిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని దేశవ్యాప్తంగా ఉన్న యావత్ బీసీ సమాజం తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలు లేవు లెక్చరర్లు లేరు

•ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ తరగతులు మొదలై నెలరోజులైంది. కానీ నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రైవేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా.. ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌, కేజీబీవీ, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 25 కోట్లను సర్కారు వెచ్చిస్తోంది. పుస్తకాల ముద్రణ బాధ్యతను తెలుగు అకాడమీ చూసుకుంటోంది. ఈ ఏడాది ఈ పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ముద్రణకు అవసరమైన కాగితాన్ని సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ఈ ఆలస్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ కోర్సును అభ్యసిస్తున్నారు. ఇందులో 1.9 లక్షల మంది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, లక్ష మంది విద్యార్థులు వివిధ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదువుతున్నారు. మిగిలిన 6.5 లక్షలకు పైచిలుకు విద్యార్థులు ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతున్నారు. ప్రైవేటు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇప్పటికే వారికి సమకూరాయి. బయటి మార్కెట్‌, తెలుగు అకాడమీల నుంచే ఈ పుస్తకాలను సేకరించడం గమనార్హం.

కొనసాగుతున్న లెక్చరర్ల కొరత

పుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్ల కొరత కూడా తీవ్రస్థాయిలోనే ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రతి ఏడాది సుమారు 2వేలమంది గెస్ట్‌ లెక్చరర్లను నియమిస్తున్నారు. అయితే... ఈ ఏడాది గెస్ట్‌ లెక్చరర్ల నియామకం ఇంకా జరగలేదు. దాంతో విద్యాబోధనకు సరైన లెక్చరర్లు లేరు. చదువుకోవడానికి పుస్తకాలు లేక, చెప్పడానికి లెక్చరర్లూ లేక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. గత నెల ఒకటో తేదీన ఇంటర్మీడియట్‌ తరగతుల్ని ప్రారంభించిన అధికారులు, ఈ ఏడాది సిలబ్‌సను త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అటు ప్రైవేటులో వేగంగా బోధన జరుగుతున్న నేపథ్యంలో.. పరీక్షల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు విద్యార్థులతో పరీక్షల్లో ఎలా పోటీ పడతారంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అటు పాఠశాలల్లోనూ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి స్థాయిలో జరగకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 29 లక్షల మంది విద్యార్థులకు సుమారు 1.57 కోట్ల పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే... సాంకేతిక కారణాలతో ఇంకా కొన్ని స్కూళ్ల పరిధిలోని విద్యార్థులకు ఈ పుస్తకాలు చేరలేదని సమాచారం. సుమారు 5 నుంచి 10 శాతం విద్యార్థులకు ఈ పుస్తకాలు అందలేదని చెబుతున్నారు...