పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి: పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్
పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అనాధా శ్రమంలో అన్నదానం
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి లోని కీ! శే! జెల్లా శంకర్ స్థాపించిన అమ్మఒడి అనాదాశ్రమం లో ఎం సీ కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ ....పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పును అధిగమించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ కు కారణమయ్యే ధూమపానం, మద్యపానం, గుట్కా, జర్ధాకిల్లీ లాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. క్యాన్సర్ నివారణ కోసం మహ్మద్ చాంద్ ఖాన్ (ఎం సి కే) ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో ఆయన ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం సి కే ఫౌండేషన్ అధ్యక్షులు బండారి బాబూరావు, కార్యదర్శి తొర్రి సురేష్, ఆర్గనైజర్ ఖాజాభాయి , మహ్మద్ ఆదిల్ కైఫ్, రమేష్ యాదవ్,హరిదీఫ్, మహ్మద్ షమీ,స్మరణ్ , ఆశ్రమ నిర్వాహకులు సుమిత్ర, మహ్మద్ అలీ, అంజి,
తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()

పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి



హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.







Feb 04 2024, 19:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
38.0k